Friday, March 21, 2014
కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి తేరు(రథం) మరియు తేరును లాగే త్రాడు
Wednesday, March 19, 2014
మనం జయించామనుకుంటాం..కానీ ఇంతలో మళ్ళీ ప్రత్యక్షమవుతుంది..
నేను చాలా నాచురల్ గా ఉంటాను..ఏం పెట్టినా తింటాను..వాళ్ళ మనసు ముఖ్యం..వాళ్ళు మనస్పూర్తిగా అన్నం పెడ్తే చాలు..వాళ్ళ నుండి నాకు మర్యాద ఏమీ అవసరం లేదు..ఇలా సాగుతుంది మన ఆలోచనా వ్యవహారం.
కానీ అనుకున్నంతసేపు ఉండదు ఈ వ్యవహారం. నాకు అహంకారం అంటూ ఏదీ లేదని నేను అనుకోవచ్చు.కానీ అంతలోనే అది ఎక్కడనుంచో ఊడిపడుతుంది. ఉదాహరణకు కలలో మనం చాలా భయపడిఉంటాము..మేల్కొన్న తర్వాత కూడా గుండె తీవ్రంగా కొట్టుకోవడం మనం గమనించవచ్చు. ఈ అహంకారం కూడా అచ్చం అలాంటిదే. నేను దానిని పారద్రోలానని అనుకుంటాను.కాని అది ఎక్కడి నుండో ప్రత్యక్షం అవుతుంది.అప్పుడు నేను బాధపడుతూ"ఏమిటి! నాకు సరైన మర్యాద చూపలేదు!" అంటాను.
గొప్పవారి నుండి సామాన్యులను దూరం చేస్తున్నదేమిటి?
ఒక చిన్నకథ.
శ్రీరామకృష్ణ పరమహంస గారు ఒకసారి కలకత్తాలో సబ్జడ్జ్ గా పనిచేసి కాలధర్మం చెందిన కాశీశ్వరమిత్రా అనే వారి ఇంటికి మిత్రాగారి కొడుకులైన శ్రీనాథ్,యజ్ఞనాథ్ అనే వారి బలవంతం మీద వెళ్ళారు. వారిద్దరూ వయసులో చాలా చిన్నవారు.అక్కడ ఏదో ఉత్సవం జరిగిన తర్వాత రామకృష్ణులను మిగతా అతిథుల వద్ద ఉంచారు.కలకత్తాలోని కొందరు గొప్పవారు కూడా ఆ ఉత్సవానికి రావడం వలన వారి భోజన ఏర్పాట్లలో ఉండి రామకృష్ణులను పట్టించుకోలేదు.చాలా సమయం తర్వాత భోజనానికి పిలుపు వచ్చింది. వచ్చిన అతిథులు ఎక్కువ మంది ఉండడం చేత రామకృష్ణులకు భోజనశాలలో ఒకమూల స్థలం దొరికింది.అంతేకాక ఆ కూర్చున్న స్థలం కూడా శుభ్రంగా లేదు.
ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తాము?
నిజాయితీగా చెప్పాలంటే మొదట భోజనానికి ఆలస్యం అయినందుకే మనకు కోపం ఎలా ఉంటుందంటే అమిత జ్వరం వచ్చినవాడి నోటిలోని ధర్మామీటర్లో పాదరసం మట్టం ఎలా పెరుగుతూంటుందో అలా పెరుగుతూంటుంది.సరే అదలా ఉండనివ్వండి తర్వాత భోజన స్థలం,ఆ ఇరుకులో కూర్చోవడం...నిజం గా మన రక్తం ఉడికిపోతూంటుంది కదా.కోపంతో అక్కడి నుండి లేచిపోవాలనిపిస్తుంది.మనకు గతిలేక అక్కడకు వచ్చామా అని కూడా మనం అనవచ్చు.
కాని రామకృష్ణులు ఏమి చేసారు? పిలిచినవారు ఇద్దరూ వయసులో చిన్నవారు,వారికి అతిథులను సముచితరీతిలో గౌరవించడం ఇంకా అంతగా తెలియదు అనుకొని కోపం చెందలేదు.వారి ఆతిథ్యాన్ని నవ్వుతో స్వీకరించారు.
ఇక్కడ మనం రామకృష్ణుల వంటి గొప్పవారం కాదే అని అనుకోనవసరం లేదు అలా ప్రవర్తించడానికి. ఇది చాలా సాధారణంగా జరిగే విషయం.ఒక వ్యక్తి గొప్పతనం అనేది అతడు చేసే గొప్పపనుల వలన కాక నిత్యజీవితంలో చిన్నచిన్న సమస్యల పట్ల అతడి దృక్పథం ఎలా ఉంటుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.
ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".
ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.
కానీ అనుకున్నంతసేపు ఉండదు ఈ వ్యవహారం. నాకు అహంకారం అంటూ ఏదీ లేదని నేను అనుకోవచ్చు.కానీ అంతలోనే అది ఎక్కడనుంచో ఊడిపడుతుంది. ఉదాహరణకు కలలో మనం చాలా భయపడిఉంటాము..మేల్కొన్న తర్వాత కూడా గుండె తీవ్రంగా కొట్టుకోవడం మనం గమనించవచ్చు. ఈ అహంకారం కూడా అచ్చం అలాంటిదే. నేను దానిని పారద్రోలానని అనుకుంటాను.కాని అది ఎక్కడి నుండో ప్రత్యక్షం అవుతుంది.అప్పుడు నేను బాధపడుతూ"ఏమిటి! నాకు సరైన మర్యాద చూపలేదు!" అంటాను.
గొప్పవారి నుండి సామాన్యులను దూరం చేస్తున్నదేమిటి?
ఒక చిన్నకథ.
శ్రీరామకృష్ణ పరమహంస గారు ఒకసారి కలకత్తాలో సబ్జడ్జ్ గా పనిచేసి కాలధర్మం చెందిన కాశీశ్వరమిత్రా అనే వారి ఇంటికి మిత్రాగారి కొడుకులైన శ్రీనాథ్,యజ్ఞనాథ్ అనే వారి బలవంతం మీద వెళ్ళారు. వారిద్దరూ వయసులో చాలా చిన్నవారు.అక్కడ ఏదో ఉత్సవం జరిగిన తర్వాత రామకృష్ణులను మిగతా అతిథుల వద్ద ఉంచారు.కలకత్తాలోని కొందరు గొప్పవారు కూడా ఆ ఉత్సవానికి రావడం వలన వారి భోజన ఏర్పాట్లలో ఉండి రామకృష్ణులను పట్టించుకోలేదు.చాలా సమయం తర్వాత భోజనానికి పిలుపు వచ్చింది. వచ్చిన అతిథులు ఎక్కువ మంది ఉండడం చేత రామకృష్ణులకు భోజనశాలలో ఒకమూల స్థలం దొరికింది.అంతేకాక ఆ కూర్చున్న స్థలం కూడా శుభ్రంగా లేదు.
ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తాము?
నిజాయితీగా చెప్పాలంటే మొదట భోజనానికి ఆలస్యం అయినందుకే మనకు కోపం ఎలా ఉంటుందంటే అమిత జ్వరం వచ్చినవాడి నోటిలోని ధర్మామీటర్లో పాదరసం మట్టం ఎలా పెరుగుతూంటుందో అలా పెరుగుతూంటుంది.సరే అదలా ఉండనివ్వండి తర్వాత భోజన స్థలం,ఆ ఇరుకులో కూర్చోవడం...నిజం గా మన రక్తం ఉడికిపోతూంటుంది కదా.కోపంతో అక్కడి నుండి లేచిపోవాలనిపిస్తుంది.మనకు గతిలేక అక్కడకు వచ్చామా అని కూడా మనం అనవచ్చు.
కాని రామకృష్ణులు ఏమి చేసారు? పిలిచినవారు ఇద్దరూ వయసులో చిన్నవారు,వారికి అతిథులను సముచితరీతిలో గౌరవించడం ఇంకా అంతగా తెలియదు అనుకొని కోపం చెందలేదు.వారి ఆతిథ్యాన్ని నవ్వుతో స్వీకరించారు.
ఇక్కడ మనం రామకృష్ణుల వంటి గొప్పవారం కాదే అని అనుకోనవసరం లేదు అలా ప్రవర్తించడానికి. ఇది చాలా సాధారణంగా జరిగే విషయం.ఒక వ్యక్తి గొప్పతనం అనేది అతడు చేసే గొప్పపనుల వలన కాక నిత్యజీవితంలో చిన్నచిన్న సమస్యల పట్ల అతడి దృక్పథం ఎలా ఉంటుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.
ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".
ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.
Monday, March 17, 2014
"మనం చేయగలిగినంత వరకు చేయడమే - ఫలితం భగవంతుడిదే" అని ఎందుకంటారు?
ఈ టపా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే ఈ మధ్య చదివిన ఒక చారిత్రక సంఘటన.
విజయనగర సామ్రాజ్యం స్థాపకుడైన విద్యారణ్యుల వారికి వేదవ్యాసులు చెప్పిన విషయం ఏమంటే 360 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం విలసిల్లుతుందని.
కానీ ఇంకా ఎక్కువ కాలం సామ్రాజ్యం ఉండాలని 3600 సంవత్సరాలు నిలబడగల ముహూర్తం పెట్టారు విద్యారణ్యుల వారు. తను ఆ ముహూర్త సమయానికి శంఖం ఊదుతానని అప్పుడు సరిగా భూమిపూజ మొదలు పెట్టాలని తమ శిష్యులకు ఆదేశించారు విద్యారణ్యులు.
సరిగా శంఖ ధ్వని వినిపించగానే భూమిపూజ మొదలు పెట్టారు శిష్యులు. కాని మళ్ళీ రెండవసారి శంఖ ధ్వని విని శిష్యులకు ఎందుకలా గురువు గారు రెండూ సార్లు ఊదారు అని విద్యారణ్యుల వారి వద్దకు వెళ్ళి అడిగారు.
విద్యారణ్యులవారు అప్పుడు దివ్యదృష్టితో మొదటిసారి శంఖ ధ్వని ఒక జంగము వాడు భిక్ష కోసం (నేటికీ వీరు ఇళ్ళ వద్ద భిక్ష అడిగేటప్పుడు శంఖం ఊదుతారు)ఊదగా వచ్చినదని గ్రహించారు. చాలా బాధపడి వేదవ్యాసుల వారి మాటే నిజమైనది కదా,విధి చాలా బలీయమైనదని నిట్టూర్చారు.
చూసారు కదా ఇదీ జరిగింది.ఇక్కడ మానవప్రయత్న లోపం ఏమైనా జరిగిందా. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలోని సాంఖ్యయోగము లో ఇలా అన్నారు.
విజయనగర సామ్రాజ్యం స్థాపకుడైన విద్యారణ్యుల వారికి వేదవ్యాసులు చెప్పిన విషయం ఏమంటే 360 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం విలసిల్లుతుందని.
కానీ ఇంకా ఎక్కువ కాలం సామ్రాజ్యం ఉండాలని 3600 సంవత్సరాలు నిలబడగల ముహూర్తం పెట్టారు విద్యారణ్యుల వారు. తను ఆ ముహూర్త సమయానికి శంఖం ఊదుతానని అప్పుడు సరిగా భూమిపూజ మొదలు పెట్టాలని తమ శిష్యులకు ఆదేశించారు విద్యారణ్యులు.
సరిగా శంఖ ధ్వని వినిపించగానే భూమిపూజ మొదలు పెట్టారు శిష్యులు. కాని మళ్ళీ రెండవసారి శంఖ ధ్వని విని శిష్యులకు ఎందుకలా గురువు గారు రెండూ సార్లు ఊదారు అని విద్యారణ్యుల వారి వద్దకు వెళ్ళి అడిగారు.
విద్యారణ్యులవారు అప్పుడు దివ్యదృష్టితో మొదటిసారి శంఖ ధ్వని ఒక జంగము వాడు భిక్ష కోసం (నేటికీ వీరు ఇళ్ళ వద్ద భిక్ష అడిగేటప్పుడు శంఖం ఊదుతారు)ఊదగా వచ్చినదని గ్రహించారు. చాలా బాధపడి వేదవ్యాసుల వారి మాటే నిజమైనది కదా,విధి చాలా బలీయమైనదని నిట్టూర్చారు.
చూసారు కదా ఇదీ జరిగింది.ఇక్కడ మానవప్రయత్న లోపం ఏమైనా జరిగిందా. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలోని సాంఖ్యయోగము లో ఇలా అన్నారు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి (2-47)
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి (2-47)
పని చెయ్యి.కాని ఫలితంపైన ఆసక్తి పెంచుకోకు.అలా అని పని చేయడం ఆపకు.
Tuesday, March 11, 2014
సహనం,ఓర్పు మరియు పట్టుదలలు విజయాన్ని కల్గిస్తాయనడానికి సజీవ ఉదాహరణ - నితిన్
నితిన్...వీరే ఆ సజీవ ఉదాహరణ..సినీతెరపై అడుగుపెట్టింది 2002 లో, చివరిసారిగా విజయం సాధించినది 2004 లో. మళ్ళీ మరో విజయం కోసం 8 సంవత్సరాలు ఆగవలసి వచ్చింది.మధ్యలో ఎన్నో ఆటుపోట్లు...తన ఆరాధ్య హీరో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అంతే...కాని పవన్ కళ్యాణ్ గారికి బలమైన నేపథ్యం ఉంది...నితిన్ గారికి బలమైన నేపథ్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ పరాజయాల కాలంలో రాటుదేలి తన లోపాలను సరిజేసుకుంటూ ఎవరు తన వెంట లేకపోయినా ఓర్పుతో అంతకు మించి సహనం,పట్టుదల లతో 2012 లో ఇష్క్ సినిమాతో విజయం సాధించాడు...తర్వాత గుండె జారి గల్లంతయ్యిందే,హార్ట్ ఎటాక్ లతో విజయాలతో దూసుకెళ్తున్నాడు..ఇప్పుడు విజయాలు ఇస్తున్న మత్తులో పట్టుజారిపోకుండా అత్యంత జాగరూకతతో మరిన్న విజయాలు పొందాలని ఆశిస్తున్నాను.
నేను
వ్యక్తిగతంగా ఏ హీరోకూ అభిమాని కాను.కాని ఏ రంగంలోనైనా ఇటువంటి పట్టుదల,ఓర్పు మరియు సహనములు ఉంటే విజయాలు వెతుక్కుంటూ వస్తాయని నిరూపించిన నితిన్ గారి లాంటి వారిని చూస్తే ఆనందం కలుగుతుంది. ఇంకా ఎందరో ఉన్నారు.ప్రస్తుతానికి వీరి గురించి చెప్పుకోవాలనిపించింది.
కాకతాళీయం ఏంటంటే ఇదే పరిస్థితి చవిచూసిన నితిన్ గారి అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా తన విజయాన్ని నితిన్ లానే 2012 లో గబ్బర్ సింగ్ తో పొందడం.
Thursday, January 30, 2014
Wednesday, January 29, 2014
Friday, January 24, 2014
Wednesday, January 1, 2014
Monday, December 30, 2013
హృదయవాసి రమణులకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
కొందరిపై ఎందుకు ప్రేమ పుడుతుందో తెలియదు..చూడగానే వారికీ,మనకూ జన్మజన్మల సంబంధం ఉందని అనిపిస్తుంది..వారి పేరు వినగానే,వారి రూపం చూడగానే ఏదో తెలియని ఆనందం మనసును ఆక్రమిస్తుంది.అలా నాకు ఫోటో చూడగానే ప్రేమ,ఆరాధన పుట్టినవారిలో స్వామి వివేకానందులు మొదటివారు.
ఇక భగవాన్ రమణులు రెండవవారు.రామకృష్ణులు,శారదామాతలను కూడా చూడగానే ఇలాంటి భావమే కలుగుతుంటుంది.
4వ తరగతి చదువుతున్నప్పుడే(అతిశయోక్తి అనిపించవచ్చు కానీ నిజం) రమణుల ఒక వాక్యం ("నేను" గురించి)ఏదో పుస్తకంలో చదివి మా తాత గారిని అడగడం ఇప్పటికీ గుర్తు వస్తూ ఉంటుంది.
ఇప్పటికీ వీరి పేర్లు ఎవరి నోటైనా అనుకోకుండా విన్నా మనసు తెలియకుండానే ఆ మాటల వైపు వెళ్ళిపోతూంటుంది.
ప్రతిరోజూ ఏదో ఒక సందర్భం లో నా హృదయంలో తిరుగాడే నా హృదయవాసి అయిన భగవాన్ రమణులకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
"భక్తి జ్ఞానమునకు తల్లి"
- భగవాన్ రమణులు
Sunday, December 8, 2013
ఓ మాదిరి తెలివి చాలా కొద్దిగా గణిత పరిజ్ఞానం ఉపయోగించి ఈ ప్రశ్నకు జవాబు ప్రయత్నించండి - సమాధానం
నిన్నటి ప్రశ్న:
మీకు నలుగురు స్నేహితులు ఉన్నారు.
ఆ నలుగురూ ఎప్పుడూ నిజం చెప్తారు.
వారి జీతాలెంతో చెప్పడం వారిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదు.
ఒక వేళ మీ జీతం ఎంత అని అడిగితే చెప్పడం మాకు ఇష్టం లేదంటారు.
వారిలో వారికి కూడా ఒకరి జీతం ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారి జీతాలు ఎవరికీ తెలియనవసరం లేకుండానే వారి జీతాల మొత్తం వారి ద్వారానే కనుక్కోవాలి.
సమాధానం:
నలుగురు వ్యక్తులు a,b,c,d అనుకుందాము. ఒక కాగితం తీసుకొని a తో తన జీతం మొత్తానికి తన ఇష్టమొచ్చినంత కలిపి వ్రాయమనాలి. ఉదాహరణకు a జీతం 15000 అనుకుంటే అతను 547 కలిపాడనుకోండి 15547 వ్రాస్తాడు. ఇలా ఎంత కలిపితే అంత వ్రాస్తాడు. జీతం వ్రాయడు (కాబట్టి తెలిసేందుకు అవకాశం లేదు) కాని కలిపిన మొత్తంతో కలిపి వ్రాస్తాడు. తర్వాత అదే కాగితాన్నిb,c,d లకు ఇచ్చి అధే విధంగా చేయమంటాము. ఇప్పుడు మొత్తము(జీతాల మొత్తము + వాళ్ళు కలిపిన మొత్తము) వస్తుంది. ఇప్పుడు వచ్చిన దాన్లో వాళ్ళు కలిపిన మొత్తాలను తీసివేయమనాలి.ఇప్పుడు మిగిలేదే వాళ్ళ జీతాల మొత్తము.
ఉదాహరణకు a,,b,c.d ల జీతాలు A,B,C,D అనుకొంటే మరియు కలిపిన మొత్తాలు w,x,y,z అనుకొంటే
అందరూ కలిపిన మొత్తం
(A+w) + (B+x) + (C+y) + (D+z) అవుతుంది
ఇందులో మళ్ళీ w,x,y,z లను తీసేస్తే A+B+C+D (అంటే జీతాల మొత్తం) వస్తుంది.
ఇక్కడ వారెంత కలిపారో మనకు తెలియనవసరం లేదు మరియు ముఖ్యంగా వారి జీతాలు కూడా తెలియనవసరం లేదు.
చూసారా ఎంత సులభమో.
వారి జీతాలెంతో చెప్పడం వారిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదు.
ఒక వేళ మీ జీతం ఎంత అని అడిగితే చెప్పడం మాకు ఇష్టం లేదంటారు.
వారిలో వారికి కూడా ఒకరి జీతం ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారి జీతాలు ఎవరికీ తెలియనవసరం లేకుండానే వారి జీతాల మొత్తం వారి ద్వారానే కనుక్కోవాలి.
సమాధానం:
నలుగురు వ్యక్తులు a,b,c,d అనుకుందాము. ఒక కాగితం తీసుకొని a తో తన జీతం మొత్తానికి తన ఇష్టమొచ్చినంత కలిపి వ్రాయమనాలి. ఉదాహరణకు a జీతం 15000 అనుకుంటే అతను 547 కలిపాడనుకోండి 15547 వ్రాస్తాడు. ఇలా ఎంత కలిపితే అంత వ్రాస్తాడు. జీతం వ్రాయడు (కాబట్టి తెలిసేందుకు అవకాశం లేదు) కాని కలిపిన మొత్తంతో కలిపి వ్రాస్తాడు. తర్వాత అదే కాగితాన్నిb,c,d లకు ఇచ్చి అధే విధంగా చేయమంటాము. ఇప్పుడు మొత్తము(జీతాల మొత్తము + వాళ్ళు కలిపిన మొత్తము) వస్తుంది. ఇప్పుడు వచ్చిన దాన్లో వాళ్ళు కలిపిన మొత్తాలను తీసివేయమనాలి.ఇప్పుడు మిగిలేదే వాళ్ళ జీతాల మొత్తము.
ఉదాహరణకు a,,b,c.d ల జీతాలు A,B,C,D అనుకొంటే మరియు కలిపిన మొత్తాలు w,x,y,z అనుకొంటే
అందరూ కలిపిన మొత్తం
(A+w) + (B+x) + (C+y) + (D+z) అవుతుంది
ఇందులో మళ్ళీ w,x,y,z లను తీసేస్తే A+B+C+D (అంటే జీతాల మొత్తం) వస్తుంది.
ఇక్కడ వారెంత కలిపారో మనకు తెలియనవసరం లేదు మరియు ముఖ్యంగా వారి జీతాలు కూడా తెలియనవసరం లేదు.
చూసారా ఎంత సులభమో.
Saturday, December 7, 2013
ఓ మాదిరి తెలివి చాలా కొద్దిగా గణిత పరిజ్ఞానం ఉపయోగించి ఈ ప్రశ్నకు జవాబు ప్రయత్నించండి.
మీకు నలుగురు స్నేహితులు ఉన్నారు.
ఆ నలుగురూ ఎప్పుడూ నిజం చెప్తారు.
వారి జీతాలెంతో చెప్పడం వారిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదు.
ఒక వేళ మీ జీతం ఎంత అని అడిగితే చెప్పడం మాకు ఇష్టం లేదంటారు.
వారిలో వారికి కూడా ఒకరి జీతం ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారి జీతాలు ఎవరికీ తెలియనవసరం లేకుండానే వారి జీతాల మొత్తం వారి ద్వారానే కనుక్కోవాలి.
అందరూ సమాధానం కోసం ప్రయత్నించేందుకు వీలుగా సాయంత్రం వరకు కామెంట్ మాడరేషన్ పెడుతున్నాను.
Friday, December 6, 2013
అరటిపండు తిన్నంత సులభమేనా ఈ ఇంటర్వ్యూ ప్రశ్నకు సమాధానం చెప్పడం?
16 రూపాయలకు "ఎన్ని" అరటిపండ్లు వస్తాయో, "అన్ని" రూపాయలకు 36 అరటిపండ్లు వస్తాయి. ఐతే డజను అరటిపండ్ల ఖరీదెంత?
( వివరణ: ఉదాహరణకు 16 రూపాయలకు "X" అరటిపండ్లు వస్తే, "X" రూపాయలకు 36 అరటిపండ్లు వస్తాయన్న మాట)
అందరూ సమాధానం కోసం ప్రయత్నించేందుకు వీలుగా సాయంత్రం వరకు కామెంట్ మాడరేషన్ పెడుతున్నాను.
Thursday, December 5, 2013
మీ క్రికెట్ పరిజ్ఞానానికి ఒక పరీక్ష (గణిత మరియు ఆట నియమాలకు సంబంధించినది)
మనదేశంలో క్రికెట్ అంటే తెలియనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మరి క్రికెట్ కు సంబంధించిన గణిత శాస్త్రపు ప్రశ్నకు సమాధానం చెప్పండి చూద్దాం.
ప్రశ్న:
9 వికెట్లు పడిపోయాయి.భారత్ తరపున చివరి ఇద్దరు బ్యాట్స్మెన్ ఆడుతున్నారు. ఇద్దరూ చెరి 94 పరుగుల మీద ఉన్నారు. ఇంకా 7 పరుగులు చేస్తే విజయం లభిస్తుంది. ఇక రెండే బంతులు ఉన్నాయి. భారత్ గెలవాలి మరియు ఇద్దరివీ సెంచరీలు కావాలి. ఎలా సాధ్యం అవుతుంది?
కష్టమనుకుంటున్నారా! క్రింది ప్రశ్న చూడండి. పై దానితో పోలిస్తే కొంచెం సులభం.
ఒక వేళ 8 వికెట్లు పడి ఉన్నప్పటి పరిస్థితి ఉంటే ఎలా సాధ్యం అవుతుంది.
ప్రశ్న:
9 వికెట్లు పడిపోయాయి.భారత్ తరపున చివరి ఇద్దరు బ్యాట్స్మెన్ ఆడుతున్నారు. ఇద్దరూ చెరి 94 పరుగుల మీద ఉన్నారు. ఇంకా 7 పరుగులు చేస్తే విజయం లభిస్తుంది. ఇక రెండే బంతులు ఉన్నాయి. భారత్ గెలవాలి మరియు ఇద్దరివీ సెంచరీలు కావాలి. ఎలా సాధ్యం అవుతుంది?
కష్టమనుకుంటున్నారా! క్రింది ప్రశ్న చూడండి. పై దానితో పోలిస్తే కొంచెం సులభం.
ఒక వేళ 8 వికెట్లు పడి ఉన్నప్పటి పరిస్థితి ఉంటే ఎలా సాధ్యం అవుతుంది.
Saturday, November 9, 2013
Thursday, November 7, 2013
చాలా మందికి తెలిసిన ఈ కథ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఈ కథ చాలామంది చదివి ఉండవచ్చు.ఒక నిరుద్యోగి ఒక సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూకు రానూ,పోనూ చార్జీలు ఆ సంస్థే ఇస్తుంది. కాని ఇంటర్వ్యూ సరిగా చేయలేక పోవడం వలన ఆ నిరుద్యోగి ఆ ఉద్యోగం పొందలేకపోయాడు. బయటకు వచ్చేసాడు.ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ బయటకు వచ్చాడు.
ఈ నిరుద్యోగి ఇంకా అక్కడే తిరుగుతుండడం చూసి అతను " ఏం బాబూ!నువ్వు ఎంపిక కాలేదు కదా? ఇంకా ఇక్కడే ఎందుకు తిరుగుతున్నావ్?" అన్నాడు.
దానికి ఆ నిరుద్యోగి "సార్! మీరు రానూ,పోనూ చార్జీలు ఇచ్చారు కదా. మీరు ఇచ్చినదాని కన్నా మా ఊరికి చార్జీలు తక్కువే. అందుకే మిగిలిన డబ్బును మీకు తిరిగి ఇద్దామని ఇక్కడే ఉన్నాను." అన్నాడు.
ఆశ్చర్యచకితుడైన ఆ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ " బాబూ! నువ్వు ఉద్యోగం లో చేరవచ్చు. సబ్జెక్ట్లో (ఉద్యోగం లో) నీకు నేను సహాయం చేయగలను. నీవు నేర్చుకోగలవు. కానీ నిజాయితీ అనేది ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు. అది నీకు ఉంది. చాలా సంతోషం. మా సంస్థలో చేరు" అన్నారు.
ముందే చెప్పినట్లు ఈ కథ చాలామంది చదివి ఉండవచ్చు.
కానీ ఇది జరిగింది ఎక్కడో తెలియనివారి కోసం ఈ టపా.
ఆ నిజాయితీ గల నిరుద్యోగి పేరు తెలియనందుకు క్షమాపణలు.
ఆ సంస్థ : భారతీయ వైజ్ఞానిక సంస్థ (IISc),బెంగళూరు.
ఆ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ : సర్ సి.వి.రామన్ గారు.
రామన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Wednesday, October 2, 2013
నేను ఆచరించిన తర్వాతే మిగతా వాళ్ళ గురించి బాధపడగలను..
జగద్గురువుల చిన్న కథ:
ఆజ్ఞవల్ల బయలుదేరి వెళ్ళారు. పని పూర్తిచేసుకొని నదిదాటి ఇవతలకి వచ్చారు.ఆ తరువాత మనం అందరం
దాటి వచ్చామా లేదా అని లెక్క పెట్టుకుందాం అనుకున్నారు. లెక్కవేయడం మొదలు పెట్టారు. ఒకడు
తగ్గుతున్నాడు. ఒకడు నదిలో కొట్టుకుపోయాడు అని అనుకున్నారు. ఒకాయన దోవన పోతూ అటుగా
వచ్చాడు. విషయం అతనికి చెప్పారు. ఒరేయ్ ఆ పదో వాడివి నువ్వేరా..నిన్ను ఎందుకు విడిచి పెట్టావు?
నువ్వూ ఆలెక్కలోకి వస్తావురా. అందరూ ఉన్నారు అన్నాడు. ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతివాడూ తనని
మాత్రం విడిచి పెడుతున్నాడు. మైకు ముందు కూర్చొని తనని మాత్రం లెక్క వేసుకోకుండా మిగతా వాళ్ళని
ధర్మం ఆచరించడం లేదు అంటున్నాడు ప్రతివాడూ. అందులో నాపాత్ర కూడా ఉన్నది అని ఎవరూ అనుకోవడం
లేదు. నా మటుకు నేను ధర్మాన్నిఆచరిస్తాను అని ప్రతివాడూ అనుకుంటే ఎలా నశించిపోతుంది? ఒక
రథోత్సవంలో త్రాటిని అందరూ పట్టుకొని నడుపుతున్నారు. నా ఒక్కడివల్ల రథం ముందుకు పోతోందా? అని
ప్రతి ఒక్కడూ అనుకొని రథాన్ని వదిలేస్తే రథం ఎలా కదులుతుంది? అలాగే ధర్మాచరణలో కూడా ప్రతి ఒక్కరి
పాత్ర ఉన్నది. కర్తవ్య లోపం నావల్ల కాకూడదు. తండ్రి ధర్మం ఆచరించకుండా కొడుకును చేయడమంటే
కొడుకు ఎలా చేస్తాడు? అలాగే సమాజం విషయంలో కూడా.
Wednesday, September 25, 2013
చెన్నై మిత్రులు(బ్లాగర్లు లేక చెన్నై లో బంధుమిత్రులు ఉన్నవారు) ఎవరైనా ఉంటే సహాయం చేయగలరు.
మిత్రులారా!
మా అబ్బాయి యతీశ్వర్(వయసు 1.5 సంవత్సరాలు) ఆరోగ్య సమస్య రీత్యా చెన్నై నగరములో 1 నుండి 2 నెలలు ఉండవలసి ఉంది. 4000 నుండి 6000 అద్దెలో మైలాపూరు లేక మందవేలి ప్రాంతాలలో అద్దె ఇల్లు (4 గురు సభ్యులకు) ( 1 నుండి 2 నెలలకు) ఏమైనా ఉంటే చెప్పగలరు. ఈ నెలాఖరులోగా ఈ సహాయం వీలైతే చేయగలరు.
Tuesday, September 24, 2013
ఈశావాస్య ఉపనిషత్తు pdf కావలిస్తే download చేసుకోగలరు.
నా "ఉపనిషత్తులు - మన మహోన్నత విజ్ఞానము" బ్లాగులో వ్రాసిన "ఈశావాస్య ఉపనిషత్తు" pdf కావలిస్తే download చేసుకోగలరు.
link: ఈశావాస్య ఉపనిషత్తు(Ishavasya upanishat)
link: ఈశావాస్య ఉపనిషత్తు(Ishavasya upanishat)
Subscribe to:
Posts (Atom)
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...






