Thursday, September 11, 2008
అనుకూల వేదాంతము
Friday, August 29, 2008
మైత్రేయి(మన ప్రాచీన తల్లులు)
మైత్రేయి మన పురాణ(వేదకాలపు) ప్రఖ్యాత స్త్రీ.ఈమె జనకమహారాజు సభలో అందరు పండితులను ఓడించిన యాజ్ఞవల్కుని రెండవ భార్య.ఇతని మొదటి భార్య కాత్యాయిని.
మైత్రేయి సకల వేదాలను,స్మృతులను ఔపోశన పట్టిన సాధ్వి.ఆమె కాలంలో మైత్రేయి "బ్రహ్మవాదిని" అను బిరుదు పొందినది.
మైత్రేయి మొదట గార్గి అను మహాయోగిని శిష్యురాలు.కాని యాజ్ఞవల్కుని తో జనకసభలో గార్గి కూడా పరాజితురాలవడం చూసి యాజ్ఞవల్కుని వద్ద శిష్యరికం చేయాలని నిర్ణయించుకొంది.తను అతని భార్య ఐతే సకల విద్యా జ్ఞానాన్నీ పొందగలనని భావించింది.ఈ విషయమై యాజ్ఞవల్కుని మొదటి భార్య ఐన కాత్యాయినిని సంప్రదించింది.తర్వాత కాత్యాయని అనుమతితో యాజ్ఞవల్కుని పెళ్ళాడి అతని రెండవ భార్య అయింది.
ఋగ్వేదంలో దాదాపు 10 సూక్తాలు మైత్రేయి గురించి ఉన్నాయి.
సప్తర్షులు (అధ్యాత్మికం)
సప్తర్షుల లక్షణాలు వాయు పురాణము (16-13,14)లో ఇలా చెప్పబడినవి - దీర్ఘాయువులు, వేద మంత్రకర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్యదృష్టి గలవారు, సద్గుణ సముపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సమంచితులు, వయోవృద్ధులు, సర్వ ధర్మ మర్మజ్ఞులు, ధర్మ స్వరూపులు, గోత్ర ప్రవర్తకులు ఈ గుణములు గల మహర్షులు "సప్తర్షులు"గా ప్రసిద్ధి వహించిరి. వీరినుండియే వంశములు వృద్ధి చెందినవి, ధర్మ వ్యవస్థ సుప్రతిష్ఠమై సాగుచున్నది.
వీరి జీవన విధానము, భావములను వాయుపురాణంలో (61/95-97) ఇలా చెప్పారు.- అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞములు చేయుట, యజ్ఞములు చేయించుట, దానములను ఇచ్చుట, దానములు తీసికొనుట అనే ఈ ఆరు కర్మలను నిత్యము ఆచరించేవారు, విద్యాబోధనకు గురుకులములు నడిపేవారు, సంతాన ప్రాప్తికే గృహస్థాశ్రమమును స్వీకరించిన వారు, అగ్నికార్యములు నిర్వహించేవారు, వర్ణాశ్రమ ధర్మాలననుసరించి వ్యవహారములను నడిపేవారు, స్వయముగా సంపాదించుకొనిన అనింద్య భోగ్య వస్తువులనే అనుభవించేవారు, సంతానము గలిగి గోధనాది సంపదలచే ఒప్పువారు, ప్రాపంచిక విషయాలపట్ల నిరాసక్తులు.
వీరు మన్వంతరానికి ఒకసారి మారుతుంటారు.
1.మొదటి మన్వంతరము,అధిపతి స్వాయంభువు,సప్తర్షులు
మరీచి,అత్రి,అంగీరస,పులహ,క్రతు,పులస్త్య మరియు వశిష్ఠ
2.రెండవ మన్వంతరము,అధిపతి స్వారోచిషుడు,సప్తర్షులు
ఊర్జ,స్థంభ,ప్రాణ,దత్తోలి,నిస్చర,ఋషభ మరియు అర్వరివత్తు
3.మూడవ నన్వంతరము,అధిపతి ఔతమి
సప్తర్షులు కౌకునిది,కరుంది,దలయ,సాంఖ,ప్రవహిత,మిత మరియు సమ్మిత
4.నాల్గవ మన్వంతరము,అధిపతి తామస మను
సప్తర్షులు జ్యోతిర్ధామ,పృధు,కవ్య,చైత్ర,అగ్ని,వనక మరియు పివర
5.ఐదవ మన్వంతరము,అధిపతి రైవతమనువు
సప్తర్షులు హిరణ్యరోమ,వేదశ్రీ, ఊర్ధబాహు, వేదబాహు, సుధామ, ఫర్జన్య మరియు మహాముని.
6.ఆరవ మన్వంతరము,అధిపతి చక్షూసమనువు
సప్తర్షులు శుమేధస్సు, విరాజస్సు, హవిష్మత్, ఉత్తమ, మధు, అభినామన్ మరియు సహిష్ణు.
7.ఏడవ మన్వంతరము,అధిపతి వైవస్వతమనువు (ఇది ప్రస్తుతకాలం)
సప్తర్షులు కష్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ.
విష్ణుపురాణం ఆధారంగా
Wednesday, August 27, 2008
స్త్రీలు,శూద్రుల వేదాధ్యయన అధికారం
భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు
"చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః"అన్నాడు.
దీని అర్థం"మొదట వారి గుణాలబట్టి,తర్వాత వారు చేసే పనులబట్టి నాలుగు వర్ణాలు(కులాలు) నాచే(భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి."అని అర్థం.
వేదాలలో నాలుగు వర్ణాల (కులాల)గురించి చెప్పారు కానీ వాటిమధ్య ఎక్కువ,తక్కువల గురించి చెప్పలేదు.మధ్యయుగంలో సాంప్రదాయవాదులు స్త్రీ,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని వారి వారి గ్రంథాలలో చొప్పించారు కానీ ఏ వేదంలోనూ అలా చెప్పబడలేదు.సరిగదా ఆ అధికారం ఉన్నదని చెప్పాయి.
1.యజుర్వేదం(26.2) శ్లోకం
"యధేమంవాచం కళ్యాణీవధజనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యం శూద్రాయ చర్యాయచస్వయచరణాయ"
అంటే "నేనెలా ఈ కళ్యాణవాక్కులను బ్రహ్మ మొదలు శూద్రులవరకు సర్వ మానవులకూ చెప్పానో నీవూ అలానే చెప్పాలి."అని అర్థము.
2.అధర్వణ వేదం (8వ మండలం,2వ అనువాకం) బ్రాహ్మణులకు,శూద్రులలో కూడా చివరివారికి
"సత్యమహం గభీరకావ్యేన సత్యంజాతే నస్మిజాతవేద,నం దాసోనం ఆర్యోమహిత్వ వ్రతం మిమయయదహధరిష్యే"
అంటే "ఓ మానవుడా!గంభీర సత్యస్వరూపుడనైన నేను పుట్టుక నిచ్చినవాడను.నేను దాస(శూద్ర),ఆర్య పక్షపాతము గలవాడను కాదు.నావలె ప్రవర్తించి సత్యవంతములైన నా ఆదేశములను పాటించు వారినందరినీ రక్షిస్తాను"అని అర్థము.
3.ఇంకనూ ఋగ్వేద 10వ మండలం,3 వ అనువాకంలోని 30-34 వరకుగల సూక్తాలను ప్రచారం చేసిన కపశైలీషుడు శూద్రుడని ఐతరేయబ్రాహ్మణమును,స్వయంగా ఋగ్వేదములోనూ మరియు శాయనాచార్య భాష్యములోనూ చూడవచ్చు.
4.అలానే ఋగ్వేద ఒకటవ మండలం,17వ అనువాకంలోని 116-126 వరకు గల సూక్తాలను ప్రచారం చేసిన కక్షవాన్ ఋషి అంగదేశపు రాజు బానిసకొడుకని ఋగ్వేదంలోనూ, శాయనభాష్యములోనూ,మహాభారతంలోనూ చూడవచ్చు.
5.అంతేకాక జనశృతి అనే ఋషి శూద్రుడు.సత్యకామజాబాలి వేశ్య కొడుకు.వీరిద్దరూ ఉపనిషత్తుల ప్రకారం(వేదాల చివరివి)ఉత్తమ వేదాంతబోధ పొందినవారు.
6.ఋగ్వేద ఒకటవమండలం 223వ అనువాకం 129వ సూక్తాన్ని లోపాముద్ర,8వ మండలం 1వ అనువాకం 91 వ సూక్తాన్ని అపలా అనే స్త్రీలు ప్రచారం చేసారని ఋగ్వేద అనుక్రమణిక,శాయనభాష్యములోనూ చెప్పబడింది.
"న స్త్రీ శూద్ర వేదం అధీయతాం"(స్త్రీలు,శూద్రులు వేదమును అభ్యసింపరాదు)అన్నది మధ్యయుగపు గ్రంథాలలో చేర్చారు కానీ ఈ వాక్యము ఏ వేదములోనూ లేదు.ఇది వైదిక వాక్యము కాదు.
7.ఇక జనక మహారాజు కొలువులోని గార్గి అనే మహాయోగిని గురించి అందరికీ తెలుసు.యాజ్ఞవల్కుడు అను ఋషిని ధైర్యంగా ప్రశ్నలు అడగి సమాధానాలు రాబట్టింది.ఆ తర్వాతనే యాజ్ఞ్యవల్కుడు వేదవేత్తగా అంగీకరింపబడ్డాడు.ఈ యాజ్ఞవల్క్యుని భార్య అయిన మైత్రేయి ఇతనిచే బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఆ కాలంలో చాలా పేరుప్రఖ్యాతులు పొందింది.(బృహదారణ్యకోపనిషత్తు నుండి).
8.వజ్రసూచీ ఉపనిషత్తు ప్రకారం ఎవరికి వేదాలను అధ్యయనం చేసి ఆచరించాలన్న సహజమైన కోరిక ఉంటుందో,సామర్థ్యము ఉంటుందో వారు స్త్రీపురుషశూద్ర భేధము లేక అందరూ అర్హులే.
నిజమైన ఆత్మానుభవం పొందిన వారి ఉపదేశాలకు,శాస్త్ర వాక్యాలకు వైరుధ్యమేర్పడినప్పుడు ఆత్మవేత్తల(ఆత్మానుభవం పొందినవారు)మాటే వినమని ధర్మశాస్త్రాలు చెపుతాయి.
దుష్టము,సంకుచితము ఐన నేటి కులవ్యవస్థ శాస్త్రీయము కాదని,ఇవి వేదాల తర్వాతి కాలంలోని గ్రంథాలలో చేర్చబడ్డాయని చెప్పవచ్చు.
Tuesday, August 26, 2008
సహారా(సాగర),కాలిఫోర్నియా(కపిలారణ్య) లకు రిఫరెన్సులు
సహారా(సాగర) : http://www.csre.iitb.ac.in/ysrao/sahara.html
కాలిఫోర్నియా (కపిలారణ్య): http://www.salagram.net/VWH-World.html
ఇవి IIT బెంగళూరు,ముంబాయి ల ఉత్తరాల నుండి సేకరించినవి.
అలాగే సుశ్రుతుని ప్లాస్టిక్ సర్జరీ మొదలగు వివరాలకు వికీపీడియా(en.wikipedia.org/wiki/Sushruta_Samhita, en.wikipedia.org/wiki/Susrutha) చూడండి.
Monday, August 25, 2008
ఆర్యభటీయం(ప్రాచీన భారత విజ్ఞానగ్రంథాలు)
1.భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది.
2.సూర్యుని దృష్ట్యా గ్రహాల రోజులు కనుగొనడం
3.చంద్రుడు మరియు ఇతర గ్రహాలు సూర్యకాంతి వలనే ప్రకాశిస్తున్నాయి
4.గ్రహణాలు సూర్యుడు,చంద్రుడు మరియు భూమి ఒకే వరుసలోనికి వచ్చినపుడు ఏర్పడతాయి.(ఇక్కడ పూర్తి వివరాలు ఇచ్చారు).
5.ఈ గ్రంథం ప్రకారం సంవత్సరం=365 రోజులు,6 గంటలు,12 నిమిషాలు,30 సెకన్లు.(ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇది 365 రోజులు,6 గంటలు,9 నిమిషాలు,10 సెకన్లు)
6.ఈ గ్రంథం ప్రకారం గణితశాస్త్రంలో "పై(π)" విలువ దాదాపు 62832/20000=3.1416....( ఇప్పటి విలువ=3.14159...)
7.భూమి చుట్టూకొలత=24,835 మైళ్ళు ( ఇప్పటి ప్రకారం 24,902 మైళ్ళు)
8.సమస్య ద్వికరణీ. ప్రమాణం త్రితీయెన వర్ధయెత్ తచ్చతుర్థానాత్మ చతుసస్త్రింషెనెన సవిషెషహ్
ఇది 2 యొక్క వర్గమూలం కనుగొనడాన్ని వివరిస్తుంది.
2 యొక్క వర్గమూలం=1 + 1/3 + 1/(3.4) - 1(3.4.34)...=1.41421569(5 దశాంశాలకు సవరిస్తే).
9.sin(15 డిగ్రీలు)=890 ( ఇప్పటి విలువ 889.820) (ఇతను sin ను అర్దజ్యా గా వ్యవహరించాడు).
సుశ్రుతుడు- శస్త్రచికిత్సా పితామహుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
సుశ్రుతుడు క్రీ.పూ 4 వ శతాబ్దమునకు చెందినవాడు.ఇంతకు మించి వీరి వృత్తాంతము తెలియరావడం లేదు.వీరు ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు.మరియు మత్తుమందు ఉపయోగించడంలోనూ,కంటి శుక్లాలు తొలగించడంలోనూ,మూత్రపిండరాళ్ళు తొలగించడంలోనూ మరియు విరిగిన ఎముకలు అతికించడంలోనూ అనుభవజ్ఞులు.
ప్రక్క చిత్రాలలో సుశ్రుతుడు శస్తచికిత్స చేయడాన్ని మరియు అతడు ఉపయోగించిన పరికరాలను చూడవచ్చు.

ప్రపంచంలో మొట్టమొదట సిజేరియన్ చేసినది కూడా వీరే.
ఇతని మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ వృత్తాంతం చరిత్రలో క్రిందివిధంగా నమోదు చేయబడింది.
"ఒక రాత్రి ఒక ప్రమాదన్లూ దాదాపు ముక్కును కోల్పోయిన ప్రయాణికుడు సుశ్రుతుని తలుపు తట్టాడు.అతని ముక్కు నుండి రక్తం ధారాళంగా ప్రవహిస్తోంది.సుశ్రుతుడు మొదట అతని ముఖాన్ని శుభ్రంగా కడిగి ఏవో ఆకులను పిండి ఆ ఆకురసమును అతని ముక్కుపై పిండాడు.తర్వాత అతనికి కొద్దిగా ద్రాక్షరసం(వైన్) త్రాగడానికి ఇచ్చాడు.తర్వాత అతని ముక్కు పొడవును ఒక ఆకుతో కొలిచి అతని గడ్డం నుండి కొద్దిగా మాంసం ముక్కను కోశాడు.ఆ రోగి బాధతో మూలిగాడు కానీ ద్రాక్షరసం ప్రభావం వలన అతనికి నొప్పి తెలియలేదు.
తర్వాత గడ్డానికి కట్టుకట్టి రెండు గొట్టాలను ముక్కు రంధ్రాలలో పెట్టి ముక్కుతెగినచోట మాంసం ముక్కను ఉంచాడు.అక్కడ ఏదో మందుపొడిని,ఎర్ర చందనమును పూశాడు.మరియు మంగళివారు ఉపయోగించే లోహాన్ని ప్రవేశపెట్టాడు.తర్వాత నువ్వులనూనె తో పత్తిని తడిపి దానితో ఆ ముక్కుకు కట్టుకట్టాడు."
ఇదే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 26 శతాబ్దాలముందే చేయబడిన "ప్లాస్టిక్ సర్జరీ".వీరు ఈ విద్యలో కాశీ లోని దివోదశధన్వంతరి అను వారినుండి ప్రావీణ్యత సాధించారు.
వీరు రచించిన ప్రపంచప్రసిద్ద గ్రంథం "సుశ్రుతసంహిత".ఇందులో దాదాపు 101 రకాల శస్తచికిత్సకు ఉపయోగించే పరికరాలను తెలిపాడు.వీటికి జంతువులను సూచించు పేర్లను పెట్టాడు.
Sunday, August 24, 2008
కాంతివేగం వేదాలలోనే ఉంది (మహోన్నత భారతదేశం)
వీరు తమ ఋగ్వేద భాష్యంలో ఒక శ్లోకంపై వ్యాఖ్య లో (1.50 సూక్తము,4 వ శ్లోకం)
"ఓ! సూర్యదేవా నీ కిరణాలు అరనిమేషంలో 2202 యోజనాలు ప్రసరిస్తాయి"అన్నాడు.
మనకు తెలుసు
ఒక యోజనం=9.00625మైళ్ళు
మహాభారతం,శాంతిపర్వం ప్రకారం
అరనిమేషం= 8/75 సెకన్లు (ఇక్కడ 7.9789... ను సమీప 8 కు మార్చడం జరిగింది).
ఈ లెక్క ప్రకారం కాంతివేగం 186413.22 మైళ్ళు/సెకన్.
ఇప్పటి లెక్కప్రకారం ఈ వేగం 186300 మైళ్ళు/సెకన్.
ఇది అత్యంత ఆశ్చర్యజనకమైన ఫలితం.ఎంత దగ్గరగా మనవాళ్ళు లెక్కించారో.
Friday, August 22, 2008
కణాదుడు(ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
వీరి తల్లిదండ్రుల గురించి,జన్మించిన స్థలం గురించి,మరణ వృత్తాంతం తెలియ రావడం లేదు.
వీరు క్రీ.పూ.6 వ శతాబ్దంలో జన్మించారు.వీరి అసలు పేరు కశ్యపుడు.చిన్నప్పటినుండే వీరు సునిశిత జ్ఞానం కలవారు.చిన్నచిన్న విషయాలను కూడా వీరు ఆసక్తిగా గమనించేవారు.
ఒకసారి వీరు ప్రయాగకు వారి నాన్న తో పాటు వెళ్ళారు.అక్కడి దారులపైన భక్తులు చల్లిన పూలు,బియ్యం గమనించి భక్తులు పూజల్లో నిమగ్నులై ఉందగా ఇతను మాత్రం ఆ గింజల్ని లెక్కించడం మొదలుపెట్టాడు.అది చూసి సోమశర్మ అను ఋషి చూసి ఎందుకలా లెక్కిస్తున్నావని అడిగాడు.అప్పుడు కణాదుడు ఆ గింజలు ఎంత చిన్నవైనప్పటికీ ఈ విశ్వంలో భాగమేకదా అన్నాడు.
ఈ విధంగా కణాదుడికి చిన్నచిన్న విషయాలపైన కూడా దృష్టి ఉండడంచూసి ఆ ఋషి అతనికి "కణాదుడు"(కణ అనగా ధాన్యపుగింజ) అని పేరుపెట్టాడు.
వీరు కనుగొన్నవి:
#ప్రపంచంలో మొట్టమొదట పరమాణుసిద్దాంతం ప్రతిపాదించారు.
#ఒక అణువులో కనీసం రెండు పరమాణువులు ఉంటాయని కనుగొన్నారు.
#ప్రతిపదార్థానికి మూలం పరమాణువులే అని వటిని విభజించలేమని,అవి కనపడవని తెల్పాడు.(ఇప్పుడు వాటినికూడా విభజించవచ్చని కనుగొన్నారు,కానీ ఆ కాలం లో కణాదుడిలా కనీసం ఎవరూ అణువును కూడా ఊహించలేకపోయారు).
కణాదుడు వైశేషికదర్శనం(మిగతా దర్శనాలు న్యాయ,సాంఖ్య,మీమాంస మొదలగునవి)ప్రతిపాదించాడు.ఇందులో విజ్ఞాన,మత మరియి వేదాంతాల సమన్వయం ఉంది.ఈ దర్శనాలు నవీన శాస్తజ్ఞులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
Thursday, August 21, 2008
ఆనందంగా జీవించండి (వ్యక్తిత్వవికాసం)
"తప్పులు చేయడం మానవసహజం".కాబట్టి గతంలో జరిగిన తప్పుల గురించి బాధపడడం మానేసి ఆ తప్పులను మరోసారి చేయకుండా జాగ్రత్తపడాలి.
కాబట్టి జరిగిపోయిన మన చరిత్రను ఒక్కసారి కూలంకుషంగా విశ్లేషించి ఇక ఆ సంఘటనలను పట్టించుకోవడం మానివేసి ప్రస్తుతం చేయబోయే పనులపైన దృష్టి పెట్టాలి.అలాగే చేయబోయే ఏ పనినైనా ముందుగా ఆ పని వలన సంతోషం మిగులుతుందా లేక బాధ ఫలితమవుతుందా అని విశ్లేషించి మొదలుపెట్టాలి.ఇక్కడ ఇంకో విషయం మరిచిపోకూడదు."మన స్వేచ్చ ఇతరులను బాధపెట్టేదైతే మనం స్వేచ్ఛగా ఉండలేము" అన్న విషయం.కాబట్టి మన పనులు సమాజానికి మేలు చేయలేకపోయినా కనీసం హాని మాత్రం చేయరాదు.
అలాగే అనవసరంగా ఎవరినీ అనవసరంగా ద్వేషించకూడదు.మన ద్వేషం వలన ఆ ద్వేషింపబడేవారిలో ఏదైనా మంచి మార్పు వచ్చేటట్టైతే మన ద్వేషానికి అర్థం ఉంటుంది.ద్వేషం వలన మనసూ మనశ్శాంతి పొందలేదు.ఉదాహరణకు మనము మనకు ఇచ్చిన పని మనస్పూర్తిగా చేస్తున్నప్పుడు మన ద్వేషానికి కారణమైన మనిషికానీ,సంఘటన కానీ ఎదురైనా లేక గుర్తువచ్చినా మనకు తెలియకుండానే మన మనసు వికలమయ్యి మన పనికి ఆటంకం అవుతుంది.ఈ విషయాలన్నీ ఆదర్శపూరిత విషయాలని అనుకోవచ్చు.కాని ఏ ఆదర్శంలేని వ్యక్తి కన్నా ఏదో ఒక ఆదర్శం గల వ్యక్తి వలనే సమాజానికి ఉపయోగం ఉంటుందన్న విషయం మనం మరిచిపోరాదు.
అప్పుడే మనము వర్తమానాన్నీ ఆనందంగా జీవించగలము మరియు సుందర భవిష్యత్తునూ జీవించగలము.
Tuesday, August 19, 2008
కొన్ని ఆంగ్ల పదాలు వాటి మూలాలు
ఇది "సాగర"అను సంస్కృత పదము నుండి వచ్చినది.పూర్వము భూమి అంతా ఒకే ఖండము గా ఉండి ఇప్పటి రూపము సంతరించుకొనేటప్పుడు ఎన్నో మార్పులు జరిగినాయి.భూగర్భ శాస్త్రజ్ఞుల ప్రకారము సహారా ఎడారి ఒక ఎండిపొయిన సముద్రము."సాగర" అను సంస్కృత పద రూపాంతరమే నేటి "సహారా" అను పదము అని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయము.
కాలిఫోర్నియా:
మన రామాయణము లోని సగర కుమారుల వృత్తాంతము అందరికీ తెలిసేవుంటుంది.వారు కపిలమహర్షి నివశించే అరణ్యము లోనికి వెళ్ళి ఆ మునికి తపస్సు భంగము గావిస్తారు.అప్పుదు కపిలుడు వారిని బూడిద చేస్తాడు.ఈ "కపిలారణ్య"మే నేటి కాలిఫోర్నియా అని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయము.ఇందుకు నిదర్శనము గా నేటికీ అక్కడ కనిపించే ప్రఖ్యాత " ఫౌంటైన్ యాషెస్".అనగా బూడిద ఫౌంటైన్స్.
దశావతారాలు - అంతరార్థం
మనందరికీ తెలుసు శ్రీమహావిష్ణువు యొక్క దశావతరాలు.
అవి వరుసగా చేప,తాబేలు,పంది,నరసింహ,వామన,పరశురామ,శ్రీరామ,శ్రీకృష్ణ,బుద్ధ మరియు కల్కి అని.
ఇక్కడ మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో సృష్టి పరిణామక్రమం,మనిషి జీవనవిధానం అర్థమవుతుంది.
అదెలాగంటే
1.చేప : మొదట నీరు ఏర్పడింది( నేటి ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా భూమిపైన మొదట అంతా నీరే ఉండేది).కాబట్టి మొదట జలచరాలు ఏర్పడ్డాయి.
2.తాబేలు : ఇది ఉభయచరం అనగా భూమిపైన మరియు నీటిలో రెండింటిలో సంచరించునది.
3.పంది : ఇది భూమిపైన మాత్రం సంచరించేది.భూమిపైన జీవరాసుల ఉత్పత్తి గురించి ఇక్కడ కనిపిస్తోంది.
4.నరసింహ : ఇక్కడ మానవుని మొదటిదశ వర్ణింపబడింది.ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణరూపం పొందలేదు.
5.వామన : మానవులు మొదట మరుగుజ్జులుగా ఉండడాన్ని సూచించడం జరిగింది.
6.పరశురామ : ఇచ్చట మనిషి యొక్క పశుప్రవృత్తిని(అంటే చెప్పినది ఆలోచించకుండా చేయడం) సూచిస్తోంది.
7.శ్రీరామ : ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కొరకు జీవించడాన్ని మరియు మనిషి తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం గమనించవచ్చు.
8.శ్రీకృష్ణ : ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని చెప్పడం జరిగింది.
9.బుద్ద : అన్ని సుఖాల మరియు అనుభవాల తర్వాత మనిషి వైరాగ్యభావంతో జీవించడాన్ని సూచించడం జరిగింది.
10.కల్కి : ఈ అవతారం ఇంకా రాలేదు కనుక దీని విషయం తెలియరావడం లేదు.
Monday, August 18, 2008
ఆర్యభట్ట (భారత శాస్త్రవేత్తలు)
ఆర్యభట్ట క్రీ.శ. 476 వ సంవత్సరంలో పాటలీపుత్రంలో(నేటి పాట్నా)లో జన్మించాడు.కానీ చాలామంది ఇతడు కేరళలో జన్మించి,పాటలీపుత్రంలో స్థిరపడ్డాడని వాదనలు ఉన్నాయి.కాని వీటికి ఆధారంలేదు.ఇతడు వర్తక కుటుంబానికి చెందినవాడు.వీరి తల్లిదండ్రులు,జీవితం గురించి అంతగా పరిశోధన జరగలేదు.
ఏదేమైనప్పటికీ ఆర్యభట్టు తన సుప్రసిద్ద ఆర్యభట్ట సిద్దాంతం(ఆర్యభట్టీయం) పాటలీపుత్రంలోనే రచించాడనడంలో ఎటువంటి అభ్యంతరమూ లేదు.
గణితంలో ఇతని ఘనకార్యాలు:
1.ఇప్పుడు మనము పాశ్చాత్యులు కనుగొన్నారనుకొంటున్న విషయాలైన "భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగడం,భూమి చుట్టు చంద్రుడు తిరగడం" గురించి ఆనాడె తన గ్రంథం లో పేర్కొన్నాడు.
2.4 కు 100 కూడి వచ్చినదాన్ని 8 తో హెచ్చవేసి తర్వాత 62,000కు కూడి వచ్చినదాన్ని 20,000తో భాగిస్తే వృత్తపరిధి మరియు వృత్తవ్యాసం నిష్పత్తికి సమానమని చెప్పాడు.దీని విలువ 3.1416 అని చెప్పాడు.గమనించి చూస్తే ఇదే గణితంలోని "పై"విలువ అని తెలుస్తుంది.ఆధునిక గణితం ప్రకారం ఈ విలువ 3.14159.చూడండి ఆనాడే ఇతను ఎంత సరిగా విలువ గణించాడో.
3.చంద్రుని వెలుతురు సూర్యరశ్మి పరావర్తనంవలన కలుగుతుందని చెప్పాడు.
4.గ్రహణాలు రాహు,కేతువులవలన కాదు అని అవి ఒకే వరుసలోకి వచ్చినప్పుడు కలుగుతాయని గ్రంథంలో పొందుపరచాడు.
5.సంవత్సరానికి 365 రొజులని కూడా చెప్పాడు.
6.భూమి యొక్క చుట్టుకొలత 24385 మైళ్లని (నేటి విజ్ఞానం ప్రకారం ఇది 24900 మైళ్ళు) అని కనుగొన్నాడు.
తర్వాతికాలంలో ఇతని గ్రంథాన్ని గ్రీకులు,అరబ్బులు గ్రహించారు.
వీరు క్రీ.శ.550 లో మరణించారు.
మహోన్నత జీవితానికి మూడు సూత్రాలు
సమర్థుడు
-- స్వామివివేకానంద
౧.సత్యం:
"సత్యం" ఈ మాట వింటేనే మనలో చాలామందికి వణుకు వస్తుంది.కానీ ఒక్కటి మరువరాదు
"సత్యమేవ జయతే,నానృతం" - ముండకోపనిషత్తు
సత్యమే జయిస్తుంది,అసత్యమెన్నటికీ కాదు.
అందరూ అనుకుంటారు " సత్యమే మాట్లాడుతూ కార్యాలయాలలోనూ,వ్యాపారాలలోనూ ఈ కాలంలో పనిచేయడం అసంభవం అని".కానీ ఇక్కడ గమనించవలసిన
విషయం ఏమిటంటే "సత్యం పురాతనమైనా,ఆధునికమైనా ఏ సమాజానికీ తలవంచదు;సమాజమే సత్యానికి తలవంచాలి".
సత్యం యొక్క తక్షణఫలితాలు చేదుగా అనిపించినా అంతిమ ఫలితం శుభమే అన్న విషయం చరిత్రలో ఋజువైంది.సత్యం పలుకువాడు దేనికీ తలవంచనవసరం
లేదు,భయపడనవసరం లేదు.
౨.పవిత్రత:
"పవిత్ర హృదయులు ధన్యులు.ఎందుకంటే వారు దేవుడిని దర్శిస్తారు" - బైబిల్
పవిత్ర హృదయం అనగా నిష్కల్మష హృదయమే.ఏదైనా పని నిర్విఘ్నంగా సాధించాలంటే ముందు మన మనసు పరిశుభ్రంగా ఉండాలి.ఆ పని చేస్తున్నంతవరకూ మన శ్వాస,ధ్యాస అంతా అప్పటికి ఆ పనే కావాలి.కాని ఇది సాధ్యం కావాలంటే పవిత్రమైన మనసుకు తప్ప మరేవిధంగానూ సాధ్యం కాదు.
పవిత్రత నిండిన హృదయం కులం,మతం,జాతి,సంప్రదాయం-అనే భేదబుద్ధిని విడిచి సమస్త విశ్వాన్నీ ఆలింగనం చేసుకుంటుంది.అప్పుడు మన పనికి ఏ విధమైన ఆటంకమూ ఏమీ చెయ్యలేదు.ఎందుకంటే అప్పుడు మన మనసు పవిత్రం కావడం వలన ఏ ఆటంకమునైనా మనము తేలికగా దాటగలము.
౩.నిస్వార్థత:
నేడు ప్రపంచంలో చాలామంది తమ స్వార్థం కోసమే జీవిస్తున్నారు.ఇక్కడ స్వార్థం అనగా స్వ+అర్థం=సొంత ప్రయోజనం కోసమే అని.
నిజం చెప్పాలంటే స్వార్థం లేనివాళ్ళు అంటూ ఎవరూ ఉండరు.కాని ఆ స్వార్థ శాతాన్ని తమ జీవితంలో ఎంతమేరకు తగ్గించుకుంటారో అంత ఎక్కువ ఆనందం అనేది అనుభవం అవుతుంది.
"చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష" అని అనుకున్నంత కాలం స్వార్థం అనేది లవలేశమైనా తగ్గదు.అందరికీ అనుభవమే పంచుకొని తినడంలో,అనుభవించడంలో గల ఆనందం.కాని ఎవరూ ఆచరణలో పెట్టలేకపోతున్నారు.ఎప్పుడైతే నిస్వార్థత మనకు కలుగుతుందో అప్పుడే మనశ్శాంతి వస్తుంది.కోట్లు సంపాదించినా పొందలేని మనశ్శాంతి మన వశమవుతుంది.
మనం ప్రపంచాన్ని మన మనసు ద్వారానే చూస్తున్నము కాబట్టి పరిశుద్దమైన మనసు ద్వారా మనకు ప్రపంచంలోని మంచే కనిపిస్తుంది.
సత్యం ద్వారా పవిత్రత,తద్వారా నిస్వార్థత అలవడుతాయి.
Sunday, August 17, 2008
శ్రీరామకృష్ణ పరమహంస
జననము మరియు బాల్యము
శ్రీరామకృష్ణ పరమహంస గారు క్రీ.శ 1836,ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్,చంద్రమణిదేవి.వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు.రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు.బాల్యం నుండే ఇతనికి లలితకళలు,చిత్రలేఖనము లో గల ప్రవేశము వలన వారి గ్రామములో ఇతనికి మంచిపేరు ఉండేది.ఐనా ఇతనికి పాఠశాల విద్య అంటే ఏహ్య భావము కలిగిఉండేవాడు.దానివలన చదువు అబ్బలేదు.పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామము గుండా వెళ్ళేవారు.వారిని సేవించేవాడు.
ఉపనయనం తర్వాత చిన్నప్పుడు ఒక దళిత మహిళకు ఇచ్చిన మాటప్రకారం బంధువులు వారిస్తున్నా మొదటి భిక్షకు వెళ్ళి స్వీకరించాడు.
రానురాను వీరి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారటంతో వీరి అన్నగారైన రాంకుమార్ గారు కలకత్తాలో ఒక సంస్కృత పాఠశాలను నడిపేవారు.తర్వాత ఒక అంత్యకులంలో జన్మించిన రాణిరాస్మణి దక్షిణేశ్వరంలో నిర్మించిన కాళికాలయంలో పూజారిగా నియమితుడయ్యాడు.
పూజారిగా
మొదట తిరస్కరించినా తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు పూజలో సేవచేసేవాడు.గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తాఅని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.కాలక్రమంలో తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవల్లు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు.ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు.అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు.నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు.
వీరి గురువులు మరియు సాధనలు
కాలక్రమంలో తోతాపురి అను నాగాసాంప్రదాయపు సాధువు వీరికి అద్వైతజ్ఞానం ఉపదేశించారు.వీరి గురువుగారు చిన్నప్పటినుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజులలోనే పొందారు.తర్వాత భైరవీబ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు.ఈ విధంగా భగవత్,ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం,క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశాం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.
వివాహము
వీరు భగవత్ధ్యాసలో ఉండడాన్ని పిచ్చితనంగా భావించిన వీరి తల్లి వీరికి వివాహము చేయ సంకల్పించింది.రామకృష్ణులే తమకొరకు ఒక అమ్మాయి సిద్దంగా ఉన్నదని ఆమె పేరు శారదాదేవి అని చెప్పి శారదాదేవిని పెళ్ళాడారు.ఆమెను సాక్షాత్ కాళికాదేవి లా భావించి పూజించారు.ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు.
గురువుగా
తన అనుభవాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి తగిన వ్యక్తుల కొరకు వీరు నిరీక్షిస్తుండగా మకరందముగ్రోలడానికి వచ్చు తుమ్మెదలలాగా శిష్యౌలు రావడం ప్రారంభించారు.వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరిపేరు ప్రపంచ ప్రఖ్యాతి పొందడానికి దోహదం చేసినది వివేకానందులు.వీరి పరిచయం విచిత్రంగా జరిగినది.
అప్పటికి వివేకానందులు నిజంగా భగవత్ అనుభవమ్ పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు."మహాత్మా మీరు భగవంతున్ని చూసారా?" అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు.రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆద్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవాడు.
రామకృష్ణులు ప్రపంచానికి అందించిన శిష్యులు:
స్వామి వివేకానంద,స్వామి బ్రహ్మానంద,స్వామి ప్రేమానంద,స్వామి శివానంద,స్వామి త్రిగుణాతీతానంద,స్వామి అభేదానంద,స్వామి తురీయాతీతానంద,స్వామి శారదానంద,స్వామి అద్భుతానంద,స్వామి అద్వైతానంద,స్వామి సుభోదానంద,స్వామి విజ్ఞానానంద,స్వామి రామకృష్ణానంద,స్వామి అఖండానంద,స్వామి యోగానంద,స్వామి నిర్గుణానంద. వీరి ద్వారా రామకృష్ణమిషన్ స్థాపించబడి నేటికీ ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది.
వీరు సన్యాస శిష్యులు.గృహస్థ శిష్యులలో నాగమహాశయులు,పూర్ణుడు,గిరీష్ ఘోష్ మొదలగువారు ప్రముఖులు.
వీరి ప్రముఖ భోదలు
#అన్నిమతాల సారాంశం ఒక్కటే.
#కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
#మానవసేవే మాధవసేవ
#ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే.
అలాగే స్వామీ వివేకానందుని భోధనలలో చాలా భాగం రామకృష్ణులవే.
అంత్యదశ
వీరు కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు.తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశిపూర్ కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవచేశారు.చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు.
చివరికి వీరు 1886,ఆగష్టు 16 న భగవంతునియందు లయించారు.
Thursday, August 14, 2008
కొన్ని ధైర్య-ఆత్మవిశ్వాస ఉత్పాదక వచనాలు
అచంచల ఆత్మవిశ్వాసం గలవాడికి సముద్రం పిల్లకాలువ లాగా,మహోన్నతపర్వతాలు గోపాదంలాగా కనిపిస్తాయి.
--స్వామి వివేకానంద
భగవంతుడు మనిషికి ఎదుర్కోలేని కష్టాలు ఇవ్వడని గుర్తుంచుకో.
-- పరమహంస యోగానంద
అగాధమైన సముద్రంలో ఆణిముత్యం ఉన్నట్లే దుఃఖాల వెనుక సుఖముంటుంది.సాదించి శోధించాలి.
-- శ్రీశ్రీ
నీకు విజయం వరించాలని ఆశించబోయేముందు అందుకు నీవు అర్హుడవో,కావో ఆలోచించు.
-- ఖలీల్ జిబ్రాన్
Wednesday, August 13, 2008
భూమి గుండ్రం (వేదాలు)
కాని ఋగ్వేదం లోని క్రింది మంత్రం గమనించండి.
" చక్రాణాసః పరీణహం పృథివ్యా...."అర్థం " భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు..."
అతిప్రాచీన గ్రంథం ఐన సూర్యసిద్దాంతం గ్రంథ 12వ అధ్యాయం,32వ శ్లోకంలో
"మధ్యే సమంతాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి"
"బ్రహ్మాండం మద్యలో భూగోళం ఆకాశంలో నిలిచిఉంది" అని దాని అర్థం.
ఆర్యభట్టు రచించిన "ఆర్యభట్టీయం" గ్రంథంలోని గోళపాద అధ్యాయంలో 6వ శ్లోకం " భూగోళః సర్వతో వృత్తః" అంటే " భూమి వృతాకారంలో ఉన్నదని అర్థం.
క్రీ.శ.505 లో వరాహమిహిరుడు " పంచ మహాభూతమయస్తారా గణ పంజరే మహీ గోళః..(13-1)"
అర్థం: పంచ భూతాత్మకమైన గుండ్రని భూమి,పంజరం లో వేలాడే ఇనుప బంతిలా,ఖగోళంలో తారల మధ్య నిలిచిఉంది"అన్నాడు.
లీలావతి గ్రంథం లో భాస్కరాచార్యుడు " నీవు చూసేదంతా నిజం కాదు.ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులో నాల్గవ భాగం చూస్తే అది మనకు ఒక సరళరేఖలా కనిపిస్తుంది.కానీ నిజానికి అది వృత్తమే.అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది."
శ్రీరామకృష్ణ ప్రభ సౌజన్యంతో
Thursday, July 31, 2008
భారతదేశం యొక్క ఘనత (ప్రపంచానికి అందించినవి)
2.గత 1000 సంవత్సరాలలో మనదేశం ఏ దేశం పైనా దండెత్తలేదు.
3.క్రీ.పూ 700 సంవత్సరంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని తక్షశిలలో నిర్మించారు.ఇక్కడ సుమారు 10,500 మంది ప్రపంచంలోని నలుమూలలనుండి వచ్చి విద్యను అభ్యసించారు.క్రీ.పూ 400 లో నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు.
3."ఫోర్బ్స్" పత్రిక ప్రకారం కంప్యూటర్ కు అత్యంత అనుకూలమైన భాష సంస్కృతం.
4.పాశ్చాత్యప్రపంచం ఈ మధ్య కనుగొన్న ప్లాస్టిక్ సర్జరీ ని ఏనాడో 2600 సంవత్సరాలకు పూర్వమే సుశ్రుతుడు చేసాడు.
5.దేశప్రాంత పటాలు 5000 సంవత్సరాల పూర్వమే సింధునాగరికత కాలంలోనే మనవారు కనుగొన్నారు.ఆంగ్ల పదం నావిగేషన్ మన సంస్కృత పదం ఐన నవగతిః నుండి వచ్చింది.
6.పైథాగరస్ సిద్దాంతాన్ని,"పై" విలువను మొదటిసారిగా కనుగొన్నది మన భారతీయులే.
7.గ్రీకులు,రోమనులు 105 అంకెల వరకు లెక్కించిన కాలంలోనే మనవారు 1053 వరకు లెక్కించారు.
8.1896వ సంవత్సరం వరకు ప్రపంచంలోనే ఏకైక వజ్రాల ఉత్పత్తిదారు,ఎగుమతిదారు ఒక్క భారతదేశమే.
9.మార్కోని కన్నా ముందే జగదీష్ చంద్రబోస్ రేడియో తరంగాలను కనుగొన్నాడు.
10.చదరంగం కనుగొన్నారు.
11.పాశ్చాత్య ప్రజలు ఇంకా అడవులలోనే జీవిస్తున్నకాలం లోనే మనవారు సింధునాగరికత లో ఉన్నారు.
12.దశాంశపద్దతిని కనుగొన్నది భారతీయులే.
Wednesday, July 30, 2008
త్రైలింగస్వామి (మన మహాత్ములు)
స్వామివారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం.స్వామి చిన్నప్పటినుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు.తన తల్లి చెప్పే రామాయణ,మహాభారతాలు మొదలైన మతగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు.ఇతను తన తల్లిదండ్రుల సేవలో 52 సంవత్సరాలు గడిపాడు.అప్పుడు తన తల్లి మరణించగా గురువును వెదుకుతూ ఇల్లు వదలిపెట్టి వెళ్ళిపోయాడు.తన సాధనను తన ఊరి శ్మశానంలో ప్రారంభించాడు.తర్వాత అతను నేపాల్ తో సహా చాలా ప్రదేశాలు తిరిగి చివరికి కాశి చేరుకొని అక్కడ సుమారు 150సంవత్సరాలు పైన ఉన్నాడు.
స్వామివారు కేవలం ఆకులూఅలములు,పండ్లుఫలాలు తిని సంవత్సరానికి ఒక పౌండు చొప్పున పెరిగి 300 పౌండ్ల బరువుకి పెరిగినట్టు చెపుతారు.
స్వామివారు ఎన్నోవిషపూరిత ద్రవాలు త్రాగికూడా ఎటువంటి తేడా లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు.వేలాదిప్రజల సాక్షిగా రోజుల తరబడి గంగానది పై తేలుతూ ఉండేవారు.ఒక్కొక్క సారి నీటిపై కూర్చుని ప్రజలకు కనిపించేవారు.ఒక్కొక్కసారి నీటిలోపల ,అలలక్రింద రోజుల తరబడి ఉండిపొయేవాడు.వేసవికాలం లో మిట్టమధ్యాహ్నం మణికర్ణికాఘాట్ లో ఎర్రగా కాలే ఇసుక పై స్వామి పడుకోవడం ,స్వామికి ఏమీకాకుండా ఉండటం చూడటం అక్కడి ప్రజలకు అలవాటే.
స్వామివారు అద్వైతఙ్ఞానసిద్ది పొందారనడానికి క్రింది సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది.
స్వామి వారు విషపూరితద్రవాలు త్రాగి కూడా ఏమీకాకుండాఉండడం చూసి ఒక వ్యక్తి స్వామివారు అబద్దాలకోరు అని ఋజువుచేయడానికి ఒకరోజు ఒక కుండ నిండా సున్నం తీసుకుని స్వామివారికి అందులో పెరుగు ఉందని చెప్పి ఇచ్చాడు.సర్వజ్ఞులైన స్వామివారు మారుమాటాడకుండా త్రాగినారు.
త్రాగిన వెంటనే ఇచ్చిన అతను కడుపులో మంట అంటూ పొర్లాడసాగాడు.స్వామివారిని కరుణించమన్నాడు.అప్పటికి ఎన్నోరోజుల నుండి మౌనంలో ఉన్న స్వామి తన మౌనం విరమించి "ఓయి ధూర్తుడా!సర్వ ప్రాణులలో ఉన్న ఆ పరబ్రహ్మమే నా కడుపులో కూడా ఉన్నాడన్న జ్ఞానం నాకు ఉంది కాబట్టే నేను నీవిచ్చిన విషపూరిత సున్నం త్రాగి కూడా బ్రతికినాను.ఇంకెప్పుడు ఇలా చేయవద్దు.వెళ్ళీపో"అన్నాడు.ఆ ఇచ్చిన వ్యక్తి బ్రతుకుజీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు.
స్వామి వారు ఎప్పుడూ దిగంబరంగా ఉండేవారు.అప్పటి ఆంగ్లేయులకు ఇది చాలా కష్టంగా ఉండేది.అందువలన ఎన్నోసార్లు స్వామిని పట్టుకొని కారాగారంలో పెట్టారు.కానీ స్వామివారిని పెట్టిన నిమిషం లోపే స్వామివారు కారాగారపు పైకప్పులపైన పచార్లు చేస్తూ కనిపించేవారు.ఒక సారి స్వామివారిని న్యాయస్థానం లో హాజరుపరిచారు.అక్కడి న్యాయమూర్తి స్వామివారితో "మీరు అన్నిటిలో దేవున్ని చూస్తున్నారని చెప్పారు కదా.అలా ఐతే నీ మలం నీవే తినగలవా?"అని ప్రశ్నించాడు.స్వామివారు ఏ మాత్రం సంకోచించకుండా అక్కడే మలవిసర్జన చేసి తన మలం తనే తిన్నాడు.ఆశ్చర్యకరంగా స్వామివారి మలవిసర్జన తర్వాత న్యాయస్థానం అంతా సుగంధభరితం అయ్యింది.ఈ దెబ్బతో స్వామి వారిపై ఆంగ్లేయులు మరెప్పుడూ ఫిర్యాదు పెట్టలేకపోయారు.
ఇలా స్వామివారి జీవితంలో ఎన్నో మహిమలు జరిగాయి.
స్వామివారు పుష్యశుక్లఏకాదశి నాడు (డిసెంబర్ 1881) నాడు సమాధి పొందారు.వీరి సమాధి కాశి లో పంచగంగఘాట్ లో ఉంది.
స్వామి వారిని దర్శించిన మహాత్ములు: శ్రీరామకృష్ణపరమహంస,శారదామాత,స్వామి వివేకానంద,పరమహంస యోగానంద,నరసింహ యోగీంద్రులు మొదలగువారు.
క్రియాయోగాన్ని బాబాజి ద్వారా గ్రహించి ప్రపంచానికి అందించిన లాహిరీ మహాశయులు త్రైలింగస్వామికి అత్యంత ఆప్తమిత్రులు.
స్త్రీ అనగా
స - సత్వగుణం - పిల్లలను ప్రేమతో పెంచడం,భర్తను అత్తమామలను,ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడం
త - తమోగుణం - పిల్లలను తీర్చిదిద్దడంలో వారిని దండించడం
ర - రజోగుణం - పిల్లలను కనడం
భారతదేశం అనగా
భా-భావ ర-రాగ త-తాళ యుక్తమైనది భారతదేశం
2.వేదాంతపరంగా
భా(వెలుగుతో) రత(సంగమించేది అనగా నిండిఉండునది) భారతదేశం
3.యోగపరంగా
భా(వెలుగుతో అనగా సత్వగుణంతో) ర(రజోగుణాన్ని) త(తమోగుణాన్ని) జయించినది భారతదేశం
Tuesday, July 29, 2008
సదాశివబ్రహ్మేంద్రస్వామి (మన మహాత్ములు)
ఇతను చిన్నప్పటి నుండే మిగతా పిల్లల కంటే తేడాగా ఉండేవాడు.వైరాగ్యం మొదలగు భావాలు ఉండేవి.అందువలన పెళ్ళి చేస్తే అంతా సరిపోతుందని వీరి తల్లిదండ్రులు భావించారు.మొదట స్వాములవారు వ్యతిరేకించినా ఒక కుమారుడిగా వారు చూసిన అమ్మాయిని 17 సంవత్సరాల వయస్సు లో పెళ్ళాడాడు.
కానీ అతను ఏ మాత్రం మారలేదు.అతనిలో వైరాగ్య భావాలు దృఢంగా ఉన్నాయి.ఇలా ఉండగా అతని భార్య పుష్పవతి అయ్యింది( ఆ కాలం లో బాల్యవివాహాల ఆచారం ఉండేది).మొదతిరాత్రిని స్వామిగారి మామగారింట్లో చేయాలని అందుకు తగ్గ వంటావార్పూ,సంభారాలు మొదలు పెట్టారు.స్వామికి విపరీతంగా ఆకలి అయ్యి వంటగది వద్దకు వెళ్ళి "నాకు ప్రత్యేక వంటకాలు అవసరం లేదు.ఏదుంటే అది పెట్టండి తినడానికి"అన్నాడు.అప్పుడు వారి అత్తగారు"దయచేసి కొద్దిసేపు వేచిఉండండి.మీరు ఎక్కువసేపు వేచి ఉండనవసరం లేదు.లోనికిరావద్దు.బయటనే ఉండు"అన్నది.
"లోనికిరావద్దు.బయటనే ఉండు" అన్న మాటలు స్వామిలో అనుకోని మార్పును వెంటనే తీసుకుని వచ్చింది."గృహస్థాశ్రమం లోకి రావద్దు.బయటనే ఉండి జ్ఞానాన్ని పొందు" అని స్వామివారు అర్థం చేసుకున్నారు.ఆకలినే తీర్చలేనివాళ్ళు తనకు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు?అని అనుకుంటూ స్వామి అక్కడినుండి వెల్లిపోయారు.బందువులు అతన్ని కనుగొనలేకపోయారు.
అతను తర్వాత అడవులలోనూ,నదీ తీరాలలోనూ గడిపాడు.భిక్షాటన చేసుకుని ఆకలి తీర్చుకునేవాడు.తనకే ఉండడానికి ప్రదేశంలేనివాడు దేవుడికి ఎక్కడ ప్రదేశం చూపించి పూజించాలి?అందువలన తన హృదయంలో పూజించేవాడు.ఈ మానసిక పూజను తన "శివ మానసికపూజ" అను స్తోత్రంలో వర్ణించాడు.
"ఓ శివా! అంతటా నీవి వ్యాపించిఉన్నావు.నిన్ని నేనెక్కడ పూజించగలను?ఆకాశమే నీ వస్త్రాలైనప్పుడు నీకు నేను ఏ వస్త్రం ఇవ్వగలను?"అంటూ స్తోత్రం చేశాడు.
ఈ హృదయవిదారక ప్రార్ఠన విని శివుడు స్వామివారికి కామకోటిపీఠంకు చెందిన పరమశివేంద్రసరస్వతి ని గురువుగా పంపాడు.గురువుగారు స్వామిని చూసి అతని లోని చైతన్యాన్ని గుర్తించి "సదాశివా"అంటూ పిలిచాడు.అప్పటి నుండి "శివరామకృష్ణ" పేరు "సదాశివ"అయ్యింది.వారి పీఠం పేరు కలుపుకొని "సదాశివబ్రహ్మేంద్రసరస్వతి" అయ్యింది.తన గురువుగారిని ఎంతగానోసేవించి అనేక కీర్తనలు,స్తోత్రాలు బ్రహ్మసూత్రాలకు పాతంజలయోగసూత్రాలకు వ్యాఖ్యానం చేసాడు.అన్నిటిని తన గురువుకు అంకితం చేసాడు.తన స్తోత్రాలకు మకుటం గా "పరమహంసగురు" అని ఎంచుకున్నాడు.
స్వామివారు ఎంతోమందితో వాదించి అందరినీ ఓడించేవాడు.ఒకసారి ఇలా ఓడిన పండితుడు గురువుగారికి ఫిర్యాదు చేసాడు.అప్పుడు గురువు గారు" ఓ! సదాశివా! నీవు ఎప్పుడు నిశ్శబ్దంగాఉంటావు?"అన్నాడు.మీ అనుగ్రహంతో ఇప్పుడే అంటూ సదాశివులవారు అన్నారు.గురువుగారి నుండి వెళ్ళిపోయి తను మౌనంలో అనుభవించిన అనుభవాలను తన కీర్తనల్లో వర్ణించాడు.లౌకిక విషయాలను వదిలి పెట్టి తనలోనే ఆత్మజ్ఞానాన్ని అనుభవిస్తూ ,తన దగ్గరకు వచ్చింది తింటూ జీవించాడు.
ఒకసారి ఈవిధంగా సమాధిస్థితిలో ఒక గడ్డివాము దగ్గర నిలిచున్నాడు.ఆ వాము యజమాని స్వామిని ఒక దొంగ అనుకొని కొట్టబోయాడు.వెంటనే అతను శిలావిగ్రహంలా ఉండిపోయాడు.స్వామికి ఇవేమీ తెలియదు.మరుసటి ఉదయం మెలకువలోనికి వచ్చినప్పుడు నవ్వుతూ ఆ రైతు వంక చూడగా ఆశ్చర్యకరంగా అతను మళ్ళీమామూలుగా అయ్యాడు.క్షమాపణ ఆడిగాడు.స్వామి నవ్వుతూ వెల్లిపోయాడు.ఒకసారి ఇదేవిధంగా సమాధిస్థితిలో కావేరి నదీతీరంలో ఉన్నప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోయాడు.మూడునెలల తర్వాత రైతులు ఇసుకమేటలు తొలగిస్తున్నప్పుడు ఒక గడ్డపార తగిలి స్పృహలోకి వచ్చి ఏమీజరగనివాడిలా వెళ్ళిపొయాడు.ఇలాంటి మహిమలెన్నో స్వామిజీవితంలో జరిగాయి.
చివరికి స్వామివారు తమిళనాడులోని నేరూరు లో స్థిరపడ్డారు.అక్కడి రాజు స్వామి ఉపదేశాలను పాటించి పరిపాలన చేసాడు.ఇప్పటికీ తమిళనాడు లో స్వామి కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.
స్వామి వారి ఉపదేశం " నీవుకోరుకున్నది చేయవద్దు.అప్పుడు నీకు నచ్చినది చేయవచ్చు" అని.
స్వామివారు నేరూరులోనే సమాధి పొందారు.
విద్యుత్తు ప్రస్తావన (వేదాలు)
" అప్పుడు ఆ దేవత జలం నుండి ఒక శక్తిని తీశాడు.ఆ శక్తి మూడు పాములు కలిగిఉంది.ఆ పాముల తలలు ఒకటి ముందుకు,ఒకటి వెనుకకు ఒకటి భూమి వైపుకు ఉన్నాయి.ఆ శక్తిని రాక్షసుల పై ప్రయోగించాడు.ఆ శక్తి తగిలిన రాక్షసులందరూ భస్మం అయ్యారు.ఆ శక్తి తిరిగి దేవత దగ్గరకు వచ్చిచేరింది"
ఈ శ్లోకం గమనిస్తే పాము మూడు తలలూ ధనాత్మక,ఋనాత్మక మరియు భూమిలోకి(ఎర్త్) లను సూచిస్తున్నాయి.విద్యుత్తు తాకినప్పుడు కలిగే ప్రభావం గురించి చెప్పడం జరిగింది.తిరిగి వలయం(సర్క్యూట్) పూర్తవ్వడం తెలుస్తోంది.
బ్రహ్మజ్ఞాని లక్షణాలు
అవి బాలక,జడ,పిశాచ మరియు ఉన్మత్త లక్షణాలు.
1.మనస్తత్వంలో స్త్రీ,పురుష భేధాలు లేక బాలక అవస్థ కలిగిఉండడం
2.బ్రహ్మనిష్ఠ(సమాధి స్థితి) లో ఉన్నప్పుడు జడుడిలా ఏమీ పట్టించుకోకుండాఉండడం
3.పగలురాత్రి అనే తేడా ఏమీలెకుండా,ఏమాత్రం భయం లేకుండా ఇష్టం వచ్చిన విధంగా సంచరించునప్పుడు పిశాచంలా (అంటే శుచిశుభ్రత అనేవి పట్టించుకోకుండా తిరగడం)
4.తమ బ్రహ్మనిష్ఠ కు భంగం కలుగకుండా ఇతరుల పట్ల ఉన్మత్తునిలా (పిచ్చివాడిలా) ఉండడం,కానీ వీరు ఎవరికీ ఎటువంటి హానీ కలిగించరు
Monday, July 28, 2008
శుకమహర్షి - మన పురాణ ఋషులు
జన్మరహస్యము:
ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుడితో "స్వామీ,ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి?జనన మరణాలు ఏ విధంగా సాగుతున్నాయి?అసలు సృష్టి ఏ విధంగా జరుగుతోంది?" మొదలైనవి అడిగింది.అప్పుడు ఈశ్వరుడు "అన్నీ చెప్తాను.కాని ఒక ఏకాంత ప్రదేశంలో చెప్పాలి" అంటూ కైలాసం వదిలి ఏకాంత ప్రదేశమునకు బయలుదేరారు.పరమశివుడు మొదట నంది ని,ఆభరణాలైన పాములను ఒక్కటొక్కటిగా వదిలివేస్తూ పార్వతితో బయలుదేరి చివరకు అమరనాథ గుహను చేరుకున్నారు.అక్కడినుండి పంచభూతములను,గుహలో ఉన్న రామచిలకలను బయటికి పంపివేశినాడు.పార్వతికి రహస్యాలను చెప్పడం మొదలు పెడతాడు.కాని గుహలో ఒక రామచిలక గుడ్డు పగిలి ఒక చిన్న చిలక ఈ విషయాలను వింది.ఈ విషయం పసిగట్టిన శివుడు ఆగ్రహించి మరణం వచ్చునట్లు శపించాడు.కాని మరుసటి జన్మలో ఒక ఋషిగా పుట్టునట్లు అనుగ్రహించాడు.ఆ చిలకే తర్వాతి జన్మలో శుకమహర్షి.అందుకే కొన్ని చిత్రాలలో శుకుడి ముఖము చిలుకలా కనిపిస్తుంది.
పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ మాయ వలన ఇతడు మనలాగే బాల్యం గడిపాడు.అప్పుడు వ్యాసుడు అతనికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.మిగిలినది తెలుసుకోవడానికి మిథిలా నగరపు రాజు జనకుడి దగ్గరకు పంపాడు.జనకుడు బ్రహ్మజ్ఞాని మరియు రాజర్షి.ఇతడికి విదేహుడు అనే పేరు ఉంది.విదేహుడు అనగా జీవించే ముక్తిని పొందినవాడు.శుకుడు అతనివద్దకు బయలుదేరాడు.జనకునికి ఈ విషయం దివ్యదృష్టి ద్వారా తెలిసి శుకుడిని పరిక్షించాలనుకొన్నాడు. తదనుగుణంగా ద్వారపాలకులకు ఆదేశాలిచ్చాడు.శుకుడు రాగానే ద్వారపాలకులు రాజు ఆదేశాల ప్రకారం శుకుడికి ఏ విధమైన గౌరవం ఇవ్వకుండా కేవలం కూర్చోవడడానికి ఒక పీఠం మాత్రం ఇచ్చి ద్వారం దగ్గరే కూర్చుండబెట్టారు.ఈ విధంగా మూడు రొజులు శుకుడు గడిపాడు.శుకుడు ఏ మాత్రం చలింపక అలానే కూర్చున్నాడు.మూడు రోజుల తర్వాత సకల రాజలాంఛనాలతో లోనికి తీసుకెళ్ళారు.శుకుడిని ఒక రాజపీఠం పై కూర్చుండబెట్టినారు.రాజ నర్తకుల నాట్యాలు ప్రారంభమైనవి.కానీ శుకుడు ఏ విధంగానూ చలింపలేదు.అప్పుడు జనకుడు శుకుడికి ఒక అంచులవరకు నూనెతో నిండిన పాత్రను ఇచ్చి సభలో ఏడు సార్లు తిరిగిరమ్మన్నాడు.శుకుడు అలా తిరుగుతున్నప్పుడు నాట్యకత్తెలు అతన్ని ఎన్నోవిధాలుగా మోహింపచేసేందుకు ప్రయత్నించారు.కాని శుకుడు ఏ మాత్రం తొణకక తిరిగివచ్చి కూర్చున్నాడు.అప్పుడు జనకుడు నేను నీకు ఏమీ భోదించనవసరం లేదు,నీవు బ్రహ్మజ్ఞానివి అన్నాడు.కానీ మీ తండ్రి ఆజ్ఞ ప్రకారము చెపుతాను అని వ్యాసమహర్షి చెప్పినదే చెప్పి పంపివేసాడు.శుకమహర్షి మనోనిగ్రహం ఇలాంటిది.తన ఆజ్ఞ లేనిదే తన మనసు లోకి ఎలాంటి అలోచనను రానివ్వంటువంటి మనోనిగ్రహం కలవాడు శుకుడు.
ఇది జరిగిన తర్వాత శుకుడు తన ఇంటికి వెళ్ళాడు.ఆప్పుడు అక్కడ తండ్రి వేదవ్యాసుడు లేడు.అప్పుడు శుకుడు పంచభూతాలను పిలిచి " నేను ఆడవులకు వెళ్ళిపోతున్నాను.నా తండ్రి వచ్చి నన్ను పిలిస్తే ఓం అని అరవండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.వెదవ్యాసుదు వచ్చి ఓ కుమారా!శుకా అని పిలువగా పంచభూతాలు ఓం అని అరిచాయి.అప్పుడు వేదవ్యాసుడు పంచభూతాలతో "మీరు నా కొడుకు గురించి చెప్పకపోతే శపిస్తాను" అని ఆగ్రహించాడు.పంచభూతాలు విషయం చెప్పాయి.శుకుడిని వెతుకుతూ వ్యాసుడు బయలుదేరాడు.కొద్ది దూరంలో ఆకాశ మార్గంలో శుకుడు వెళ్తూ కనిపించాడు.వ్యాసుడు పిలుస్తున్నా శుకుడు పట్టించుకోకుండా వెళ్తున్నాడు.దారిలో ఒకచోట దేవకన్యలు స్నానం చేస్తున్నారు.వారి నవయవ్వనం లోఉన్న,దిగంబరం గా వెళ్తున్న శుకుడిని చూసి కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా స్నానం కొనసాగించారు.వెనుకనే వేదవ్యాసున్ని చూసి సిగ్గుపడి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు.ఇది చూసి వ్యాసుడు ఆశ్చర్యంతో" ఓ అమ్మాయిలారా!మీరు యవ్వనంలోని నా బిడ్డను చూసికూడా సిగ్గుపడలేదు.కాని ముసలివాడినైన నన్ను చూసి సిగ్గుపడుతున్నారు.ఎందుకు?" అని అడిగాడు.అప్పుడు దేవకన్యలు"మీ కుమారుడు నవయవ్వనం లో ఉన్నా అతడు జితేంద్రియుడు,ఎలాంటి బందాలు లేనివాడు.కాని మీరు మీ పుత్రుడికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించికూడా ఇంకా కొడుకు అనే భ్రాంతిని వదలలేకపోయారు.అందువలన మిమ్ములను చూసినప్పుడు మాకు సిగ్గు కలిగింది.మీ కొడుకుని చూసినప్పుడు మాకు ఎలాంటి వికారము కలుగలేదు" అన్నారు.
ఇదీ శుకమహర్షి చరిత్ర.
శుకుడి విశేషాలు:
1.తిరుమల శ్రీవేంకటేశ్శ్వరస్వామికి పద్మావతితో పెళ్ళికి ముహూర్తం పెట్టింది శుకమహర్షి గారే.
2.శుకుడి గురించి పరమశివుడు పార్వతితో " ఓ దేవీ!భగవద్గీత సారాంశము శ్రీకృష్ణుడికి తెలుసు,నాకూ మరియు శుకుడికి పూర్తిగా తెలుసు.వేదవ్యాసుడికి తెలిసుండవచ్చు కొద్దిగా" అని అన్నాడు.
3.మహాభాగవతాన్ని పరీక్షిత్ మహారాజుద్వారా ప్రపంచానికి అందించినది శుకమహర్షిగారే.
Friday, July 25, 2008
సూర్యచికిత్స-ఆలోచించవలసిన విషయము ( వేదాలు)
ఋగ్వేదం, మొదటి మండలం,9 వ అనువాకం 50వ సూక్తం,11వ శ్లోకం
उद्यन्नद्य मित्रमह आरोहन्नुत्तरां दिवम
हर्द्रोगं ममसूर्य हरिमाणं च नाशय
అర్థము:
ఓ సూర్యదేవా! నీవు అందరికీ సమాన తేజస్సు ఇస్తావు.ఉదయం సమయాన ఆకాశము ఎక్కుతావు.నీవు హృదయ రోగమును అలాగే కామెర్లు,పాండురోగము లను నివారింపుము.
ఇక్కడ సూర్యరశ్మిని పై వ్యాధులకు చికిత్స గా చెప్పినారు.
మరి ఇప్పటి విఙ్ఞానము ఈ విషయాన్ని కనుగొన్నదోలేదో నాకు తెలియదు.ఒకవేళ కనుగొని ఉంటే తెలుపగలరు.
Thursday, July 24, 2008
కాంతి - దాని ధర్మము (వేదాలు)
कस्त उषः कधप्रिये भुजे मर्तो अमर्त्ये कं नक्षसे विभावरि
वयं हि ते अमन्मह्यान्तादा पराकात अश्वे न चित्रे अरुषि
तवं तयेभिरा गहि वाजेभिर्दुहितर्दिवः अस्मे रयिं निधारय
"అంతము ఎరుగని ఉషస్సా! నీవు స్తుతి ప్రియవు.నీ అందాన్ని ఆనందించని మనిషి ఉన్నాడా?ఎవరైనా నీ కాంతి ని అందుకొనగలరా? ఓ ఉషో దేవీ,నీవు విచిత్రమైన రంగులు కలదానవు.ఆ రంగులు వ్యాపించు రీతి అద్భుతము.నీ దగ్గరికి వచ్చి గానీ,దూరం నుండి గానీ నిన్ను ఆస్వాదించుట సాధ్యము కాదు.నీవు ద్యులోకమునకు కూతరువి."
ఇక్కడ ఉషోదేవి అనగా కాంతి కి అధిష్టాన దేవత.ఇప్పుడు మనము విజ్ఞానము లో పాశ్చాత్యులు కనుగొన్నారనుకొంటున్న కాంతి-ఏక వర్ణం కాదు,అనేక వర్ణాలు కలది అన్న విషయం ఈ శ్లోకం లో ఆనాడే మన వేద ఋషులకు తెలుసన్న విషయం అర్థం అవుతోంది.
ఉపనిషత్తుల సందేశము
తేన త్యక్తేన భుజ్ఞీథాః మాగృధఃకస్య స్విద్ధనం
సృష్టి అంతా మరియు సృష్టి అంతా భగవంతుని(ఈశ్వరుని) చే ఆవరింపబడిఉన్నది.భగవంతుడు ఇచ్చిన వాటిని త్యాగబుద్ధి చే అనుభవించాలి.పరుల ధనం ఆశించరాదు.ధనము ఎవ్వరి సొంతమూ కాదు.
ఇది ఈశావాస్య ఉపనిషత్తు లోని మొదటి శ్లోకము.
ఓజోన్ - వేదాలు
नहि ते कषत्रं न सहो न मन्युं वयश्चनामी पतयन्त आपुः
नेमा आपो अनिमिषं चरन्तीर्न ये वातस्य परमिनन्त्यभ्वम
अबुध्ने राजा वरुणो वनस्योर्ध्वं सतूपं ददते पूतदक्षः
नीचीना सथुरुपरि बुध्न एषामस्मे अन्तर्निहिताःकेतवः सयुः
అర్థం:
"ఓ వరుణ దేవా!నీవు పరాక్రమవంతుడవు.రెక్కలుగల పక్షులు నీని చేరలేవు.నిన్ను అవి సహించలేవు.ప్రవహించే నీరు కూడా నిన్ను చేరలేవు.వరుణుడు రాజులకు ప్రభువు.ఆధారంలేని అంతరిక్షంలో అతను ఉన్నాడు.అతడు తేజో రాణి చే ఆవరింపబడి ఉన్నాడు.కిరణములు అతని పై నుండి క్రిందకు ప్రసరిస్తున్నాయి.అందువలనే మన ప్రాణములు నిలిచిఉన్నవి.ఆ కిరణములకు మూలము అంతరిక్షమున ఉన్నది."
గమనించి చూస్తే వరుణదేవుడిని వాతావరణము గా,తేజోరాణి ని ఓజోన్ పొరగా తెలుసుకోవచ్చు.
నీటి చికిత్స అనగా వాటర్ థెరపి - వేదాలు
ఋగ్వేదం లో క్రింది శ్లోకాలు పరిశీలించండి.ఇవి 5వ అనువాకం,23వ సూక్తం లోని 19,20,21 వ శ్లోకాలు
अप्स्वन्तरम्र्तमप्सु भेषजमपामुत परशस्तये देवाभवत वाजिनः
अप्सु मे सोमो अब्रवीदन्तर्विश्वानि भेषजा अग्निं च विश्वशम्भुवमापश्च विश्वभेषजीः
आपः पर्णीत भेषजं वरूथं तन्वे मम जयोक च सूर्यं दर्शे
వీటి అర్థము:
"నీటి యందు అమృతము ఉన్నది.ఔషదములున్నవి.నీటి ప్రాముఖ్యతను చాటండి.ఇందులో సమస్త ఔషదాలున్నవి.నీటిలో విశ్వానికి ఉపయోగపడు అగ్ని ఉన్నది.నీరు మా శరీరమందలి సమస్త రోగాలను నశింపచేయు ఔషదము కావలెను.మేము చిరకాలము సూర్యున్ని చూడాలి అనగా ఎక్కువ కాలం బ్రతకాలి."
నీటి చికిత్స అనగా వాటర్ థెరపి గత శతాబ్దంలో కనుగొన్నట్లు ప్రచారంలో ఉంది.కాని పై శ్లోకాలను పరిశీలించిన అప్పుడే నీటి అద్భుత ఔషదగుణాలు మన ఋషులకు తెసిసినట్టు అర్థం చేసుకోవచ్చు.
Wednesday, July 23, 2008
కృతఙ్నత ప్రాముఖ్యత
"బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా!
నిష్కృతిర్వహితాసద్భిః కృతఘ్నేనాస్తి నిష్కృతిః!!"
భావము: బ్రహ్మ హత్యకు,సురాపానమునకు,వ్రతభంగమునకు,దొంగతనానికి ప్రాయశ్చిత్తమున్నది.కాని కృతఘ్నతకు లేదు.
కృతఘ్నుల మాంసము కుక్కలు సైతం తినవు.కాబట్టి కృతఙ్నత చూపడం ముఖ్యం.
Monday, January 7, 2008
వివేకానందుని భారతదేశ అభిమానము:
ఇంకొక సందర్బము లో వివేకానందున్ని అవమానించాలని అమెరికా వారు భగవద్గీతని క్రింద పెట్టి మిగతా మతగ్రంధాలను దాని పైన పెట్టి " చూడండి మీ పవిత్ర గ్రంథము మా గ్రంథాల క్రింద ఉంది" అన్నారు.అప్పుడు స్వామి వెంటనే భగవద్గీతను లాగేసాడు.వెంటనే మిగిలిన గ్రంథాలు క్రింద పడిపోయాయి.అప్పుడు స్వామి "చూశారా ,మిగిలిన మతాలు మా మతం పైన ఆధారపడిఉన్నవి.మాది గనుక కూలిపోతే మిగిలినవాటి గతి కూడా ఇంతే" అన్నాడు.స్వామికి అన్ని మతాలపైనా సమాన దృష్టి ఉన్నప్పటికీ వారు ఎగతాళి చేయడం వలన ఈ విధము గా సమాధానము ఇవ్వవలసి వచ్చినది.
ఉపనిషత్తుల పిలుపు:
వేమన పద్యము
తిక్కపట్టి నరుడు తిరుగుగాక
కుక్క వంటి మనసు కూర్చుండనిచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమ
మనిషి ఎన్నో కోరికలు కలిగి మనశ్శాంతి లేక తిరుగుతుంటాడు.స్వాధీనములో లేని మనసు కుక్కలాంటిది. అలాంటి కుక్క వంటి మనసు మనిషిని ఒక చోట స్థిమితంగా కూర్చుండనిస్తుందా?
Saturday, January 5, 2008
వేమన పద్యము
మంచి వాని వలె మనుజుడుండు
ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా
విశ్వదాభిరామ వినుర వేమ
చాలా మంది మనుషులు ఎవరికీ తెలియకుండా తప్పులు చేసి ఎవరికీ తెలియదులే అనుకుంటారు.కానీ అంతర్యామి ఐన దైవానికి తెలుసునన్న విషయాన్ని మరిచిపోతుంటారు.
సీతమ్మ మాయమ్మ ( త్యాగరాజ కీర్తన )
|
సీతమ్మ మాయమ్మ! శ్రీ రాముడు మా తండ్రి!
వాతాత్మజ, సౌమిత్రి, వైనతేయ, రిపు మర్దన, ధాత, భరతాదులు సోదరులు మాకు! ఓ మనసా! (సీతమ్మ)
పరమేశ, వసిష్ఠ, పరాశర, నారద, శౌనక, శుక, సుర పతి, గౌతమ, లంబోదర, గుహ, సనకాదులుధర నిజ భాగవతాగ్రేసరులెవరో, వారెల్లను, వర త్యాగరాజునికి పరమ బంధవులు. మనసా!! (సీతమ్మ)
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...
