Sunday, October 13, 2019
Friday, October 11, 2019
Thursday, October 10, 2019
Wednesday, October 9, 2019
Tuesday, October 8, 2019
Monday, October 7, 2019
Sunday, October 6, 2019
Saturday, October 5, 2019
Friday, October 4, 2019
Thursday, October 3, 2019
Wednesday, October 2, 2019
గాంధీజీ తో పాటు లాల్ బహదూర్శాస్త్రి గారి పుట్టినరోజు కూడా నేడే

నేడు మన అత్యంత నిష్పక్షపాత ప్రధాని ఐన లాల్బహదూర్ శాస్త్రి గారి జన్మదినమని ఎంతమందికి గుర్తుంది?మనమెంత కృతఘ్నులం?
ఐనా నేడు మహాత్మాగాంధీ జన్మదినమని కూడా కొంతమందికి గుర్తులేదు.
ప్రియతమ నాయకులారా జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి.
కానీ క్షమించండి.మీరు చూపిన బాటలో మేము ఎంత మాత్రమూ నడవడంలేదు.ఎప్పుడూ మేము ఎలా బ్రతకాలనే. ప్రక్కవారిని పట్టించుకోకుండా మేము మా స్వార్థాన్నే చూసుకుంటున్నాము.క్షమించండి.
మీ బాటలోనే మేము నడిచేలా మమ్మల్ని ఆశీర్వదించండి.
Tuesday, October 1, 2019
Monday, September 30, 2019
Friday, September 27, 2019
Thursday, September 26, 2019
Wednesday, September 25, 2019
Monday, September 23, 2019
Friday, September 20, 2019
Thursday, September 19, 2019
Wednesday, September 18, 2019
Tuesday, September 17, 2019
Monday, September 16, 2019
Saturday, September 14, 2019
Thursday, September 12, 2019
Monday, September 9, 2019
Saturday, September 7, 2019
Thursday, September 5, 2019
Wednesday, September 4, 2019
Tuesday, September 3, 2019
Saturday, August 31, 2019
Friday, August 30, 2019
Thursday, August 29, 2019
Wednesday, August 28, 2019
Tuesday, August 27, 2019
Monday, August 26, 2019
Saturday, August 24, 2019
Thursday, August 22, 2019
Wednesday, August 21, 2019
Tuesday, August 20, 2019
చెన్నై బీచ్ లో నీలి రంగు అలలు...కానీ ఇది మనకు మంచిది కాదు
ఇలా అలలు నీలం రంగులో ఏర్పడడం చూడడానికి బాగుంటుందేమో కానీ మన ప్రపంచానికి మంచిది కాదు. ఎందుకంటే మన వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు నోక్టిలుకా సింటిలన్స్ అనే బ్యాక్టీరియా వలన ఇలా ఏర్పడతాయి. ఆక్సిజన్ శాతం తగ్గితే మనం శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది పడి సమస్య అవుతుంది.
Monday, August 19, 2019
Sunday, August 18, 2019
Saturday, August 17, 2019
Friday, August 16, 2019
Thursday, August 15, 2019
Tuesday, April 23, 2019
Sunday, March 17, 2019
Saturday, April 28, 2018
Saturday, March 3, 2018
సోదరి నివేదిత గురించి శ్రీ రామకృష్ణుల భవిష్యవాణి
భారతదేశం వచ్చాక వివేకానంద శిష్యురాలైన సోదరి
నివేదిత పూర్తిగా బెంగాలీ కట్టుబొట్టు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించింది. అందువలన ఆమె ఆ విషయంలో అమాయకత్వంతో చేసే కొన్ని పనులు శారదా మాతకు నవ్వు తెప్పించేవి.
అలా ఒకరోజు శారదా మాతకు నవ్వు రాగా " గురుదేవులు(శ్రీ రామకృష్ణులు) చెప్పినట్లు ఈమె(నివేదిత) బయటా తెలుపే(శరీరం రంగు),లోపలా తెలుపే(కల్మషం లేని మనసు)" అని మనస్ఫూర్తిగా నవ్వారు. అది విన్న నివేదిత పరుగుపరుగున శారదా మాత వద్దకు వెళ్లి రామకృష్ణులు అలా ఎప్పుడన్నారు అని అడిగింది. "ఒక రోజు భావావస్థలో రామకృష్ణులు తాము విదేశాలకు వెళ్లినట్లు అక్కడ మనుషులు లోపలా బయటా తెలుపే" అని అన్నట్లు శారదా మాత చెప్పారు.
ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో అని ఆమె ఆరా తీయగా ఫలానా యాత్రా దినాన అని అమ్మ చెప్పింది. వెంటనే నివేదిత స్వామి రామకృష్ణానంద వద్దకు వెళ్లి ఆ దినానికి సరిఅయిన ఇంగ్లీష్ తేదీ అడిగింది. ఆయన లెక్క కట్టి ఫలానా దినం అని చెప్పాడు. నివేదిత పరుగుపరుగున పోయి తనకు రామకృష్ణులు కలలో దర్శనం ఇచ్చిన తేదీ ఎప్పుడో తను రాసిన డైరీ లో చూసింది. ఆశ్చర్యకరంగా రామకృష్ణులు ఆమెకు కలలో దర్శనం ఇచ్చిన రోజు, ఆయన ఆ విధంగా భావావస్థలో చెప్పిన రోజూ ఒక్కటే అయింది.
ఈ విషయం శారదా మాతకు నివేదిత చెప్పగా అమ్మ నివేదిత చుబుకం ను ముద్దాడి " నరేంద్ర(స్వామి వివేకానంద) నా బిడ్డ. నా బిడ్డకు నువ్వు అందుకే అంత ప్రీతిపాత్రమైనావు. గురుదేవులు నిన్ను అనుగ్రహించి ఎన్నుకొన్నారు" అంది..
నివేదిత పూర్తిగా బెంగాలీ కట్టుబొట్టు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించింది. అందువలన ఆమె ఆ విషయంలో అమాయకత్వంతో చేసే కొన్ని పనులు శారదా మాతకు నవ్వు తెప్పించేవి.
అలా ఒకరోజు శారదా మాతకు నవ్వు రాగా " గురుదేవులు(శ్రీ రామకృష్ణులు) చెప్పినట్లు ఈమె(నివేదిత) బయటా తెలుపే(శరీరం రంగు),లోపలా తెలుపే(కల్మషం లేని మనసు)" అని మనస్ఫూర్తిగా నవ్వారు. అది విన్న నివేదిత పరుగుపరుగున శారదా మాత వద్దకు వెళ్లి రామకృష్ణులు అలా ఎప్పుడన్నారు అని అడిగింది. "ఒక రోజు భావావస్థలో రామకృష్ణులు తాము విదేశాలకు వెళ్లినట్లు అక్కడ మనుషులు లోపలా బయటా తెలుపే" అని అన్నట్లు శారదా మాత చెప్పారు.
ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో అని ఆమె ఆరా తీయగా ఫలానా యాత్రా దినాన అని అమ్మ చెప్పింది. వెంటనే నివేదిత స్వామి రామకృష్ణానంద వద్దకు వెళ్లి ఆ దినానికి సరిఅయిన ఇంగ్లీష్ తేదీ అడిగింది. ఆయన లెక్క కట్టి ఫలానా దినం అని చెప్పాడు. నివేదిత పరుగుపరుగున పోయి తనకు రామకృష్ణులు కలలో దర్శనం ఇచ్చిన తేదీ ఎప్పుడో తను రాసిన డైరీ లో చూసింది. ఆశ్చర్యకరంగా రామకృష్ణులు ఆమెకు కలలో దర్శనం ఇచ్చిన రోజు, ఆయన ఆ విధంగా భావావస్థలో చెప్పిన రోజూ ఒక్కటే అయింది.
ఈ విషయం శారదా మాతకు నివేదిత చెప్పగా అమ్మ నివేదిత చుబుకం ను ముద్దాడి " నరేంద్ర(స్వామి వివేకానంద) నా బిడ్డ. నా బిడ్డకు నువ్వు అందుకే అంత ప్రీతిపాత్రమైనావు. గురుదేవులు నిన్ను అనుగ్రహించి ఎన్నుకొన్నారు" అంది..
Thursday, December 14, 2017
Saturday, August 5, 2017
Thursday, August 3, 2017
Wednesday, August 2, 2017
Thursday, July 27, 2017
Monday, July 24, 2017
ధ్యానం చేసి భక్తులను ఆశీర్వదించిన కోతి
ఈ మధ్య ఒక కోతి ఒక గుడిలో దేవుడి ముందు 10 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత భక్తులను ఆశీర్వదించింది.
Sunday, July 23, 2017
Saturday, July 22, 2017
Thursday, July 20, 2017
Wednesday, July 19, 2017
బుధ గ్రహంపైన సూర్యుడు ఎలా అస్తమిస్తాడు.
మొదట మునిగిపోయి మళ్ళీ అక్కడ బుధ గ్రహం పై వంపు వలన పైకి వచ్చినట్లు కనిపించి మళ్ళీ అస్తమిస్తాడు.
Monday, July 17, 2017
Saturday, July 15, 2017
Thursday, July 13, 2017
Wednesday, July 12, 2017
Sunday, September 4, 2016
Saturday, June 18, 2016
దేవుడికి పనిపాటాలేదా ? నన్నెందుకు పట్టించుకోవాలి ?
చెట్లు కొట్టేస్తా - వానలుపడవు - కాలం మారిపోయింది అంటూ తెగ బాధపడతాను
పెద్దవారిని కూడా గౌరవించను - నాకు మర్యాదలేదని బాధపడతాను - కాలం మారిపోయిందని దొంగఏడుపులు ఏడుస్తా
అవసరమున్నా,లేకపోయినా బైకులో చాలా వేగంగా వెళతాను - జనం ఎవరూ రూల్సు పాటించరని గగ్గోలు పెడతాను
నోరు తెరిస్తే అబద్దమే వస్తుంది - కానీ నిజానికి విలువలేదని గుండెలు బాదుకొంటా
మూర్ఖుడైనా తనదైన రోజున మహత్కార్యాన్ని చేసి గొప్పపేరు సంపాదిస్తాడు. నిజమైన గొప్పతనం అనేది ఒకరు చేసిన గొప్పపనిని బట్టికాక అతను తన దైనందిన జీవితములో చేసే చిన్నచిన్న పనులను ఏవిధముగా చేస్తున్నాడనేదాన్ని బట్టి ఉంటుంది.ఇది స్వామి వివేకానందుని మాట.
పెద్దవారిని కూడా గౌరవించను - నాకు మర్యాదలేదని బాధపడతాను - కాలం మారిపోయిందని దొంగఏడుపులు ఏడుస్తా
అవసరమున్నా,లేకపోయినా బైకులో చాలా వేగంగా వెళతాను - జనం ఎవరూ రూల్సు పాటించరని గగ్గోలు పెడతాను
నోరు తెరిస్తే అబద్దమే వస్తుంది - కానీ నిజానికి విలువలేదని గుండెలు బాదుకొంటా
మూర్ఖుడైనా తనదైన రోజున మహత్కార్యాన్ని చేసి గొప్పపేరు సంపాదిస్తాడు. నిజమైన గొప్పతనం అనేది ఒకరు చేసిన గొప్పపనిని బట్టికాక అతను తన దైనందిన జీవితములో చేసే చిన్నచిన్న పనులను ఏవిధముగా చేస్తున్నాడనేదాన్ని బట్టి ఉంటుంది.ఇది స్వామి వివేకానందుని మాట.
1.మనము తాగడానికి నీరులేదని, పాలకులు సరిగా లేరని బాధపడతాము. అదే నీరు రోజూ వస్తూ నీటిగొట్టాలు పగిలిపోయి నీరు వృథాగా వెళ్ళిపోతున్నా పట్టించుకోము. లేక కుళాయికి ట్యాపులేక నీరు వెళ్ళిపోతుంటే కనీసము ఏదైనా అడ్డుపెడదామన్న ఆలోచనకూడా రాదు. వచ్చినా మిగతావారు చూసుకుంటారులే, నాకెందుకు అనుకొని వెళ్ళిపోతారు. నీళ్ళైతే పట్టుకొంటారు కాని నీరు వృథాగా పోతుంటే పట్టించుకోరు. ఎవరూ పట్టించుకోకుంటే నీటిసరఫరా విభాగపు వారిని తిడతారు. అంతేకాని మన బాధ్యత మనకు పట్టదు. కనీసము వారికి ఫోను ఐనా చేసి చెపుదామన్న ఆలోచన కూడా రాదు.
2.ఇంకొందరు విదేశాలకు వెళ్ళివచ్చి అక్కడ ఎంతో శుభ్రముగా ఉంటుందని మనదేశములో అలా ఉండదని తెగ బాధపడిపోతుంటారు. ఇక విదేశాలు చూడని వారైతే TV లో ఆయా దేశాలను చూసి మన దేశము అలా లేదని బాధపడుతుంటారు. ఏ ప్రభుత్వ పథకమైనా జనము పాటిస్తేనే ఆ పథకము విజయవంతము అవుతుంది. కనీసము మనము అంతరాత్మ చెప్పినట్లైనా నడుచుకోము. మనకు తెలుసు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేసినా, ఉచ్చ పోసినా అనారోగ్యమని, మరియు శుభ్రతకు భంగము అని. కాని మనము ఏమి చేస్తున్నామో మనకు తెలుసు. విదేశాలలో ఉన్నప్పుడు అక్కడి నియమాలు పాటించినప్పుడు అవే నియమాలు ఇక్కడ ఎందుకు పాటించరు? మాటలైతే ఎన్నో మాట్లాడుతారు.
ఇలా ఒకటా,రెండా ఎన్నో చెప్పుకోవచ్చు. ఏ విషయమైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. మొదట నిద్రలేవగానే "నేను" అనే స్పృహ కలిగిన తర్వాతే మిగతా ప్రపంచము గోచరిస్తుంది. అంటే ఏ పనైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. ప్రతి మనిషి తన బాధ్యత తెలుసుకొని ప్రవర్తిస్తే హక్కులు వాటంతట అవే వస్తాయి. అలా రాకున్న పోరాడే హక్కు కూడా ఉంటుంది. అంతే కాని హక్కులే తప్ప బాధ్యతలు తెలుసుకోనంత కాలం జీవితాలు అలానే ఉంటాయి.
ఇలాంటి మనలను భగవంతుడు ఎందుకు పట్టించుకోవాలి?
గమనిక: ఈ టపా అందరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు. కాని చాలామంది ప్రజలనే ఉద్దేశించి వ్రాసినది
Friday, June 17, 2016
నువ్వెంత ? నీ తలకు ఉన్న విలువెంత ?
టైటిల్ చూసి భయపడకండి. ఇది ఒక జరిగిన నీతికథ
ఒకసారి అశోకుడు,తన మంత్రి ఒక వీధిలో నడుస్తున్నారు.
దారిలో ఒక బౌద్ధసన్యాసి ఎదురు రాగా అశొకుడు తన కిరీటం తీసి పక్కన పెట్టి తన తలను ఆ సన్యాసి పాదాలపై ఉంచి నమస్కరించాడు. ఈ దృశ్యం చూసి మంత్రి ఒక చక్రవర్తి ఒక సామాన్య సన్యాసికి అంత గౌరవం ఇవ్వడం అనవసరం అని భావించాడు. ఈ విషయాన్ని అశోకుడు గమనించాడు.
తర్వాత ఆ మంత్రికి పాఠం నేర్పదలచి తన మంత్రి తో ఒక గొర్రెతల, ఒక ఎద్దు తల, ఒక మనిషితల తెమ్మని చెప్పాడు. మంత్రి అలాగే తెచ్చాడు. తర్వాత వాటిని బజారులో అమ్ముకొని రమ్మని మంత్రిని పంపాడు. మేక,ఎద్దు తలలను అమ్మగలిగాడు కానీ మనిషి తలను ఎంత ప్రయత్నించినా అమ్మలేకపోయాడు. అదే విషయం అశోకునికి చెప్పగా మనిషి తలను ఉచితంగా ఐనా ఎవరికైనా ఇచ్చి రమ్మన్నాడు. కాని ఏ ఒక్కరూ మనిషితలను తీసుకోవడానికి కాని, కనీసం చూడడానికి కూడా ఇష్టపడలేదు.
మంత్రి తిరిగి సభకు రాగా అశొకుడు అన్నాడు " ఆ రోజు నా తలను ఆ సన్యాసి పాదాలపై పెట్టగా నువు ఏంటి ఇలా చేశారు రాజు అనుకున్నావు. ఇప్పుడే చూసావు కాదా మనిషి తల యొక్క విలువ. బ్రతికి ఉన్నంత వరకే మనిషి తలకు విలువ.చనిపోయిన తర్వాత ఎద్దు,మేక లాంటి జంతువుల తలలకైనా విలువ ఉంటుంది కాని అసలు మనిషి తలను అసలు చూడడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు,ఇక విలువ సంగతి ఏం చెప్పాలి".
Thursday, June 16, 2016
దేవుడిపై నిజంగా నమ్మకం ఉందంటున్నవాడు మతం మారితే అది మోసమే
ఆర్థిక కారణాలతోనో లేక సామాజిక కారణాలతోనో మతం మారేవారిని మనం చూస్తూనే ఉన్నాము. అలాకాకుండా భగవంతుడి ఉనికి పట్ల మనస్పూర్తిగా నమ్మకం ఉన్నవాడు ఎన్నటికీ మతం మారవద్దని చెప్పే ఒక యదార్థ సంఘటన ఇప్పుడు చూద్దాం.
శృంగేరీ పీఠాధిపతి అయిన చంద్రశేఖరభారతీ స్వాముల వారి వద్ద జరిగిన విషయం ఇది. ఒకనాడు ఒక విదేశీ క్రైస్తవుడు స్వామివారిని కలవడానికి వచ్చినాడు. అక్కడ స్వామి వారికి అతనికిమధ్య జరిగిన సంభాషణ ఇలా జరిగింది.
విదేశీయుడు: "స్వామీ! మీరు అనుసరిస్తున్న సనాతనధర్మం పట్ల నేనెంతో ఆకర్షితుడైనాను.నేను కూడా మీ మతంలో చేరాలనుకుంటున్నాను.అనుగ్రహించండి"
స్వామి వారు: "మీకు భగవంతుడి ఉనికి పట్ల నిజంగా నమ్మకం ఉందా?"
విదేశీయుడు:ఉందండీ.
స్వామివారు:"సరే మీరు మీ ఇష్టప్రకారమే ,మీ తల్లిదండ్రులను మీరే ఎన్నుకుని జన్మించారా?"
విదేశీయుడు: "అలా ఎలా అవుతుందండీ. అది మన చేతుల్లో లేదు కదండీ. దేవుడు అక్కడ నన్ను జన్మించాలని ఆదేశించాడు. అందుకు అక్కడ పుట్టాను".
స్వామివారు: మరి మీఇష్టప్రకారమే మరణిస్తారా?
విదేశీయుడు: అదికూడా మనచేతుల్లో ఏముందండీ.అంతా ప్రభువు దయే కదండీ.
స్వామివారు: మరి మీ పుట్టుకకు, చావుకు కారణం భగవంతుడు అని మీరు నమ్ముతున్నప్పుడు అదే భగవంతుడు మిమ్మల్ని ఫలానా మతంలోనే ఎందుకు పుట్టించాడంటారు. అది అతడి నిర్ణయం అని మీరు ఎలా మర్చిపోతున్నారు. మీ బైబిల్ లో కూడా అద్భుతమైన విషయాలు ఉన్నాయి కదా. వాటిని ఆచరించవచ్చు కదా.
విదేశీయుడు: అవునండీ. మీరు చెప్పినది నిజమేనండీ. ప్రతిమతంలోనూ సత్యం ఉందండీ. అలానే మా మతంలో కూడా ఉందండీ. నన్ను క్షమించండి.
స్వామివారు: మీరు మీ మతంలోనే ఉంటూ ఒక నిజమైన క్రైస్తవుడు గా మంచి అభ్యున్నతి పొందండి. ఏ మతం ద్వారా ఐనా భగవంతుడిని సాక్షాత్కరించుకోవచ్చు.
చూసారు కదండీ. ఇదీ విషయం.
Wednesday, June 1, 2016
Tuesday, May 31, 2016
Monday, May 30, 2016
Sunday, May 29, 2016
Saturday, May 28, 2016
Sunday, April 3, 2016
ఉత్తములకీ మనకీ తేడా !
మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
.
.
జరిగిన కధ !
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో 1892 లో జరిగిన వాస్తవం .
.
18 సంవత్సరాల ఆ యువకుడు ఫీజులు కట్టలేక ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్నాడు . అతడు తల్లి తండ్రులు లేని అనాధ !
.
అతడూ అతడి స్నేహితుడూ కలిసి ఒక పధకం ఆలోచించారు . వాళ్ళ యూనివర్సిటీ లో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేద్దామనీ , అందులో ఖర్చులు పోను మిగీన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు .
.
అప్పట్లో గొప్ప పియానో వాద్య కారుడు Ignace J. Paderewski. వద్దకు వెళ్ళారు . ఆయన మేనేజరు ఫీజు రూపం లో 2000 డాలర్లు కనీస మొత్తం గా ఇవ్వాలనీ , ఆ పైన ఇతర ఖర్చులు అనీ ఒప్పదం చేసుకున్నారు . వీళ్ళు అంగీకరించారు . టికెట్లు అమ్మడం సాగించారు . అనుకున్న రోజు వచ్చింది . ప్రోగ్రాం అద్భుతం గా జరిగింది . అయితే వీళ్ళు అనుకున్నట్టు వసూళ్లు రాలేదు . మొత్తం 1600 డాలర్లు మాత్రమె వచ్చింది .
.
వాళ్ళు Paderewski. దగ్గరకు వెళ్ళారు . వసూలు అయిన మొత్తమూ , 400 డాలర్లకు చేక్కూ పట్టుకు వెళ్లి జరిగిన మొత్తం విషయం చెప్పారు . సాధ్యమయినంత త్వందరలో ఆ మిగిలిన సొమ్ము చెల్లిస్తాము అనీ , క్షమించమనీ అన్నారు .
.
వాళ్ళ గురించి Paderewski. కి తెలీదు . ఆయన వాళ్ళని అతకు ముందు చూడలేదు . ఆయన ఆ చెక్కును చింపేశాడు . . 1600 డాలర్లూ వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళతో ఆయన ఇలా అన్నాడు
.
" మీకు అయిన ఖర్చులు ఎంతో లెక్క పెట్టుకోండి . మీ ఫీజులకు ఎంతో అవుతోందో అది కూడా ఇందులో నుండి మినహాయించుకోండి . ఏమైనా మిగిలితే ఆ మిగిలిన సొమ్ము నాకు ఇవ్వండి "
.
ఈ సంఘటన Paderewski మానవతను చాటి చెబుతుంది . తనకు తెలీని , తనకు ఏమీకాని , వారి వలన ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా తన శ్రమనూ , తన ఆదాయాన్నీ ఇవ్వడం Paderewski హృదయం గురించి చెబుతోంది కదూ !
మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
అదే ఉత్తములకీ మనకీ తేడా !
.
ఇది ఇక్కడితో ఆగిపోలేదు
.
Paderewski తర్వాతి కాలం లో పోలాండ్ ప్రధాని అయ్యారు .
.
మొదటి ప్రపంచ యుద్ధం లో పోలాండ్ సర్వ నాశనం అయిపొయింది . 15 లక్షల మంది ఆకలితో అలమటించే స్థితికి చేరారు .
.Paderewski కి ఏమి చెయ్యాలో తోచలేదు . ఎవరిని అడగాలో తోచలేదు . చివరికి అమెరకా ఆహార , పునరావాస విభాగాన్ని సంప్రదించాడు . దానికి అధిపతి Herbert Hoover . ఇతడే తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యాడు . అతడు వెంటనే ప్రతిస్పందించాడు . టన్నులకొద్దీ ఆహార పదార్ధాలు పోలాండ్ కు సరపరా జరిగింది . పోలాండ్ లో ఆహార సంక్షోభం నివారించబడింది .
.
Herbert Hoover చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి Paderewski అమెరికా వెళ్లి హూవర్ ను కలిశాడు . కృతజ్ఞతలు చెబుతూ ఉండగా హోవర్ అన్నాడు
.
" కొన్ని సంవత్సరాల క్రితం మీరు కాలేజీ ఫీజులు కట్టలేని ఇద్దరు యువకులకు సహాయం చేశారు . వారిలో నేను ఒకడిని "
.
ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశం . నీవు ఏది ఇస్తావో అది నీవు అనేక రెట్లు పొందుతావు అనే గీతా సారం ఇది .
.
The world is a wonderful place. What goes around usually comes around.
-- సేకరణ
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
.
.
జరిగిన కధ !
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో 1892 లో జరిగిన వాస్తవం .
.
18 సంవత్సరాల ఆ యువకుడు ఫీజులు కట్టలేక ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్నాడు . అతడు తల్లి తండ్రులు లేని అనాధ !
.
అతడూ అతడి స్నేహితుడూ కలిసి ఒక పధకం ఆలోచించారు . వాళ్ళ యూనివర్సిటీ లో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేద్దామనీ , అందులో ఖర్చులు పోను మిగీన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు .
.
అప్పట్లో గొప్ప పియానో వాద్య కారుడు Ignace J. Paderewski. వద్దకు వెళ్ళారు . ఆయన మేనేజరు ఫీజు రూపం లో 2000 డాలర్లు కనీస మొత్తం గా ఇవ్వాలనీ , ఆ పైన ఇతర ఖర్చులు అనీ ఒప్పదం చేసుకున్నారు . వీళ్ళు అంగీకరించారు . టికెట్లు అమ్మడం సాగించారు . అనుకున్న రోజు వచ్చింది . ప్రోగ్రాం అద్భుతం గా జరిగింది . అయితే వీళ్ళు అనుకున్నట్టు వసూళ్లు రాలేదు . మొత్తం 1600 డాలర్లు మాత్రమె వచ్చింది .
.
వాళ్ళు Paderewski. దగ్గరకు వెళ్ళారు . వసూలు అయిన మొత్తమూ , 400 డాలర్లకు చేక్కూ పట్టుకు వెళ్లి జరిగిన మొత్తం విషయం చెప్పారు . సాధ్యమయినంత త్వందరలో ఆ మిగిలిన సొమ్ము చెల్లిస్తాము అనీ , క్షమించమనీ అన్నారు .
.
వాళ్ళ గురించి Paderewski. కి తెలీదు . ఆయన వాళ్ళని అతకు ముందు చూడలేదు . ఆయన ఆ చెక్కును చింపేశాడు . . 1600 డాలర్లూ వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళతో ఆయన ఇలా అన్నాడు
.
" మీకు అయిన ఖర్చులు ఎంతో లెక్క పెట్టుకోండి . మీ ఫీజులకు ఎంతో అవుతోందో అది కూడా ఇందులో నుండి మినహాయించుకోండి . ఏమైనా మిగిలితే ఆ మిగిలిన సొమ్ము నాకు ఇవ్వండి "
.
ఈ సంఘటన Paderewski మానవతను చాటి చెబుతుంది . తనకు తెలీని , తనకు ఏమీకాని , వారి వలన ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా తన శ్రమనూ , తన ఆదాయాన్నీ ఇవ్వడం Paderewski హృదయం గురించి చెబుతోంది కదూ !
మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
అదే ఉత్తములకీ మనకీ తేడా !
.
ఇది ఇక్కడితో ఆగిపోలేదు
.
Paderewski తర్వాతి కాలం లో పోలాండ్ ప్రధాని అయ్యారు .
.
మొదటి ప్రపంచ యుద్ధం లో పోలాండ్ సర్వ నాశనం అయిపొయింది . 15 లక్షల మంది ఆకలితో అలమటించే స్థితికి చేరారు .
.Paderewski కి ఏమి చెయ్యాలో తోచలేదు . ఎవరిని అడగాలో తోచలేదు . చివరికి అమెరకా ఆహార , పునరావాస విభాగాన్ని సంప్రదించాడు . దానికి అధిపతి Herbert Hoover . ఇతడే తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యాడు . అతడు వెంటనే ప్రతిస్పందించాడు . టన్నులకొద్దీ ఆహార పదార్ధాలు పోలాండ్ కు సరపరా జరిగింది . పోలాండ్ లో ఆహార సంక్షోభం నివారించబడింది .
.
Herbert Hoover చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి Paderewski అమెరికా వెళ్లి హూవర్ ను కలిశాడు . కృతజ్ఞతలు చెబుతూ ఉండగా హోవర్ అన్నాడు
.
" కొన్ని సంవత్సరాల క్రితం మీరు కాలేజీ ఫీజులు కట్టలేని ఇద్దరు యువకులకు సహాయం చేశారు . వారిలో నేను ఒకడిని "
.
ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశం . నీవు ఏది ఇస్తావో అది నీవు అనేక రెట్లు పొందుతావు అనే గీతా సారం ఇది .
.
The world is a wonderful place. What goes around usually comes around.
-- సేకరణ
Friday, March 18, 2016
పసిపిల్లల చేష్టలు మనకు ఎందుకంత ఆనందం కల్గిస్తాయి?
మనందరికీ అనుభవమే ఈ విషయం. పసిపిల్లల పనులు, వారి చేష్టలు మనకు ఎంతో ఆనందం కల్గిస్తాయి. అలాగే ఇంట్లోని పెంపుడు జంతువుల చేష్టలు కూడా మనకు ఎంతో ఆనందం కల్గించి మన మనసులను టెన్షన్ నుండి దూరం చేస్తుంటాయి. అసలు వారి పనుల వలన మనకు ఎందుకు ఆనందం కల్గుతోంది? అవే పనులను పెద్దవాళ్ళు చెస్తే మనకు ఒక్కొక్కసారి కోపం,అసహ్యం కూడా కల్గుతుంటాయి.
పసిపిల్లల చేష్టలు మనకు ఆనందం కల్గించడానికి కారణం ఒక్కటే. వారు చూసేవారికి ఆనందం కల్గించడానికి అలా ప్రవర్తించరు. వారి పనులు పరిపూర్ణసహజత్వం కల్గిఉన్నవి. వారి సహజస్వభావం ప్రకారం పనులు చేస్తుంటారు. వారు ఎలాంటి ముసుగులనూ ధరించి ఉండరు. వారి మనసులలో కపటత్వం ఉండదు కేవలం నిర్మలత్వం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ముసుగులు అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకలా ఉండడం లాంటివి. చివరికి వాళ్ళ కోపం కూడా ఎంత సహజం గా ఉంటుందంటే వారు కోపగించుకోవడాన్ని కూడా మనం ఆనందిస్తాము. "అబ్బ ఎంతకోపం వీడికి" అంటూ మురిసిపోతాము.
కాలం గడవగా గడవగా ఏమవుతుందంటే చుట్టుపక్కల పరిస్థితుల వలన ఆ సహజత్వం కోల్పోయి ఒకరిని ఆనందపెట్టడానికో లేక బాధపెట్టడానికో ప్రవర్తించడం వలన ఇక వారి చేష్టలు మనకు అసలైన ఆనందం ఇవ్వలేవు.
సమస్త వేదాంతానికీ మూలసూత్రం ఇదే. ఎవరైతే తమ బాల్యం లో లాగా నిర్మలమైన,కపటత్వం లేకుండా అత్యంత సహజంగా తమకు తెలియకుండానే ప్రవర్తిస్తారో వారికి తెలియకుండానే వారి పనుల వలన జీవులు ఆనందిస్తుంటాయో వారే భగవంతునికి అత్యంత సమీపంగా తమకు తెలియకుండానే ఆయన సాన్నిధ్యం అనుభవిస్తుంటారు.
పసిపిల్లల చేష్టలు మనకు ఆనందం కల్గించడానికి కారణం ఒక్కటే. వారు చూసేవారికి ఆనందం కల్గించడానికి అలా ప్రవర్తించరు. వారి పనులు పరిపూర్ణసహజత్వం కల్గిఉన్నవి. వారి సహజస్వభావం ప్రకారం పనులు చేస్తుంటారు. వారు ఎలాంటి ముసుగులనూ ధరించి ఉండరు. వారి మనసులలో కపటత్వం ఉండదు కేవలం నిర్మలత్వం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ముసుగులు అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకలా ఉండడం లాంటివి. చివరికి వాళ్ళ కోపం కూడా ఎంత సహజం గా ఉంటుందంటే వారు కోపగించుకోవడాన్ని కూడా మనం ఆనందిస్తాము. "అబ్బ ఎంతకోపం వీడికి" అంటూ మురిసిపోతాము.
కాలం గడవగా గడవగా ఏమవుతుందంటే చుట్టుపక్కల పరిస్థితుల వలన ఆ సహజత్వం కోల్పోయి ఒకరిని ఆనందపెట్టడానికో లేక బాధపెట్టడానికో ప్రవర్తించడం వలన ఇక వారి చేష్టలు మనకు అసలైన ఆనందం ఇవ్వలేవు.
సమస్త వేదాంతానికీ మూలసూత్రం ఇదే. ఎవరైతే తమ బాల్యం లో లాగా నిర్మలమైన,కపటత్వం లేకుండా అత్యంత సహజంగా తమకు తెలియకుండానే ప్రవర్తిస్తారో వారికి తెలియకుండానే వారి పనుల వలన జీవులు ఆనందిస్తుంటాయో వారే భగవంతునికి అత్యంత సమీపంగా తమకు తెలియకుండానే ఆయన సాన్నిధ్యం అనుభవిస్తుంటారు.
Wednesday, March 16, 2016
అయినదానికీ కానిదానికీ ఆత్మహత్యలు చేసుకొనేవడమేనా? ఆగి ఆలోచించండి..- హనుమంతుడు
చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకొంటున్న యువత కానీ, పనిలో విజయం కోసం వేచిఉండలేని ప్రజలు కానీ హనుమంతుని ఉపదేశాలను (తను పాటించినవాటిని) తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.
లంకలో సీతమ్మను వెతకడంలో హనుమంతుడు కూడా నిరాశ పొందాడు. కాని వెంటనే అతను చేసిన ఆలోచన యుగాల పర్యంతం మనకు ఆదర్శముగా ఉంటాయనడం అతిశయోక్తి కాదు.
సీతమ్మ కనపడక నిరుత్సాహం పొందిన హనుమంతుడు, వెంటనే
"శ్రేయస్సుకు(మంచి కలుగడానికి) , సుఖం కలుగడానికి, అన్ని పనులు సాగడానికి ఉత్సాహమే మూలము.ఉత్సాహం కల్గిన మనిషి సర్వకార్యాలందు విజయం పొందుతాడు. వాడు చేసిన కార్యం విజయవంతం అవుతుంది. అందుచేత ఉత్సాహం కోల్పోకుండా నేను మరల మరల సీతమ్మను వెదుకుతాను." అని ఆలొచించి తిరిగి సీతమ్మను వెదకడములో నిమగ్నమైనాడు.
ఐనా సీతమ్మ కనపడకపోవడముతో ఆత్మహత్య చేసుకోవాలని సంకల్పించుకొని, తిరిగి హనుమ ఒక క్షణంలో ఆలొచించిన తీరు అత్యధ్బుతం.
"చనిపోవుట అనేక దోషాలకు కారణమవుతుంది. బ్రతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది. అందువలన నేను చనిపోను."
నేటి వ్యక్తిత్వవికాస పుస్తకాలలో ఏమైతే ఉందో ఆనాడే హనుమంతుడు ఆలోచించి ఆచరించిన విధానము, మనకు ఆదర్శముగా నిలిచిన విధానము ఏనాటి మనుషులైనా, ఏ ప్రాంతపు మనుషులైనా ఖచ్చితముగా తెలుసుకొని ఆచరించి తీరవలసినవి కావంటారా ?
లంకలో సీతమ్మను వెతకడంలో హనుమంతుడు కూడా నిరాశ పొందాడు. కాని వెంటనే అతను చేసిన ఆలోచన యుగాల పర్యంతం మనకు ఆదర్శముగా ఉంటాయనడం అతిశయోక్తి కాదు.సీతమ్మ కనపడక నిరుత్సాహం పొందిన హనుమంతుడు, వెంటనే
"శ్రేయస్సుకు(మంచి కలుగడానికి) , సుఖం కలుగడానికి, అన్ని పనులు సాగడానికి ఉత్సాహమే మూలము.ఉత్సాహం కల్గిన మనిషి సర్వకార్యాలందు విజయం పొందుతాడు. వాడు చేసిన కార్యం విజయవంతం అవుతుంది. అందుచేత ఉత్సాహం కోల్పోకుండా నేను మరల మరల సీతమ్మను వెదుకుతాను." అని ఆలొచించి తిరిగి సీతమ్మను వెదకడములో నిమగ్నమైనాడు.
ఐనా సీతమ్మ కనపడకపోవడముతో ఆత్మహత్య చేసుకోవాలని సంకల్పించుకొని, తిరిగి హనుమ ఒక క్షణంలో ఆలొచించిన తీరు అత్యధ్బుతం.
"చనిపోవుట అనేక దోషాలకు కారణమవుతుంది. బ్రతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది. అందువలన నేను చనిపోను."
నేటి వ్యక్తిత్వవికాస పుస్తకాలలో ఏమైతే ఉందో ఆనాడే హనుమంతుడు ఆలోచించి ఆచరించిన విధానము, మనకు ఆదర్శముగా నిలిచిన విధానము ఏనాటి మనుషులైనా, ఏ ప్రాంతపు మనుషులైనా ఖచ్చితముగా తెలుసుకొని ఆచరించి తీరవలసినవి కావంటారా ?
Monday, February 29, 2016
Friday, February 19, 2016
251 రుపాయలకు ఫోనా ? మనం గొర్రెలమవుతున్నామా ?
ఆఫ్ట్రాల్ ఫోన్ పౌచ్ కొనడానికి కనీసం అన్నా 80 నుండి 200 రుపాయల వరకు, ఫ్లిప్ కవర్ ఐథే 200 నుండి 1000 రూపాయల వరకు అవుతుంది...
అలాంటిది ఫోన్ 251 రూపాయలంటే ?
టచ్ స్క్రీన్ తయారు చేయడానికే 1000 రూపాయల నుండి నుండి మొదలవుతాయి...
అసలు ఇది ఎంతదాకా వెళుతుందో చూడాలి...
మనము మూకుమ్మడిగా గొర్రెలవుతున్నామనుకొంటున్నాను..
Saturday, February 13, 2016
Tuesday, January 5, 2016
మనకు వినోదం పంచేవాడికి ఉన్న విలువ మన ప్రాణాలను కాపాడేవాళ్ళకు ఇవ్వని దౌర్భాగ్యులం మనం...
ఒక సినిమా హీరోనో లేక మరో సినీప్రముఖుడో పోతే మన సొంత మనిషే పోయాడన్నంతగా బాధపడతాము. మంచిదే అతడు మీకు వినోదాన్ని పంచాడు. కాని వినోదం ఎప్పటివరకు ? మన ప్రాణం ఉన్నంతవరకే.
మరి ఆ ప్రాణాలను కాపాడడానికే అనుక్షణం జీవిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరజవానుల కోసం ఒక కన్నీటిబొట్టైనా రాలదే !
మన మనసు అంత బండబారిపోయిందా ?
పఠాన్కోట్ అమర జవానులకు నివాళులు మరియు దేశసైన్యానికి వందనాలు.
Friday, January 1, 2016
కూడలి బ్లాగుల సంకలిని(అగ్రిగేటర్) మూతపడడం మనసుకు బాధగా ఉంది
ఇప్పుడే చూస్తున్నాను. కూడలి వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే కూడలిని మూసివేస్తున్నట్లు ప్రకటన.
బ్లాగు రాయడం మొదలు పెట్టినప్పటి నుండి కూడలికి బాగా అలవాటు పడ్డాను. ఒక్కసారిగా ఇలా అయ్యేసరికి ఇంకా మనసు స్వీకరించలేకపోతోంది. అసలు ఏమయ్యిందో అర్థం కావడం లేదు.
చాలా బాధాకరంగా ఉంది.
Tuesday, December 15, 2015
Friday, December 11, 2015
మీ పాటకు ఒక్క తీగ చాలదా ? నాలుగు కావాలా? (ఒక నిజ సంఘటన)
ప్రఖ్యాత ఫిడేల్ వాయిద్య విద్వాంసులుగా శ్రీ కృష్ణయ్యర్ గారి గురించి చాలామందికి తెలుసు.
వారి జీవితములో ఒకసారి జరిగిన సంఘటన ద్వారా వారెంత సాధకులో,విద్వాంసులో తెలుస్తుంది.
ఒకసారి ఒక కచేరీలో గాయకులకు ప్రక్కవాద్య సహకారంగా కృష్ణయ్యర్ గారు ఫిడేలు వాయిస్తున్నారు. ఉన్నట్టుండి ఫిడేల్ లో ని ఒక తీగ తెగిపోయింది. గాయకుడు కృష్ణయ్యర్ గారి వైపు "పాటకు అనుగుణంగా వాయించలేక కావాలని తీగ తెంపుకున్నావు" అన్నట్లు వ్యంగముగా చూసారట. ఫిడేలుకు 4 తీగలు ఉంటాయి. కృష్ణయ్యర్ గారికి కోపం వచ్చి "మీ పాటకు ఒక తీగ చాలు మిగతా 3 కూడా అవసరం లేదు" అని మిగతా రెండు తీగలు కూడా తెంపేసి ఒక్క తీగ తోనే మొత్తం కచేరీకి అత్యద్భుతంగా వాద్య సహకారం అందించారు. కానీ ఎవరికీ అనుమానం రాలేదు.
చూసారా ఇలాంటి మహానుభావుల సాధనా బలం.
- వాసుదేవ గారి "స్మృతులు" గ్రంధం నుండి
Monday, December 7, 2015
నీలము - ఆ రంగుకు (తెలుగు భాషలో) ఈ పేరెలా వచ్చింది ? (నా అభిప్రాయము)
కొన్ని ఉన్నట్టుండి అనూహ్యంగా,అకస్మాత్తుగా మనసుకు తడుతూఉంటాయి. అలా నిన్న పడుకున్నప్పుడు ఉన్నట్టుండి మెరుపులా నాకు కలిగిన భావన ఇది.
నాకు తట్టిన ఊహ ప్రకారము :
మనకు తెలుసు సముద్రము ఆకాశము రంగులో అంటే నీలపు రంగులో ఉంటుందని (రామన్ ఎఫెక్ట్ దీనినే వివరించింది).నీటిని తెలుగులో నీళ్ళు, నీరు గ్రాంధిక భాషలో "నీరము" అని కూడా అంటారు.
భాష అభివృద్ధి దశలో మన తెలుగువారు ఎప్పుడైనా నీలము రంగును చుసినప్పుడు అది ఏ రంగులో ఉంది అనే ప్రశ్న వచ్చినప్పుడు (ఇంకా నీలము అనే పదము లేదు కాబట్టి) వారు సముద్రపు రంగును దృష్టిలో పెట్టుకొని "నీళ్ళ రంగులో" లేక "నీరము రంగులో" ఉంది అనేవారు అని నా భావన.
ఈ భావమే తర్వాతి కాలములో నీరము అనేది నీలము అని మారిందని నా ఊహ. నీరు అనేది "నీలి" అని మారి ఉండవచ్చు..
ఇది కేవలం నా భావన మాత్రమే.ఇదే నిజమని నేను చెప్పలేను.
ఇదండీ నాకు నిన్న అకస్మాతుగా మెరుపులా వచ్చిన ఊహ.
Saturday, July 25, 2015
జీవితాంతం తప్పుడు పనులు చేస్తూ చనిపోయేముందు మాత్రం భగవంతుడిని స్మరిస్తే ఆయనను పొందగలమా ?
జీవితాంతం తప్పుడు పనులు చేస్తూ చనిపోయేముందు మాత్రం భగవంతుడిని స్మరిస్తే ఆయనను పొందగలమా ?
పొందగలము.
కానీ...........ఇది చదవండి..
శ్రీ భగవద్గీత లోని 8 వ అధ్యాయం ఐన అక్షరపరబ్రహ్మ యోగం లోని 5 వ శ్లోక భావం అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఆ శ్లోకం ఏమిటంటే
"అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః"
దీని అర్థము
"ఎవరైతే మరణ సమయములో నన్ను స్మరిస్తూ ప్రాణాలు వదులుతారో వారు నన్నే పొందుతారు. ఈ విషయంలో సందేహము లేదు " అని
సరే ఒక విషయం ఆలోచించండి. మనకు ఏదైనా ఒక ప్రమాదం జరిగి దెబ్బలు తగిలి రక్తం వస్తున్నదనుకోండి. తగిలిన వెంటనే మనం "అమ్మా" అనో, "అబ్బా" అనో అంటాము. అంటే మనకు ఆపద సమయములో దేవుడు గుర్తుకు వస్తున్నాడా? 99.99 శాతము గుర్తుకు రాడు.
మరి అన్నిటికన్నా పెద్ద సంఘటన ఐన మరణసమయములో ,మనకు మరణము తప్పదన్న విషయం తెలిసిన క్షణములో దేవుడు గుర్తుకు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అదే సమాధానం 99.99 శాతం గుర్తుకు రాడు. మనకు అత్యంత ఇష్టమైన సంఘటన లేక ఇష్టులు లేక పెళ్ళాము లేక మొగుడు,బిడ్డలు లేదా తల్లిదండ్రులు లేదా డబ్బో, ఇన్సూరెన్స్(భీమా) పాలసీ నో గుర్తుకువస్తాయి. అంటే ఆప్తులు మాత్రం గుర్తుకువస్తారు.నిజమే కదా?
ఇప్పుడు చెప్పండి. చావు సమయములో భగవంతుడు గుర్తుకు రాడు కదా?
మరి దేవుడు గుర్తుకు రావాలి అంటే మన మనసు సంపూర్ణముగా దైవచింతనతో నిండి ఉండాల్సిన అవసరము ఉంది. అలా ఉండాలంటే మనము ప్రతిరోజూ భగవంతుని స్మరిస్తూ ఉండాలి కదా. మనకు అత్యంత ఆప్తుడుగా భగవంతున్ని మనం భావించాలి కదా, అప్పుడు మాత్రమే భగవంతుడు మనకు మరణసమయంలో గుర్తుకువస్తాడు.
అత్యంత ఆప్తుడు కావాలంటే ఒక ప్రియుడు(ప్రేయసి) తన ప్రియురాలిని(ప్రేమికున్ని) ప్రేమించినట్లు లేక ఒక తల్లి తన బిడ్డను లేక ఒక బిడ్డ తన తల్లిని ప్రేమించినట్టు మనం కూడా భగవంతున్ని ప్రేమించాలి. పైన పేర్కొన్న వారిలో ఏ జంటలోని వ్యక్తులూ ఒకరు లేకుండా మరొకరు జీవించలేరు. అంతే సంబంధము మనిషికీ,దేవునికీ ఉండాలి. అప్పుడు మాత్రమే మరణసమయములో కూడా భగవంతుడు గుర్తుకు వస్తాడు.
అలానే భగవంతుని గురించి ప్రతిరోజూ ఆలోచిస్తే అతడిని మరణసమయములో కూడా భగవంతుడు గుర్తు వస్తాడు కానీ ఎప్పుడూ ఆలోచించకుండా అప్పుడే గుర్తుకురావడం అనేది 99.99 శాతం అసాధ్యం.
మిగతా 0.01 శాతం అత్యంతఅరుదుగా మనకు తటాలున ఏదైనా విషయం గుర్తుకు వచ్చినట్లు భగవంతుడు కూడా గుర్తుకు రావచ్చు.
పొందగలము.
కానీ...........ఇది చదవండి..శ్రీ భగవద్గీత లోని 8 వ అధ్యాయం ఐన అక్షరపరబ్రహ్మ యోగం లోని 5 వ శ్లోక భావం అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఆ శ్లోకం ఏమిటంటే
"అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః"
దీని అర్థము
"ఎవరైతే మరణ సమయములో నన్ను స్మరిస్తూ ప్రాణాలు వదులుతారో వారు నన్నే పొందుతారు. ఈ విషయంలో సందేహము లేదు " అని
సరే ఒక విషయం ఆలోచించండి. మనకు ఏదైనా ఒక ప్రమాదం జరిగి దెబ్బలు తగిలి రక్తం వస్తున్నదనుకోండి. తగిలిన వెంటనే మనం "అమ్మా" అనో, "అబ్బా" అనో అంటాము. అంటే మనకు ఆపద సమయములో దేవుడు గుర్తుకు వస్తున్నాడా? 99.99 శాతము గుర్తుకు రాడు.
మరి అన్నిటికన్నా పెద్ద సంఘటన ఐన మరణసమయములో ,మనకు మరణము తప్పదన్న విషయం తెలిసిన క్షణములో దేవుడు గుర్తుకు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అదే సమాధానం 99.99 శాతం గుర్తుకు రాడు. మనకు అత్యంత ఇష్టమైన సంఘటన లేక ఇష్టులు లేక పెళ్ళాము లేక మొగుడు,బిడ్డలు లేదా తల్లిదండ్రులు లేదా డబ్బో, ఇన్సూరెన్స్(భీమా) పాలసీ నో గుర్తుకువస్తాయి. అంటే ఆప్తులు మాత్రం గుర్తుకువస్తారు.నిజమే కదా?
ఇప్పుడు చెప్పండి. చావు సమయములో భగవంతుడు గుర్తుకు రాడు కదా?
మరి దేవుడు గుర్తుకు రావాలి అంటే మన మనసు సంపూర్ణముగా దైవచింతనతో నిండి ఉండాల్సిన అవసరము ఉంది. అలా ఉండాలంటే మనము ప్రతిరోజూ భగవంతుని స్మరిస్తూ ఉండాలి కదా. మనకు అత్యంత ఆప్తుడుగా భగవంతున్ని మనం భావించాలి కదా, అప్పుడు మాత్రమే భగవంతుడు మనకు మరణసమయంలో గుర్తుకువస్తాడు.
అత్యంత ఆప్తుడు కావాలంటే ఒక ప్రియుడు(ప్రేయసి) తన ప్రియురాలిని(ప్రేమికున్ని) ప్రేమించినట్లు లేక ఒక తల్లి తన బిడ్డను లేక ఒక బిడ్డ తన తల్లిని ప్రేమించినట్టు మనం కూడా భగవంతున్ని ప్రేమించాలి. పైన పేర్కొన్న వారిలో ఏ జంటలోని వ్యక్తులూ ఒకరు లేకుండా మరొకరు జీవించలేరు. అంతే సంబంధము మనిషికీ,దేవునికీ ఉండాలి. అప్పుడు మాత్రమే మరణసమయములో కూడా భగవంతుడు గుర్తుకు వస్తాడు.
అలానే భగవంతుని గురించి ప్రతిరోజూ ఆలోచిస్తే అతడిని మరణసమయములో కూడా భగవంతుడు గుర్తు వస్తాడు కానీ ఎప్పుడూ ఆలోచించకుండా అప్పుడే గుర్తుకురావడం అనేది 99.99 శాతం అసాధ్యం.
మిగతా 0.01 శాతం అత్యంతఅరుదుగా మనకు తటాలున ఏదైనా విషయం గుర్తుకు వచ్చినట్లు భగవంతుడు కూడా గుర్తుకు రావచ్చు.
Friday, July 24, 2015
Monday, January 12, 2015
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్పురద్రూపి..ఒక్క మాటలో చెప్పాలంటే Manly person.
అ వేశ్యలు విటుల కోసం చేసే హావభావాలను చూసి ఆ వ్యక్తి సహచరులలోని స్త్రీలు ఆ వేశ్యలను చూసి భయపడ్డారు. అందుచేత వారు ఆ వ్యక్తిని అక్కడ నుండి పక్కకు వచ్చేయమని వారించారు.కాని ఆ వ్యక్తి సూటిగా ఆ వేశ్యల వద్దకు వెళ్ళి వారి వద్ద కూర్చొని " వీరు తమ దివ్యత్వాన్ని బాహ్యమైన అందం రూపంలో వ్యక్తపరుస్తున్నారు( They put their divinity into beauty)" అని కన్నీళ్ళు కారుస్తూ అన్నాడు. అతని ఈ మాటలు ఆ వేశ్యలను ఎంతగా ప్రభావితం చేశాయంటే ఆ వేశ్యలలో కొందరు తమ జీవితాన్ని తలుచుకొని మొహం కప్పుకొని ఏడవసాగారు. ఒక వేశ్య ఈ వ్యక్తి అంగీ కొనను పట్టుకొని " నేడు నేను ఒక దైవదూత అంగీని ముట్టుకొని ధన్యత చెందాను" అన్నది. ఆ వ్యక్తి మీ అందరి కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నాడు.
ఇంతలో ఆ వ్యక్తి సహచర స్త్రీలు ఆయనను పక్కకు లాక్కుపోయారు.
ఎవరు ఈ వ్యక్తి? మీలో చాలా మంది ఊహించే ఉంటారు. తన వ్యక్తిత్వంచే నేటికీ, ఎల్లప్పటికీ ప్రభావితం చేస్తున్న స్వామి వివేకానందుడే ఆ వ్యక్తి.
జనవరి 12 న జాతీయ యువజన దినోత్సవమని, వివేకానందుల పుట్టినరోజని జరుపుకోవడం ఇదేనా ఆ మహానుభావుడికి మనం ఇచ్చే నివాళి ?
ఆయన ఉపదేశాలలో ఒక్కటి మనస్పూర్తిగా ఆచరించినా మన జీవితమే అత్యధ్బుతంగా తీర్చిదిద్దబడుంది.
Thursday, September 11, 2014
ప్రపంచ చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత చాలా ఆనందం,అద్భుతం,ఆశ్చర్యం,బాధాకరం
సెప్టెంబరు 11,1893:

సరిగ్గా నేటికి 121 సంవత్సరాల క్రిందట చికాగోలో
స్వామివివేకానంద "అమెరికా సోదరసోదరీమణులారా!.."
అంటూ ఇచ్చిన ఉపన్యాసం సనాతన హైందవధర్మాన్ని నిలబెట్టింది.
భారతదేశాన్ని ప్రపంచం ముందు తిరిగి తలెత్తుకొనేలా చేసింది మరియు
భవిష్యత్తుకై బాట వేసింది.
సెప్టెంబరు11,2001:
నేటికి 13 సంవత్సరాల క్రింద ఉగ్రవాదుల దాడిలో న్యూయార్క్ లోని WTO ట్విన్ టవర్స్ ధ్వంసం అయ్యాయి.

మొదటిది ధర్మస్థాపన కోసం నాంది అయితే రెండవది అధర్మానికి వేదిక
అయింది.
మీరు సరిగా గమనిస్తే ఒక వింత కనిపిస్తుంది.
అదేమంటే తేడా 108 సంవత్సరాలు. మన హిందూధర్మం లో 108 ప్రాముఖ్యత మీకు తెలిసిందే. దీనికై నా గత టపా
లోని మాటలు ఇక్కడ చూడండి.
1.వేదాల ప్రకారం
#భూమికి,చంద్రునికి మధ్యదూరం,చంద్రుని వ్యాసానికి 108 రెట్లు
#భూమికి,సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు
#సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.
నేటి విజ్ఞానం ప్రకారం కూడా ఇవి దాదాపు సరిపోలాయి.
2.ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మర్మస్థానాలు 108.
3.నక్షత్రాలు 27.వాటికి ఒక్కొక్కటికి గల పాదాలు 4. 27*4=108
4.రాశులు 12.గ్రహాలు 9. 12*9=108.
5.భరతనాట్యంలో మొత్తం నాట్యభంగిమలు 108.
6.ఉపనిషత్తులు 108.
7.108=1*2 వర్గం*3 ఘనం=1*(2*2)*(3*3*3).
8.భగవద్గీత అధ్యాయాలు 18.మహాభారత పర్వాలు 18.ఇవి 108 యొక్క కారణాంకాలు.

సరిగ్గా నేటికి 121 సంవత్సరాల క్రిందట చికాగోలో
స్వామివివేకానంద "అమెరికా సోదరసోదరీమణులారా!.."
అంటూ ఇచ్చిన ఉపన్యాసం సనాతన హైందవధర్మాన్ని నిలబెట్టింది.
భారతదేశాన్ని ప్రపంచం ముందు తిరిగి తలెత్తుకొనేలా చేసింది మరియు
భవిష్యత్తుకై బాట వేసింది.
సెప్టెంబరు11,2001:
నేటికి 13 సంవత్సరాల క్రింద ఉగ్రవాదుల దాడిలో న్యూయార్క్ లోని WTO ట్విన్ టవర్స్ ధ్వంసం అయ్యాయి.

మొదటిది ధర్మస్థాపన కోసం నాంది అయితే రెండవది అధర్మానికి వేదిక
అయింది.
మీరు సరిగా గమనిస్తే ఒక వింత కనిపిస్తుంది.
అదేమంటే తేడా 108 సంవత్సరాలు. మన హిందూధర్మం లో 108 ప్రాముఖ్యత మీకు తెలిసిందే. దీనికై నా గత టపా
108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది?
1.వేదాల ప్రకారం
#భూమికి,చంద్రునికి మధ్యదూరం,చంద్రుని వ్యాసానికి 108 రెట్లు
#భూమికి,సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు
#సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.
నేటి విజ్ఞానం ప్రకారం కూడా ఇవి దాదాపు సరిపోలాయి.
2.ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మర్మస్థానాలు 108.
3.నక్షత్రాలు 27.వాటికి ఒక్కొక్కటికి గల పాదాలు 4. 27*4=108
4.రాశులు 12.గ్రహాలు 9. 12*9=108.
5.భరతనాట్యంలో మొత్తం నాట్యభంగిమలు 108.
6.ఉపనిషత్తులు 108.
7.108=1*2 వర్గం*3 ఘనం=1*(2*2)*(3*3*3).
8.భగవద్గీత అధ్యాయాలు 18.మహాభారత పర్వాలు 18.ఇవి 108 యొక్క కారణాంకాలు.
Monday, August 11, 2014
కాకతాళీయం లేక యాదృచ్చికం అయ్యుండచ్చు...కాని మాయగా కూడా అనిపిస్తాయి!
మన నిత్యజీవితం లో జరిగే కొన్ని సంఘటనలు మనలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. అలాంటి సంఘటనలు యాదృచ్చికమో లేక కాకతాళీయమో అయ్యొండొచ్చు.కాని మనలను చెప్పలేనంత ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. ఇలాంటి రెండు సంఘటనలు నా జీవితంలో జరిగినవి చెప్తాను.
ఈ మధ్యే అంటే 10 రోజుల క్రిందట జరిగిన ఒక సంఘటన.
రాఘవేంద్రస్వామి వారి శ్లోకం
"పూజ్యా రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయచ|
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే|"
ఈ శ్లోకం నాకు వచ్చినప్పటికీ 10 రొజుల క్రిందట శ్లోకం లో మొదటిపాదం ఒకటే గుర్తుకువచ్చేది. రెండవ పాదం గుర్తుకు వచ్చేది కాదు. ఎక్కడా చదవకుండా, ఎవరితోనూ అడగకుండా రెండవ పాదం గుర్తుకుతెచ్చుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేసేవాడిని. 10 రోజుల క్రిందట బెంగళూరు లో సిటీ బస్సులో వెళ్ళేటప్పుడు గుర్తుతెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను. నా ఎదురుగా ఒక అబ్బాయి(బహుశా భవననిర్మాణ కార్మికుడు అనుకొంటాను) చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఊగిపోతూ పాటలు వింటున్నాడు.అప్పుడప్పుడు hum చేసుకొంటున్నాడు. ఆ అబ్బాయి తెలుగు పాట వింటున్నాడని అర్థమైంది. ఆ అబ్బాయి ఎందుకో ఇయర్ ఫోన్స్ తీసివేశాడు. ఇంతలో నాకు అకస్మాత్తుగా రెండవపాదం గుర్తుకు వచ్చింది. హమ్మయ్య అనుకున్నాను. ఆ అబ్బయితో మీది ఏ ఊరు అన్నాను. ఆ అబ్బాయి "అన్నా మాది "మంత్రాలయం", అదే అన్నా రాఘవేంద్రస్వామి మఠం ఉన్న ఊరు " అన్నాడు.
ఈ సంఘటన యాదృచ్చికమే అయ్యుండచ్చు. కాని ఆ క్షణంలో నాకు మాయగా అనిపించింది.
ఇక రెండవ సంఘటన ఏమంటే నా బ్లాగు "లేవండి,మేల్కొనండి..." పేరు 2009 వ సంవత్సరం మొదటిదాక "సత్యమేవజయతే" అనే పేరుతో నడిపేవాడిని. ఒకరోజు రాత్రి అనుకోకుండా బ్లాగుపేరు మార్చేశాను. మరుసటిరోజే "సత్యం" రామలింగరాజు గారు తమ మోసం ఒప్పుకోవడం, "సత్యం" కంపెనీ తిరోగమనం మొదలైంది.
ఈ సంఘటన అత్యంత యాదృచ్చికం,కాకతాళీయం ఐనా నాకు మాత్రం వింతగా అనిపించింది.
ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు సాధారణంగా సంభవిస్తుంటాయి. అను భవించేవాడికి మాత్రం వింతగా,మాయగా,అద్బుతంగా అనిపిస్తాయి.
Monday, June 16, 2014
ఇకనైనా మారండయ్యా చులకన అయినది చాలు!
తరాలు మారినా మనకు మాత్రం సిగ్గు రావడం లేదు. ఎందుకండీ సాధువులారా! మీ సాధుత్వం? హాయిగా సంసారంలోకి రండి. రాగద్వేషాలు ఉన్నచోట సాధువుకీ సంసారికీ తేడా ఏముంది? సంసారి సంసారం కోసం కొట్టుకొంటున్నాడు, కొందరు సాధువులు పంతం కోసం కొట్టుకొంటున్నారు.
లేకుంటే ఏంటి ఇది..మొన్న భద్రాచలం లో సీతారాముల నిత్యకళ్యాణంలో ప్రవర చెప్పేటప్పుడు "రామనారాయణ" అన్నారట...అలా అనకూడదని కొందరు సాధువులు గగ్గోలు పెట్టారట..
శ్రీరాముడి నామాలలో "రామనారాయణ" కూడా ఒకటి...అంటే నారాయణ స్వరూపమైన రాముడు అని అర్థం..ఇది కూడా తెలియని సాధువులా వీరు?
ప్రసిద్ది చెందిన క్రింది స్తోత్రం చూడండి:
అచ్యుతం కేశవం రామనారాయణం!!
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్!!
శ్రీధరం మాధవం గోపికావల్లభం!!
జానకీనాయకం రామచంద్రం భజే!!
అచ్యుతం కేశవం సత్యభామాధవం!!
మాధవం శ్రీధరం రాధికారాధితమ్!!
ఇందిరామందిరం చేతసా సుందరం!!
దేవకీనందనం నందజం సందధే!!
శివ కేశవుల భేధమే అంతరించిపోతున్న ఈ కాలంలో ఇంకా ఇలాంటి సంకుచిత భావాలతో ఇలాంటి వారు సనాతనధర్మానికి ఎంత ద్రోహం చేస్తున్నారో వీరికి తెలుస్తోందా?
ఇతర మతస్థులు మన ధర్మం గురించి తెలియక విమర్శిస్తే ఏమన్నా అనుకోవచ్చు, కాని మనవారే మనలనే కించపరుచుకుంటూ ఉంటే మనకు ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించరా? "
ఏకం సత్ విప్రా బహుదా వదంతి" (ఉన్నది ఒక్కటే, కాని అది పలురకాల పేర్లతో పిలువబడుతోంది) అన్న విషయం జీర్ణించుకుపోని సాధువులు ఎందుకు. సంసారులకు ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు.కాని భగవంతుడి కోసం అని చెప్పుకుని సంసారాన్ని వదిలివేసి సాధువుల వేషం కట్టిన ఇలాంటి సాధువులు ఘోరమైన దుర్గతి పాలవుతారు.
గమనిక: ఈ పోస్ట్ కుహనా (Half minded) మరియు ఢాంభికులైన సాధువులను ఉద్దేశించి వ్రాసినది.
Monday, June 2, 2014
Subscribe to:
Posts (Atom)
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...





