తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, July 28, 2010

వేదాల ముందు,వెనుకలను నిర్ణయించడానికి నేటి పరిశోధకుల ప్రామాణికత్వం ఏంటి?

నేటికాలపు పరిశోధకుల దృష్టిలో ఋగ్వేదం పురాతనమైనది. తర్వాత యజుర్వేదం,సామవేదం, అధర్వణవేదం వచ్చాయి. అందరూ దీనినే నమ్ముతున్నారు.

ఈ పరిశోధకులు దేనిని ప్రామాణికంగా తీస్కొని ఇలా వర్గీకరించారో తెలియడం లేదు.

ఇలా ఎందుకంటున్నానంటే అసలు ఋగ్వేదంలోనే యజుర్వేదానికీ, సామవేదానికీ సంబంధించిన సమాచారం ఉంది.
అందుకే వేదాల ముందు,వెనుకల సందేహం వచ్చింది.

మనలో పురుషసూక్తము చాలామందికి తెలుసు. ఋగ్వేదం 10వ మండలంలోని పురుషసూక్తములోని 10 వ శ్లోకం చూడండి.

తస్మాద్యజ్ఞాత్-సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
చందాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాద జాయత ||


అర్థం:

ఈ సర్వహుత యజ్ఞం నుండి ఋగ్వేద మంత్రాలు పుట్టాయి,సామవేద మంత్రాలు పుట్టాయి.ఛందస్సు పుట్టింది,యజుర్వేదం పుట్టింది.


మరి ఋగ్వేదం తర్వాత పూర్తైన తర్వాత యజుర్వేదం,సామవేదాలు వచ్చాయనాలా? లేక ఋగ్వేదం రచిస్తుండగానే యజుర్,సామవేదాలు సమాంతరంగా(parallel) గా రచించారనాలా? లేక అన్నీ ఒకేసారి ఉన్నాయనాలా లేక పుట్టాయనాలా? కాని ఎవరూ ఇలా అనలేదు. అందరూ అనేదేమంటే మొదట చెప్పినట్లుగా ఋగ్వేదం మొదట తర్వాత యజుర్వేదం, సామవేదం మొదలగునవి.


కాని పై శ్లోకం వలన
ఋగ్వేదం మొదట తర్వాత యజుర్వేదం, సామవేదం అనే భావన ఎలా నిలబడగలదు?


ఇంకా ఇలాంటి ప్రస్తావనలు కల శ్లోకాలు ఏమైనా ఉన్నాయేమో నేనింకా చూడలేదు కాని పై శ్లోకం నాకు కనిపించింది.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు