తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, March 17, 2014

"మనం చేయగలిగినంత వరకు చేయడమే - ఫలితం భగవంతుడిదే" అని ఎందుకంటారు?

ఈ టపా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే ఈ మధ్య చదివిన ఒక చారిత్రక సంఘటన.

విజయనగర సామ్రాజ్యం స్థాపకుడైన విద్యారణ్యుల వారికి వేదవ్యాసులు చెప్పిన విషయం ఏమంటే 360 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం విలసిల్లుతుందని.

కానీ ఇంకా ఎక్కువ కాలం సామ్రాజ్యం ఉండాలని 3600 సంవత్సరాలు నిలబడగల ముహూర్తం పెట్టారు విద్యారణ్యుల వారు. తను ఆ ముహూర్త సమయానికి శంఖం ఊదుతానని అప్పుడు సరిగా భూమిపూజ మొదలు పెట్టాలని తమ శిష్యులకు ఆదేశించారు విద్యారణ్యులు.

సరిగా శంఖ ధ్వని వినిపించగానే భూమిపూజ మొదలు పెట్టారు శిష్యులు. కాని మళ్ళీ రెండవసారి శంఖ ధ్వని విని శిష్యులకు ఎందుకలా గురువు గారు రెండూ సార్లు ఊదారు అని విద్యారణ్యుల వారి వద్దకు వెళ్ళి అడిగారు.
విద్యారణ్యులవారు అప్పుడు దివ్యదృష్టితో మొదటిసారి శంఖ ధ్వని ఒక జంగము వాడు భిక్ష కోసం (నేటికీ వీరు ఇళ్ళ వద్ద భిక్ష అడిగేటప్పుడు శంఖం ఊదుతారు)ఊదగా వచ్చినదని గ్రహించారు. చాలా బాధపడి వేదవ్యాసుల వారి మాటే నిజమైనది కదా,విధి చాలా బలీయమైనదని నిట్టూర్చారు.

చూసారు కదా ఇదీ జరిగింది.ఇక్కడ మానవప్రయత్న లోపం ఏమైనా జరిగిందా. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలోని  సాంఖ్యయోగము లో ఇలా అన్నారు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి  (2-47) 

పని చెయ్యి.కాని ఫలితంపైన ఆసక్తి పెంచుకోకు.అలా అని పని చేయడం ఆపకు.


Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు