తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, February 12, 2009

షిర్డి సాయిబాబా గారు మరణించి తిరిగి మూడు రోజుల తర్వాత ఎందుకు లేవవలసివచ్చింది?

ఈ మధ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ విరచిత షిరడిసాయిబాబా చరిత్ర చదువుచున్నప్పుడు ఇప్పుడు చెప్పబోవు విషయం ఆసక్తికరంగా,రహస్య విషయంగా అనిపించింది.

సాయిబాబా గారు మూడు రోజుల తర్వాత తిరిగి మరణించి లేచినప్పుడు సాయిబాబా గారే స్వయముగా చెప్పినది.
"నేను అల్లా దగ్గరికి వెల్లి ఓ దేవా నేను ఇక జన్మ చాలించి మీదగ్గరికి వచ్చేద్దామని అనుకుంటున్నానని అన్నాను.కాని అల్లా ఏమన్నాడంటే సాయీ!గదాధరుడు అనే మహాత్ముడు కూడా చాలారోజులనుండి నా దగ్గరకు వస్తానని వేడుకుంటున్నాడు.భూలోకంలో అతని కార్యం ముగిసినది.నీ కార్యం ఇంకా ఉన్నది.అందువలన నీవు తిరిగి భూలోకానికి వెళ్ళు.గధాదరుడు నా దగ్గరికి వస్తాడు"అన్నాడు.

ఇక్కడ గధాదరుడు అంటే వేరెవరోకాదు శ్రీరామకృష్ణపరమహంస గారు.సాయిబాబా గారు అర్దరాత్రి ఒంటి గంటకు తిరిగిలేచారు.సరిగా అదే సమయంలో అదే రోజు శ్రీరామకృష్ణపరమహంస తన దేహం చాలించారు.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు