Wednesday, November 21, 2012
Tuesday, October 23, 2012
Monday, October 22, 2012
సృష్టి నడవడంలో భగవంతుడు ఒక క్రమబద్ధమైన విధానం ఏర్పరచాడా? (నా (అందరి) అనుభవం)
ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే అందరికీ ఎదురయ్యే అనుభవమే ఒకటి నాక్కూడా ఎదురైంది.
ఒక అయస్కాంతం ఉన్నదనుకోండి. అది తనకు దూరంగా ఉన్నవాటిని అతితక్కువ బలంతో ఆకర్షిస్తూ, ఆ వస్తువులు దగ్గరకు వచ్చేకొద్దీ అత్యంత బలంగా ఆకర్షిస్తుందని. ఇది ఆ అయస్కాంత పదార్థ ధర్మం.
మరి మన నిజ జీవితంలో కూడా మన అందరికీ ఒక అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. అదేమంటే మనం ఫలానాచోటికి(గుడికో లేక మన ఇంటికో,కాలేజుకో,సినిమాకో) వెళ్ళాళనుకోండి. ఆ చోటు దూరం ఉన్నంత వరకు మనం మామూలుగానే వెళుతుంటాము. కానీ చేరవలసిన ప్రదేశానికి దగ్గర అవుతున్నకొద్దీ మన నడకలో వేగం పెరుగుతుంది కదా. దగ్గరయ్యే కొద్దీ ఎంత త్వరగా చేరుకుంటామా అన్నంత వేగంగా నడుస్తాము.ఒక వేళ ఏదైనా వాహనంలో కనుక వెళ్తుంటే దగ్గరయ్యే కొద్దీ మానసికంగా ఆత్రుత చెందుతాము.
ఇక్కడ కంటికి కనిపించే లోహాల విషయంలోనూ, కనిపించని ఒక భౌతికమైన ఆకృతి అంటూ ఏమీలేని మనసుకూ కల ఒకే ధర్మాన్ని కనుక ఆలోచిస్తే ఆశ్చర్యం కల్గుతుంది.
అందుకే నాకు ఈ అనుమానం వచ్చింది. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే అన్నిటికీ మూలమైన ధర్మం,వస్తువు ఏదో ఉందనీ, దాని నుండే అన్నీ ఉత్పన్నమైనాయనీ మనకు లీలగా అనిపిస్తుంది. బహుశా ఆ మూలాన్నే మనం భగంతుడిగా కొలుస్తున్నామనుకుంటున్నాను.
ఒక అయస్కాంతం ఉన్నదనుకోండి. అది తనకు దూరంగా ఉన్నవాటిని అతితక్కువ బలంతో ఆకర్షిస్తూ, ఆ వస్తువులు దగ్గరకు వచ్చేకొద్దీ అత్యంత బలంగా ఆకర్షిస్తుందని. ఇది ఆ అయస్కాంత పదార్థ ధర్మం.
మరి మన నిజ జీవితంలో కూడా మన అందరికీ ఒక అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. అదేమంటే మనం ఫలానాచోటికి(గుడికో లేక మన ఇంటికో,కాలేజుకో,సినిమాకో) వెళ్ళాళనుకోండి. ఆ చోటు దూరం ఉన్నంత వరకు మనం మామూలుగానే వెళుతుంటాము. కానీ చేరవలసిన ప్రదేశానికి దగ్గర అవుతున్నకొద్దీ మన నడకలో వేగం పెరుగుతుంది కదా. దగ్గరయ్యే కొద్దీ ఎంత త్వరగా చేరుకుంటామా అన్నంత వేగంగా నడుస్తాము.ఒక వేళ ఏదైనా వాహనంలో కనుక వెళ్తుంటే దగ్గరయ్యే కొద్దీ మానసికంగా ఆత్రుత చెందుతాము.
ఇక్కడ కంటికి కనిపించే లోహాల విషయంలోనూ, కనిపించని ఒక భౌతికమైన ఆకృతి అంటూ ఏమీలేని మనసుకూ కల ఒకే ధర్మాన్ని కనుక ఆలోచిస్తే ఆశ్చర్యం కల్గుతుంది.
అందుకే నాకు ఈ అనుమానం వచ్చింది. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే అన్నిటికీ మూలమైన ధర్మం,వస్తువు ఏదో ఉందనీ, దాని నుండే అన్నీ ఉత్పన్నమైనాయనీ మనకు లీలగా అనిపిస్తుంది. బహుశా ఆ మూలాన్నే మనం భగంతుడిగా కొలుస్తున్నామనుకుంటున్నాను.
Friday, September 28, 2012
పరమేశ్వరుడి కుటుంబము - జీవవైవిధ్యము
హైదరాబాదులో జరుగుతున్న జీవవైవిధ్య సదస్సు సందర్బముగా గతములో ప్రచురించిన టపా మనకు ఆదర్శము పరమేశ్వరుడి కుటుంబమే ను మళ్ళీ ప్రచురిస్తున్నాను.
మొదట వీరి కుటుంబ సభ్యులను చూద్దాం. శివపార్వతులుకాకవీరికొడుకులైన గణపతి, కుమారస్వామి ఈ కుటుంబ సభ్యులు.సరే, ఇక్కడ ఆ కుటుంబము మనకు ఎలా ఆదర్శమో చూద్దాము.
పరమేశ్వరుడు కేవలం మొలకు చర్మమును మాత్రం ధరించి,శరీరమంతటా విభూతిని ధరించి ఉంటాడు. ఇంత మాత్రమేఆమహాదేవుని వస్త్రాలు, అలంకారాలు. ఇక అమ్మపార్వతీదేవిసర్వాలంకార భూషితయై ఉంటుంది.ఈ సందర్బములో ఒకకుటుంబములోని భర్తతెలుసుకోవలసినవిషయం ఒకటి ఉంది. అదేమిటంటే తన కోసం చిన్నప్పటినుండీతననుఎంతగానోప్రేమించిన తల్లిదండ్రులను, కుటుంబసభ్యులనుతన పుట్టింటినివదిలి వచ్చిన భార్యను ఎలాచూసుకోవాలనేది. భర్త ఎంత కష్టపడిఐనా తన అర్ధాంగిని ఆనందపరచాలి. అంటే భార్యకు నగలుకొనిపెట్టో,ఆస్తులు కూడబెట్టో లేక మంచి బట్టలు ఇచ్చోఆనందపరచమని అర్థం కాదు. పరమేశ్వరుడుఅర్ధనారీశ్వరుడు.అంటే తనలో సగభాగం అమ్మవారికి ఇచ్చాడు. ఆమాటకొస్తే శివుడి నివాసంరాజభవనంకాదు. అది ఒక కొండ మాత్రమే. ఉన్నంతలోనే తనూ,తన భార్య సుఖముగానే ఉన్నారు.
అమ్మవారు ఎంత సర్వాలంకారభూషితయై ఉన్నప్పటికీ అది పరమేశ్వరుని కొరకు మాత్రమే. కావాలంటేతనుకూడానార చీరలను మాత్రమే ధరించి ఉండగలదు. శివుడు లేని పార్వతి ఉండలేదు. అయ్యవారిసంతోషమేఅమ్మవారిసంతోషము.ఈ విషయం మనం దక్షయజ్ఞములో చూడవచ్చు. తన భర్తకుఅవమానం జరిగిందని తనప్రాణాలనే త్యాగంచేసిన మహాసాధ్వి పార్వతీదేవి. ఇది ఒక భార్యతెలుసుకోవలసిన విషయం.
ఇక వీరి కుమారులు వినాయకుడు, కుమారస్వామి బిడ్డలు ఎలా ఉండాలనడానికి మంచి ఉదాహరణ.బిడ్డలకు అమ్మానాన్నలే ప్రపంచమని వారిచుట్టూ ప్రదక్షిణ చేయడమే సర్వతీర్థాలు,సర్వపుణ్యక్షేత్రాలు,అందరు దేవతలూవీటన్నిటినీ దర్శించిన ఫలం కలుగుతుందని వినాయకుడునిరూపించాడు. దీనిని తన తమ్ముడైనకార్తికేయునికిఉదాహరణగా ఒక అన్నగా గణేశుడు చూపించాడు.కార్తికేయుడు కూడా నిజం తెలుసుకొని తన అన్నయొక్కగణాధిపత్యాన్ని (గణాలకు అధిపతి పదవిని)సంతోషముగా అంగీకరించాడు. ఏ విధమైన పోట్లాటా పెట్టుకోలేదు.
ఇక శివపార్వతుల,గణేశకార్తికేయుల ఆభరణాలు,వాహనాల గురించి చూద్దాం.శివుడి ఆభరణాలు పాములు, వాహనం నంది. అమ్మవారి వాహనము సింహము.గణేశుని వాహనము ఎలుక, కుమారస్వామి వాహనము నెమలి.
మనకు తెలుసు సింహము అత్యంత భయంకర జంతువు,మృగరాజు. నెమలి,పాములు పరస్పరశత్రువులు. అలాగేపాములు,ఎలుకలు శత్రువులు.సింహము తన ఆహారముగా ఏ జంతువునైనాతినగలదు. అది ఎద్దు ఐనా, నెమలిఐనాసరే.కాని ఈ కుటుంబములో ఇవేమీ ఒకదానికొకటి హాని తలపెట్టకుండా ఆనందముగామసలుకొంటున్నాయి.
ఇక్కడి జంతువులను మనిషి మనస్తత్వాలుగా చెప్పుకోవచ్చు. ఏ ఇద్దరి మనస్తత్వాలూ ఒకేలా ఉండవు.అలాగేఒకకుటుంబములో కూడా విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. కాని ఎవరూ ఎవరినీబాధపెట్టుకోకుండా, పరస్పరహానికలిగించుకోకుండా అందరూ సంతోషముగా ఉండాలి.
ఓం నమః శివాయఓం జగన్మాతాయ నమఃఓం గం గణపతయే నమఃఓం స్కందాయ నమః
గమనిక : ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇక్కడ నేను శివపార్వతుల కుటుంబాన్నిఒకదైవకుటుంబముగాకాక ఒక సాధారణ కుటుంబముగా మాత్రమే తీసుకొన్నాను. ,
ఎప్పుడైనా శివపార్వతుల కుటుంబము ను గమనించారా?
మొదట వీరి కుటుంబ సభ్యులను చూద్దాం. శివపార్వతులుకాకవీరికొడుకులైన గణపతి, కుమారస్వామి ఈ కుటుంబ సభ్యులు.సరే, ఇక్కడ ఆ కుటుంబము మనకు ఎలా ఆదర్శమో చూద్దాము.
పరమేశ్వరుడు కేవలం మొలకు చర్మమును మాత్రం ధరించి,శరీరమంతటా విభూతిని ధరించి ఉంటాడు. ఇంత మాత్రమేఆమహాదేవుని వస్త్రాలు, అలంకారాలు. ఇక అమ్మపార్వతీదేవిసర్వాలంకార భూషితయై ఉంటుంది.ఈ సందర్బములో ఒకకుటుంబములోని భర్తతెలుసుకోవలసినవిషయం ఒకటి ఉంది. అదేమిటంటే తన కోసం చిన్నప్పటినుండీతననుఎంతగానోప్రేమించిన తల్లిదండ్రులను, కుటుంబసభ్యులనుతన పుట్టింటినివదిలి వచ్చిన భార్యను ఎలాచూసుకోవాలనేది. భర్త ఎంత కష్టపడిఐనా తన అర్ధాంగిని ఆనందపరచాలి. అంటే భార్యకు నగలుకొనిపెట్టో,ఆస్తులు కూడబెట్టో లేక మంచి బట్టలు ఇచ్చోఆనందపరచమని అర్థం కాదు. పరమేశ్వరుడుఅర్ధనారీశ్వరుడు.అంటే తనలో సగభాగం అమ్మవారికి ఇచ్చాడు. ఆమాటకొస్తే శివుడి నివాసంరాజభవనంకాదు. అది ఒక కొండ మాత్రమే. ఉన్నంతలోనే తనూ,తన భార్య సుఖముగానే ఉన్నారు.
అమ్మవారు ఎంత సర్వాలంకారభూషితయై ఉన్నప్పటికీ అది పరమేశ్వరుని కొరకు మాత్రమే. కావాలంటేతనుకూడానార చీరలను మాత్రమే ధరించి ఉండగలదు. శివుడు లేని పార్వతి ఉండలేదు. అయ్యవారిసంతోషమేఅమ్మవారిసంతోషము.ఈ విషయం మనం దక్షయజ్ఞములో చూడవచ్చు. తన భర్తకుఅవమానం జరిగిందని తనప్రాణాలనే త్యాగంచేసిన మహాసాధ్వి పార్వతీదేవి. ఇది ఒక భార్యతెలుసుకోవలసిన విషయం.
ఇక వీరి కుమారులు వినాయకుడు, కుమారస్వామి బిడ్డలు ఎలా ఉండాలనడానికి మంచి ఉదాహరణ.బిడ్డలకు అమ్మానాన్నలే ప్రపంచమని వారిచుట్టూ ప్రదక్షిణ చేయడమే సర్వతీర్థాలు,సర్వపుణ్యక్షేత్రాలు,అందరు దేవతలూవీటన్నిటినీ దర్శించిన ఫలం కలుగుతుందని వినాయకుడునిరూపించాడు. దీనిని తన తమ్ముడైనకార్తికేయునికిఉదాహరణగా ఒక అన్నగా గణేశుడు చూపించాడు.కార్తికేయుడు కూడా నిజం తెలుసుకొని తన అన్నయొక్కగణాధిపత్యాన్ని (గణాలకు అధిపతి పదవిని)సంతోషముగా అంగీకరించాడు. ఏ విధమైన పోట్లాటా పెట్టుకోలేదు.
ఇక శివపార్వతుల,గణేశకార్తికేయుల ఆభరణాలు,వాహనాల గురించి చూద్దాం.శివుడి ఆభరణాలు పాములు, వాహనం నంది. అమ్మవారి వాహనము సింహము.గణేశుని వాహనము ఎలుక, కుమారస్వామి వాహనము నెమలి.
మనకు తెలుసు సింహము అత్యంత భయంకర జంతువు,మృగరాజు. నెమలి,పాములు పరస్పరశత్రువులు. అలాగేపాములు,ఎలుకలు శత్రువులు.సింహము తన ఆహారముగా ఏ జంతువునైనాతినగలదు. అది ఎద్దు ఐనా, నెమలిఐనాసరే.కాని ఈ కుటుంబములో ఇవేమీ ఒకదానికొకటి హాని తలపెట్టకుండా ఆనందముగామసలుకొంటున్నాయి.
ఇక్కడి జంతువులను మనిషి మనస్తత్వాలుగా చెప్పుకోవచ్చు. ఏ ఇద్దరి మనస్తత్వాలూ ఒకేలా ఉండవు.అలాగేఒకకుటుంబములో కూడా విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. కాని ఎవరూ ఎవరినీబాధపెట్టుకోకుండా, పరస్పరహానికలిగించుకోకుండా అందరూ సంతోషముగా ఉండాలి.
ఓం నమః శివాయఓం జగన్మాతాయ నమఃఓం గం గణపతయే నమఃఓం స్కందాయ నమః
గమనిక : ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇక్కడ నేను శివపార్వతుల కుటుంబాన్నిఒకదైవకుటుంబముగాకాక ఒక సాధారణ కుటుంబముగా మాత్రమే తీసుకొన్నాను. ,
Thursday, September 27, 2012
Monday, September 24, 2012
"No cell phone Day"(సెల్ఫోన్రహిత దినము)అని ఒక రోజును జరుపుకుంటే బాగుంటుంది కదా!
ఇవ్వాళ ఎక్కడో సెల్ఫోన్ రేడియేషన్ గురించి చదువుతుంటే ఒక ఐడియా వచ్చింది.అదేమంటే mothers day,fathers day,lovers day లాగా No cell phone Day కూడా ప్రభుత్వం నిర్భందంగా విధిస్తే బాగుంటుంది కదా అని.
మరి అత్యవసర సమాచారం ఎలాగా అంటారేమో , ఆ రోజు call rates, sms rates నిమిషానికి 30 రూపాయలో లేక మరో Tariff వసూలు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది.
Wednesday, June 13, 2012
ఇలా చేయడం శ్రీరామానుజాచార్యులకే చెల్లింది.

అష్టాక్షరీ మంత్రాన్ని బహిర్గతం చేసి మానవాళికి మహోపకారం చేసిన రామానుజాచార్యుల జీవిత సంఘటన ఇది.
శ్రీరామానుజాచార్యుల కాలంలో జనులు రోజూ ఒక వింతను చూసేవారు.
అదేంటంటే రామానుజులు శారీరకంగా అంత బలవంతులు కాకపోవడంతో రోజూ స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక బ్రాహ్మణుని భుజంపై చేతులు వేసుకుని వెళ్ళేవారు. స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక శూద్రుని భుజంపై చేతులు వేసి వచ్చేవారు. జనం దీనిని వింతగా చూసేవారు.
ఒక రోజు కొందరు ధైర్యం చేసి స్వామి ప్రవర్తనకు గల కారణం అడిగారు.
అప్పుడు ఆయన ఇలా అన్నారు.
"స్నానం వలన నా శరీరం మాత్రమే శుభ్రం అవుతోంది. మనసులోని మాలిన్యం పోవడం లేదు. ఇతరుల కన్నా నేను గొప్పవాన్ని అనే భావన అహంకారం అనిపించుకుంటుంది. మనిషి పురోగతికి ఆధిక్య భావన అన్నింటికీ మించిన ఆటంకం.స్నానం చేసి దేహ మాలిన్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత నేను శూద్రున్ని తాకి నా అహంకారాన్నీ,మనోమాలిన్యాన్ని తొలగించుకుంటున్నాను. నేను ఎవరికన్నా గొప్పవాణ్ణీ కాను. నాకన్నా ఎవరూ తక్కువ వారూ కాదు. నాకాన్నా శూద్రుడు కూడా శ్రేష్ఠుడే అనే భావన వలన నాకు ఆనందం లభిస్తుంది."
వర్గాలు
మహనీయుల జీవితాలలో మధురఘట్టాలు
Friday, June 1, 2012
వేమనకూ తెలుసు నేటి మానవుల అవసరాలేమిటో!
నేటి ప్రపంచంలో ఎంతో అవసరమైన సమాచార నైపుణ్యాలు(Communication skills),యాజమాన్యనైపుణ్యాలు(Management skills) నాటికాలం లోని వేమన పద్యాలలోనే చూడవచ్చు.
ఇందుకు ఉదాహరణగా కొన్ని పద్యాలు చూడండి.
మాట జెప్ప వినని మనుజుడు మూర్ఖుడు
మాట విన్న నరుడు మానుడగును
మాట వినగ జెప్ప మానుట కూడదు
విశ్వధాభిరామ వినుర వేమ
అర్థము:
ఎదుటివాడు చెప్పిన మాటలలోని మంచిచెడులను తెలుసుకోలేనివాడు మూర్ఖుడు.అందరిమాటలను ఆలకించేవాడు ఉత్తముడు.మాటలు విన్న త్రవత మంచిచెడులను ఆలోచించి సమాధానం చెప్పకపోవడం కూడా సమంజసం కాదు.
పదుగురాడు మాట పాడియై ధర జెల్లు
నొక్కడాడు మాట యెక్కదెందు
వూరకుండువాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ
అర్థం:పదిమంది చెప్పే మాట అబద్దమైనా అదే న్యాయంగా చెల్లుతుంది.ఒక్కడే నిజం చెప్పినా నమ్మరు.వాగ్వివాదాల సమయంలో మౌనంగా ఉండేవాడే ఉత్తముడు.
తామసించి చేయదగదెట్టి కార్యంబు
వేగిరింపనదియు విషమగును
పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనా
విశ్వదాభిరామ వినుర వేమ
అర్థం:ఏ పని ఐనా తొందరపడిచేయుట మంచిది కాదు.తొందరపడడం వలన పని చెడుతుంది.పచ్చికాయ తెచ్చి ముగ్గ పెట్టినంత మాత్రమున అది పండు(ఫలము)కాదు కదా.
శాంతమే జనులను జయమొందించును
శాంతముననె గురువు జాడ తెలియు
శాంతభావ మహిమ జర్చింపలేమయా
విశ్వదాభిరామ వినుర వేమ
అర్థం:శాంతస్వభావం ఉంటెనే ఏదైనా సాధించగలము.శాంతంతోనే గురువులు గొప్పవారయ్యారు.శాంతగుణం మహిమను వర్ణించలేము.
Thursday, May 31, 2012
ఆంజనేయుడొక్కడే ఇలా అర్థం చేసుకోగలడేమో (ఆంజనేయుని అత్యద్భుత జ్ఞానం)
క్రింద ఉదహరించు సంఘటన లంకలో సీతతో రాముని నిందిస్తూ రావణుడు పలికిన మాటలు:
''అతల్పం నిద్రాళుః రజనిషు కువాక దుర్గత తమః
మహాకాతర్యాఢ్యః మనసి విధుత ప్రోజ్జ్వ లయశాః
వధా న్మాంసా దానం బహు విమతలాభో జనకజే.''
అంటే "రాముడు శయ్యలేకుండా రాత్రిపూటనిద్రిస్తాడు. చెడ్డమాటలు పలుకుతాడు, ప్రియమైన హితవాక్యం చెప్పడు, దరిద్రం అనుభవిస్తున్నాడు, అన్నిటి కంటే పిరికివాడు, ఏది చూచినా భయపడువాడు, మాంసం తింటాడు అట్లాంటివాడు, ''కథంశ్లా ఘ్యోరామః'' అటువంటి రాముని నీవు ఎలా పొగడుతున్నావు? అతడు నగరాలు విడిచి అడవుల పాలైనాడు. ఖరదూషణాదులను చంపి పెద్దనష్టం పొందాడు. చివరకు భార్యే కనిపించని నష్టం కలిగింది. అందువల్ల రాముడు శ్లాఘ్యుడుకాడు (అంటే పొగడబడేందుకు అర్హుడు కాదు) - అని రావణుడు చెప్పగా
సీతాదేవి ఇలా బదులు చెప్పింది.
'ఖల తం అసకృత్ మా స్పృశగిరా''
ఓదుర్మార్గుడా! నీ వాక్కుతో ఆ మహానుభావుని ముట్టుకోకు-అంటే అతని నామమైన పలుకుటకు నీకు యోగ్యత లేదని మృదువుగా చెప్పింది.
ఈ సంభాషణను హనుమంతుడు చెట్టు పైనుండి వింటున్నాడు.
అయితే ఆంజనేయస్వామి నవవ్యాకరణవేత్త. ఐంద్రియాదివ్యాకరణాలు తొమ్మిది, ఆయనకు తెలుసు అంతేకాక మహాభక్తుడు, అందువల్ల అమ్మచెప్పిన మాటలోని మరొక విశేషభావాన్ని యిలా గ్రహించాడు.
ఖల అంటే దుర్మార్గుడని అర్థం కనక ఆ పుణ్యపురుషుడైన రాముని గురించి మాట్లాడే అధికారందుర్మార్గుడైన రావణునికి లేదని సీతాదేవి తాత్పర్యం.
''తం''-అంటే ''అతనిని'' అనే అర్థం కాకుండా ''అతల్పం నిద్రాళుః'' అనే శ్లోకంలోని తకారాలన్నింటినీ ఒక్కసారి (అసకృత్)కూడా పలుకకుండా-శ్లోకంలోని తక్కిన మాటల భావాన్ని మాత్రమే గ్రహించాలని ఆ జగన్మాత మాటలోని విశేషముగా హనుమంతుడు గ్రహించాడు. శ్లోకాన్ని ఆ ప్రకారం తిరిగి చదువుకొంటే అమ్మవారు సూచించిన ప్రధానార్థం గోచరిస్తుంది
''మొదటిది-అల్పనిద్రాళుః'' అని వస్తుంది. ''అల్పాహారో, అల్పనిద్రః'' అని రామునిగురించి వాల్మీకి చెప్పిన దానికి యిది సరిపోతుంది, మహాపురుషులు ఎప్పుడు ఏం భుజిస్తారో, ఎక్కడ ఎప్పుడు నిద్రిస్తారో ఎవరికీ తెలియదు, రాములవారు అట్టివారు.
రెండవదానిలో ''తకారాలు'' తీసేస్తే ''కువాక్ దుర్గమః''అని వస్తుంది. అంటే కువాక్కులకు దుర్గముడని అర్థం, వాటికి వారివద్దకు వెళ్ళడానికి కూడా అర్హతలేదు
. తర్వాతమాట- ''మహాకార్యాఢ్యః'' అని వస్తుంది. దేవకార్యనిర్వహణం. దుష్టనిగ్రహం, శిష్టరక్షణం, చెయ్యడం వారి కార్యము అని అర్థం. ''పైమాట ''విధుప్రోజ్జ్వలయశాః'' అని వస్తుంది. అంటే చంద్రకాంతివంటి కీర్తిగలవాడని అర్థం. ''బహువిమలాభః''అనేది అనంతరపదం, ఆయనకాంతి కూడా మిక్కిలి స్వచ్ఛమైనదని అర్థం.
అందుకే అంటారు
"మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి"
''అతల్పం నిద్రాళుః రజనిషు కువాక దుర్గత తమః
మహాకాతర్యాఢ్యః మనసి విధుత ప్రోజ్జ్వ లయశాః
వధా న్మాంసా దానం బహు విమతలాభో జనకజే.''
అంటే "రాముడు శయ్యలేకుండా రాత్రిపూటనిద్రిస్తాడు. చెడ్డమాటలు పలుకుతాడు, ప్రియమైన హితవాక్యం చెప్పడు, దరిద్రం అనుభవిస్తున్నాడు, అన్నిటి కంటే పిరికివాడు, ఏది చూచినా భయపడువాడు, మాంసం తింటాడు అట్లాంటివాడు, ''కథంశ్లా ఘ్యోరామః'' అటువంటి రాముని నీవు ఎలా పొగడుతున్నావు? అతడు నగరాలు విడిచి అడవుల పాలైనాడు. ఖరదూషణాదులను చంపి పెద్దనష్టం పొందాడు. చివరకు భార్యే కనిపించని నష్టం కలిగింది. అందువల్ల రాముడు శ్లాఘ్యుడుకాడు (అంటే పొగడబడేందుకు అర్హుడు కాదు) - అని రావణుడు చెప్పగా
సీతాదేవి ఇలా బదులు చెప్పింది.
'ఖల తం అసకృత్ మా స్పృశగిరా''
ఓదుర్మార్గుడా! నీ వాక్కుతో ఆ మహానుభావుని ముట్టుకోకు-అంటే అతని నామమైన పలుకుటకు నీకు యోగ్యత లేదని మృదువుగా చెప్పింది.
ఈ సంభాషణను హనుమంతుడు చెట్టు పైనుండి వింటున్నాడు.
అయితే ఆంజనేయస్వామి నవవ్యాకరణవేత్త. ఐంద్రియాదివ్యాకరణాలు తొమ్మిది, ఆయనకు తెలుసు అంతేకాక మహాభక్తుడు, అందువల్ల అమ్మచెప్పిన మాటలోని మరొక విశేషభావాన్ని యిలా గ్రహించాడు.
ఖల అంటే దుర్మార్గుడని అర్థం కనక ఆ పుణ్యపురుషుడైన రాముని గురించి మాట్లాడే అధికారందుర్మార్గుడైన రావణునికి లేదని సీతాదేవి తాత్పర్యం.
''తం''-అంటే ''అతనిని'' అనే అర్థం కాకుండా ''అతల్పం నిద్రాళుః'' అనే శ్లోకంలోని తకారాలన్నింటినీ ఒక్కసారి (అసకృత్)కూడా పలుకకుండా-శ్లోకంలోని తక్కిన మాటల భావాన్ని మాత్రమే గ్రహించాలని ఆ జగన్మాత మాటలోని విశేషముగా హనుమంతుడు గ్రహించాడు. శ్లోకాన్ని ఆ ప్రకారం తిరిగి చదువుకొంటే అమ్మవారు సూచించిన ప్రధానార్థం గోచరిస్తుంది
''మొదటిది-అల్పనిద్రాళుః'' అని వస్తుంది. ''అల్పాహారో, అల్పనిద్రః'' అని రామునిగురించి వాల్మీకి చెప్పిన దానికి యిది సరిపోతుంది, మహాపురుషులు ఎప్పుడు ఏం భుజిస్తారో, ఎక్కడ ఎప్పుడు నిద్రిస్తారో ఎవరికీ తెలియదు, రాములవారు అట్టివారు.
రెండవదానిలో ''తకారాలు'' తీసేస్తే ''కువాక్ దుర్గమః''అని వస్తుంది. అంటే కువాక్కులకు దుర్గముడని అర్థం, వాటికి వారివద్దకు వెళ్ళడానికి కూడా అర్హతలేదు
. తర్వాతమాట- ''మహాకార్యాఢ్యః'' అని వస్తుంది. దేవకార్యనిర్వహణం. దుష్టనిగ్రహం, శిష్టరక్షణం, చెయ్యడం వారి కార్యము అని అర్థం. ''పైమాట ''విధుప్రోజ్జ్వలయశాః'' అని వస్తుంది. అంటే చంద్రకాంతివంటి కీర్తిగలవాడని అర్థం. ''బహువిమలాభః''అనేది అనంతరపదం, ఆయనకాంతి కూడా మిక్కిలి స్వచ్ఛమైనదని అర్థం.
అందుకే అంటారు
"మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి"
Wednesday, May 30, 2012
ఫలితం కోసం వేచిచూసేవాడిని ఫలితం తెలిసికూడా చెప్పకుండా టెన్షన్ పెట్టడం ఒక పైశాచికానందమే!
TV లలో వచ్చే Reality show లలో పోటీదారులను చూస్తుంటే అయ్యోపాపం అనిపిస్తోంది. వాళ్ళు వాళ్ళ పని పూర్తి చేసి ఫలితం కోసం వేచిచూస్తుంటారు. కాని వ్యాఖ్యాత లేక న్యాయనిర్ణేతలు అనబడే సదరు వ్యక్తులు ఫలితము వాళ్ళ చేతులలో ఉంచుకొని పోటీదారులకు చెప్పకుండా వాళ్ళను Tension పెడుతుంటారు.
చూసే ప్రేక్షకులకే చాలా Tension ఉంటుంది. అలాంటిది నిజంగా పోటీలో పాల్గొన్నవారికి ఇంకెంత ఉంటుందో కదా పాపం. వారు ఏడుస్తారు. విసుగుతో (Frustration) తో పక్కవారిని ఈర్ష్యా,అసూయలతో చూస్తుంటారు, బాధపడుతుంటారు. ఇవన్నీ చూస్తూ వ్యాఖ్యాతలు మరియు న్యాయనిర్ణేతలు ఎంతో సంతోషంతో ఇంకా రెచ్చగొడుతుంటారు. పోటీదారుల బాధలలో వీరు ఆనందాన్ని వెదుక్కుంటూంటారు. ఇవన్నీ మనం చూస్తూ Tension పడుతూ ,అయ్యో పాపం అనుకొంటూ తిట్టుకొంటూ ఉంటాము.
వ్యాఖ్యాతల సంగతి సరి, మరి న్యాయనిర్ణేతలు అనబడే సదరు వ్యక్తులు కొద్దోగొప్పో పేరు సంపాదించుకొన్నవారే కదా! వారి బుద్ధి ఏమైంది? వయసుతో పాటు వివేకం సంగతి దేవుడెరుగు, వారికి శాడిజం బాగా పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.
హనుమంతుడు లంకలో సీతమ్మను చూసి వచ్చిన తర్వాత అతని కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వేచిచూస్తున్న వానరవీరులను ఏం Tension పెట్టలేదే. వానరుల దృష్టిలో పడగానే "దృష్ట్వాతు సీతా" (చూసాను సీతను) అన్నాడు కదా. "సీతను చూసాను" అని కూడా అనలేదు, అలా అంటే మొదట సీత పేరు చెబితే సీతమ్మకు ఏమయ్యిందో, చూసాడో లేదో అనే సందేహాలు వస్తాయని మొదటే "చూసాను" అనే పాజిటివ్ మాట అన్నాడు.
మనము హనుమంతునితో మనలను పోల్చుకోనవసరం లేదు, కనీసం అతని ఆచరణ ను తెల్సుకొని మనలను మనం దిద్దుకొంటే చాలు కదా.
కొసమెరుపు:
అసలు TV చూడకుంటే సరిపోతుంది అనుకోవచ్చు. కాని ఇలాంటి కార్యక్రమాలు చూడడం వలన ఇలా మనం మన జీవితంలో ఉండకూడదు అని నేర్చుకోవచ్చేమో. ఇలాంటి భావంతో చూస్తే ఏ తలనొప్పీ ఉండదనుకొంటాను.
చూసే ప్రేక్షకులకే చాలా Tension ఉంటుంది. అలాంటిది నిజంగా పోటీలో పాల్గొన్నవారికి ఇంకెంత ఉంటుందో కదా పాపం. వారు ఏడుస్తారు. విసుగుతో (Frustration) తో పక్కవారిని ఈర్ష్యా,అసూయలతో చూస్తుంటారు, బాధపడుతుంటారు. ఇవన్నీ చూస్తూ వ్యాఖ్యాతలు మరియు న్యాయనిర్ణేతలు ఎంతో సంతోషంతో ఇంకా రెచ్చగొడుతుంటారు. పోటీదారుల బాధలలో వీరు ఆనందాన్ని వెదుక్కుంటూంటారు. ఇవన్నీ మనం చూస్తూ Tension పడుతూ ,అయ్యో పాపం అనుకొంటూ తిట్టుకొంటూ ఉంటాము.
వ్యాఖ్యాతల సంగతి సరి, మరి న్యాయనిర్ణేతలు అనబడే సదరు వ్యక్తులు కొద్దోగొప్పో పేరు సంపాదించుకొన్నవారే కదా! వారి బుద్ధి ఏమైంది? వయసుతో పాటు వివేకం సంగతి దేవుడెరుగు, వారికి శాడిజం బాగా పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.
హనుమంతుడు లంకలో సీతమ్మను చూసి వచ్చిన తర్వాత అతని కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వేచిచూస్తున్న వానరవీరులను ఏం Tension పెట్టలేదే. వానరుల దృష్టిలో పడగానే "దృష్ట్వాతు సీతా" (చూసాను సీతను) అన్నాడు కదా. "సీతను చూసాను" అని కూడా అనలేదు, అలా అంటే మొదట సీత పేరు చెబితే సీతమ్మకు ఏమయ్యిందో, చూసాడో లేదో అనే సందేహాలు వస్తాయని మొదటే "చూసాను" అనే పాజిటివ్ మాట అన్నాడు.
మనము హనుమంతునితో మనలను పోల్చుకోనవసరం లేదు, కనీసం అతని ఆచరణ ను తెల్సుకొని మనలను మనం దిద్దుకొంటే చాలు కదా.
కొసమెరుపు:
అసలు TV చూడకుంటే సరిపోతుంది అనుకోవచ్చు. కాని ఇలాంటి కార్యక్రమాలు చూడడం వలన ఇలా మనం మన జీవితంలో ఉండకూడదు అని నేర్చుకోవచ్చేమో. ఇలాంటి భావంతో చూస్తే ఏ తలనొప్పీ ఉండదనుకొంటాను.
Friday, May 25, 2012
ఏమిటయ్యా వేంకటేశు...
ఏమిటయ్యా వేంకటేశు...
అప్పుడెప్పుడో.. ఒక సోమరి ఏనుగు కాలికి దెబ్బతగిలితేనే... ఇంటి దగ్గరినుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి రక్షించావే..
ఆ తరువాత... ఒక వెర్రి పిల్లాడు... పొరపాటున ఒక పిచ్చి రాయిలో నువ్వున్నావని అంటే.. ఏకంగా ఒక అవతారాన్నే చూపించావే...
మరోసారి.. ఒక చాదస్తపు వృద్దురాలు... ఎంగిలి పండ్లిస్తే.. మొహమాటం కూడా లేకుండా తిన్నావే....
మొన్నటికి మొన్న... పాత స్నేహితుడు పలకరింపుకు వచ్చి అటుకులిస్తే... అష్ట ఐశ్వార్యలిచ్చి సత్కరించావే...
మరి నేనిప్పుడు.. అంతులేని కష్టాల్లో, అయోమయమైన రాగద్వేషాల్లో కొట్టుకుంటుంటే కరుణించవేమయ్యా.... ఇంత మొండివాడివేమయ్య ..
--ఇది మా స్నేహితుడు కొండయ్య వ్రాసిన కవిత
--ఇది మా స్నేహితుడు కొండయ్య వ్రాసిన కవిత
Tuesday, May 22, 2012
Wednesday, May 9, 2012
ఈ మధ్య నేను చూసిన మంచి సినిమా "Two brothers"
నా స్నేహితుడు ఉదయ్ చెప్పగా 2004 సంవత్సరం లో విడుదలైన Two brothers అనే పులుల కు సంబంధించిన సినిమా చూశాను. చాలా బాగుంది. ప్రేమాభిమానాలు, మాతృప్రేమ అనేవి సర్వవ్యాపకమని పులుల ద్వారా దర్శకుడు బాగా చెప్పగలిగాడు.తల్లి పులి, దాని ఇద్దరు బిడ్డలైన రెండు పిల్లలు మానవ స్వార్థం వలన విడిపోవడం తర్వాత ఎన్నో కష్టాలు పడడం చివరికి మూడూ కలవడం ఎంతో బాగా చూపించారు. ముఖ్యంగా పులులు మధ్య భావోద్వేగాలను దర్శకుడు చాలా బాగా చూపించాడు. కొన్ని దృశ్యాలలో మనము కూడా ఆ భావోద్వేగంలో లీనమైపోతాము. అంతబాగా తీశారు.
సెంటిమెంట్ కు పెద్దపీట వేస్తూ తీశిన ఈ ఆంగ్ల చిత్రం చాలా కదిలించింది.
మన తెలుగు మూసచిత్రాలకు భిన్నంగా మంచి సినిమా చూడాలనే కోరిక ఈ సినిమా ద్వారా తీరింది.
ఈ చిత్రం ఫ్రెంచ్ నుండి ఆంగ్లానికి అనువదించినట్లు ఉంది.
Wednesday, April 25, 2012
అన్నమయ్య ఆవేదన అర్థం చేసుకోండి
కీర్తన:
కడుపెంత తా గుడుచు కుడుపెంత! దీనికై పడని పాట్లనెల్ల పడి పొరలనేలా||
పరుల మనసునకునాపదలు కలుగజేయ పరితాపకరమైన బ్రతుకేలా|
సొరిదినితరుల మేలుచూచి సైపగలేక తిరుగుచుండేటి కష్టదేహమిది యేలా||
యెదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు చదివిచెప్పని యట్టి చదువులేలా|
పొదిగొన్న ఆశలో బుంగుడై సతతంబు సతమతంబై పడయు చవులు దనకేలా||
శ్రీవేంకటేశ్వరుని సేవానిరతిగాక జీవనభ్రాంతి బడు సిరులేలా|
దేవోత్తముని నాత్మ దెలియ నొల్లక పెక్కు త్రోవలేగిన దేహి దొరతనంబేలా||
అర్థవివరణ:
ఉన్నది బెత్తెడు కడుపు, అదెంత తింటుంది? పట్టెడన్నమే కదా. దీనికొరకేనా ఇన్నిపాట్లు మనము పడి పొర్లుతున్నది?
ఇతరుల మనసులు బాధ పెట్టే పనులు చేసే దుఃఖకరమైన బ్రతుకు ఎందుకు?
ఈర్ష్య,అసూయలకు లోనై మనము ఇతరులు బాగుపడుతూంటే చూసి ఓర్వలేని బ్రతుకు ఎందుకు?
ఎదుటివారికి చేసే మేలు కూడా మనకు మేలే అని చెప్పని విద్య ఎందులకు?
ఆశలలో మునిగిపోయి ఎల్లప్పుడూ సతమతం చేసే డబ్బు ఎందులకు?
భగవంతుని సేవ లేకుండా జీవితాన్ని భ్రాంతిలో పడవేయు ధనమెందుకు?
పరమాత్మను తెలియలేక అన్ని రకాల దారులలో కన్నుగానక తిరుగు జీవుని దొరతనం (నేనే గొప్ప అనుకోవడం) ఎందుకు?
Thursday, April 19, 2012
Wednesday, April 11, 2012
ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి.

లాభాల కోసం ఇతరులను త్రొక్కివేసే వారిని ప్రోత్సహిస్తారో లేక తమ మానాన తాము ఎవరినీ మోసం చేయకుండా కేవలం బ్రతకడం కోసమే వ్యాపారం చేసుకునేవారిని ప్రోత్సహిస్తారో ఆలోచించుకోండి.
చిత్రంలో దాగున్నదెవరో కనుక్కోండి?

ఈ చిత్రం లో దాగున్నదెవరో కనుక్కోగలరా?
ఒకవేళ కనుగొనడానికి ఇబ్బంది ఐతే
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
చిత్రాన్ని చూస్తూ మీ తలను కంటిన్యూగా ఆడించండి.
Monday, March 19, 2012
తప్పించుకొనేందుకు పారిపోయివస్తే మళ్ళీ ఇలాగైందేమిటి? - రమణమహర్షులవారు

శ్రీరమణమహర్షుల వారు ఆశ్రమంలో ఉండగా గతంలో రమణుల పాఠశాల జీవితంలో వారికి తమిళం భోధించిన ఉపాధ్యాయుడు ఒకసారి వచ్చారు. ఆ ఉపాధ్యాయుడిని గుర్తించిన మహర్షి తాను రచించిన ఒక తమిళ గ్రంధాన్ని ఆయనకు సమర్పించారు.
మహర్షి రచనా విధానాన్ని ఆ ఉపాధ్యాయుడు ఎంతగానో మెచ్చుకొన్నాడు.ఆ తర్వాత ఆ గ్రంధంలోని ఒక పద్యానికి అర్థం అడిగాడు. అప్పుడు మహర్షి సమీపంలోని భక్తుల వంక చూస్తూ ఇలా అన్నాడు.
"ఆయనను చూడండి. ఇటువంటి ప్రశ్నల బెడదను తప్పించుకునేందుకే నేను బడి నుండి పారిపోయాను.ఆయన మదురై నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. దీని అర్థం ఏంటి?" అని చమత్కరించారు.
అదివిన్న జనం భక్తులతో సహా గొల్లున నవ్వారు.
Friday, March 16, 2012
Subscribe to:
Posts (Atom)
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...








