సమస్య:
a=1 అనుకొందాం
(a^2 అంటే a square)
ఇప్పుడు రెండు వైపులా a తో గుణిస్తే
a^2 = a
(a^2 - 1) = (a -1)
(a+1)*(a-1) = (a-1)
(a+1) = (a-1)/(a-1)
(a+1) = 1
(1+1) = 1
2 = 1
2 =1 కాదని మనకు తెల్సు. మరి పైన చూపిన దానిలో తప్పు ఎక్కడ ఉందో చెప్పగలరా?
Friday, July 16, 2010
Thursday, July 15, 2010
దేశభక్తి అంటే అవసరమైనప్పుడు మాత్రం చూపేదా? లేక మనలో జీర్ణించుకు పోయుండాలా?
ఇప్పుడు ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్య చదివిన ఒక సంఘటన విషయం నన్ను ఎంతగానో స్పందింపజేసింది.
అదేమిటంటే ఒకసారి స్వామి రామతీర్థ జపాన్లో పర్యటిస్తూ అందులో భాగంగా రైలులో ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణిస్తున్నాడు.స్వామికి మధ్యలో ఆకలి అయ్యి పండ్ల కోసం ఒక స్టేషన్లో దిగి పండ్ల కోసం వెదికాడు.కాని ఎక్కడా దొరకలేదు. అలానే రైలు ఆగిన మరో మూడు స్టేషనులలో ప్రయత్నించాడు కానీ దొరకలేదు.
ఇదంతా గమనిస్తోన్న ఎదుటి సీట్లో కూర్చొని ఉన్న ఒక జపాన్ కార్మికుడు రైలు మరో స్టేషనులో ఆగుతుందనగా రైలు ఆగీఆగకనే దిగివేసి బయటకు పరుగెత్తుకు వెళ్ళి పండ్లు కొనుక్కొనివచ్చి రామతీర్థ గారికి ఇచ్చాడు.రామతీర్థ గారు "ఎందుకంత కష్టం తీసుకొన్నావు?" అంటూ డబ్బు అతని చేతికి ఇవ్వబోగా అతను తీసుకోవడానికి నిరాకరిస్తూ ఒక్క మాట మాత్రం అన్నాడు.
"స్వామీ! మీరు జపాన్ నుండి భారతదేశమునకు తిరిగవెళ్ళిన తర్వాత అక్కడ మీరు జపాన్ లో కనీసం తినడానికి కూడా పండ్లు దొరకలేదని అనకండి.అందుకే నేనిలా చేసాను.అదే మీరు నాకు ఇచ్చే పదివేలు" అన్నాడు.
ఒక చిన్న విషయం దగ్గర కూడా జపాన్ వారి దేశభక్తి ఎలా వెల్లడైందో గమనించారా?
ఇక మన విషయానికి వద్దాం.మనకు దేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడో కానీ లేక ఎక్కడో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడో కాని దేశభక్తి అన్నది గుర్తుకురాదు.
పై సంఘటనలో లాగా మనలో ఎంతమందికి నరనరానా దేశభక్తి జీర్ణించుకుపోయింది?
మనకు ఏదైనా పెద్ద సంఘటన జరిగితే దేశభక్తిని ప్రదర్శిస్తాము తప్ప మన నిత్యజీవితములో దానిని నిజముగా పాటిస్తున్నామా?
మనదేశము లోని కొన్ని కామకుక్కలు ఎంతగా దిగజారి పోయాయంటే మనదేశానికి వచ్చే విదేశీ పర్యాటక మహిళలను బలాత్కరిస్తున్నారు.డబ్బు కోసం ఆ పర్యాటకుల వద్ద యాచిస్తున్నారు.ఎంత చులకన? దీనివలన దేశానికి అంతర్జాతీయముగా ఎంత తలవంపులు వస్తున్నాయో మనకు తెలుసు.దేశభక్తి నిజముగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటారా?
ఈ టపా మనలోని డొల్లతనాన్ని విమర్శిస్తూ వ్రాసిందే కానీ నరనరానా దేశభక్తి నింపుకొన్న సైనికులను,పౌరులను ఉద్దేశించి వ్రాయలేదని గమనించగలరు.
అదేమిటంటే ఒకసారి స్వామి రామతీర్థ జపాన్లో పర్యటిస్తూ అందులో భాగంగా రైలులో ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణిస్తున్నాడు.స్వామికి మధ్యలో ఆకలి అయ్యి పండ్ల కోసం ఒక స్టేషన్లో దిగి పండ్ల కోసం వెదికాడు.కాని ఎక్కడా దొరకలేదు. అలానే రైలు ఆగిన మరో మూడు స్టేషనులలో ప్రయత్నించాడు కానీ దొరకలేదు.
ఇదంతా గమనిస్తోన్న ఎదుటి సీట్లో కూర్చొని ఉన్న ఒక జపాన్ కార్మికుడు రైలు మరో స్టేషనులో ఆగుతుందనగా రైలు ఆగీఆగకనే దిగివేసి బయటకు పరుగెత్తుకు వెళ్ళి పండ్లు కొనుక్కొనివచ్చి రామతీర్థ గారికి ఇచ్చాడు.రామతీర్థ గారు "ఎందుకంత కష్టం తీసుకొన్నావు?" అంటూ డబ్బు అతని చేతికి ఇవ్వబోగా అతను తీసుకోవడానికి నిరాకరిస్తూ ఒక్క మాట మాత్రం అన్నాడు.
"స్వామీ! మీరు జపాన్ నుండి భారతదేశమునకు తిరిగవెళ్ళిన తర్వాత అక్కడ మీరు జపాన్ లో కనీసం తినడానికి కూడా పండ్లు దొరకలేదని అనకండి.అందుకే నేనిలా చేసాను.అదే మీరు నాకు ఇచ్చే పదివేలు" అన్నాడు.
ఒక చిన్న విషయం దగ్గర కూడా జపాన్ వారి దేశభక్తి ఎలా వెల్లడైందో గమనించారా?
ఇక మన విషయానికి వద్దాం.మనకు దేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడో కానీ లేక ఎక్కడో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడో కాని దేశభక్తి అన్నది గుర్తుకురాదు.
పై సంఘటనలో లాగా మనలో ఎంతమందికి నరనరానా దేశభక్తి జీర్ణించుకుపోయింది?
మనకు ఏదైనా పెద్ద సంఘటన జరిగితే దేశభక్తిని ప్రదర్శిస్తాము తప్ప మన నిత్యజీవితములో దానిని నిజముగా పాటిస్తున్నామా?
మనదేశము లోని కొన్ని కామకుక్కలు ఎంతగా దిగజారి పోయాయంటే మనదేశానికి వచ్చే విదేశీ పర్యాటక మహిళలను బలాత్కరిస్తున్నారు.డబ్బు కోసం ఆ పర్యాటకుల వద్ద యాచిస్తున్నారు.ఎంత చులకన? దీనివలన దేశానికి అంతర్జాతీయముగా ఎంత తలవంపులు వస్తున్నాయో మనకు తెలుసు.దేశభక్తి నిజముగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటారా?
ఈ టపా మనలోని డొల్లతనాన్ని విమర్శిస్తూ వ్రాసిందే కానీ నరనరానా దేశభక్తి నింపుకొన్న సైనికులను,పౌరులను ఉద్దేశించి వ్రాయలేదని గమనించగలరు.
సంఖ్యలను లెక్కించడంలో గ్రీకు,రోమనులకన్నా ముందున్న ప్రాచీన భారతదేశం
ప్రాచీన భారతీయుల గణితప్రతిభ క్రింద చూడండి.
1.దశాంశపద్దతిని కనుగొన్నది భారతీయులే.(అనగా 0 నుండి 9 వరకు గల అంకెలతో లెక్కించు పద్దతి)
2.యజుర్వేదం 17వ అధ్యాయం,2వ మంత్రంలో పెర్కొనబడ్డ సంఖ్యల క్రమం
ఏక-1
దశ-10
శత-100
సహస్ర- 1000
ఆయుత-10000- పదివేలు
నీయుత- 100000-లక్ష
ప్రయుత- 1000000- పదిలక్షలు
అర్బుత- 10000000- కోటి
న్యార్బుద-100000000- పదికోట్లు
సముద్ర- 1000000000- వందకోట్లు
మధ్య- 10000000000- వేయికోట్లు
అంత- 100000000000- పదివేలకోట్లు
పరార్థ- 1000000000000- లక్షకోట్లు
క్రీ.పూ మొదటి శతాబ్దం నాటి "లలిత విస్తార"గ్రంథం లో "తల్లక్షణ" కొలమానం 10 ఘాతం 53(1 తర్వాత 53 సున్నాలు).
ప్రాచీన భారత జైనమతగ్రంథం ఐన "అనుయోగద్వార" లో 1 తర్వాత 140 సున్నాల వరకు గల సంఖ్య చెప్పబడింది.
3.ఆ కాలం నాటికి గ్రీకుల అతి పెద్ద సంఖ్య 10000(మీరియడ్).
4.రోమనులకు తెలిసిన పెద్ద సంఖ్య 1000(మిలి).
ఇక సున్న కనుగొన్నది మన భారతీయుడైన "ఆర్యభట" అని అందరికీ తెలుసు.
ఇతర గణిత ప్రక్రియలకు వస్తే నా గత టపాలైన "ఆర్యభటీయం","భాస్కరాచార్యుడు","ఆర్యభట" లలో వ్రాసాను.
"భారతీయులకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము.వారే సులభంగా లెక్కించే దశాంశపద్దతిని ప్రపంచానికి అందించారు.అదే గనుక లేకపోతే నేడు ఎన్నో విజ్ఞాన ఆవిష్కరణలు సాధ్యమయ్యేవి కావు". - అల్బర్ట్ ఐన్స్టీన్
1.దశాంశపద్దతిని కనుగొన్నది భారతీయులే.(అనగా 0 నుండి 9 వరకు గల అంకెలతో లెక్కించు పద్దతి)
2.యజుర్వేదం 17వ అధ్యాయం,2వ మంత్రంలో పెర్కొనబడ్డ సంఖ్యల క్రమం
ఏక-1
దశ-10
శత-100
సహస్ర- 1000
ఆయుత-10000- పదివేలు
నీయుత- 100000-లక్ష
ప్రయుత- 1000000- పదిలక్షలు
అర్బుత- 10000000- కోటి
న్యార్బుద-100000000- పదికోట్లు
సముద్ర- 1000000000- వందకోట్లు
మధ్య- 10000000000- వేయికోట్లు
అంత- 100000000000- పదివేలకోట్లు
పరార్థ- 1000000000000- లక్షకోట్లు
క్రీ.పూ మొదటి శతాబ్దం నాటి "లలిత విస్తార"గ్రంథం లో "తల్లక్షణ" కొలమానం 10 ఘాతం 53(1 తర్వాత 53 సున్నాలు).
ప్రాచీన భారత జైనమతగ్రంథం ఐన "అనుయోగద్వార" లో 1 తర్వాత 140 సున్నాల వరకు గల సంఖ్య చెప్పబడింది.
3.ఆ కాలం నాటికి గ్రీకుల అతి పెద్ద సంఖ్య 10000(మీరియడ్).
4.రోమనులకు తెలిసిన పెద్ద సంఖ్య 1000(మిలి).
ఇక సున్న కనుగొన్నది మన భారతీయుడైన "ఆర్యభట" అని అందరికీ తెలుసు.
ఇతర గణిత ప్రక్రియలకు వస్తే నా గత టపాలైన "ఆర్యభటీయం","భాస్కరాచార్యుడు","ఆర్యభట" లలో వ్రాసాను.
"భారతీయులకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము.వారే సులభంగా లెక్కించే దశాంశపద్దతిని ప్రపంచానికి అందించారు.అదే గనుక లేకపోతే నేడు ఎన్నో విజ్ఞాన ఆవిష్కరణలు సాధ్యమయ్యేవి కావు". - అల్బర్ట్ ఐన్స్టీన్
వర్గాలు
మహోన్నత భారతదేశం
Wednesday, July 14, 2010
నేను నా భార్యను అంత ప్రేమగా చూడడం లేదేమో!
టపా పేరు చూసి నాకు భార్య ఉందని అనుకొనేరు. నేను ఇంకా బ్రహ్మచారినే. ఇక్కడ నా స్నేహితుడి విషయం లో జరిగిన సంఘటనను వ్రాస్తున్నాను.
సరే ఇక విషయానికి వస్తాను.
నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. పేరు చెప్పడం లేదు. ఆ అబ్బాయికి పెళ్ళై రెండేళ్ళు అవుతోంది. నా స్నేహితుడిది ప్రేమవివాహం. పెద్దలను ఒప్పించే చేసుకొన్నారు.ఇప్పుడు తన భార్య ఎనిమిదవ నెల గర్భవతి. ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఆ అమ్మాయి గర్భవతి అని రూఢి (pregnancy conform) అయినప్పుడు జరిగింది.
ఆ సమయంలో ఆ అమ్మాయి పుట్టింటికి ఏదో పని మీద వెళ్ళింది. అక్కడ ఒంట్లో నలతగా ఉంటే వైద్యుని వద్దకు వెళ్తే ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది. పక్కనే అమ్మాయి వాళ్ళ అమ్మ ఉండడం చేత వాళ్ళ అమ్మ కూడా సంతోషించింది. ఆ అమ్మాయి విషయం చెబుదామని నా స్నేహితునికి ఫోన్ చేయబోతోంది. ఇంతలో చెల్లి ఆసుపత్రికి వచ్చిందని తెల్సుకొన్న ఆ అమ్మాయి అన్నయ్యలు ఇద్దరూ ఏమయిందోనన్న అదుర్దా తో ఆసుపత్రికి వచ్చారు. విషయం వాళ్ళు కూడా తెల్సుకొని ఆనందపడ్డారు.నా మిత్రునికి ఫోన్ కలవడం లేదు. చాలాసేపు ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు.
ఇంట్లో అమ్మాయి వాళ్ళ నాన్న కు విషయం తెల్సి ఆనందించి అల్లుడికి (నా మిత్రునికి) ఫోన్ చేస్తే ఫోన్ కలిసింది. విషయం చెప్తే నా స్నేహితుడు కూడా ఎంతో సంతోషం లో మునిగిపోయాడు.
తర్వాత అమ్మాయి కూడా వెంటనే వాళ్ళ నాన్న దగ్గరి నుండి ఫోన్ అందుకొని విషయం చెప్పింది.
ఫోన్ పెట్టేసిన తర్వాత పక్కనే ఉన్న మరో స్నేహితుడు ఊర్కే ఉండలేక " మొదట నీకు కదా చెప్పాలి. వారికి మొదట ఎందుకు చెప్పింది?" అంటూ ఏవేవో మాటలతో రెచ్చగొట్టాడు.
అందుకు వీడు "అలా ఏం ఉండదు. ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అయినప్పుడు వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉందంట. అలా తెల్సుంటుంది" అన్నాడు.
అందరికీ ఫోన్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకొంటున్నాడు. అలానే అమ్మాయి అన్నయ్యలకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పబోతే వారు మాకు తెల్సు బావా! శుభాకాంక్షలు (congratulations) అన్నారు.
ఫోన్ పెట్టేసాక పక్కన ఉన్న స్నేహితుడు రెచ్చగొట్టే ధోరణి లో "చెప్పా కదా! మొదట మీఆవిడ నీకు చెప్పకుండా అందరికీ చెప్పేసింది" అన్నాడు. ఇలా అన్న స్నేహితుడే ఇంతకు ముందు వీరి పెళ్ళికి ఎంతో
సహాయపడ్డాడు. వీరు ప్రేమించుకొంటున్నప్పుడు చాలా సహాయంగా ఉన్నాడు. ఆ కృతజ్ఞత తో నా మిత్రుడు ఆ అబ్బాయి అలా అంటున్నా ఏమీ అనలేదు. లేకుంటే " నా సంసారం విషయం నీకెందుకు?" అంటూ క్లాస్ పీకేవాడు. కాని ఎంతో సహాయం చేసినందు వలన ఏమీ అనలేకపోయాడు. అతను రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఇంతకు ముందు ఆ అబ్బాయి అలా ఎప్పుడూ మాట్లాడలేదు. మొదటిసారిగా అలా మాట్లాడుతున్నాడు. తన భార్య గురించి తనకు బాగా తెల్సు. ఆ అబ్బాయినీ ఏం అనలేకపోతున్నాడు. కాని మనసులో కొద్దిగా ఇతనికీ బాధ కల్గింది.
అంతకు ముందు నాకు ప్రెగ్నెన్సీ విషయం చెప్పి ఆనందం పంచుకోవడానికి ఫోన్ చేసున్నాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి " రే సూరీ(సురేష్)! నేను తనను(అమ్మాయిని) అంత ప్రేమగా చూసుకోవడం లేదేమో.వాడు మాకు చాలా సహాయం చేసాడు కదా. ఇప్పుడు ఇలా ఎందుకు రెచ్చగొట్టేలా మాట్లాడాడు." అన్నాడు. అబ్బాయి గొంతులో బాధ కనిపించింది.
"ఎందుకురా! ఇప్పుడే కదా విషయం చెప్పి సంతోషించావ్. మళ్ళీ ఈ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుకు బాధపడుతున్నావ్?" అన్నాను. వాడు ఇంకో స్నేహితుడు అన్న విషయాలన్నీ నాకు చెప్పాడు.నేనేదో సర్దిచెప్పాననుకోండి.
తర్వాత అమ్మాయికి మామూలుగా ఫోన్ చేసాడు. కాని అప్పటికే అమ్మాయి కూడా మొదట తన భర్త( నా మిత్రుడు) కి విషయం చెప్పకపోయానే అనే బాధలో ఉంది. ఏడుస్తూ ఉంది.ఈ అబ్బాయి ఫోన్ చేసి ఎందుకు ఏడుస్తున్నావని అంటే బాధపడుతూ విషయం మొత్తం చెప్పి సారీ చెప్పింది.
తర్వాత ఈ అబ్బాయి కూడా ఇక్కడ జరిగిన విషయం ( నాకు ఫోన్ చేసిన విషయం కూడా) చెప్పేసాడు. మొదట అమ్మాయికి కోపం వచ్చినా ఆ అబ్బాయి నాతో అన్న మాట(నేను తనను(అమ్మాయిని) అంత ప్రేమగా చూసుకోవడం లేదేమో) తెల్సుకొని ఇలాంటి సున్నితమైన అంశాలలో కూడా ఇంత పాజిటివ్ గా ఆలోచించాడని చాలా సంతోషించింది.
ఇలా కథ సుఖాంతమయ్యింది.
నాకు అనిపించింది ఏమంటే భార్యాభర్తలు ఒకరి వలన ఒకరికి తెలిసో,తెలియకో బాధ కల్గినప్పుడు వీరిలా మనసు విప్పి అహం(Ego)లు లేకుండా మాట్లాడుకొంటే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి కదా అని.
ఇదండీ జరిగింది. అందరితో పంచుకోవాలనిపించింది. ఇలా బయట పెట్టాను.
సరే ఇక విషయానికి వస్తాను.
నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. పేరు చెప్పడం లేదు. ఆ అబ్బాయికి పెళ్ళై రెండేళ్ళు అవుతోంది. నా స్నేహితుడిది ప్రేమవివాహం. పెద్దలను ఒప్పించే చేసుకొన్నారు.ఇప్పుడు తన భార్య ఎనిమిదవ నెల గర్భవతి. ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఆ అమ్మాయి గర్భవతి అని రూఢి (pregnancy conform) అయినప్పుడు జరిగింది.
ఆ సమయంలో ఆ అమ్మాయి పుట్టింటికి ఏదో పని మీద వెళ్ళింది. అక్కడ ఒంట్లో నలతగా ఉంటే వైద్యుని వద్దకు వెళ్తే ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది. పక్కనే అమ్మాయి వాళ్ళ అమ్మ ఉండడం చేత వాళ్ళ అమ్మ కూడా సంతోషించింది. ఆ అమ్మాయి విషయం చెబుదామని నా స్నేహితునికి ఫోన్ చేయబోతోంది. ఇంతలో చెల్లి ఆసుపత్రికి వచ్చిందని తెల్సుకొన్న ఆ అమ్మాయి అన్నయ్యలు ఇద్దరూ ఏమయిందోనన్న అదుర్దా తో ఆసుపత్రికి వచ్చారు. విషయం వాళ్ళు కూడా తెల్సుకొని ఆనందపడ్డారు.నా మిత్రునికి ఫోన్ కలవడం లేదు. చాలాసేపు ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు.
ఇంట్లో అమ్మాయి వాళ్ళ నాన్న కు విషయం తెల్సి ఆనందించి అల్లుడికి (నా మిత్రునికి) ఫోన్ చేస్తే ఫోన్ కలిసింది. విషయం చెప్తే నా స్నేహితుడు కూడా ఎంతో సంతోషం లో మునిగిపోయాడు.
తర్వాత అమ్మాయి కూడా వెంటనే వాళ్ళ నాన్న దగ్గరి నుండి ఫోన్ అందుకొని విషయం చెప్పింది.
ఫోన్ పెట్టేసిన తర్వాత పక్కనే ఉన్న మరో స్నేహితుడు ఊర్కే ఉండలేక " మొదట నీకు కదా చెప్పాలి. వారికి మొదట ఎందుకు చెప్పింది?" అంటూ ఏవేవో మాటలతో రెచ్చగొట్టాడు.
అందుకు వీడు "అలా ఏం ఉండదు. ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అయినప్పుడు వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉందంట. అలా తెల్సుంటుంది" అన్నాడు.
అందరికీ ఫోన్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకొంటున్నాడు. అలానే అమ్మాయి అన్నయ్యలకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పబోతే వారు మాకు తెల్సు బావా! శుభాకాంక్షలు (congratulations) అన్నారు.
ఫోన్ పెట్టేసాక పక్కన ఉన్న స్నేహితుడు రెచ్చగొట్టే ధోరణి లో "చెప్పా కదా! మొదట మీఆవిడ నీకు చెప్పకుండా అందరికీ చెప్పేసింది" అన్నాడు. ఇలా అన్న స్నేహితుడే ఇంతకు ముందు వీరి పెళ్ళికి ఎంతో
సహాయపడ్డాడు. వీరు ప్రేమించుకొంటున్నప్పుడు చాలా సహాయంగా ఉన్నాడు. ఆ కృతజ్ఞత తో నా మిత్రుడు ఆ అబ్బాయి అలా అంటున్నా ఏమీ అనలేదు. లేకుంటే " నా సంసారం విషయం నీకెందుకు?" అంటూ క్లాస్ పీకేవాడు. కాని ఎంతో సహాయం చేసినందు వలన ఏమీ అనలేకపోయాడు. అతను రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఇంతకు ముందు ఆ అబ్బాయి అలా ఎప్పుడూ మాట్లాడలేదు. మొదటిసారిగా అలా మాట్లాడుతున్నాడు. తన భార్య గురించి తనకు బాగా తెల్సు. ఆ అబ్బాయినీ ఏం అనలేకపోతున్నాడు. కాని మనసులో కొద్దిగా ఇతనికీ బాధ కల్గింది.
అంతకు ముందు నాకు ప్రెగ్నెన్సీ విషయం చెప్పి ఆనందం పంచుకోవడానికి ఫోన్ చేసున్నాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి " రే సూరీ(సురేష్)! నేను తనను(అమ్మాయిని) అంత ప్రేమగా చూసుకోవడం లేదేమో.వాడు మాకు చాలా సహాయం చేసాడు కదా. ఇప్పుడు ఇలా ఎందుకు రెచ్చగొట్టేలా మాట్లాడాడు." అన్నాడు. అబ్బాయి గొంతులో బాధ కనిపించింది.
"ఎందుకురా! ఇప్పుడే కదా విషయం చెప్పి సంతోషించావ్. మళ్ళీ ఈ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుకు బాధపడుతున్నావ్?" అన్నాను. వాడు ఇంకో స్నేహితుడు అన్న విషయాలన్నీ నాకు చెప్పాడు.నేనేదో సర్దిచెప్పాననుకోండి.
తర్వాత అమ్మాయికి మామూలుగా ఫోన్ చేసాడు. కాని అప్పటికే అమ్మాయి కూడా మొదట తన భర్త( నా మిత్రుడు) కి విషయం చెప్పకపోయానే అనే బాధలో ఉంది. ఏడుస్తూ ఉంది.ఈ అబ్బాయి ఫోన్ చేసి ఎందుకు ఏడుస్తున్నావని అంటే బాధపడుతూ విషయం మొత్తం చెప్పి సారీ చెప్పింది.
తర్వాత ఈ అబ్బాయి కూడా ఇక్కడ జరిగిన విషయం ( నాకు ఫోన్ చేసిన విషయం కూడా) చెప్పేసాడు. మొదట అమ్మాయికి కోపం వచ్చినా ఆ అబ్బాయి నాతో అన్న మాట(నేను తనను(అమ్మాయిని) అంత ప్రేమగా చూసుకోవడం లేదేమో) తెల్సుకొని ఇలాంటి సున్నితమైన అంశాలలో కూడా ఇంత పాజిటివ్ గా ఆలోచించాడని చాలా సంతోషించింది.
ఇలా కథ సుఖాంతమయ్యింది.
నాకు అనిపించింది ఏమంటే భార్యాభర్తలు ఒకరి వలన ఒకరికి తెలిసో,తెలియకో బాధ కల్గినప్పుడు వీరిలా మనసు విప్పి అహం(Ego)లు లేకుండా మాట్లాడుకొంటే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి కదా అని.
ఇదండీ జరిగింది. అందరితో పంచుకోవాలనిపించింది. ఇలా బయట పెట్టాను.
Tuesday, July 13, 2010
పరమశివుడి నటరాజతాండవంలో వెలువడిన శబ్దాలు ఇవే!

మన అందరికీ తెలుసు పాణిని అనే మహాఋషి సంస్కృత వ్యాకరణాన్నిరచించాడని. పరమశివుడు నటరాజుగా నాట్యం చేసేప్పుడు పాణిని మహర్షి అప్పుడు ఆ నాట్యంలో పుట్టినశబ్దాలను గ్రహించి వ్యాకరణాన్ని వ్రాసాడు. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. సాక్షాత్ పరమశివుడు నాట్యం చేస్తున్నప్పుడు వచ్చిన ఆ శబ్దాలేంటో తెల్సుకోవాలనే ఉత్సుకత చాలామందికి ఉంటుంది కదా. ఆ శబ్దాలేంటో చూద్దామా!
'అఇఉణ్, ఋఌక్, ఏఓఙ్, ఐఔచ్, హయవరట్, లణ్, ఞమఙణనమ్, ఝభఞ్, ఘఢధష్, జబగడదశ్, ఖఫఛఠథచటతవ్, కపయ్, శషసర్, హల్'
ఈ పదునాలుగు శబ్దాలనూ పదునాలుగు సూత్రాలు గా పాణిని మహర్షి గ్రహించి సంస్కృత వ్యాకరణాన్ని రూపొందించాడు, ఈ 14 సూత్రాలను మాహేశ్వరసూత్రాలు అంటారు.
అచ్చులకు ఆకారము మొదటిది. ఈ మాహేశ్వర సూత్రాలలో 'అ' అనేది మొదటవది. 'హల్' చివరిది. వీనిమధ్యలో ఇమిడిఉన్న అచ్చులనూ, హల్లులనూ 'అల్' అనేది సూచిస్తుంది. 'అలోంత్యస్య' అనేదొక పాణినిసూత్రం.
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి అసాధారణ జ్ఞాపక శక్తి మనకు ఆశ్చర్యం కల్గించక మానదు

"రామాయణ కల్పవృక్షం", "వేయిపడగలు" వ్రాసిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలియని తెలుగువారు ఉండరు. వారి అత్యద్భుత అసాధారణ జ్ఞాపకశక్తి ని తెల్పే క్రింది సంఘటన చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.
అవి వారు రామాయణ కల్పవృక్షం రచిస్తున్న రోజులు. విశ్వనాథ గారు చెప్తుంటే వారి కొడుకులు వ్రాసేవారు. ఒక రోజు చూసుకొంటే 32 వ కాగితం నుండి 72 వ కాగితం వరకు కనిపించలేదు. ఇల్లంతా వెదికారు. కానీ కనబడలేదు. వారికి తమ తండ్రి గారైన విశ్వనాథ గారంటే చాలా భయభక్తులు ఉండేవి. అందువలన ఈ విషయం చెప్పడానికి సాహసించలేదు. గ్రంథం వ్రాయడం పూర్తయింది. ఇక ముద్రణకు వెళ్ళాలి. ఇక తప్పదనుకొని విశ్వనాథ గారికి చెప్పారు.
అందుకు విశ్వనాథ గారు " అందులో బాధపడాల్సింది ఏం లేదు" అంటూ మళ్ళీ పూర్తిగా కనబడకుండా పోయిన 40 కాగితాలలో ఉన్నదంతా చెప్పేసారు.
తర్వాత ఇంట్లో ఇంతకుముందు కనబడకపోయిన 32 నుండి 72 వరకు 40 కాగితాలు దొరికాయి.
అత్యంత ఆశ్చర్యకరం గా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా కనబడకుండా పోయిన కాగితాలలోని విషయం క్రొత్తగా మళ్ళీ చెప్పబడిన కాగితాలలో ఉంది. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా పొల్లుపోలేదు,తప్పు లేదు.
ఇంత అసాధారణ జ్ఞాపకశక్తి మనకు ఆశ్చర్యం కల్గించకమానదు.
Monday, July 12, 2010
నేను హిందువును, అతడు ముస్లిం ఇంకొకతను క్రిస్టియన్ ఐనంత మాత్రాన కొట్టుకోవాలా? తిట్టుకోవాలా?
మనం అందరమూ చదువుకొన్నవాళ్ళము. లోకజ్ఞానము ఇంతో అంతో కలిగినవాళ్ళము. కాని మనము కూడా అనాగరికులలాగా మతము పేరుతో గొడవలు పడడము ఎంతవరకు సమంజసం?
ఎవరి మతము వారికి ప్రియము. ఆ ప్రియత్వము అనేది ఇతరమతాలను ద్వేషించకుండా ఉన్నంతవరకే బాగుంటుంది. ప్రత్యేకముగా ఏదో ఒక మతాన్ని లక్ష్యము చేసుకొని ఎప్పుడూ దానిపైనే బురద చల్లడానికి ప్రయత్నించడం సమంజసము కాదని నా వ్యక్తిగత అభిప్రాయము.
ఎవరి మతాలను వారు పొగడుకుంటూ, వారి మతాల గొప్పతనం గురించి కావాలనుకొంటే వారు వ్రాసుకోవచ్చు. అప్పుడు ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండవు. అలా కాకుండా ఇతర మతాల లోటుపాట్ల గురించి వాదించుకోనవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం వాదించుకున్నంతమాత్రాన లేక వాటి గురించి గొడవ పడినంత మాత్రాన ఆయా మతధర్మాలు కాని, ఆచారసాంప్రదాయాలు కాని ఇసుమంతైనా మారవు కదా. ఊరికే మన మధ్య భేధాభిప్రాయాలు రావడం, వ్యక్తిగత కక్ష్యలు ఏర్పడడం( అసలు కనీసం ముఖపరిచయాలు కూడా లేకుండానే ) తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు.
కొందరి తిండి లేదని, బట్టలు లేవని, ఇల్లు లేదని బాధ. ఈ మూడూ ఉన్న మనకు అభిప్రాయప్రకటన, వాక్స్వాతంత్రము పేరుతో వాదోపవాదాల బాధ. మొత్తానికి మనకు సౌలభ్యాలు ఎన్ని ఉన్నా ఏదో ఒక బాధను మెడకు గుదిబండలా తగిలించుకొంటే తప్ప మనకు జిల తీరదనుకొంటా.
నేనొక హిందువును. నా మతధర్మాలు నేను పాటిస్తాను. నాకు ముస్లిములు, క్రైస్తవులలో కూడా మంచి స్నేహితులున్నారు. మేము ఎవరి మతధర్మాలు వారు పాటిస్తాము. మా మత ధర్మాల గురించి, ఆచారసాంప్రదాయాల గురించి ఒకరికొకరు చెప్పుకొంటాము. కొత్త విషయాలు తెలుసుకొని ఆనందిస్తాము.
నాకు సమీర్ అనే ముస్లిం స్నేహితుడున్నాడు. భగవద్గీత గురించి అతను, ఖురాన్ గురించి నేను అతడిని తెల్సుకొంటుంటాము. ఉన్నట్టుండి అతను జ్ఞానయోగం అంటే ఏంటని అడుగుతాడు. నాకు తెలిసింది చెప్తాను. అలానే నాకూ అతని మతధర్మాలు గురించి నాకు చెప్తుంటాడు. అలానే ఫణి అనే క్రైస్తవ స్నేహితునితో కూడా ఇటువంటి సంబంధాలే ఉన్నాయి. మాకు ఎప్పుడూ మామా మతాల విషయంలో గొడవలు కానీ, వాదోపవాదాలు కానీ రాలేదు.
ఒకరి పండుగలకు మరొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటాము. అంతవరకే. ఏ విషయములోనైనా మా మధ్య భేధాభిప్రాయాలు ఉండవచ్చు. కాని మా మతాల విషయాలలో, కుటుంబ విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉంటాము. ఎందుకంటే మత విషయాలు, కుటుంబవిషయాలు అత్యంత సున్నితమైనవని మాకు తెలుసు. వాటి విషయములో ఒక సారి అభిప్రాయభేధాలు గనుక వస్తే జీవితమంతా బాధపడవలసి వస్తుందని మాకు తెలుసు. అలా మా స్నేహాన్ని నిలుపుకొంటున్నాము.
అందరికీ తెలుసు వాదోపవాదాలు మనసుకు ఎంత అశాంతికి గురిచేస్తాయో. కాని వాదాలను వదలలేకుండా పోతున్నారు.
ఫలానా రాముడో లేక మహమ్మదో లేక ఏసుక్రీస్తో, వీరి గురించి మనం ఎందుకు పోట్లాడుకోవాలి? ఆయా మతాలవారు వీరిని పూజిస్తారు. వీరి వ్యక్తిత్వాలతో పోలిస్తే మన వ్యక్తిత్వాలు ఏ మూలకు? వారున్నరో లేదో మనకు ఎందుకు? ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. కాని వారున్నారని, వారు తమ వ్యక్తిత్వాలతో, జ్ఞానంతో, ప్రవర్తనతో సమాజాలను ప్రభావితం చేసారని పెద్దలు చెబుతారు. అలాంటప్పుడు వారు భోధించిన, ఆచరించి చూపిన విషయాలను మనకు నచ్చితే అనుసరిద్దాము. నచ్చకపోతే వద్దు. అంతేకాని వారిని దూషిస్తూ, మనలో మనం వారి పేరుపై పోట్లాడుకొంటూ మనం ఎందుకు మనశ్శాంతిని పోగొట్టుకోవాలి? అవసరమా?
ఈ బ్లాగులు, కంప్యూటర్లు, ఆంగ్లము ఏమీ తెలియని గ్రామాల ప్రజలే పరమతసహనముతో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకొంటూ ఆనందముగా ఉంటున్నారు. ఏ మతపండుగ వచ్చినా అందరూ కలిసి జరుపుకొంటూ సంతోషముగా ఉంటున్నారు. కాని ఇవన్నీ తెలిసిన మనం ఒకరికొకరు దుమ్మెత్తిపోసుకొంటున్నాము. నిజమే కదా?
చివరిగా ఒక మాట. తప్పు మతం పేరుతో చేసే తప్పులు చేసే మనుషులదే కాని, మతానిది ఎన్నటికీ కానేరదు.
ఇకనైనా మనము మతాల పేరుతో కువిమర్శలకు, వ్యక్తిగత విమర్శలకు దిగకుండా ఉండాలని నా అభిలాష.
ఎవరి మతము వారికి ప్రియము. ఆ ప్రియత్వము అనేది ఇతరమతాలను ద్వేషించకుండా ఉన్నంతవరకే బాగుంటుంది. ప్రత్యేకముగా ఏదో ఒక మతాన్ని లక్ష్యము చేసుకొని ఎప్పుడూ దానిపైనే బురద చల్లడానికి ప్రయత్నించడం సమంజసము కాదని నా వ్యక్తిగత అభిప్రాయము.
ఎవరి మతాలను వారు పొగడుకుంటూ, వారి మతాల గొప్పతనం గురించి కావాలనుకొంటే వారు వ్రాసుకోవచ్చు. అప్పుడు ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండవు. అలా కాకుండా ఇతర మతాల లోటుపాట్ల గురించి వాదించుకోనవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం వాదించుకున్నంతమాత్రాన లేక వాటి గురించి గొడవ పడినంత మాత్రాన ఆయా మతధర్మాలు కాని, ఆచారసాంప్రదాయాలు కాని ఇసుమంతైనా మారవు కదా. ఊరికే మన మధ్య భేధాభిప్రాయాలు రావడం, వ్యక్తిగత కక్ష్యలు ఏర్పడడం( అసలు కనీసం ముఖపరిచయాలు కూడా లేకుండానే ) తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు.
కొందరి తిండి లేదని, బట్టలు లేవని, ఇల్లు లేదని బాధ. ఈ మూడూ ఉన్న మనకు అభిప్రాయప్రకటన, వాక్స్వాతంత్రము పేరుతో వాదోపవాదాల బాధ. మొత్తానికి మనకు సౌలభ్యాలు ఎన్ని ఉన్నా ఏదో ఒక బాధను మెడకు గుదిబండలా తగిలించుకొంటే తప్ప మనకు జిల తీరదనుకొంటా.
నేనొక హిందువును. నా మతధర్మాలు నేను పాటిస్తాను. నాకు ముస్లిములు, క్రైస్తవులలో కూడా మంచి స్నేహితులున్నారు. మేము ఎవరి మతధర్మాలు వారు పాటిస్తాము. మా మత ధర్మాల గురించి, ఆచారసాంప్రదాయాల గురించి ఒకరికొకరు చెప్పుకొంటాము. కొత్త విషయాలు తెలుసుకొని ఆనందిస్తాము.
నాకు సమీర్ అనే ముస్లిం స్నేహితుడున్నాడు. భగవద్గీత గురించి అతను, ఖురాన్ గురించి నేను అతడిని తెల్సుకొంటుంటాము. ఉన్నట్టుండి అతను జ్ఞానయోగం అంటే ఏంటని అడుగుతాడు. నాకు తెలిసింది చెప్తాను. అలానే నాకూ అతని మతధర్మాలు గురించి నాకు చెప్తుంటాడు. అలానే ఫణి అనే క్రైస్తవ స్నేహితునితో కూడా ఇటువంటి సంబంధాలే ఉన్నాయి. మాకు ఎప్పుడూ మామా మతాల విషయంలో గొడవలు కానీ, వాదోపవాదాలు కానీ రాలేదు.
ఒకరి పండుగలకు మరొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటాము. అంతవరకే. ఏ విషయములోనైనా మా మధ్య భేధాభిప్రాయాలు ఉండవచ్చు. కాని మా మతాల విషయాలలో, కుటుంబ విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉంటాము. ఎందుకంటే మత విషయాలు, కుటుంబవిషయాలు అత్యంత సున్నితమైనవని మాకు తెలుసు. వాటి విషయములో ఒక సారి అభిప్రాయభేధాలు గనుక వస్తే జీవితమంతా బాధపడవలసి వస్తుందని మాకు తెలుసు. అలా మా స్నేహాన్ని నిలుపుకొంటున్నాము.
అందరికీ తెలుసు వాదోపవాదాలు మనసుకు ఎంత అశాంతికి గురిచేస్తాయో. కాని వాదాలను వదలలేకుండా పోతున్నారు.
ఫలానా రాముడో లేక మహమ్మదో లేక ఏసుక్రీస్తో, వీరి గురించి మనం ఎందుకు పోట్లాడుకోవాలి? ఆయా మతాలవారు వీరిని పూజిస్తారు. వీరి వ్యక్తిత్వాలతో పోలిస్తే మన వ్యక్తిత్వాలు ఏ మూలకు? వారున్నరో లేదో మనకు ఎందుకు? ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. కాని వారున్నారని, వారు తమ వ్యక్తిత్వాలతో, జ్ఞానంతో, ప్రవర్తనతో సమాజాలను ప్రభావితం చేసారని పెద్దలు చెబుతారు. అలాంటప్పుడు వారు భోధించిన, ఆచరించి చూపిన విషయాలను మనకు నచ్చితే అనుసరిద్దాము. నచ్చకపోతే వద్దు. అంతేకాని వారిని దూషిస్తూ, మనలో మనం వారి పేరుపై పోట్లాడుకొంటూ మనం ఎందుకు మనశ్శాంతిని పోగొట్టుకోవాలి? అవసరమా?
ఈ బ్లాగులు, కంప్యూటర్లు, ఆంగ్లము ఏమీ తెలియని గ్రామాల ప్రజలే పరమతసహనముతో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకొంటూ ఆనందముగా ఉంటున్నారు. ఏ మతపండుగ వచ్చినా అందరూ కలిసి జరుపుకొంటూ సంతోషముగా ఉంటున్నారు. కాని ఇవన్నీ తెలిసిన మనం ఒకరికొకరు దుమ్మెత్తిపోసుకొంటున్నాము. నిజమే కదా?
చివరిగా ఒక మాట. తప్పు మతం పేరుతో చేసే తప్పులు చేసే మనుషులదే కాని, మతానిది ఎన్నటికీ కానేరదు.
ఇకనైనా మనము మతాల పేరుతో కువిమర్శలకు, వ్యక్తిగత విమర్శలకు దిగకుండా ఉండాలని నా అభిలాష.
Friday, July 9, 2010
108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది?
మనకు తెలుసు హిందూమతం లో 108 సంఖ్యకు గల ప్రాముఖ్యత.జపమాలలోని పూసలు 108. ఇంకొన్ని ప్రత్యేకతలుచూద్దాం.
1.వేదాల ప్రకారం
#భూమికి,చంద్రునికి మధ్యదూరం,చంద్రుని వ్యాసానికి 108 రెట్లు
#భూమికి,సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు
#సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.
నేటి విజ్ఞానం ప్రకారం కూడా ఇవి దాదాపు సరిపోలాయి.
2.ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మర్మస్థానాలు 108.
3.నక్షత్రాలు 27.వాటికి ఒక్కొక్కటికి గల పాదాలు 4. 27*4=108
4.రాశులు 12.గ్రహాలు 9. 12*9=108.
5.భరతనాట్యంలో మొత్తం నాట్యభంగిమలు 108.
6.ఉపనిషత్తులు 108.
7.108=1*2 వర్గం*3 ఘనం=1*(2*2)*(3*3*3).
8.భగవద్గీత అధ్యాయాలు 18.మహాభారత పర్వాలు 18.ఇవి 108 యొక్క కారణాంకాలు.
1.వేదాల ప్రకారం
#భూమికి,చంద్రునికి మధ్యదూరం,చంద్రుని వ్యాసానికి 108 రెట్లు
#భూమికి,సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు
#సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.
నేటి విజ్ఞానం ప్రకారం కూడా ఇవి దాదాపు సరిపోలాయి.
2.ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మర్మస్థానాలు 108.
3.నక్షత్రాలు 27.వాటికి ఒక్కొక్కటికి గల పాదాలు 4. 27*4=108
4.రాశులు 12.గ్రహాలు 9. 12*9=108.
5.భరతనాట్యంలో మొత్తం నాట్యభంగిమలు 108.
6.ఉపనిషత్తులు 108.
7.108=1*2 వర్గం*3 ఘనం=1*(2*2)*(3*3*3).
8.భగవద్గీత అధ్యాయాలు 18.మహాభారత పర్వాలు 18.ఇవి 108 యొక్క కారణాంకాలు.
Thursday, July 8, 2010
వేదకాలం లో జంతుబలి ఉన్నంత మాత్రాన వారు అనాగరికులా? మనం కాదా?
ఈ మధ్య వేదాలలో జంతుబలులు ఉన్నాయన్న విషయాన్ని విమర్శిస్తూ వ్రాసిన ఒక వ్యాసము(article)ఈ టపాకు ప్రేరణ.విచిత్రమేమిటంటే మన భారతీయులు కూడా ఆ వ్యాసానికి వంతపాడారు.అందుకే ఈ టపా వ్రాయవలసి వచ్చింది.
అందరికీ తెలుసు వేదకాలపు యజ్ఞాలలో జంతుబలులు ఉండేవని.ఈ విషయం ఒక్కటి తీసుకొని పాశ్చాత్యులు వేదకాలపు జనులు ఆటవికులని,అది ఆటవిక సమాజమని,ఆనాటివారు అనాగరికులని నిర్ణయించారు.లోపాలు తప్ప మంచిని గ్రహించని ఆ కాలపు ఆంగ్లేయుల వలన మన ప్రజలు కూడా వారికి వంత పాడారు,నేటికీ పాడుతూనే ఉన్నారు.సరే నేడు వారు కానీ,మనం కానీ చేస్తున్నది ఏమిటి.ఏ దేశపు ప్రజలు మాంసాహారం తినడం లేదు? కోళ్ళు,మేకలు,పొట్టేళ్ళు మొదలుకొని ఎద్దు(beef),పంది(fork),ఒంటె,పాములు,బల్లుల వరకు తినడం లేదా?దీనిని బట్టి నేటి సమాజం కూడా ఆటవిక సమాజం అనగలమా?ఏ మతం వారు,ఏ దేశం వారు పండుగలని,ఉత్సవాలని
జంతుహింసకు పాల్పడడం లేదు? ఇలా అని ప్రస్తుతం ఆటవిక సమాజం నడుస్తోందని అందామా? ప్రస్తుతం మనం కూడా అనాగరికులమని అన వీలవుతుందా? అలా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పటికీ ఆంగ్లేయులకు కానీ,అమెరికనులకు కానీ ఎద్దు మాంసం కానీ,పంది మాంసం అంటే కానీ ఇష్టం పోయిందా(శాఖాహారులు తప్ప)? వీరినే ఎందుకు ఉదహరించడం జరిగిందంటే వీరే ఇలాంటి వాదనలకు ఆద్యులు.
అప్పుడు వేదకాలం లో జంతుబలులకు పాల్పడ్డవారే కాలక్రమంలో శాఖాహార ప్రాముఖ్యతను గుర్తించి శాఖాహారానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు.ఇదంతా మానవ మనసు పరిణామ దశలలో భాగమని ఎందుకు అనుకోకూడదు? కాని ఒకరిలో లోపాలు ఎంచడానికే అధిక ప్రాముఖ్యత ఇవ్వడమే నేటి లోక నైజం. "ఎదుటివారి కంట్లో నలుసు తీసే ముందు నీ కంటిలోని దూలాన్ని తొలగించుకో" అన్న ఏసుక్రీస్తు బోధన తెలియదా? తను బెల్లం తినడం మానివేసిన తర్వాతే పిల్లవాడికి బెల్లము ఎక్కువ తినడం హానికరమని బోధించిన రామకృష్ణపరమహంస గురించి తెలియదా?
ఒక్క మాట.మనుషులు చీమలకున్న పాటి జ్ఞానం కూడా కోల్పోతున్నారు.చీమలు ఇసుక,చక్కెర మిశ్రమం నుండి చక్కెరను మాత్రం గ్రహించి ఇసుకను వదిలివేస్తాయి.అంటే పనికిరాని విషయాన్ని వదిలివేసి పనికివచ్చే చక్కెరను మాత్రమే గ్రహిస్తాయి.లోకంలో చాలా మందిలో లోపాలు ఉన్నంత మాత్రాన లోకాన్నంతటినీ ఒకే గాటన కట్టగలమా?(for faults in many,judge not the whole). వేదాలలోని శాంతి మంత్రం(అసతోమా సద్గమయ మంత్రం) వారికి కనపడలేదా? అనాగరికులే ఈ మహోన్నత మంత్రాన్ని అందించారు."సర్వేజనా సుఖినో భవంతు" అని ఘోషించడానికి ఎంత పరిపక్వం చెందిఉండాలి? "సహనాభవతు,సహనౌ భునక్తు"(కలిసి ఉందాం,కలిసి తిందాం) అనే సంస్కారం ఆనాటి వేదాలలోనే ఉన్నదని గ్రహించరా?
"సమానీ వ ఆకూతిః సమానా హృదయాని వః
సమాన మస్తు వో మనో యథా వః సుసహాసతి"(అధర్వణవేదం 6-64-4)
అర్థం: మీ సంకల్పం ఒక్కటైనదిగా ఉండుగాక!మీ భావం ఒక్కటైనదిగా ఉండుగాక!మీ చింతన ఒక్కటైనదిగా ఉండుగాక!ఈ విధముగా మీ మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొను గాక!
ఇంతటి ఉపదేశం ఇచ్చినవారు అనాగరికులా? ఆలోచించండి.వేదాలలో జంతుబలులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే గ్రహించి మొత్తం వేదాలనే నిందించడం తగదు.
మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం గారు తన ఆత్మకథ (ఒక విజేత ఆత్మకథ) లో ఒక విషయం చెప్పారు.అదేమిటంటే అతను అంతరిక్షశాఖ లో పని చేస్తున్నప్పుడు తరచూ శాస్త్రవేత్తల సమావేశాలు జరిగేవట.వాటిలో మన దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎవరైనా ఒక నూతన విషయం ప్రస్తావిస్తే తక్షణం అందరు శాస్త్రవేత్తలు వాదోపవాదాలు లేవదీసేవారు.కాని అదే ఎవరైనా విదేశ శాస్త్రవేత్త గనుక ప్రతిపాదిస్తే ఎటువంటి వాదోపవాదాలు లేకుండా ఏకగ్రీవంగా అంగీకరించేవారట.
అలానే ఆంగ్లేయులు చెప్పినంత మాత్రాన గొర్రెలా తలాడించి అవుననడమే తప్ప ఆలోచన లేకుండా తలాడించడమేనా? ఏదైనా ఒక విషయం పై అభిప్రాయం ఏర్పరుచుకునేముందు ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోనవసరం లేదా? " వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్ కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ " అని మన మహాత్ములు చెప్పిన విషయం తల కు ఎక్కదా?. మేలెంచి కీడెంచమన్న పెద్దలమాట మరిచిపోయారు.కనీసం కీడెంచి మేలు కూడా ఎంచడం లేదు.కేవలం లోపాలు వెదకడమే పనిగా
పెట్టుకున్నారు.వేదాలను ఎవరైనా పూర్తిగా చదివారా? చదవకుండానే,తెలుసుకోకుండానే ఆంగ్లేయులు చెప్పారు కాబట్టి అవన్నీ బూటకమని నిర్ణయించడమేనా?.
ఆంగ్లేయులు మనలను భౌతికముగా,సాంస్కృతికముగా బానిసలు చేసుకోవడంకోసం పన్నిన ఉచ్చులో మనం ఎంత బాగా పడ్డామో తెలుసుకోవాలి.ఇప్పుడు వారు లేరు కాని వారి ప్రభావము నుండి ఇంకా బయట పడలేకపోతున్నాము.ఒకరు చెప్పినది గ్రుడ్డిగా కాకుండా పూర్తిగా తెలుసుకొని,అన్ని కోణాలలోనూ విచారించి అప్పుడు ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం.వేదాల విషయమే కాదు ఏ విషయానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.
అందరికీ తెలుసు వేదకాలపు యజ్ఞాలలో జంతుబలులు ఉండేవని.ఈ విషయం ఒక్కటి తీసుకొని పాశ్చాత్యులు వేదకాలపు జనులు ఆటవికులని,అది ఆటవిక సమాజమని,ఆనాటివారు అనాగరికులని నిర్ణయించారు.లోపాలు తప్ప మంచిని గ్రహించని ఆ కాలపు ఆంగ్లేయుల వలన మన ప్రజలు కూడా వారికి వంత పాడారు,నేటికీ పాడుతూనే ఉన్నారు.సరే నేడు వారు కానీ,మనం కానీ చేస్తున్నది ఏమిటి.ఏ దేశపు ప్రజలు మాంసాహారం తినడం లేదు? కోళ్ళు,మేకలు,పొట్టేళ్ళు మొదలుకొని ఎద్దు(beef),పంది(fork),ఒంటె,పాములు,బల్లుల వరకు తినడం లేదా?దీనిని బట్టి నేటి సమాజం కూడా ఆటవిక సమాజం అనగలమా?ఏ మతం వారు,ఏ దేశం వారు పండుగలని,ఉత్సవాలని
జంతుహింసకు పాల్పడడం లేదు? ఇలా అని ప్రస్తుతం ఆటవిక సమాజం నడుస్తోందని అందామా? ప్రస్తుతం మనం కూడా అనాగరికులమని అన వీలవుతుందా? అలా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పటికీ ఆంగ్లేయులకు కానీ,అమెరికనులకు కానీ ఎద్దు మాంసం కానీ,పంది మాంసం అంటే కానీ ఇష్టం పోయిందా(శాఖాహారులు తప్ప)? వీరినే ఎందుకు ఉదహరించడం జరిగిందంటే వీరే ఇలాంటి వాదనలకు ఆద్యులు.
అప్పుడు వేదకాలం లో జంతుబలులకు పాల్పడ్డవారే కాలక్రమంలో శాఖాహార ప్రాముఖ్యతను గుర్తించి శాఖాహారానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు.ఇదంతా మానవ మనసు పరిణామ దశలలో భాగమని ఎందుకు అనుకోకూడదు? కాని ఒకరిలో లోపాలు ఎంచడానికే అధిక ప్రాముఖ్యత ఇవ్వడమే నేటి లోక నైజం. "ఎదుటివారి కంట్లో నలుసు తీసే ముందు నీ కంటిలోని దూలాన్ని తొలగించుకో" అన్న ఏసుక్రీస్తు బోధన తెలియదా? తను బెల్లం తినడం మానివేసిన తర్వాతే పిల్లవాడికి బెల్లము ఎక్కువ తినడం హానికరమని బోధించిన రామకృష్ణపరమహంస గురించి తెలియదా?
ఒక్క మాట.మనుషులు చీమలకున్న పాటి జ్ఞానం కూడా కోల్పోతున్నారు.చీమలు ఇసుక,చక్కెర మిశ్రమం నుండి చక్కెరను మాత్రం గ్రహించి ఇసుకను వదిలివేస్తాయి.అంటే పనికిరాని విషయాన్ని వదిలివేసి పనికివచ్చే చక్కెరను మాత్రమే గ్రహిస్తాయి.లోకంలో చాలా మందిలో లోపాలు ఉన్నంత మాత్రాన లోకాన్నంతటినీ ఒకే గాటన కట్టగలమా?(for faults in many,judge not the whole). వేదాలలోని శాంతి మంత్రం(అసతోమా సద్గమయ మంత్రం) వారికి కనపడలేదా? అనాగరికులే ఈ మహోన్నత మంత్రాన్ని అందించారు."సర్వేజనా సుఖినో భవంతు" అని ఘోషించడానికి ఎంత పరిపక్వం చెందిఉండాలి? "సహనాభవతు,సహనౌ భునక్తు"(కలిసి ఉందాం,కలిసి తిందాం) అనే సంస్కారం ఆనాటి వేదాలలోనే ఉన్నదని గ్రహించరా?
"సమానీ వ ఆకూతిః సమానా హృదయాని వః
సమాన మస్తు వో మనో యథా వః సుసహాసతి"(అధర్వణవేదం 6-64-4)
అర్థం: మీ సంకల్పం ఒక్కటైనదిగా ఉండుగాక!మీ భావం ఒక్కటైనదిగా ఉండుగాక!మీ చింతన ఒక్కటైనదిగా ఉండుగాక!ఈ విధముగా మీ మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొను గాక!
ఇంతటి ఉపదేశం ఇచ్చినవారు అనాగరికులా? ఆలోచించండి.వేదాలలో జంతుబలులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే గ్రహించి మొత్తం వేదాలనే నిందించడం తగదు.
మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం గారు తన ఆత్మకథ (ఒక విజేత ఆత్మకథ) లో ఒక విషయం చెప్పారు.అదేమిటంటే అతను అంతరిక్షశాఖ లో పని చేస్తున్నప్పుడు తరచూ శాస్త్రవేత్తల సమావేశాలు జరిగేవట.వాటిలో మన దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎవరైనా ఒక నూతన విషయం ప్రస్తావిస్తే తక్షణం అందరు శాస్త్రవేత్తలు వాదోపవాదాలు లేవదీసేవారు.కాని అదే ఎవరైనా విదేశ శాస్త్రవేత్త గనుక ప్రతిపాదిస్తే ఎటువంటి వాదోపవాదాలు లేకుండా ఏకగ్రీవంగా అంగీకరించేవారట.
అలానే ఆంగ్లేయులు చెప్పినంత మాత్రాన గొర్రెలా తలాడించి అవుననడమే తప్ప ఆలోచన లేకుండా తలాడించడమేనా? ఏదైనా ఒక విషయం పై అభిప్రాయం ఏర్పరుచుకునేముందు ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోనవసరం లేదా? " వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్ కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ " అని మన మహాత్ములు చెప్పిన విషయం తల కు ఎక్కదా?. మేలెంచి కీడెంచమన్న పెద్దలమాట మరిచిపోయారు.కనీసం కీడెంచి మేలు కూడా ఎంచడం లేదు.కేవలం లోపాలు వెదకడమే పనిగా
పెట్టుకున్నారు.వేదాలను ఎవరైనా పూర్తిగా చదివారా? చదవకుండానే,తెలుసుకోకుండానే ఆంగ్లేయులు చెప్పారు కాబట్టి అవన్నీ బూటకమని నిర్ణయించడమేనా?.
ఆంగ్లేయులు మనలను భౌతికముగా,సాంస్కృతికముగా బానిసలు చేసుకోవడంకోసం పన్నిన ఉచ్చులో మనం ఎంత బాగా పడ్డామో తెలుసుకోవాలి.ఇప్పుడు వారు లేరు కాని వారి ప్రభావము నుండి ఇంకా బయట పడలేకపోతున్నాము.ఒకరు చెప్పినది గ్రుడ్డిగా కాకుండా పూర్తిగా తెలుసుకొని,అన్ని కోణాలలోనూ విచారించి అప్పుడు ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం.వేదాల విషయమే కాదు ఏ విషయానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.
ఇలాంటి కష్టం ఏ జీవికీ రాకూడదనే కోరుకొందాం.

క్రింది సంఘటన చదివితే ఇలాంటి సంఘటనలు కూడా జరుగాతాయా! అనే ఆశ్చర్యం కల్గక మానదు. ఒక జంట పెళ్ళి చేసుకొందామంటే వారికి కల్గిన కష్టాలు చూస్తే పగవారికి కూడా రాకూడదని అనిపిస్తాయి.
లండన్కు చెందిన కెన్నెత్, కరెన్ పోర్టర్ ఏడాదికిందట పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లికూతురి గౌన్లు కుట్టమని ఓ షాపులో ఆర్డరిచ్చారు. ఆ షాపులో మంటలు చెలరేగి వెుత్తం కాలిపోయింది. మరో చోట కుట్టిస్తే కొలతలు కుదర్లేదు సరికదా, ఇస్త్రీ చేసేటపుడు అదీ కాలిపోయింది. హనీమూన్కు వెళ్లడానికి, ముందే విమాన టిక్కెట్లు బుక్ చేసుకుంటే ఆ విమానం కాస్తా కూలిపోయి టిక్కెట్ డబ్బులు తిరిగొచ్చేశాయి. ఇక పెళ్లయ్యాక రిసెప్షన్ కోసం ఆర్డరిచ్చిన హోటల్ దివాలా తీసి మూతబడిపోయింది. హనీమూన్కు మరోచోటికి వెళ్దామని మళ్లీ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈలోగా పెళ్లికూతురి కాలు విరిగి హాస్పిటల్ బెడ్ ఎక్కడంతో పెళ్లే వాయిదా పడింది. అలా యాదృచ్చికమో లేక దురదృష్టమో కానీ కెన్నెత్, పోర్టర్ ఏడాది కిందట చేసుకుందామనుకున్న పెళ్లి వాయిదాలు పడీ పడీ చివరికి ఆగస్ట్ 2009 లో జరిగింది. అందుకే, వీళ్ల పెళ్లికి ప్రపంచంలోనే అతి దురదృష్టకరమైన పెళ్లి అని పేరొచ్చింది. అన్నట్లు వీళ్లు మైఖేల్ జాక్సన్ సంగీత కార్యక్రమానికి కూడా టిక్కెట్లు బుక్ చేసుకున్నారట!
తర్కాల విషయం, హేతువు విషయం పక్కన పెడితే ఇలా ఎవరికీ జరగకూడదనే కోరుకొందాం.
Wednesday, July 7, 2010
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?
క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.
1.అక్షరలక్ష:ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.
2.శబ్దశాస్త్రం:రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.
3.శిల్పశాస్త్రం:రచయిత కశ్యపముని.ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి.ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు,మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.
4.సూపశాస్త్రం:రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు,పిండివంటలు,తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి,ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.
5.మాలినీ శాస్త్రం:రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.
6.ధాతుశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.మిశ్రలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.
7.విషశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.
8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం): రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి.సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు.ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.
9.మల్లశాస్త్రం: రచయిత మల్లుడు.వ్యాయామాలు,ఆటలు,వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.
10.రత్నపరీక్ష: రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం,బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.
11.మహేంద్రజాల శాస్త్రం:సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.
12.అర్థశాస్త్రం:రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.
13.శక్తితంత్రం: రచయిత అగస్త్యముని.ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం ఇందులోని భాగమే.
14.సౌధామినీకళ:రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.
15.మేఘశాస్త్రం: రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.
16.స్థాపత్యవిద్య:అదర్వణవేదం లోనిది.ఇంజనీరింగ్,ఆర్కితెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.
ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సాముద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.
వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు.
1.అక్షరలక్ష:ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.
2.శబ్దశాస్త్రం:రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.
3.శిల్పశాస్త్రం:రచయిత కశ్యపముని.ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి.ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు,మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.
4.సూపశాస్త్రం:రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు,పిండివంటలు,తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి,ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.
5.మాలినీ శాస్త్రం:రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.
6.ధాతుశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.మిశ్రలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.
7.విషశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.
8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం): రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి.సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు.ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.
9.మల్లశాస్త్రం: రచయిత మల్లుడు.వ్యాయామాలు,ఆటలు,వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.
10.రత్నపరీక్ష: రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం,బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.
11.మహేంద్రజాల శాస్త్రం:సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.
12.అర్థశాస్త్రం:రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.
13.శక్తితంత్రం: రచయిత అగస్త్యముని.ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం ఇందులోని భాగమే.
14.సౌధామినీకళ:రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.
15.మేఘశాస్త్రం: రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.
16.స్థాపత్యవిద్య:అదర్వణవేదం లోనిది.ఇంజనీరింగ్,ఆర్కితెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.
ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సాముద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.
వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు.
Tuesday, July 6, 2010
మనసులను కదిలించే సంఘటనలు - మనం నేర్చుకోవలసింది
నిస్వార్థసేవ:
ఒకసారి మదర్థెరెసా శరణాలయపు జీపు టైరు పంచర్ అయ్యింది.ఓ మరమ్మత్తు దుకాణానికి వెళ్ళి టైరును బాగు చెయ్యమని ఇచ్చింది.ఆ యజమాని"అమ్మా!మేము టైరు బాగుచేసి శరణాలయానికి పంపిస్తాము.మీరు వెళ్ళిరండి" అని అన్నాడు.
థెరెసా అతనితో "మీరు ఈ టైరు ఎవరిచే పంపిస్తారు? అతనికి ఎంత ఇస్తారు?" అని అడిగింది."రిక్షాలో పంపిస్తాము.కిరాయి గా 10 రూపాయలు ఇస్తాము" అన్నాడు.
వెంటనే ఆమె"ఆ టైరు బాగుచేసేంతవరకు ఉండి నేనే స్వయముగా తీసుకొనిపోతాను.దయచేసి ఆ పది రూపాయలు నాకు ఇవ్వండి.దానితో పదిమంది అనాధల ఆకలి తీరుతుంది "అంది. ఆ మాటలు విన్న యజమాని హృదయం ద్రవించి అతనే 50 రూపాయల చందా ఇచ్చాడు.
అవరోధాలుగా మారే అవసరాలు:
సోక్రటీస్ ప్రతిరోజూ సాయంత్రం బజారంతా తిరిగి,ఏమీ కొనకుండానే ఇంటికి వచ్చేవాడు.ఒకరోజు ఆయన శిష్యుడు "గురువుగారూ! మీరు ప్రతిరోజూ సాయంత్రం బజారుకి వెళ్ళి ఏమీ కొనకుండానే తిరిగి వస్తున్నారు. అలాంటప్పుడు అసలు బజారుకు ఎందుకు వెళ్తున్నట్లు?"అని అడిగాడు."ఈ ప్రపంచంలో మనకు అవసరం లేని వస్తువులు ఎన్ని ఉన్నాయో తెలుసుకొందామని బజారుకి వెళ్ళి వస్తున్నాను" అని సోక్రటీస్ శిష్యునికి సమాధానం ఇచ్చాడు.
చాలామంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా లేనిపోని అవసరాలను పెంచుకుంటూ అప్పులపాలై అశాంతిని ఆహ్వానిస్తుంటారు.ఇతరులతో పోల్చుకొనే స్వభావమే ఇందుకు కారణం. నిజానికి మనకు అవసరం లేనివాటిని పొందాలనే తాపత్రయంలో మన మనశ్శాంతికి మనమే అవరోధాలను కల్పించుకొంటున్నాము.
ఒకసారి మదర్థెరెసా శరణాలయపు జీపు టైరు పంచర్ అయ్యింది.ఓ మరమ్మత్తు దుకాణానికి వెళ్ళి టైరును బాగు చెయ్యమని ఇచ్చింది.ఆ యజమాని"అమ్మా!మేము టైరు బాగుచేసి శరణాలయానికి పంపిస్తాము.మీరు వెళ్ళిరండి" అని అన్నాడు.
థెరెసా అతనితో "మీరు ఈ టైరు ఎవరిచే పంపిస్తారు? అతనికి ఎంత ఇస్తారు?" అని అడిగింది."రిక్షాలో పంపిస్తాము.కిరాయి గా 10 రూపాయలు ఇస్తాము" అన్నాడు.
వెంటనే ఆమె"ఆ టైరు బాగుచేసేంతవరకు ఉండి నేనే స్వయముగా తీసుకొనిపోతాను.దయచేసి ఆ పది రూపాయలు నాకు ఇవ్వండి.దానితో పదిమంది అనాధల ఆకలి తీరుతుంది "అంది. ఆ మాటలు విన్న యజమాని హృదయం ద్రవించి అతనే 50 రూపాయల చందా ఇచ్చాడు.
అవరోధాలుగా మారే అవసరాలు:
సోక్రటీస్ ప్రతిరోజూ సాయంత్రం బజారంతా తిరిగి,ఏమీ కొనకుండానే ఇంటికి వచ్చేవాడు.ఒకరోజు ఆయన శిష్యుడు "గురువుగారూ! మీరు ప్రతిరోజూ సాయంత్రం బజారుకి వెళ్ళి ఏమీ కొనకుండానే తిరిగి వస్తున్నారు. అలాంటప్పుడు అసలు బజారుకు ఎందుకు వెళ్తున్నట్లు?"అని అడిగాడు."ఈ ప్రపంచంలో మనకు అవసరం లేని వస్తువులు ఎన్ని ఉన్నాయో తెలుసుకొందామని బజారుకి వెళ్ళి వస్తున్నాను" అని సోక్రటీస్ శిష్యునికి సమాధానం ఇచ్చాడు.
చాలామంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా లేనిపోని అవసరాలను పెంచుకుంటూ అప్పులపాలై అశాంతిని ఆహ్వానిస్తుంటారు.ఇతరులతో పోల్చుకొనే స్వభావమే ఇందుకు కారణం. నిజానికి మనకు అవసరం లేనివాటిని పొందాలనే తాపత్రయంలో మన మనశ్శాంతికి మనమే అవరోధాలను కల్పించుకొంటున్నాము.
Wednesday, June 30, 2010
మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) కంటూ ఒక విధానం ఉంది. విదేశీయుల కళ్ళజోళ్ళతో దాన్నెందుకు చూడాలి?
రోముకు వెళ్ళినప్పుడు రోమన్ లాగా ఉండమని ఒక సామెత. అంటే వారి మనస్తత్వానికి తగ్గట్లు నడుచుకోవాలన్నమాట. అంటే ప్రతి దేశానికి కొన్ని విధివిధానాలు, సంస్కృతీసాంప్రదాయాలు
ఉంటాయి, అవి ఇంకో దేశంలో చెల్లుబాటు కావచ్చు,కాకపోవచ్చు. అలానే ప్రజల మనస్తత్వాలు కూడా. భారతదేశంలో ని ప్రజల వేషధారణ ఇంగ్లాండ్ వారికి ఎబ్బెట్టు గా కనిపించవచ్చు.
అలానే వారి స్వేఛ్ఛా మనస్తత్వాన్ని మనం విచ్చలవిడితనం గా భావించవచ్చు. ఇక్కడ ఇద్దరిదీ తప్పే కనిపిస్తుంది. ఎందుకంటే మనం మన విధానాల కళ్ళజోళ్ళ లో నుండి, వారు వారి
విధానాల కళ్ళజోళ్ళలో నుండి చూస్తున్నారు. అలా చూడకూడదు కదా. ఎవరి ప్రమాణాలు(Standards) వారివి.
ఇదే విషయం మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) విషయంలో కూడా వర్తిస్తుంది. వారి విధానం వేరు. ఇక్కడ మన ప్రాచీన శాస్త్రజ్ఞులను ఋషులని సంభోధిస్తున్నాను. భారతీయులు
ఎప్పుడూ దేవుడు,ఆత్మ,వేదాంత రంగాలలోనే విషయాలు కనుగొన్నారు కానీ సైన్సు పరంగా ఏమీ లేదనే అభిప్రాయం విదేశీయులలోనే కాదు, దురదృష్టవశాత్తూ మన భారతీయులలో కూడా
చాలా ఎక్కువగా ఉంది.
మన ఋషులు ఏవైనా సైన్సుకు సంబంధించిన విశేషాలు కనుగొంటే ఎందుకు చెప్పలేదు? అని చాలామంది అంటుంటారు. ఒకటే కారణం వారు చెప్పిన విధానం వేరు.
మన ఋషుల విధానం ఏమంటే సమాజంలో సామాన్యులే ఎక్కువగా ఉంటారు. మేధావుల శాతాన్ని మామూలు జనం సంఖ్యతో పోలిస్తే నిర్లక్ష్యం చేయవచ్చు(Negligible). సైన్సు యొక్క ఫలాలు సామాన్యులకు చేరినప్పుడే దానికి విలువ అని ప్రస్తుతం మనం అనుకుంటున్నదే వారి విధానం కూడా. సాధారణంగా మన పూర్వీకుల పద్దతి ఆధ్యాత్మిక సంబంధమైనది. ఆ పద్దతికి తగ్గట్లే మన ఋషులు కూడా తమ పద్దతిని రూపకల్పన(Design) చేసుకొన్నారు. తము కనుగొన్న విషయాలను కథల రూపంలోనూ, కట్టుబాట్ల రూపం లోనూ, నిషేధాల రూపం లోనూ జనానికి అందించారు. ఉదాహరణకు ఏదైనా ఆసనం పై (కుర్చీ లేదా గోడ ఏదైనా కావచ్చు) కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపరాదు అంటారు. అలా ఊపడం అలవాటైతే గనుక పక్షవాతం వస్తుందని నేటి సైంటిస్టులు కనుగొన్నారు. కానీ మనవారు అలా ఊపితే ఎదురుగా ఉన్న వారికి కాళ్ళు చూపినట్లవుతుందని ,వారికి అగౌరవమని నిషేధించారు.ఇది ఒక ఉదాహరణ
మాత్రమే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని మూఢనమ్మకాలు కూడా ఇందులో కలిసిపోయుండవచ్చు. అంత మాత్రాన అన్నీ మూఢనమ్మాకాలేనని ఎలా నిర్ణయించగలం?
మనఋషుల విధానం లో ప్రజలలోనికి విషయం ఎలాగైనా చేరాలి, వారు ఆచరించాలి అంతే.
అసలు తాము ఒక విషయం కనుగొన్నమనే దానికి వారు ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వలేదు. ఉదాహరణకు సాయణాచార్యులు ఋగ్వేద భాష్యం చెప్తూ కాంతివేగాన్ని కూడా
పరోక్షం(indirect)గా చెప్పారు. తానేదో కొత్తవిషయాన్ని పరిచయం చేస్తున్నట్లు చెప్పలేదు.
మనకు తెలిసిన ఆర్యభటుడు , భాస్కరాచార్యుడు, చరకుడు,కణం అనే భావనను కనుగొన్న కణాదుడు మొదలగు వారు కూడా తమ ఆవిష్కరణలను ఏనాడూ ప్రచారం చేసుకోలేదు.
పేటెంటు కూడా తీసుకోలేదు. పేరును ఆశించలేదు. తమ కృషి ఫలితాలు కేవలం ప్రజలకు చేరడమే వారికి కావలసింది. అంతెందుకు మన కాలం నాటి జగదీశ్ చంద్రబోస్ కూడా ఎన్నో
కనుగొన్నా ఏనాడూ పేరు ఆశించకుండా కేవలం తన పరిశోధన ఫలితాలు జనానికి అందాలని ఆశించాడు. పేటెంట్లు కూడా తీసుకోలేదు.
ఇప్పుడంటే మనం మన పూర్వీకులు ఇది కనుగొన్నారు, అది కనుగొన్నారు అని చెప్పుకొంటున్నాం కానీ వారు ఏనాడూ పేరుప్రతిష్టలకై ఆశించలేదు.
ఇక విదేశీయుల పద్దతి ఏమిటంటే తాము ఏదైనా కనుగొంటే మొదట తమ పేరున పేటెంట్ పొంది తర్వాత జనాలకు ఆ అవిష్కరణను పరిచయం చేస్తారు. ఇక్కడ నేను విదేశీయులను తక్కువ చేసి మాట్లాడడం లేదు. వారి విధానం ఇది అని చెప్తున్నాను. వారి విధానం వారికి సరైనదని అనిపించవచ్చు కాబట్టి అదే వారు అనుసరిస్తున్నారు.
ఇప్పుడు ఆలోచించండి విదేశీయుల విధానాలను ప్రాతిపదికగా తీస్కొని మన విధానాలను పోల్చడం ఎంత బుద్ధి తక్కువ పనో!
వనరులు:
కాంతివేగం వేదాలలోనే ఉంది (మహోన్నత భారతదేశం)
ఆర్యభటీయం(ప్రాచీన భారత విజ్ఞానగ్రంథాలు)
భాస్కరాచార్యుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
ఋషులు అంటే సమాజహితం వదిలి స్వార్థం చూసుకొనేవారా?
ఉంటాయి, అవి ఇంకో దేశంలో చెల్లుబాటు కావచ్చు,కాకపోవచ్చు. అలానే ప్రజల మనస్తత్వాలు కూడా. భారతదేశంలో ని ప్రజల వేషధారణ ఇంగ్లాండ్ వారికి ఎబ్బెట్టు గా కనిపించవచ్చు.
అలానే వారి స్వేఛ్ఛా మనస్తత్వాన్ని మనం విచ్చలవిడితనం గా భావించవచ్చు. ఇక్కడ ఇద్దరిదీ తప్పే కనిపిస్తుంది. ఎందుకంటే మనం మన విధానాల కళ్ళజోళ్ళ లో నుండి, వారు వారి
విధానాల కళ్ళజోళ్ళలో నుండి చూస్తున్నారు. అలా చూడకూడదు కదా. ఎవరి ప్రమాణాలు(Standards) వారివి.
ఇదే విషయం మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) విషయంలో కూడా వర్తిస్తుంది. వారి విధానం వేరు. ఇక్కడ మన ప్రాచీన శాస్త్రజ్ఞులను ఋషులని సంభోధిస్తున్నాను. భారతీయులు
ఎప్పుడూ దేవుడు,ఆత్మ,వేదాంత రంగాలలోనే విషయాలు కనుగొన్నారు కానీ సైన్సు పరంగా ఏమీ లేదనే అభిప్రాయం విదేశీయులలోనే కాదు, దురదృష్టవశాత్తూ మన భారతీయులలో కూడా
చాలా ఎక్కువగా ఉంది.
మన ఋషులు ఏవైనా సైన్సుకు సంబంధించిన విశేషాలు కనుగొంటే ఎందుకు చెప్పలేదు? అని చాలామంది అంటుంటారు. ఒకటే కారణం వారు చెప్పిన విధానం వేరు.
మన ఋషుల విధానం ఏమంటే సమాజంలో సామాన్యులే ఎక్కువగా ఉంటారు. మేధావుల శాతాన్ని మామూలు జనం సంఖ్యతో పోలిస్తే నిర్లక్ష్యం చేయవచ్చు(Negligible). సైన్సు యొక్క ఫలాలు సామాన్యులకు చేరినప్పుడే దానికి విలువ అని ప్రస్తుతం మనం అనుకుంటున్నదే వారి విధానం కూడా. సాధారణంగా మన పూర్వీకుల పద్దతి ఆధ్యాత్మిక సంబంధమైనది. ఆ పద్దతికి తగ్గట్లే మన ఋషులు కూడా తమ పద్దతిని రూపకల్పన(Design) చేసుకొన్నారు. తము కనుగొన్న విషయాలను కథల రూపంలోనూ, కట్టుబాట్ల రూపం లోనూ, నిషేధాల రూపం లోనూ జనానికి అందించారు. ఉదాహరణకు ఏదైనా ఆసనం పై (కుర్చీ లేదా గోడ ఏదైనా కావచ్చు) కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపరాదు అంటారు. అలా ఊపడం అలవాటైతే గనుక పక్షవాతం వస్తుందని నేటి సైంటిస్టులు కనుగొన్నారు. కానీ మనవారు అలా ఊపితే ఎదురుగా ఉన్న వారికి కాళ్ళు చూపినట్లవుతుందని ,వారికి అగౌరవమని నిషేధించారు.ఇది ఒక ఉదాహరణ
మాత్రమే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని మూఢనమ్మకాలు కూడా ఇందులో కలిసిపోయుండవచ్చు. అంత మాత్రాన అన్నీ మూఢనమ్మాకాలేనని ఎలా నిర్ణయించగలం?
మనఋషుల విధానం లో ప్రజలలోనికి విషయం ఎలాగైనా చేరాలి, వారు ఆచరించాలి అంతే.
అసలు తాము ఒక విషయం కనుగొన్నమనే దానికి వారు ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వలేదు. ఉదాహరణకు సాయణాచార్యులు ఋగ్వేద భాష్యం చెప్తూ కాంతివేగాన్ని కూడా
పరోక్షం(indirect)గా చెప్పారు. తానేదో కొత్తవిషయాన్ని పరిచయం చేస్తున్నట్లు చెప్పలేదు.
మనకు తెలిసిన ఆర్యభటుడు , భాస్కరాచార్యుడు, చరకుడు,కణం అనే భావనను కనుగొన్న కణాదుడు మొదలగు వారు కూడా తమ ఆవిష్కరణలను ఏనాడూ ప్రచారం చేసుకోలేదు.
పేటెంటు కూడా తీసుకోలేదు. పేరును ఆశించలేదు. తమ కృషి ఫలితాలు కేవలం ప్రజలకు చేరడమే వారికి కావలసింది. అంతెందుకు మన కాలం నాటి జగదీశ్ చంద్రబోస్ కూడా ఎన్నో
కనుగొన్నా ఏనాడూ పేరు ఆశించకుండా కేవలం తన పరిశోధన ఫలితాలు జనానికి అందాలని ఆశించాడు. పేటెంట్లు కూడా తీసుకోలేదు.
ఇప్పుడంటే మనం మన పూర్వీకులు ఇది కనుగొన్నారు, అది కనుగొన్నారు అని చెప్పుకొంటున్నాం కానీ వారు ఏనాడూ పేరుప్రతిష్టలకై ఆశించలేదు.
ఇక విదేశీయుల పద్దతి ఏమిటంటే తాము ఏదైనా కనుగొంటే మొదట తమ పేరున పేటెంట్ పొంది తర్వాత జనాలకు ఆ అవిష్కరణను పరిచయం చేస్తారు. ఇక్కడ నేను విదేశీయులను తక్కువ చేసి మాట్లాడడం లేదు. వారి విధానం ఇది అని చెప్తున్నాను. వారి విధానం వారికి సరైనదని అనిపించవచ్చు కాబట్టి అదే వారు అనుసరిస్తున్నారు.
ఇప్పుడు ఆలోచించండి విదేశీయుల విధానాలను ప్రాతిపదికగా తీస్కొని మన విధానాలను పోల్చడం ఎంత బుద్ధి తక్కువ పనో!
వనరులు:
కాంతివేగం వేదాలలోనే ఉంది (మహోన్నత భారతదేశం)
ఆర్యభటీయం(ప్రాచీన భారత విజ్ఞానగ్రంథాలు)
భాస్కరాచార్యుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
ఋషులు అంటే సమాజహితం వదిలి స్వార్థం చూసుకొనేవారా?
Tuesday, June 29, 2010
మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఇవ్వడు.అలాంటప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం అవసరమా?
మొన్న మౌనిక అనే నర్సింగ్ చదివే అమ్మాయి ఆత్మహత్య చేసుకొంది. ఇంత చిన్న వయసులో పిల్లలు అలా ఆత్మహత్యలు చేసుకోవడం చూసి ఎందరు బాధపడరు? కొందరు పరీక్షలలో తప్పామనో, మరి కొందరు ప్రేమలు విఫలమయ్యాయనో, ఇంకొందరు తమకు అవమానాలు జరుగుతున్నాయనో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.
ఎన్నో విషాదకరసంఘటనలు జరుగుతున్నా బ్రతుకుతున్నామంటే మన వలన జరగవలసింది ఇంకా ఉందన్నమాటే కదా! పరీక్ష ఫెయిల్ అయినవెంటనే లేక ప్రేమ విఫలమైన వెంటనే లేక అవమానం పొందిన వెంటనే ప్రాణం దానంతట అది ఎందుకు పోవడం లేదు? అలా పోతే ఏం చెప్పలేము. కానీ 99% అలా పోవడం లేదే! అంటే ఇంకా అవకాశాలు ఉన్నాయన్న మాటే కదా!
ఏమైనా అంటే " మా పొజిషన్ లో మీరుంటే మీకు తెలుస్తుంది" అంటారు. ఎవరి స్థితి వారికి బాధాకరమైనదే. కాని అదే లోకమా? ఇంక ప్రపంచమే లేదా?
బ్రతకడానికి ధైర్యం కల్గించే మాటలు ఉపాధ్యాయులూ చెప్పరు, తల్లిదండ్రులూ చెప్పరు. అందరినీ అలా అనడం లేదు కానీ చాలా మంది ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఎప్పటికీ ర్యాంకుల, మార్కుల గోలే కానీ ఒక పిల్లవాడు వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడు? అని చాలామంది తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ చూడడం లేదు.
ఇక స్నేహితుల విషయానికి వస్తే తమ స్నేహితుడు(స్నేహితురాలు) ఒకరిని ప్రేమిస్తున్నామంటే మద్దతు బాగా ఇస్తారు కానీ ఎందుకు సపోర్ట్ చెయ్యాలి,అవుతుందాలేదా అనే ముందుచూపు కానీ ఉండదు. అంతే కాక వారి ప్రేమ విఫలం ఐతే ధైర్యం చెప్పడం కానీ ఉండదు. అందరినీ ఇలా అనడం లేదు కానీ చాలామందే ఇలా ఉంటున్నారు.
నా ఇంజనీరింగ్ చదువు అయిపోయి 7 సంవత్సరాలు అవుతోంది. కానీ ఇంతవరకు నాకు పర్మనెంట్ ఉద్యోగం లేదు.ఎన్నో ఉద్యోగాలు చేతివరకు వచ్చి, చివరి క్షణంలో జారిపోయాయి. పార్ట్టైం ఉద్యోగాలే చేసుకొంటూ ఉన్నాను. ఇదే కారణాన వచ్చిన పెళ్ళిసంబంధాలు వెళ్ళిపోయాయి. ఇంట్లో వారి బాధలూ, బయటి వారి అవమానాలూ ఎన్నో భరిస్తున్నాను.బాధపడ్డాను ఎందుకంటే నేను కూడా ఒక మనిషిని మాత్రమే.అంతవరకే.కానీ ఏనాడూ ఒక స్థాయిని మించి బాధపడలేదు.
నాకు స్పూర్తిని ఇచ్చిన మహామంత్రం పరమహంస యోగానంద చెప్పిన" మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఎన్నటికీ ఇవ్వడు ".
రామాయణంలోని సుందరకాండలో ఆంజనేయుడు ఒక మాట అంటాడు.""చనిపోవుట అనేక దోషాలకు కారణమవుతుంది. బ్రతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది"అని.ఇలాంటి స్పూర్తిదాయక మాటలు చెప్పేవారుండరు.
ఎప్పుడూ సిలబస్ పుస్తకాలే లోకం కానీ మహాత్ముల పుస్తకాలు చదవరు, అలా చదవడానికి ప్రోత్సాహం కూడా చాలా తక్కువే. కొంతమంది ఒంటరితనం భరించలేక కూడా ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. వీరికీ తోడు ఇవ్వలేనప్పుడు మహాత్ముల,గొప్పవారి జీవిత చరిత్రల పుస్తకాలు చదవడమే తోడు అవుతుంది. అలా అలవాటు చేయడం ఎంతో ముఖ్యం కదా!.
పెద్దలు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వీరందరికీ నా మనవి ఒక్కటే చదువులు ఎన్నైనా చదివించండి లేక చెప్పండి అలాగే మనుషులను ధైర్యవంతులుగా చేసే మాటలు, బ్రతకడానికి
స్పూర్తిని కల్గించే బోధనలు చెప్పండి.
స్నేహితులను కూడా ఇదే వేడుకొంటున్నాను.
చివరిగా ఒక మాట "బలమే(ధైర్యమే) జీవితము, బలహీనతయే మరణము". కాబట్టి ఆత్మవిశ్వాసము, ధైర్యమూ కలిగించే మాటలనే ఎప్పుడూ తల్చుకొందాము.
అలా అందరూ తలచుకొనేలా ప్రయత్నిద్దాము.
ఎన్నో విషాదకరసంఘటనలు జరుగుతున్నా బ్రతుకుతున్నామంటే మన వలన జరగవలసింది ఇంకా ఉందన్నమాటే కదా! పరీక్ష ఫెయిల్ అయినవెంటనే లేక ప్రేమ విఫలమైన వెంటనే లేక అవమానం పొందిన వెంటనే ప్రాణం దానంతట అది ఎందుకు పోవడం లేదు? అలా పోతే ఏం చెప్పలేము. కానీ 99% అలా పోవడం లేదే! అంటే ఇంకా అవకాశాలు ఉన్నాయన్న మాటే కదా!
ఏమైనా అంటే " మా పొజిషన్ లో మీరుంటే మీకు తెలుస్తుంది" అంటారు. ఎవరి స్థితి వారికి బాధాకరమైనదే. కాని అదే లోకమా? ఇంక ప్రపంచమే లేదా?
బ్రతకడానికి ధైర్యం కల్గించే మాటలు ఉపాధ్యాయులూ చెప్పరు, తల్లిదండ్రులూ చెప్పరు. అందరినీ అలా అనడం లేదు కానీ చాలా మంది ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఎప్పటికీ ర్యాంకుల, మార్కుల గోలే కానీ ఒక పిల్లవాడు వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడు? అని చాలామంది తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ చూడడం లేదు.
ఇక స్నేహితుల విషయానికి వస్తే తమ స్నేహితుడు(స్నేహితురాలు) ఒకరిని ప్రేమిస్తున్నామంటే మద్దతు బాగా ఇస్తారు కానీ ఎందుకు సపోర్ట్ చెయ్యాలి,అవుతుందాలేదా అనే ముందుచూపు కానీ ఉండదు. అంతే కాక వారి ప్రేమ విఫలం ఐతే ధైర్యం చెప్పడం కానీ ఉండదు. అందరినీ ఇలా అనడం లేదు కానీ చాలామందే ఇలా ఉంటున్నారు.
నా ఇంజనీరింగ్ చదువు అయిపోయి 7 సంవత్సరాలు అవుతోంది. కానీ ఇంతవరకు నాకు పర్మనెంట్ ఉద్యోగం లేదు.ఎన్నో ఉద్యోగాలు చేతివరకు వచ్చి, చివరి క్షణంలో జారిపోయాయి. పార్ట్టైం ఉద్యోగాలే చేసుకొంటూ ఉన్నాను. ఇదే కారణాన వచ్చిన పెళ్ళిసంబంధాలు వెళ్ళిపోయాయి. ఇంట్లో వారి బాధలూ, బయటి వారి అవమానాలూ ఎన్నో భరిస్తున్నాను.బాధపడ్డాను ఎందుకంటే నేను కూడా ఒక మనిషిని మాత్రమే.అంతవరకే.కానీ ఏనాడూ ఒక స్థాయిని మించి బాధపడలేదు.
నాకు స్పూర్తిని ఇచ్చిన మహామంత్రం పరమహంస యోగానంద చెప్పిన" మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఎన్నటికీ ఇవ్వడు ".
రామాయణంలోని సుందరకాండలో ఆంజనేయుడు ఒక మాట అంటాడు.""చనిపోవుట అనేక దోషాలకు కారణమవుతుంది. బ్రతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది"అని.ఇలాంటి స్పూర్తిదాయక మాటలు చెప్పేవారుండరు.
ఎప్పుడూ సిలబస్ పుస్తకాలే లోకం కానీ మహాత్ముల పుస్తకాలు చదవరు, అలా చదవడానికి ప్రోత్సాహం కూడా చాలా తక్కువే. కొంతమంది ఒంటరితనం భరించలేక కూడా ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. వీరికీ తోడు ఇవ్వలేనప్పుడు మహాత్ముల,గొప్పవారి జీవిత చరిత్రల పుస్తకాలు చదవడమే తోడు అవుతుంది. అలా అలవాటు చేయడం ఎంతో ముఖ్యం కదా!.
పెద్దలు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వీరందరికీ నా మనవి ఒక్కటే చదువులు ఎన్నైనా చదివించండి లేక చెప్పండి అలాగే మనుషులను ధైర్యవంతులుగా చేసే మాటలు, బ్రతకడానికి
స్పూర్తిని కల్గించే బోధనలు చెప్పండి.
స్నేహితులను కూడా ఇదే వేడుకొంటున్నాను.
చివరిగా ఒక మాట "బలమే(ధైర్యమే) జీవితము, బలహీనతయే మరణము". కాబట్టి ఆత్మవిశ్వాసము, ధైర్యమూ కలిగించే మాటలనే ఎప్పుడూ తల్చుకొందాము.
అలా అందరూ తలచుకొనేలా ప్రయత్నిద్దాము.
Monday, June 28, 2010
వేదాలా! అవి ఒట్టి ట్రాష్! ఎందుకంటే విదేశీయులు అలా అన్నారు మరి!
మన జీవన సూత్రం ఏమంటే మన సొత్తు గురించి మనకు బయటి వారి సర్టిఫికేషన్(ధ్రువీకరణ) మనకు కావాలి. మన సొంత పరిశీలన చాలా తక్కువగా ఉంటుంది.
వేదాల విషయంలో కూడా జరిగింది, జరుగుతున్నదీ కూడా అదే.
వేదాలు మూడే అన్నారు. అధర్వణ వేదం వేదం కాదని తర్వాత చేరిందన్నారు.
'' చత్వారోహి ఇమే వేదా ఋగ్వేదో యజుర్వేదః
సామవేదో బ్రహ్మవేద ఇతి'' అని గోపథ బ్రాహ్మణం (పూర్వభాగం) అంది. బ్రహ్మవేదమే అథర్వవేదం
'వేదత్రయి' అని మరొక విభజన ఉంది. 1. పద్య, 2. గద్య 3. గేయవిభజన. వేదాలు పద్యంలో దర్శించినవీ, 2. గద్యంలో దర్శించినవీ 3. గేయంలో దర్శించినవీ ఉన్నాయి. ఇది ఛందో విభజన.
వేదం మూడు విషయాలను ప్రతిపాదిస్తుంది. అవి. 1. బ్రహ్మ, 2. ఆత్మ, 3. బ్రహ్మ ఆత్మల ఏకత్వం. అందుకు కూడ అది 'వేదత్రయి' అయింది.
ఇవన్నీ తెల్సుకోరు కానీ వేదాలు మూడే అంటారు, అలానే అని మనలను నమ్మించారు.
వేదానికి 'శ్రుతి' అని కూడా పేరుంది. 'శ్రుతి' అంటే చెవిన పడింది- విన్నది.
ఇంకేం పాశ్చాత్యులకు మంచి అస్త్రం దొరికింది. మనపై మనకే అపనమ్మకం ఏర్పడేలా చేసారు.
శ్రుతి అంటే విన్నది కాబట్టి వేదకాలం నాటికి అక్షరం లేదని వ్యాఖ్యానించారు. తొలుత వేదం పలుకబడింది , వ్రాయబడలేదు అన్నారు. అదే నిజం అని మనం నమ్ముతున్నాం.
వేదమంత్రాలు స్వర ప్రాధాన్యం కలవి కాబట్టి విని నేర్చుకొని ఒక విధానంలో వాటిని పలకాలి. ఇలా వింటూ నేర్చుకొనే విధానం ఉండేది కాబట్టి "శ్రుతి" అన్నారు.అంతే కాకుండా వేద మంత్రాలను ఋషులు తమ తపో బలంతో తపస్సు లో వాటిని విని అక్షరబద్దం చేసారు(వ్రాసారు). వారు వాటిని విన్నారు కాబట్టి శ్రుతి అయింది. పాశ్చాత్యులకు ఈ విషయం తెలుసో లేదో లేక తెలిసే మనలను నమ్మించారో తెలియదు. మనవాళ్ళూ వారు చెప్పిందే నమ్మారు.
గౌతమ బుద్దుడూ, శ్రీ రామానుజాచార్యులూ వేదాలను నిరసించారని మనలనే నమ్మేలా చేసారు. నిజానికి వారు నిరసించింది వేదాలను కాదనీ, వేదం పేరున జరుగుతున్న కర్మలను మాత్రమే అని మనం తెలుసుకోలేదు. వేదం అంటే యజ్ఞ,యాగాలు మాత్రమే అనే నమ్మకం కలిగించారు.ఇది ఈనాటికి జరుగుతున్నది.
"దైవం స్థాణోపరపరాధః యదేనం అంధో న పశ్యతి పురుషాపరాధః న భవతి'' ఒక పదార్థం ఉంది. దాన్ని గ్రుడ్డివాడు చూడడు. తప్పు పదార్థానిది కాదు.గ్రుడ్డివాడిది అవుతుంది.
వేదానికి అర్థం ఉంది. దాన్ని తెలుసుకోనివాడు గ్రుడ్డివాడు . అతడికి వేదకర్మ కనిపిస్తుంది. వేదార్థం కనిపించదు.
క్రీస్తుకు వేయి సంవత్సరాల ముందు వాడైన యాస్కఋషి చెప్పినట్లుగా
''ఒకడు బరువు మోస్తాడు. మోసిందేమిటో తెలియదు. అలాంటివాడే అర్థం తెలియకుండా వేదాన్ని వహించేవాడు.
వేదం చదివి అర్థం చేసుకున్నవాడికి సకల శుభాలు కలుగుతాయి. జ్ఞాన తేజస్సు పాపాల్ను కడిగేస్తుంది.''
అసలు మనము మనవాటి పైన శ్రద్ద చూపనప్పుడు వారిని అని మాత్రం ఏం లాభం? పైన చెప్పిన ఉదాహరణలు కొన్ని మాత్రమే. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోఎన్నెన్నో ఉన్నాయి. మరో టపాలో ఎప్పుడైనా అవి పంచుకొనే ప్రయత్నం చేస్తాను.
వేదాల విషయంలో కూడా జరిగింది, జరుగుతున్నదీ కూడా అదే.
వేదాలు మూడే అన్నారు. అధర్వణ వేదం వేదం కాదని తర్వాత చేరిందన్నారు.
'' చత్వారోహి ఇమే వేదా ఋగ్వేదో యజుర్వేదః
సామవేదో బ్రహ్మవేద ఇతి'' అని గోపథ బ్రాహ్మణం (పూర్వభాగం) అంది. బ్రహ్మవేదమే అథర్వవేదం
'వేదత్రయి' అని మరొక విభజన ఉంది. 1. పద్య, 2. గద్య 3. గేయవిభజన. వేదాలు పద్యంలో దర్శించినవీ, 2. గద్యంలో దర్శించినవీ 3. గేయంలో దర్శించినవీ ఉన్నాయి. ఇది ఛందో విభజన.
వేదం మూడు విషయాలను ప్రతిపాదిస్తుంది. అవి. 1. బ్రహ్మ, 2. ఆత్మ, 3. బ్రహ్మ ఆత్మల ఏకత్వం. అందుకు కూడ అది 'వేదత్రయి' అయింది.
ఇవన్నీ తెల్సుకోరు కానీ వేదాలు మూడే అంటారు, అలానే అని మనలను నమ్మించారు.
వేదానికి 'శ్రుతి' అని కూడా పేరుంది. 'శ్రుతి' అంటే చెవిన పడింది- విన్నది.
ఇంకేం పాశ్చాత్యులకు మంచి అస్త్రం దొరికింది. మనపై మనకే అపనమ్మకం ఏర్పడేలా చేసారు.
శ్రుతి అంటే విన్నది కాబట్టి వేదకాలం నాటికి అక్షరం లేదని వ్యాఖ్యానించారు. తొలుత వేదం పలుకబడింది , వ్రాయబడలేదు అన్నారు. అదే నిజం అని మనం నమ్ముతున్నాం.
వేదమంత్రాలు స్వర ప్రాధాన్యం కలవి కాబట్టి విని నేర్చుకొని ఒక విధానంలో వాటిని పలకాలి. ఇలా వింటూ నేర్చుకొనే విధానం ఉండేది కాబట్టి "శ్రుతి" అన్నారు.అంతే కాకుండా వేద మంత్రాలను ఋషులు తమ తపో బలంతో తపస్సు లో వాటిని విని అక్షరబద్దం చేసారు(వ్రాసారు). వారు వాటిని విన్నారు కాబట్టి శ్రుతి అయింది. పాశ్చాత్యులకు ఈ విషయం తెలుసో లేదో లేక తెలిసే మనలను నమ్మించారో తెలియదు. మనవాళ్ళూ వారు చెప్పిందే నమ్మారు.
గౌతమ బుద్దుడూ, శ్రీ రామానుజాచార్యులూ వేదాలను నిరసించారని మనలనే నమ్మేలా చేసారు. నిజానికి వారు నిరసించింది వేదాలను కాదనీ, వేదం పేరున జరుగుతున్న కర్మలను మాత్రమే అని మనం తెలుసుకోలేదు. వేదం అంటే యజ్ఞ,యాగాలు మాత్రమే అనే నమ్మకం కలిగించారు.ఇది ఈనాటికి జరుగుతున్నది.
"దైవం స్థాణోపరపరాధః యదేనం అంధో న పశ్యతి పురుషాపరాధః న భవతి'' ఒక పదార్థం ఉంది. దాన్ని గ్రుడ్డివాడు చూడడు. తప్పు పదార్థానిది కాదు.గ్రుడ్డివాడిది అవుతుంది.
వేదానికి అర్థం ఉంది. దాన్ని తెలుసుకోనివాడు గ్రుడ్డివాడు . అతడికి వేదకర్మ కనిపిస్తుంది. వేదార్థం కనిపించదు.
క్రీస్తుకు వేయి సంవత్సరాల ముందు వాడైన యాస్కఋషి చెప్పినట్లుగా
''ఒకడు బరువు మోస్తాడు. మోసిందేమిటో తెలియదు. అలాంటివాడే అర్థం తెలియకుండా వేదాన్ని వహించేవాడు.
వేదం చదివి అర్థం చేసుకున్నవాడికి సకల శుభాలు కలుగుతాయి. జ్ఞాన తేజస్సు పాపాల్ను కడిగేస్తుంది.''
అసలు మనము మనవాటి పైన శ్రద్ద చూపనప్పుడు వారిని అని మాత్రం ఏం లాభం? పైన చెప్పిన ఉదాహరణలు కొన్ని మాత్రమే. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోఎన్నెన్నో ఉన్నాయి. మరో టపాలో ఎప్పుడైనా అవి పంచుకొనే ప్రయత్నం చేస్తాను.
Friday, June 25, 2010
భారతదేశం పై ఆర్యుల దండయాత్ర(లేక వలస) లో నిజానిజాలు ఎంత?
ఇదేదో హిందుత్వవాదమో మరొకటో అని అపార్థం చేసుకోకండి. సరే విషయానికి వద్దాము.
1.మొదట మన వేదాలను గమనిద్దాము.వేదాలను అనుసరించే ఈ సిద్దాంతాన్ని ఆంగ్లేయులు ప్రతిపాదించారు.కాని వేద పరిబాషలో ఆర్యుడు అనగా గౌరవ వాచకం.ఉత్తమ నడవడిక,మంచి వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు.అంతే కాని ఈ పదాన్ని జాతిని సూచించేదిగా ఎక్కడా వేదాలలో ఉపయోగించలేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలలో వలస విషయం కాని,దండయాత్ర విషయం కాని ఎక్కడా చెప్పబడలేదు.
దస్యుడు అనగా మంచి నడవడికలేని వాడని అర్థము.
వేదాలలో కాని,పురాణేతిహాసాలలో కాని ఆర్యావర్తము లేక ద్రవిడ ప్రదేశం అని ప్రాంతాలను బట్టి మాత్రమే పేర్లు పెట్టడం జరిగింది.
ఇక రావణుడు ద్రావిడుడని,రాముడు ఆర్యుడని అపార్థం చేసుకొన్నారు.అపార్థం అని ఎందుకు అన్నానంటే దీనికి ఋజువుగా వాల్మీకి రామాయణంలో మండోదరి రావణుడిని "ఆర్యపుత్రా" అనే సంబోధిస్తుంది.రామాయణమును పూర్తిగా చదివిన వారెవరైనా ఈ విషయాన్ని చూడవచ్చు.
2.ఆంగ్లేయులు ఎలా ఈ సిద్దాంతానికి పథకం రచించారో కొన్ని ఋజువులు.
అ)1866,ఏప్రిల్ 10 వ తేదీ లండన్ లోని "రాయల్ ఏషియాటిక్ సొసైటీ" రహస్య సమావేశ తీర్మానం
"ఆర్య దండయాత్ర సిద్దాంతం భారతీయుల మనసులలోనికి ఎక్కించాలి.అలగైతేనే వారు బ్రిటిష్వారిని పరాయి పాలకులుగా భావించరు.ఎందుకంటే అనాదిగా వారిపై ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు.అందువలన మనపాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు."
(వనరు:Proof of Vedic Culture's global Existence - by Stephen Knapp.page-39)
ఆ)మ్యాక్స్ముల్లర్ 1886లో తన భార్యకు వ్రాసిన ఉత్తరం
"నేను ఈ వేదం అనువదించటంలో భారతదేశపు తలరాత "గొప్పగా" మారబోతూ ఉంది.అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.ఈ వేదం(ఋగ్వేదం) వారి మతానికి తల్లివేరు.3000 ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకలించి వేస్తుంది."
(వనరు:The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife,1902,Volume I.page 328)
విశేషం ఏమంటే 1746-1794 మధ్య కలకత్తా లో భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన "విలియం జోన్స్",మ్యాక్స్ ముల్లర్ గార్లే ఈ "ఆర్య" శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
3.ఇక భారతీయుల పరిశోధనలు చూద్దాం.
1946లో అంబేద్కర్ రచించిన "Who were the sudras?" అనే పుస్తకంలో శూద్రులు-ఆర్యులు అని ఒక అద్యాయం రచించాడు.అందులో " పాశ్చాత్యులు సృష్టించిన "ఆర్యజాతి" సిద్దాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు.ఈ సిద్దాంతాన్ని పరిశీలిస్తే లోటుపాట్లు రెండు విధాలు గా కనిపిస్తాయి.అవి ఒకటి ఈ సిద్దాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకొన్న ఊహల నుండి గ్రహించుకొన్న భావనలు గానూ,రెండు.ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ,నిజాలను గుర్తించకుండా మొదటే ఒక సిద్దాంతం అనుకొని దానికి అనుగుణమైన ఋజువులు చూపిస్తున్నట్లు ఉంది"
Secrets of vedas అనే గ్రంథమును అరవిందులు రచించారు.ఇందులో "ఆర్యుల సిద్దాంతం గురించిన హేతువులు,ఋజువులు వేదాలలో అసలు కనిపించవు.అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి అసలు ఎక్కడా లేదు".
4.సైంటిఫిక్ ఋజువులు:
1920లో బయటపడిన "సింధు నాగరికత"తవ్వకాలతో ఆర్యుల దండయాత్ర సిద్దాంతం తప్పని ఋజువైంది.హరప్పా,మొహంజదారో
మొదలైన స్థలాలు,లోతల్ రేవు,వీటి నగర నిర్మాణ రీతులు మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో 10వేల సంవత్సరాలుగా ఉన్నతస్థాయిలో వర్ధిల్లుతున్నది అని ఋజువులు చూపిస్తున్నాయి.బ్రిటిష్వారి ప్రకారమే మహాభారతం ఇప్పటికి 5000 సంవత్సరాల క్రిందటిది.మన అందరికి తెలుసు రామాయణం అంతకంటే ముందరిది.ఒక వేళ రామాయణ ప్రామాణికతను ఎవరైనా ప్రశ్నించినా వేదాల ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేదు.వేదాలు మహాభారత కాలం కన్నా ఎంతో ముందని తెలుసు.మరి ఆ వేదాలలోనే "ఆర్య" శబ్దం ఉన్నదనీ తెలుసు.అటువంటిది 'గుర్రాలపై దండెత్తి" ఆర్యులు ద్రావిడులను 3500(క్రీ.పూ 1500 నుండి క్రీ.పూ 100 మధ్య) సంవత్సరాల క్రిందట తరిమికొట్టారన్నది ఏ మాత్రం అర్థం లేనిది.
1980లో ఉపగ్రహాల ద్వారా 'సరస్వతీ' నది ప్రవహించిన ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ ప్రవాహ మార్గం ఖచ్చితంగా సరిపోతోంది. వేద నాగరికత సరస్వతీ నదీ తీరంలో వెలసినది అని వేదాలు మనకు చెబుతున్నాయి.కాని బ్రిటిష్వారు ఈ నదిని ఒక ఊహగా,వేదాల సృష్టిగా చిత్రీకరించారు.
ముఖ్య విషయం ఏమిటంటే సైంటిఫిక్ గా కానీ,చారిత్రికంగా కానీ ఆర్యుల దాడి కి సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ లేవు.
ఇక ఉత్తర భారత,దక్షిణ భారత ప్రజల శరీర నిర్మాణం,రంగుల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం హిమాలయాలు ఉండడం వలన అధిక చల్లదనాన్ని కలిగిఉంది.దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వలన వాతావరణం వేడి గా ఉంటుంది.అందువలనే ప్రజల భౌతిక రూపాలలో తేడాలు ఉన్నాయి.ఒకే రాష్ట్రం లో ని ప్రజల ఒకే బాషలో తేడాలు(యాస),ఆచారాలలో తేడాలు ఉన్నప్పుడు విశాల భారతదేశంలో ఆచారవ్యవహారాలలో తేడాలు ఉండడం విషయం కాదు.ఉదాహరణకు తమిళనాడులోనూ,ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలోనూ పెళ్ళికూతురుని ఒక గంపలో కూర్చుండబెట్టి పిలుచుకురావడమనే ఆచారం ఉంది.కాని ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలోనే ఈ ఆచారం లేదు.నేను నివశించే అనంతపురం జిల్లాలో కూడా ఈ ఆచారం లేదు.ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.
ముక్తాయింపు:
వ్యక్తిగత విమర్శలు చేస్తే అవి తొలగిస్తాను. మీ వద్ద గల అధారాలు, అభిప్రాయాలు మాత్రం చెప్పగలరు.
1.మొదట మన వేదాలను గమనిద్దాము.వేదాలను అనుసరించే ఈ సిద్దాంతాన్ని ఆంగ్లేయులు ప్రతిపాదించారు.కాని వేద పరిబాషలో ఆర్యుడు అనగా గౌరవ వాచకం.ఉత్తమ నడవడిక,మంచి వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు.అంతే కాని ఈ పదాన్ని జాతిని సూచించేదిగా ఎక్కడా వేదాలలో ఉపయోగించలేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలలో వలస విషయం కాని,దండయాత్ర విషయం కాని ఎక్కడా చెప్పబడలేదు.
దస్యుడు అనగా మంచి నడవడికలేని వాడని అర్థము.
వేదాలలో కాని,పురాణేతిహాసాలలో కాని ఆర్యావర్తము లేక ద్రవిడ ప్రదేశం అని ప్రాంతాలను బట్టి మాత్రమే పేర్లు పెట్టడం జరిగింది.
ఇక రావణుడు ద్రావిడుడని,రాముడు ఆర్యుడని అపార్థం చేసుకొన్నారు.అపార్థం అని ఎందుకు అన్నానంటే దీనికి ఋజువుగా వాల్మీకి రామాయణంలో మండోదరి రావణుడిని "ఆర్యపుత్రా" అనే సంబోధిస్తుంది.రామాయణమును పూర్తిగా చదివిన వారెవరైనా ఈ విషయాన్ని చూడవచ్చు.
2.ఆంగ్లేయులు ఎలా ఈ సిద్దాంతానికి పథకం రచించారో కొన్ని ఋజువులు.
అ)1866,ఏప్రిల్ 10 వ తేదీ లండన్ లోని "రాయల్ ఏషియాటిక్ సొసైటీ" రహస్య సమావేశ తీర్మానం
"ఆర్య దండయాత్ర సిద్దాంతం భారతీయుల మనసులలోనికి ఎక్కించాలి.అలగైతేనే వారు బ్రిటిష్వారిని పరాయి పాలకులుగా భావించరు.ఎందుకంటే అనాదిగా వారిపై ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు.అందువలన మనపాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు."
(వనరు:Proof of Vedic Culture's global Existence - by Stephen Knapp.page-39)
ఆ)మ్యాక్స్ముల్లర్ 1886లో తన భార్యకు వ్రాసిన ఉత్తరం
"నేను ఈ వేదం అనువదించటంలో భారతదేశపు తలరాత "గొప్పగా" మారబోతూ ఉంది.అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.ఈ వేదం(ఋగ్వేదం) వారి మతానికి తల్లివేరు.3000 ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకలించి వేస్తుంది."
(వనరు:The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife,1902,Volume I.page 328)
విశేషం ఏమంటే 1746-1794 మధ్య కలకత్తా లో భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన "విలియం జోన్స్",మ్యాక్స్ ముల్లర్ గార్లే ఈ "ఆర్య" శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
3.ఇక భారతీయుల పరిశోధనలు చూద్దాం.
1946లో అంబేద్కర్ రచించిన "Who were the sudras?" అనే పుస్తకంలో శూద్రులు-ఆర్యులు అని ఒక అద్యాయం రచించాడు.అందులో " పాశ్చాత్యులు సృష్టించిన "ఆర్యజాతి" సిద్దాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు.ఈ సిద్దాంతాన్ని పరిశీలిస్తే లోటుపాట్లు రెండు విధాలు గా కనిపిస్తాయి.అవి ఒకటి ఈ సిద్దాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకొన్న ఊహల నుండి గ్రహించుకొన్న భావనలు గానూ,రెండు.ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ,నిజాలను గుర్తించకుండా మొదటే ఒక సిద్దాంతం అనుకొని దానికి అనుగుణమైన ఋజువులు చూపిస్తున్నట్లు ఉంది"
Secrets of vedas అనే గ్రంథమును అరవిందులు రచించారు.ఇందులో "ఆర్యుల సిద్దాంతం గురించిన హేతువులు,ఋజువులు వేదాలలో అసలు కనిపించవు.అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి అసలు ఎక్కడా లేదు".
4.సైంటిఫిక్ ఋజువులు:
1920లో బయటపడిన "సింధు నాగరికత"తవ్వకాలతో ఆర్యుల దండయాత్ర సిద్దాంతం తప్పని ఋజువైంది.హరప్పా,మొహంజదారో
మొదలైన స్థలాలు,లోతల్ రేవు,వీటి నగర నిర్మాణ రీతులు మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో 10వేల సంవత్సరాలుగా ఉన్నతస్థాయిలో వర్ధిల్లుతున్నది అని ఋజువులు చూపిస్తున్నాయి.బ్రిటిష్వారి ప్రకారమే మహాభారతం ఇప్పటికి 5000 సంవత్సరాల క్రిందటిది.మన అందరికి తెలుసు రామాయణం అంతకంటే ముందరిది.ఒక వేళ రామాయణ ప్రామాణికతను ఎవరైనా ప్రశ్నించినా వేదాల ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేదు.వేదాలు మహాభారత కాలం కన్నా ఎంతో ముందని తెలుసు.మరి ఆ వేదాలలోనే "ఆర్య" శబ్దం ఉన్నదనీ తెలుసు.అటువంటిది 'గుర్రాలపై దండెత్తి" ఆర్యులు ద్రావిడులను 3500(క్రీ.పూ 1500 నుండి క్రీ.పూ 100 మధ్య) సంవత్సరాల క్రిందట తరిమికొట్టారన్నది ఏ మాత్రం అర్థం లేనిది.
1980లో ఉపగ్రహాల ద్వారా 'సరస్వతీ' నది ప్రవహించిన ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ ప్రవాహ మార్గం ఖచ్చితంగా సరిపోతోంది. వేద నాగరికత సరస్వతీ నదీ తీరంలో వెలసినది అని వేదాలు మనకు చెబుతున్నాయి.కాని బ్రిటిష్వారు ఈ నదిని ఒక ఊహగా,వేదాల సృష్టిగా చిత్రీకరించారు.
ముఖ్య విషయం ఏమిటంటే సైంటిఫిక్ గా కానీ,చారిత్రికంగా కానీ ఆర్యుల దాడి కి సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ లేవు.
ఇక ఉత్తర భారత,దక్షిణ భారత ప్రజల శరీర నిర్మాణం,రంగుల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం హిమాలయాలు ఉండడం వలన అధిక చల్లదనాన్ని కలిగిఉంది.దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వలన వాతావరణం వేడి గా ఉంటుంది.అందువలనే ప్రజల భౌతిక రూపాలలో తేడాలు ఉన్నాయి.ఒకే రాష్ట్రం లో ని ప్రజల ఒకే బాషలో తేడాలు(యాస),ఆచారాలలో తేడాలు ఉన్నప్పుడు విశాల భారతదేశంలో ఆచారవ్యవహారాలలో తేడాలు ఉండడం విషయం కాదు.ఉదాహరణకు తమిళనాడులోనూ,ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలోనూ పెళ్ళికూతురుని ఒక గంపలో కూర్చుండబెట్టి పిలుచుకురావడమనే ఆచారం ఉంది.కాని ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలోనే ఈ ఆచారం లేదు.నేను నివశించే అనంతపురం జిల్లాలో కూడా ఈ ఆచారం లేదు.ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.
ముక్తాయింపు:
వ్యక్తిగత విమర్శలు చేస్తే అవి తొలగిస్తాను. మీ వద్ద గల అధారాలు, అభిప్రాయాలు మాత్రం చెప్పగలరు.
Thursday, June 24, 2010
ఎప్పుడూ తన పదవి పోతుందని భయపడే ఇంద్రుడికి వేదాలలో అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు?
ఏంటండీ ఇంద్రుడు ఎప్పుడూ తమ మానాన తాము దైవసాక్షాత్కారం కోసం తపస్సు చేసుకొనే ఋషుల తపస్సును భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తూంటాడు. అలానే అతనికి ఒక మామూలు మనుషికి ఉండే దుర్గుణాలన్నీ ఉంటాయి. అంటే ఇతర స్త్రీలను ఆశించడం, పదవీ వ్యామోహం మొదలగునవి ఉంటాయి. మరి ఇలాంటి ఇంద్రునికి మనం ఎంతో గొప్పగా చెప్పుకొనే వేదాలలో అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు అనే సందేహం చాలామందికి ఉంది. విషయం తెలియక ఈ కారణంతోనే వేదాలను నింద చేసే వారున్నారు.
ఆ అనుమానంను నివృత్తి చేయడానికి ఈ టపా దోహదం చేస్తుందని భావిస్తున్నాను.
మొదట మనం ఇక్కడ తెలుసుకోవలసింది పైన అనుకొన్న ఇంద్రుడు ఒక దేవత లేక దేవతలరాజు,స్వర్గలోకాధిపతి. ఈ ఇంద్రుడు ఇంద్రియాలకు అధిపతి.కాబట్టి ఈ ఇంద్రునికి మానవస్వభావాలన్నీ(కామ,క్రోధ,లోభాది గుణాలు)అంటగట్టబడ్డాయి. అందుకే ఇతను తన పదవి పోతుందనే భయము తో ఋషులు చేసే తపస్సును భగ్నం చేస్తుంటాడు.
ఇక వేదాలలో ప్రస్తుతింపబడ్డ లేక పూజింపబడిన ఇంద్రుని విషయానికి వద్దాం.
అసలు విషయం ఏమిటంటే వేదాలలో ఇంద్రునిగా భావించి పూజించినది ఇంద్రుడు అనే దేవతను కాదు, "ఇంద్ర" అనే శబ్దాన్నిలేక ఆ శబ్దానికి అర్హులైనవారిని.
ఈ "ఇంద్ర" అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఎందుకని పూజించారు?. అన్న ప్రశ్నలకు ఋగ్వేదములోని ఐతరేయోపనిషత్తు సమాధానం చెబుతుంది. ఇందులోని 1వ అధ్యాయం, 3వ అనువాకంలోని 13,14 శ్లోకాలు అర్థం
13.మనుష్యరూపమున ఉత్పన్నమైన జీవుడు ఈ విచిత్ర జగత్తును చూచి దీని కర్త, ధర్త(ధరించువాడు) మరియొకరు ఉండవలెనని భావించి తన హృదయమందు అంతర్యామి రూపమున విరాజిల్లు పరమాత్మ సాక్షాత్కారము పొందెను. పరమాత్మయే ఈ విచిత్ర జగత్తుకు కర్త,ధర్త(ధరించువాడు)యని, ఆయన శక్తి యందు పూర్ణ విశ్వాసముకలిగి, ఆయనను పొంద ఉత్సుకతతో ప్రయత్నించిన ఆయనను పొందగలడు, మనుష్య శరీరము ద్వారానే ఆయనను పొందవచ్చును. కావున మనుష్యుడు తన అమూల్య సమయమును వృధాచేయక పరమాత్మ ప్రాప్తికి సాధన చేయవలెను.
14.మనుష్య శరీర రూపమున ఉత్పన్నమైన జీవుడు పై చెప్పిన విధమున పరమాత్మను సాక్షాత్కరింప జేసుకొనుటచే పరమాత్మను ఇదం+ద్ర= ఇదంద్ర. అంటే "నేను చూచితిని" అను పేరుతో చే పిలుతురు. అదియే పరోక్షరూపమున అంటే వ్యావహారిక రూపమున "ఇంద్ర" అనే పేరుతో వ్యవహరింతురు.
కాబట్టి వేదాల ప్రకారం ఇంద్రుడు అంటే కేవలం ఒక్కరే కాదు. ఎవరెవరు భగవంతుని చూసారో లేక ప్రత్యక్షం చేసుకొన్నారో వారందరూ ఇంద్రులే.
అటువంటి ఇంద్రులను లేక ఇంద్ర శబ్దాన్ని పొందినవారినే వేదాలలో పూజించారు. అంతేకాని ఒకే ఇంద్రున్ని లేక ఇంద్రుడనే వ్యక్తిని అని కాని కాదు.
గమనిక : గతంలో ఈ విషయానికి సంబందించిన టపా వ్రాసినప్పటికీ పొరపాటున అది తొలగింపబడడం వలన మళ్ళీ వ్రాస్తున్నాను.
ఆ అనుమానంను నివృత్తి చేయడానికి ఈ టపా దోహదం చేస్తుందని భావిస్తున్నాను.
మొదట మనం ఇక్కడ తెలుసుకోవలసింది పైన అనుకొన్న ఇంద్రుడు ఒక దేవత లేక దేవతలరాజు,స్వర్గలోకాధిపతి. ఈ ఇంద్రుడు ఇంద్రియాలకు అధిపతి.కాబట్టి ఈ ఇంద్రునికి మానవస్వభావాలన్నీ(కామ,క్రోధ,లోభాది గుణాలు)అంటగట్టబడ్డాయి. అందుకే ఇతను తన పదవి పోతుందనే భయము తో ఋషులు చేసే తపస్సును భగ్నం చేస్తుంటాడు.
ఇక వేదాలలో ప్రస్తుతింపబడ్డ లేక పూజింపబడిన ఇంద్రుని విషయానికి వద్దాం.
అసలు విషయం ఏమిటంటే వేదాలలో ఇంద్రునిగా భావించి పూజించినది ఇంద్రుడు అనే దేవతను కాదు, "ఇంద్ర" అనే శబ్దాన్నిలేక ఆ శబ్దానికి అర్హులైనవారిని.
ఈ "ఇంద్ర" అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఎందుకని పూజించారు?. అన్న ప్రశ్నలకు ఋగ్వేదములోని ఐతరేయోపనిషత్తు సమాధానం చెబుతుంది. ఇందులోని 1వ అధ్యాయం, 3వ అనువాకంలోని 13,14 శ్లోకాలు అర్థం
13.మనుష్యరూపమున ఉత్పన్నమైన జీవుడు ఈ విచిత్ర జగత్తును చూచి దీని కర్త, ధర్త(ధరించువాడు) మరియొకరు ఉండవలెనని భావించి తన హృదయమందు అంతర్యామి రూపమున విరాజిల్లు పరమాత్మ సాక్షాత్కారము పొందెను. పరమాత్మయే ఈ విచిత్ర జగత్తుకు కర్త,ధర్త(ధరించువాడు)యని, ఆయన శక్తి యందు పూర్ణ విశ్వాసముకలిగి, ఆయనను పొంద ఉత్సుకతతో ప్రయత్నించిన ఆయనను పొందగలడు, మనుష్య శరీరము ద్వారానే ఆయనను పొందవచ్చును. కావున మనుష్యుడు తన అమూల్య సమయమును వృధాచేయక పరమాత్మ ప్రాప్తికి సాధన చేయవలెను.
14.మనుష్య శరీర రూపమున ఉత్పన్నమైన జీవుడు పై చెప్పిన విధమున పరమాత్మను సాక్షాత్కరింప జేసుకొనుటచే పరమాత్మను ఇదం+ద్ర= ఇదంద్ర. అంటే "నేను చూచితిని" అను పేరుతో చే పిలుతురు. అదియే పరోక్షరూపమున అంటే వ్యావహారిక రూపమున "ఇంద్ర" అనే పేరుతో వ్యవహరింతురు.
కాబట్టి వేదాల ప్రకారం ఇంద్రుడు అంటే కేవలం ఒక్కరే కాదు. ఎవరెవరు భగవంతుని చూసారో లేక ప్రత్యక్షం చేసుకొన్నారో వారందరూ ఇంద్రులే.
అటువంటి ఇంద్రులను లేక ఇంద్ర శబ్దాన్ని పొందినవారినే వేదాలలో పూజించారు. అంతేకాని ఒకే ఇంద్రున్ని లేక ఇంద్రుడనే వ్యక్తిని అని కాని కాదు.
గమనిక : గతంలో ఈ విషయానికి సంబందించిన టపా వ్రాసినప్పటికీ పొరపాటున అది తొలగింపబడడం వలన మళ్ళీ వ్రాస్తున్నాను.
వర్గాలు
వేదాలు-అందు దాగిఉన్న సత్యాలు
Wednesday, June 23, 2010
ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి మీరు చేస్తున్న నిర్వాకానికి?
మొన్న ఉప్పల్,హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో అభం,శుభం ఎరుగని, కల్లాకపటం తెలియని చిన్నపిల్లలు ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. దీనికి కారణం మద్యం తాగి వాహనం నడపడమే.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మద్యం త్రాగండి, త్రాగి చంపండి, మీరూ చావండి" పథకం అత్యద్బుతంగా పనిచేస్తోంది. లేకుంటే ప్రజాసంక్షేమం మరిచి మద్యం ఏరులై పారిస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ఎండాకాలంలో వీధి వీధికో చలివేంద్రం ఉన్నట్లుగా వీధివీధికీ మద్యం అంగళ్ళ లైసెన్సులు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వఖజానా నిండడం కోసం న్యాయమైన మార్గాలు వదిలి, ఇలాంటి మార్గాలు అనుసరిస్తూ ముక్కుపచ్చలారని పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రాణాలు తీస్తుంటే మనం ఇలా ఎన్నాళ్ళని చేతులు ముడుచుకొని కూర్చోవాలి? అనుభవజ్ఞులు కూడా ఏం చేయలేరా? కనీసం అనుభవజ్ఞులు ఒక ప్రణాళిక రచిస్తే ఇలాంటి సంఘటనల వలన బాధపడే యువత కూడా ముందుకొస్తుంది కదా!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మద్యం త్రాగండి, త్రాగి చంపండి, మీరూ చావండి" పథకం అత్యద్బుతంగా పనిచేస్తోంది. లేకుంటే ప్రజాసంక్షేమం మరిచి మద్యం ఏరులై పారిస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ఎండాకాలంలో వీధి వీధికో చలివేంద్రం ఉన్నట్లుగా వీధివీధికీ మద్యం అంగళ్ళ లైసెన్సులు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వఖజానా నిండడం కోసం న్యాయమైన మార్గాలు వదిలి, ఇలాంటి మార్గాలు అనుసరిస్తూ ముక్కుపచ్చలారని పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రాణాలు తీస్తుంటే మనం ఇలా ఎన్నాళ్ళని చేతులు ముడుచుకొని కూర్చోవాలి? అనుభవజ్ఞులు కూడా ఏం చేయలేరా? కనీసం అనుభవజ్ఞులు ఒక ప్రణాళిక రచిస్తే ఇలాంటి సంఘటనల వలన బాధపడే యువత కూడా ముందుకొస్తుంది కదా!
Thursday, June 17, 2010
మంత్రాలకు చింతకాయలు ఎందుకు రాలకూడదు?
ఒక మనిషిని "ఓ మూర్ఖుడా!,నువ్వెందుకూ పనికిరావు" అంటే కృంగిపోవచ్చు లేక అన్నవాడిపై కోప్పడవచ్చు. అప్పటి వరకు అతను ఎంత ఆనందంగా ఉన్నా ఈ మాట అనేసరికి ముఖం అంతా మాడిపోయి,డీలా పడిపోయి ఇంతకు ముందు మనం చూసిన అతను ఇతనేనా అనుకొనేట్లు మారిపోతాడు.
అలానే " మీ అంత మంచివారు ఈ కాలంలో చాలా అరుదండీ!, మీరు చాలా గొప్పవారు" అంటే పొంగిపోతాడు. ఆ పొంగు బయటకు కనపడకపోవచ్చు కాని మనసు ఆనందపడుతుంది.
పైన చెప్పిన రెండు సందర్బాలలోనూ ఏమాత్రం పట్టించుకొనని వారు నూటికో,కోటికో కొందరే ఉంటారు. అంటే ప్రతిస్పందన(Reaction) చూపేవారు నూటికి 95 శాతం పైమాటే.
ఇక్కడ మనం మాట్లాడే మాటలు ఆ వ్యక్తిపై ప్రభావం చూపుతున్నాయి కదా. అంటే మనసున్న ప్రతి మనిషీ మాట్లాడే విధానాన్ని బట్టి అతని స్వభావం, అందుకు తగినట్లు ముఖకవళికలు మారుతాయి కదా. చివరికి జంతువులు కూడా మన మనసు బాగా లేనప్పుడు, మనం కోపంతో గట్టిగా అరుస్తున్నప్పుడు అవి కూడా మన వద్ద ముభావం(Dull) గా ఉంటాయి కదా. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. అంటే మనసు పై మాటల ప్రభావం ఖచ్చితం గా ఉంటుందని అందరికీ తెలుసు.
ఇక అసలు విషయానికి వద్దాం.
నేటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పుణ్యమా అని మొక్కలకు,చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని అలానే మనసు కూడా ఉంటుందని, అవి కూడా తమ భావాలను(ఆనందం లేక బాధలను) వ్యక్తపరుస్తాయని తెలుస్తోంది. మనం పరిహాసం గా మాట్లాడితే ఆ మాటల పౌనఃపున్యము, స్థాయి ఒకలా ఉంటాయి. అలానే సీరియస్ గా మాట్లాడినప్పుడు కూడా ఆ మాటల పౌనఃపున్యము,స్థాయిలు వేరేగా ఉంటాయి. అందరికీ ఈ సైన్సు విషయాలు తెలియకపోవచ్చు. కాని తెలిసినా,తెలియకున్నా జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా.
అంటే ఎలా మాట్లాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయం పై మనకు ఒక అవగాహన(Idea) ఉంటుంది కదా. మరి మనలానే మనసు గల చెట్లపై నిర్ధిష్ట పౌనఃపున్యము, స్థాయి గల మాటలు మాట్లాడితే అవి కాయలు రాల్చనూవచ్చు, లేక చెట్టే పడిపోవనూవచ్చు అనే విషయం పై అనుమానం ఎందుకుండాలి. మంత్రాలంటే ఒక విధివిధానం గల మాటలే కదా.
ఋషులంటే కేవలం ఆధ్యాత్మికవాదులే కాదు కదా, ఏ శాస్త్రంలో నిష్ణాతులైనా వారిని ఋషులనే అంటాము. ఉదాహరణకు కణము అనే భావనను కనిపెట్టిన కణాదున్ని ఋషి అనే అన్నాము. మంత్రాలతో పనులు చేయవచ్చు అని అన్నది ఆ ఋషులే కదా.
మన కాలపు మనుషులకు తెలిసింది పూర్వకాలపు మనుషులకు తెలియకపోవచ్చు, అలానే వారికి తెలిసింది మనకు తెలియకపోవచ్చు. అంతమాత్రాన కేవలం హేతువును లేక తర్కాన్ని పట్టుకొని వారు చెప్పింది అసంభవం,బూటకం అని అనడం ఎంతవరకు సమంజసం? వారు చెప్పిన దానిపై పరిశోధన చేద్దాం. తప్పని ఋజువైతే అప్పుడు బూటకం అందాం. మనం ఏ పరిశోధన చేయకుండా ,ఊరకే పనీపాటాలేని పెద్దలు రచ్చబండ పైనో, చెట్ల క్రిందనో కూర్చొని చెప్పారు, అని అవి బూటకం అని ఎలా అనగలం.
గమనిక: మంత్రాలకు చింతకాయలు రాలడం అనే భావన ను ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను మంత్రాలను నమ్మమనీ చెప్పడం లేదు, అలాగే నమ్మవద్దనీ చెప్పడం లేదు. విశ్వాసం,నమ్మకం ఉన్న వారిని వారి మానాన వారిని వదిలెయ్యండి. పరిశోధనల ఫలితంగా మీరనుకొన్నదే ఋజువైతే కనుక అప్పుడు మాట్లాడవచ్చు. ఏ విషయమైనా మన ఊహకు అందనంత మాత్రాన ఆ విషయంపై అతి తొందరగా ఒక అభిప్రాయానికి రావద్దని మాత్రమే నేను చెప్పదలచుకొన్నది.
అలానే " మీ అంత మంచివారు ఈ కాలంలో చాలా అరుదండీ!, మీరు చాలా గొప్పవారు" అంటే పొంగిపోతాడు. ఆ పొంగు బయటకు కనపడకపోవచ్చు కాని మనసు ఆనందపడుతుంది.
పైన చెప్పిన రెండు సందర్బాలలోనూ ఏమాత్రం పట్టించుకొనని వారు నూటికో,కోటికో కొందరే ఉంటారు. అంటే ప్రతిస్పందన(Reaction) చూపేవారు నూటికి 95 శాతం పైమాటే.
ఇక్కడ మనం మాట్లాడే మాటలు ఆ వ్యక్తిపై ప్రభావం చూపుతున్నాయి కదా. అంటే మనసున్న ప్రతి మనిషీ మాట్లాడే విధానాన్ని బట్టి అతని స్వభావం, అందుకు తగినట్లు ముఖకవళికలు మారుతాయి కదా. చివరికి జంతువులు కూడా మన మనసు బాగా లేనప్పుడు, మనం కోపంతో గట్టిగా అరుస్తున్నప్పుడు అవి కూడా మన వద్ద ముభావం(Dull) గా ఉంటాయి కదా. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. అంటే మనసు పై మాటల ప్రభావం ఖచ్చితం గా ఉంటుందని అందరికీ తెలుసు.
ఇక అసలు విషయానికి వద్దాం.
నేటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పుణ్యమా అని మొక్కలకు,చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని అలానే మనసు కూడా ఉంటుందని, అవి కూడా తమ భావాలను(ఆనందం లేక బాధలను) వ్యక్తపరుస్తాయని తెలుస్తోంది. మనం పరిహాసం గా మాట్లాడితే ఆ మాటల పౌనఃపున్యము, స్థాయి ఒకలా ఉంటాయి. అలానే సీరియస్ గా మాట్లాడినప్పుడు కూడా ఆ మాటల పౌనఃపున్యము,స్థాయిలు వేరేగా ఉంటాయి. అందరికీ ఈ సైన్సు విషయాలు తెలియకపోవచ్చు. కాని తెలిసినా,తెలియకున్నా జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా.
అంటే ఎలా మాట్లాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయం పై మనకు ఒక అవగాహన(Idea) ఉంటుంది కదా. మరి మనలానే మనసు గల చెట్లపై నిర్ధిష్ట పౌనఃపున్యము, స్థాయి గల మాటలు మాట్లాడితే అవి కాయలు రాల్చనూవచ్చు, లేక చెట్టే పడిపోవనూవచ్చు అనే విషయం పై అనుమానం ఎందుకుండాలి. మంత్రాలంటే ఒక విధివిధానం గల మాటలే కదా.
ఋషులంటే కేవలం ఆధ్యాత్మికవాదులే కాదు కదా, ఏ శాస్త్రంలో నిష్ణాతులైనా వారిని ఋషులనే అంటాము. ఉదాహరణకు కణము అనే భావనను కనిపెట్టిన కణాదున్ని ఋషి అనే అన్నాము. మంత్రాలతో పనులు చేయవచ్చు అని అన్నది ఆ ఋషులే కదా.
మన కాలపు మనుషులకు తెలిసింది పూర్వకాలపు మనుషులకు తెలియకపోవచ్చు, అలానే వారికి తెలిసింది మనకు తెలియకపోవచ్చు. అంతమాత్రాన కేవలం హేతువును లేక తర్కాన్ని పట్టుకొని వారు చెప్పింది అసంభవం,బూటకం అని అనడం ఎంతవరకు సమంజసం? వారు చెప్పిన దానిపై పరిశోధన చేద్దాం. తప్పని ఋజువైతే అప్పుడు బూటకం అందాం. మనం ఏ పరిశోధన చేయకుండా ,ఊరకే పనీపాటాలేని పెద్దలు రచ్చబండ పైనో, చెట్ల క్రిందనో కూర్చొని చెప్పారు, అని అవి బూటకం అని ఎలా అనగలం.
గమనిక: మంత్రాలకు చింతకాయలు రాలడం అనే భావన ను ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను మంత్రాలను నమ్మమనీ చెప్పడం లేదు, అలాగే నమ్మవద్దనీ చెప్పడం లేదు. విశ్వాసం,నమ్మకం ఉన్న వారిని వారి మానాన వారిని వదిలెయ్యండి. పరిశోధనల ఫలితంగా మీరనుకొన్నదే ఋజువైతే కనుక అప్పుడు మాట్లాడవచ్చు. ఏ విషయమైనా మన ఊహకు అందనంత మాత్రాన ఆ విషయంపై అతి తొందరగా ఒక అభిప్రాయానికి రావద్దని మాత్రమే నేను చెప్పదలచుకొన్నది.
Tuesday, June 15, 2010
ఎప్పటికీ మెకాలేను తిట్టుకుంటూనే ఉందామా? మనం చేసేదేమైనా ఉందా?
మెకాలే అను ఆంగ్లేయుడు మన విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించడంలో అగ్రగణ్యుడని అంటుంటారు. దాని గురించి చర్చ మనకు అనవసరం. మన దురదృష్టమో లేక ప్రారబ్దమో విద్యావ్యవస్థ మారింది. నైతికవిలువల కన్నా మార్కులకే,ర్యాంకులకే ప్రాధాన్యం ఇచ్చే తల్లిదండ్రులే,పెద్దలే ఎక్కువయ్యారు. అందరూ అలానే లేరు కానీ అసలంటూ ఉన్నారని తెలుస్తోంది కదా.
ఇలా ఎందుకంటూ ఉన్నానంటే "ఆట" అనే ఒక TV కార్యక్రమం విషయంలో ఆ పిల్లల తల్లిదండ్రుల వాదన వింటే ఆశ్చర్యం,విస్మయం కగుతుంది. "మాకు లేని బాధ మీకెందుకంటూ?" వారు అన్న మాటలకు జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు విస్తుపోయారు.
మెకాలే పై చర్చ అవసరం లేదు. ఎందుకంటే అతను ఇప్పుడు లేడు. రామాయణం లో శ్రీరాముడు చెప్పినట్లు "ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా కావచ్చు కాని ఆ వ్యక్తి చనిపోవడంతోటే అతని పై శతృత్వాన్ని కూడా మనం చంపేసుకోవాలి". అందుకే వాదన అనవసరం అన్నాను.
జరిగిందేదో జరిగింది, మరి మనం చేసేది ఏంలేదా?
ఇక్కడ విద్యావ్యవస్థ లోని మూల(basic) సమస్యను గురించి చెప్పుకోవాలి."మొక్కై వంగనిది మానై వంగునా" అన్నది మన పెద్దలు చెప్పిన సత్యము.విద్య యొక్క మొదటి లక్ష్యము పిల్లల యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందించడము.తర్వాత నైతికముగా అభివృద్ధి చెందేలా చేయడము అనగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దడము మొదలగునవి వస్తాయి.
ఇక్కడ నిజముగా జరిగిన విషయాన్ని గురించి చూద్దాము."ఒక సారి ఒక మంత్రిగారు మన దేశం నుండి జపాన్ కు పర్యటించడానికి వెళ్ళారు.వారి సాంకేతిక ప్రతిభ మొదలగునవి చూసి ఆశ్చర్యపడి అక్కడి ఒక మంత్రి గారితో "ఏమండీ!పురాణ కాలం నుండీ మన రెండు దేశాలు మంచి మిత్రులు.మీ ప్రజలకున్న తెలివితేటలే భారత ప్రజలకు కూడా ఉన్నాయి కదా.మరి అభివృద్ధి విషయంలో ఇంత తేడా ఎందుకున్నదో చెప్పగలరా?" అన్నారు.
అప్పుడు ఆ జపాన్ మంత్రిగారు "మీరన్నది నిజమే.మనము మంచి మిత్రులమే.ఇంకా చెప్పాలంటే భారతీయులకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము.చాలా వైజ్ఞానిక విషయాలకు మీరే మాకు మార్గదర్శకులు.కాని ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే మా దేశంలో 10 కోట్లమంది "పౌరులు" ఉన్నారు."వ్యక్తులు" లేరు."అని సమాధానం ఇచ్చారు.ఇక్కడ మనం "పౌరులు" మరియు "వ్యక్తులు" మధ్య తేడా గమనించవచ్చు.
జపాన్ వారి విధ్యా విధానంలో విశేషం ఏమిటంటే వారి పిల్లలకు చిన్నపటి నుండే తమ దేశపు గొప్పతనం గురించి వారి సంస్కృతి గొప్పతనం గురించి భోధిస్తారు.వారి దేశపు ప్రఖ్యాత వ్యక్తుల గురించి చెపుతారు.ముఖ్యముగా తమ దేశము భగవంతుని దృష్టిలో ఎంతో ఉన్నతమైనదని అందుకే ప్రపంచములో మొట్టమొదట సూర్యుడు తమ దేశములోనే ఉదయిస్తాడని నూరిపోస్తారు.తద్వారా తమ దేశముపైన అపార గౌరవ విశ్వాసాలు పెంపొందేలా చేస్తారు. తమపైన తమకు విశ్వాసం పెంపొందేలా చేస్తారు.తము మహోన్నత వ్యక్తుల వారసులము అన్న భావన పెంపొందించుకొనేలా చేస్తారు.
తర్వాతే మిగతా విషయాలు అనగా సైన్సు,లెక్కలు మొదలగునవి వస్తాయి.ఇప్పుడు అందరికీ అర్థం అయ్యే ఉంటుంది.జపాన్ వారు అంతగా ఎందుకు అభివృద్ధి చెందారో. కొన్ని విషయాలలో వారూ వెనుకబడి ఉండవచ్చు అన్న విషయం కాని ఇక్కడ ఆ విషయం అప్రస్తుతం అని భావిస్తాను.
మన దేశంలో ఇలాంటి విద్యా విధానాన్ని మనం కలలోనైనా ఊహించగలమా?మన సంస్కృతీసంప్రదాయాలు ఎంత ఉన్నతమైనవో అందరికీ తెలుసు. అవి మాత్రం అసలు చెప్పరు.
ప్రతి దేశపు సంస్కృతిలోనూ కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు, అవి మనకెందుకు? మనం మంచినే పిల్లలకు నేర్పుదాం.
"విద్య యొసగు వినయంబు" అన్న పెద్దలమాట ఎంత వృధాగా పోతోందో మనకు తెలుసు.మన ఇప్పటి విద్యావిధానం పిల్లలను మార్కులు తెచ్చుకొనే యంత్రాలుగా ,ర్యాంకులే పరమావధిగా మారుస్తోంది.ఇక నైతిక,సంస్కార విలువలు ఎలా నేర్పుతాయి?
ఇతర దేశాలవారి నుండి బట్టలు ఎలాంటివి వేసుకోవాలో, ఎలాంటి ఫ్యాషన్ ను అనుకరించాలో నేర్చుకొంటున్నాము కానీ మనకు నిజముగా పనికి వచ్చేది నేర్చుకోవడం లేదు.
ఇలా ఎందుకంటూ ఉన్నానంటే "ఆట" అనే ఒక TV కార్యక్రమం విషయంలో ఆ పిల్లల తల్లిదండ్రుల వాదన వింటే ఆశ్చర్యం,విస్మయం కగుతుంది. "మాకు లేని బాధ మీకెందుకంటూ?" వారు అన్న మాటలకు జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు విస్తుపోయారు.
మెకాలే పై చర్చ అవసరం లేదు. ఎందుకంటే అతను ఇప్పుడు లేడు. రామాయణం లో శ్రీరాముడు చెప్పినట్లు "ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా కావచ్చు కాని ఆ వ్యక్తి చనిపోవడంతోటే అతని పై శతృత్వాన్ని కూడా మనం చంపేసుకోవాలి". అందుకే వాదన అనవసరం అన్నాను.
జరిగిందేదో జరిగింది, మరి మనం చేసేది ఏంలేదా?
ఇక్కడ విద్యావ్యవస్థ లోని మూల(basic) సమస్యను గురించి చెప్పుకోవాలి."మొక్కై వంగనిది మానై వంగునా" అన్నది మన పెద్దలు చెప్పిన సత్యము.విద్య యొక్క మొదటి లక్ష్యము పిల్లల యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందించడము.తర్వాత నైతికముగా అభివృద్ధి చెందేలా చేయడము అనగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దడము మొదలగునవి వస్తాయి.
ఇక్కడ నిజముగా జరిగిన విషయాన్ని గురించి చూద్దాము."ఒక సారి ఒక మంత్రిగారు మన దేశం నుండి జపాన్ కు పర్యటించడానికి వెళ్ళారు.వారి సాంకేతిక ప్రతిభ మొదలగునవి చూసి ఆశ్చర్యపడి అక్కడి ఒక మంత్రి గారితో "ఏమండీ!పురాణ కాలం నుండీ మన రెండు దేశాలు మంచి మిత్రులు.మీ ప్రజలకున్న తెలివితేటలే భారత ప్రజలకు కూడా ఉన్నాయి కదా.మరి అభివృద్ధి విషయంలో ఇంత తేడా ఎందుకున్నదో చెప్పగలరా?" అన్నారు.
అప్పుడు ఆ జపాన్ మంత్రిగారు "మీరన్నది నిజమే.మనము మంచి మిత్రులమే.ఇంకా చెప్పాలంటే భారతీయులకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము.చాలా వైజ్ఞానిక విషయాలకు మీరే మాకు మార్గదర్శకులు.కాని ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే మా దేశంలో 10 కోట్లమంది "పౌరులు" ఉన్నారు."వ్యక్తులు" లేరు."అని సమాధానం ఇచ్చారు.ఇక్కడ మనం "పౌరులు" మరియు "వ్యక్తులు" మధ్య తేడా గమనించవచ్చు.
జపాన్ వారి విధ్యా విధానంలో విశేషం ఏమిటంటే వారి పిల్లలకు చిన్నపటి నుండే తమ దేశపు గొప్పతనం గురించి వారి సంస్కృతి గొప్పతనం గురించి భోధిస్తారు.వారి దేశపు ప్రఖ్యాత వ్యక్తుల గురించి చెపుతారు.ముఖ్యముగా తమ దేశము భగవంతుని దృష్టిలో ఎంతో ఉన్నతమైనదని అందుకే ప్రపంచములో మొట్టమొదట సూర్యుడు తమ దేశములోనే ఉదయిస్తాడని నూరిపోస్తారు.తద్వారా తమ దేశముపైన అపార గౌరవ విశ్వాసాలు పెంపొందేలా చేస్తారు. తమపైన తమకు విశ్వాసం పెంపొందేలా చేస్తారు.తము మహోన్నత వ్యక్తుల వారసులము అన్న భావన పెంపొందించుకొనేలా చేస్తారు.
తర్వాతే మిగతా విషయాలు అనగా సైన్సు,లెక్కలు మొదలగునవి వస్తాయి.ఇప్పుడు అందరికీ అర్థం అయ్యే ఉంటుంది.జపాన్ వారు అంతగా ఎందుకు అభివృద్ధి చెందారో. కొన్ని విషయాలలో వారూ వెనుకబడి ఉండవచ్చు అన్న విషయం కాని ఇక్కడ ఆ విషయం అప్రస్తుతం అని భావిస్తాను.
మన దేశంలో ఇలాంటి విద్యా విధానాన్ని మనం కలలోనైనా ఊహించగలమా?మన సంస్కృతీసంప్రదాయాలు ఎంత ఉన్నతమైనవో అందరికీ తెలుసు. అవి మాత్రం అసలు చెప్పరు.
ప్రతి దేశపు సంస్కృతిలోనూ కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు, అవి మనకెందుకు? మనం మంచినే పిల్లలకు నేర్పుదాం.
"విద్య యొసగు వినయంబు" అన్న పెద్దలమాట ఎంత వృధాగా పోతోందో మనకు తెలుసు.మన ఇప్పటి విద్యావిధానం పిల్లలను మార్కులు తెచ్చుకొనే యంత్రాలుగా ,ర్యాంకులే పరమావధిగా మారుస్తోంది.ఇక నైతిక,సంస్కార విలువలు ఎలా నేర్పుతాయి?
ఇతర దేశాలవారి నుండి బట్టలు ఎలాంటివి వేసుకోవాలో, ఎలాంటి ఫ్యాషన్ ను అనుకరించాలో నేర్చుకొంటున్నాము కానీ మనకు నిజముగా పనికి వచ్చేది నేర్చుకోవడం లేదు.
Monday, May 24, 2010
శృంగార రసాన్ని మనసుకు హత్తుకొనేలా తిక్కన గారి లాగా ఎందరు వర్ణించగలరు?

మహాభారతములో తిక్కన గారు ఒకచోట ఒక పద్యాన్నివ్రాశాడు. ఆ పద్యం ఏంటో, ఏ పర్వం లోనిదో గుర్తులేదు.
ఆ పద్య అర్థం ఏంటంటే
" సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత సూర్యుడు తనస్థానానికి చేరాక ఆకాశం అనే పందిరి మంచం పై సంధ్యసాయం సంధ్య ) అనే కన్య తన ఎరుపెక్కిన బుగ్గలతో ( నక్షత్రాలు అనే పూలు చల్లుతుంది. తర్వాత ప్రొద్దున కూడాసిగ్గుతో ఎరుపెక్కిన మొహంతో ఎవరైనా చూస్తారేమోనని తననాథుడైన సూర్యుడు లేస్తుండగానే (ఉదయిస్తుండగానే) నక్షత్రాలు అనే పూలను పందిరిమంచం (ఆకాశం) పై నుండితొలగించివేస్తుంది."
సాయంకాలము, ఉదయము సమయాలలో ఆ దిక్కు ఎరుపెక్కడాన్ని ఎంత బాగా తీసుకొన్నాడో కదా.
అసభ్యత అనే దుర్గంధం సోకని శృంగారరస వర్ణన ఎంత బాగుందో కదా!
Sunday, May 23, 2010
మీ చేయి ఆగినా మీ పాట అమరం - వేటూరి సుందర్రామూర్తి గారికి నివాళి

కనికరం లేని కాలం, నియమాలపై నడిచే కాలం,
మీకై తన నిబంధనలను సడలించుకోరాదా,
ఓ కాలమా ఒక చేయిని ఆపగలిగావేమో కానీ,
ఆ సాహిత్య మధురిమను కాదు,
నీలో ఉన్న నవరసాలు తనలో కూడా ఉన్నాయని ఈర్ష్యపడ్డావో ఏమో,
తనను మాకు దూరం చేసావు, అంతే నీవు చేయగలిగింది ,
తన నాదోపాసనను ఎంత మాత్రం కాదు
ఆ మహోన్నత వ్యక్తికి ఆశ్రునివాళి .
తెలుగు ఉన్నంత కాలం మీరు ఉంటారు.
Friday, May 21, 2010
రామేశ్వరుడు అనే పదానికి అసలు అర్థం ఏంటి? (ఒక సరదా కథ)

రామేశ్వరం లో ఉన్న దేవుడిని (శివలింగాన్ని) రామేశ్వరుడు అంటారని అందరికీ తెలుసు. అసలు ఈ పదానికి అర్థం ఏంటి అని ఒకసారి దేవతలకు సందేహం వచ్చింది.
పరమశివుడి వద్దకు వెళ్ళి అర్థం అడిగారు.
అప్పుడు ఈశ్వరుడన్నాడు " రామేశ్వరుడు అంటే రాముడిని ఈశ్వరుడిగా గలవాడు అంటే రాముడిని భగవంతుడిగా గలవాడు" అని. అంటే అర్థం శివుడికి దైవం రాముడు అని. దేవతలు సరేనంటూ వెళ్ళిపోయారు.
కాని వారికి ఎందుకో సందేహం వీడక శ్రీమహావిష్ణువుని అడిగారు.
అప్పుడు విష్ణువు అన్నాడు " రాముడికి ఈశ్వరుడు ఐనవాడు" అని. అంటే రాముడు భగవంతుడిగా కొలిచేవాడు రామేశ్వరుడు (రాముడికి దైవం శివుడు) అని.
దేవతలు పూర్తి గందరగోళంలో పడ్డారు.
సరేననుకుంటూ చతుర్ముఖ బ్రహ్మ గారిని అడిగారు.
అప్పుడు ఆయన అన్నారు " శివకేశవులిద్దరూ అలానే మాట్లాడతారు. కాని అసలు అర్థం అదికాదు "రాముడే ఈశ్వరుడైన వాడు" అని అసలు అర్థం. అంటే వారిరువురూ ఒకటే. ఒకే భగవంతుడు వారిద్దరిగా ఉన్నాడు అని అర్థం ". అప్పుడు దేవతలకు విషయం పూర్తిగా అర్థమై సందేహం తీరిపోయింది.
ఈ కథ ఎందులోనిదో తెలియదు. విన్నది అంతే.
Tuesday, May 18, 2010
ఆంజనేయుడు సముద్రాన్ని దాటాడు సరే,ఐతే మనకు ప్రయోజనం ఏంటి ?

"విజయం సాధించటం ఎలా?", "విజయానికి ఇన్ని మెట్లు" లాంటి పుస్తకాలు కోకొల్లలు. సరే.
కానీ మన ఆదికావ్యమైన రామాయణమును తరచిచూస్తే ఇలాంటి విషయాలు ఇందులో ఉన్నాయా అన్న ఆశ్చర్యం కలుగక మానదు.
సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని దాటడం లో , ఒక పని సాధించాలనుకొనేవారికి ఆ పనిని ఎలా సాధించాలో, మనకు నేర్పిస్తుండడం మనము గమనిస్తే ఆశ్చర్యం కలుగక మానదు.
సముద్రాన్ని దాటడం సాధించాల్సిన పని. ఆంజనేయుడు తనకు సాధ్యము కాదని ఊరికే ఒకవైపు అమాయకముగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుని శక్తిని హనుమంతునికి గుర్తుచేసాడు. ఇక్కడ ఒక పని సాధించాలి అనుకొనేవాడు మొదట తన శక్తిని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేని పక్షంలో పని కావడానికి ప్రోత్సహించే మిత్రుడి లేదా శ్రేయోభిలాషి అవసరం ఎంతైనా ఉంది. అంటే మనకు ఎలాంటి మిత్రుల అవసరం అనే విషయములో మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఆలోచించాలి.
హనుమ బయలు దేరుతూ రామబాణం లా దూసుకెళ్ళి పనిని సాధిస్తానని ప్రకటించాడు. అంటే నాదేమీ లేదు భగవంతుడి చేతిలో ఒక పనిముట్టుగా ఉంటాను అనే భావము కలిగిఉండాలి. అంటే అహంకారము ఉండరాదు అని నేర్పుతున్నాడు.
ఇక సముద్రాన్ని దాటేప్పుడు మొదట బంగారు శిఖరాలు గల మైనాకపర్వతం ఆతిథ్యం తీసుకొమ్మని కోరింది. కాని హనుమంతుడు అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ "మీకు ఎన్నో కృతజ్ఞతలు. కాని అత్యవసరమైన పని మీద వెడుతున్నాను. ఆలశ్యం చేయడం నాకు తగదు.పని ఐన తర్వాత మళ్ళీ కలుస్తాను" అంటూ ఒకసారి ఆ కొండను ముట్టుకొని "నీవు ఆతిథ్యం ఇచ్చినట్లే" అంటూ సెలవు పుచ్చుకొన్నాడు.
అంటే కార్యసాధనలో అలసత్వం పనికిరాదు అని, అదెటువంటి ఆకర్షణ ఐనా లొంగరాదని, అదే సమయములో ఎదుటివారు ప్రేమతో మనకు ఆతిథ్యం ఇస్తామన్నప్పుడు వారిని నొప్పించకుండా ఎలా మాట్లాడాలి, నడుచుకోవాలి అనే విషయం మనకు నేర్పుతున్నాడు.
ఇక తర్వాత సురస అనే నాగమాత నిన్ను ఆహారంగా తింటానని హనుమతో అనగా చాలా చిన్నగా మారిపోయి ఆమె నోట్లోకి దూరి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేసాడు.
ఇక్కడ "అనువుగాని చోట అధికులమనరాదు" అని, ఎంత పెద్ద సమస్య ఐనా సూక్ష్మబుద్ధితో ఆలోచించి దానిని ఎలా సామరస్యముగా పరిష్కరించుకోవాలి అని, అది మన పనికి ఆటంకము కాకుండా ఎలా చూసుకోవాలి అని, కండబలమే కాదు బుద్ధిబలము కూడా అత్యవసరము అని మనకు నేర్పుతున్నాడు.
తర్వాత సింహిక అనే రాక్షసి హనుమంతుని తినబోగా ఆమె కడుపులోనికి దూరి ఆమె లోపలి అంగాలను పిండి చేసి ఆమెను చంపేసాడు.
ఇక్కడ మన కార్యసాధనలో మనం భరించలేని,తీవ్రమైన కష్టం ఎదురైనప్పుడు ఆ సమస్య యొక్క మూలాన్ని కనుగొని మూలాన్ని కనుక దెబ్బతీస్తే పునాదులు లేని భవనములా ఆ సమస్య కూడా కూలిపోతుంది అంటే పరిష్కారమవుతుంది అని నేర్పుతున్నాడు. అదే సమయములో సమస్య మూలాన్ని అన్వేషించేటప్పుడు ఆ సమస్య మనలను ముంచేయకుండా ఎంత అప్రమత్తముగా ఉండాలి అని కూడా నేర్పుతున్నాడు.ఇంతకు
మునుపు సమస్యను కేవలం బుద్ధిబలముతో పరిష్కరించాడు. కాని ఇప్పుడు బుద్ధిబలముతో పాటు సాహసాన్ని కూడా కల్గి ఉండాలని నేర్పుతున్నాడు.
తర్వాత ఇక ఏ బాధా లేకుండా సముద్రాన్ని దాటాడు.
ఇదండీ నాకు అర్థమైన హనుమంతుడి సముద్ర లంఘనం.
ఇంకా సీతమ్మను వెతకడం లో కూడా మనం తెలుసుకోవల్సింది ఎంతో ఉంది. కాని ప్రస్తుతానికి ఇలా ముగిస్తున్నాను.
ఆదిశంకారాచార్యులను స్మరించి నమస్కరిద్దాం

భజగోవిందం, సౌందర్యలహరి, శివానందలహరి, మహిషాసురమర్ధిని స్తోత్రం, గణేషపంచరత్నం వంటి ఎన్నో స్తోత్రాలను మనకు అందించి అంతేకాక శ్రీభగవద్గీత లాంటి గ్రంధాలకు భాష్యములు వ్రాసి మనకు భక్తి,జ్ఞానమార్గాలను బోధించిన సాక్షాత్ కైలాస శంకరుడైన కాలడి శంకరులకు మనసా,వాచా,కర్మణా ప్రణామాలు అర్పిస్తూ అందరికీ ఆదిశంకరచార్యుల జయంతి శుభాకాంక్షలు.
M.S. సుబ్బులక్ష్మి గారి నోట అమృత సమానమైన కన్నడ పాట ( లక్ష్మిదేవి పాట)
సంగీతానికి భాషాభేధాలు లేవని, ఎవరినైనా ఆనందడోలికలలో ఊగిస్తుందని నిరూపించే క్రింది పాటను వినండి.
సుబ్బులక్ష్మి గారి నోటి ద్వారా మనకు అమృతం కురిపించిన పాట ఇది.
ఈ కీర్తన వ్రాసినవారు పురందరదాసు గారు.
మనకు అన్నమయ్య ఎలాంటివాడో కన్నడిగులకు పురందరదాసు గారు అలాంటివారు. అన్నమయ్య,పురందరదాసు గారు సమకాలికులు. కాకపోతే పురందరదాసు గారు అన్నమయ్య కంటే వయసులో చాలా పెద్దవారు.
సుబ్బులక్ష్మి గారి నోటి ద్వారా మనకు అమృతం కురిపించిన పాట ఇది.
ఈ కీర్తన వ్రాసినవారు పురందరదాసు గారు.
మనకు అన్నమయ్య ఎలాంటివాడో కన్నడిగులకు పురందరదాసు గారు అలాంటివారు. అన్నమయ్య,పురందరదాసు గారు సమకాలికులు. కాకపోతే పురందరదాసు గారు అన్నమయ్య కంటే వయసులో చాలా పెద్దవారు.
Monday, May 17, 2010
గొప్పవారికీ, సామాన్యులకూ గల తేడా ఎక్కడ ఉంది?

ఇక్కడ గొప్పవారు అంటే డబ్బులో ధనవంతుల గూర్చి కాదు చెప్పబడుతున్నది, శీలము (character) లో గొప్పవారి గురించి.
రమణ మహర్షి జీవితములో జరిగిన చిన్న సంఘటన. ఒకసారి ఒక దుష్టుడి గూర్చి కొందరు భక్తులు మహర్షి సన్నిధిలో మాట్లాడుకుంటున్నారు. అతని దుష్టత్వం గురించి మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి మహర్షిగారు కలుగజేసుకొంటూ " మీరు దుష్టుడు అని చెప్పుకొంటున్నతడు ప్రొద్దున్నే సూర్యోదయానికి ముందే బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానం చేస్తాడటనే" అన్నారు.
ప్రొద్దున సూర్యోదయానికి ముందే బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానం చేయడం ఎంత మంచిదో మనకు తెలుసు.
ఇక్కడ ఆ దుష్టుడిలోని చెడ్డగుణాలను పట్టించుకోకుండా ఉన్న ఒక్క మంచిగుణమును మాత్రమే శ్రీరమణులు గుర్తుపెట్టుకొన్నారు.
ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".
ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.
తెలుగు భాష విశిష్టత - కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతుల వారి మాటలలో

తెలుగుభాషను గూర్చితెలుగులిపిని గూర్చి కొంత పరిశీలిద్దాం. ఈ రెంటిలోనూ కొన్ని విశేషా లున్నవి. పరాశక్తి యంత్రానికి తెలుగులిపి ఉపయోగింపబడ్డది. పరాశక్తి స్త్రీస్వరూపిణి. అమ్మవారికి వామావర్త పూజ ఏర్పడిఉన్నది. తెలుగులిపి కూడా వామావర్తమైనది. అనగా ఎడమప్రక్క చుట్టివ్రాయబడేది. తక్కినవి దక్షిణావర్తమైనవి. అనగా కుడిప్రక్కకు చుట్టివ్రాయబడేది. ఆవర్త మనగా చక్రం. తెలుగు వర్తులాకారలిపి, అందులోనూ వామావర్తం. వామావర్తపూజ లందుకొనే అమ్మ వారి యంత్రంలోనూ చక్రంలోనూ తెలుగులిపి వున్నది. అందుచే తెలుగులిపి పరాశక్తి ప్రధానమై ఉన్నది. తెలుగుభాష శివప్రదానం. లిపి శక్తిస్వరూపం. భాష శివ స్వరూపం. వాగర్థాలు పార్వతీపరమేశ్వరులనికదా కాళిదాసు రఘువంశంలో అన్నాడు. తెలుగుభాష శివప్రధానమైన దని గుర్తించినది అప్పయదీక్షితులవారు. వారు పరమశివభక్తులు. దక్షిణాదిని, ఆరణి (తమిళనాడు) అనుఊరికి సమీపంలోఉన్న ఆడెయపాలెం వారు పుట్టినఊరు.దక్షిణ భారతాన శివోత్కృష్టత స్థాపించినవారు. ఈక్రిందిశ్లోకం చెప్పారు.
ఆంధ్రత్వ మాంధ్రభాషా చా ప్యాంధ్రదేశః స్వజన్మభూః,
తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపసః ఫలమ్||
ఆంధ్రం త్రిలింగదేశం. దేశమే లింగావర్తం అనగా లింగములతో చుట్టబడినది. దక్షిణాన దక్షిణకాశి కాళహస్తిక్షేత్రం ఉన్నది. పడమట శ్రీశైలక్షేత్రమున్నూ, ఉత్తరమున కోటిలింగక్షేత్రమున్నూ ఎల్లలుగాకలది ఆంధ్రదేశం. అట్టి త్రిలింగదేశంలో తాను జన్మించలేదన్న విషయమూ ఆంధ్రభాష తన మాతృభాష కాకపోయినదే అన్నసంగతీ ఆయనకు కొరతయట. ఇవి రెండేకాక మరొక్క కొరతకూడా ఆయన కున్నదిట.
ఆంధ్రులు శైవులైనా సరే, వైష్ణవులైనాసరే, అక్షరాభ్యాస సమయంలో ''ఓం నమః శివాయ'' అని చదువు ప్రారంభిస్తారు. జన్మతారకమైన శివపంచాక్షరి జీవితానికి ప్రథమ సోపానంగా ఈభాష నేర్చేవారికి ఏర్పడిఉన్నది. పంచాక్షరి, యజుర్వేదమధ్యంలో ఉన్నది. అంటే యజుర్వేదం శివసంబంధమైనది. దానికి తగినట్టు తెలుగువారిలో యజుఃశాఖేయులు ఎక్కువమంది. అంటే యజుర్వేదం పఠించేవారు ఎక్కువ. సామశాఖీయులులేనేలేరు. ఋగ్వేదుల సంఖ్యకూడా తక్కువ. ఇట్లా సామశాఖేయులున్నూ పరమశివ భక్తులు అయిన అయ్యప్ప దీక్షితుల వారు శివసంబంధమైన తెలుగు దేశంలో జన్మించకపోతినే అని విచారపడేవారట. తెలుగుకు లిపి శక్తిస్వరూపమై, భాష శివస్వరూపమై ఎల్లలుత్రిలింగములై, వేదము యజుర్వేదమై ఒప్పుతుండడం ఒక విశేషం.
Friday, May 14, 2010
తర్పణం వదిలే నువ్వులు,నీళ్ళు మొదలగునవి చనిపోయినవారికి ఎలా చేరుతాయి?
ఈ టపా కేవలం శ్రాద్ధకర్మలను నమ్మినా అసలు ఇది ఎలా సంభవం? అనే వారి కోసం మాత్రమే. దయచేసి నమ్మనివారు వ్యాఖ్యలు వ్రాయవద్దని మనవి.
ఈ కర్మలలో నువ్వులు,నీళ్ళు మొదలగునవి వదులుతారు కదా? మరి అవి చనిపోయినవారికి ఎలా చేరుతాయి అనే సందేహము వస్తుంది. బ్రతికిఉన్నవారికి ఏమైనా ఇస్తే వాళ్ళు పుచ్చుకొంటారు. మరి చనిపోయినవారికి ఎలా అందుతాయి?
ఒక చిన్నకథ ద్వారా దీనిని అర్థం చేసుకోవచ్చు.
ఒక పెద్దమనిషి తన కుమారుణ్ణి చదవటానికి పట్టణంలో వదలి పెట్టినాడు. ఆ పిల్లవాడు పరీక్షకు డబ్బుకట్ట వలసి వచ్చింది. వెంటనే తండ్రికి నీవు డబ్బును మని యార్డరు చేయవలసినదని కోరినాడు. కుమారుడు అడిగిన డబ్బు తీసుకొని తండ్రి తపాలా ఆఫీసుకు వెళ్ళినాడు. ఈ పెద్దమనిషి ఒక పల్లెవాడు,అమాయకుడు. డబ్బును తంతీ(Telegram) ఆఫీసు ఉద్యోగికి అప్పచెప్పి దానిని పంపవలసిన దని కోరినాడు- తంతుల ద్వారా ఆ డబ్బు ఉద్యోగి పంపుతాడని, ఆ అమాయకుడు అనుకొన్నాడు. ఉద్యోగి డబ్బును తీసి, మేజాలో భద్ర పరచి, సరే పంపుతాను'- అని అన్నాడు. 'నే నిచ్చిన డబ్బు నీదగ్గరే వుంచుకొన్నావే ? అది మా వాడికి ఎట్లా పోయి చేరుతుంది?' అని అతని ప్రశ్న. 'ఎట్లా చేరుతుందా? ఇదో ఈ విధంగా' అని అతడు టెలిగ్రాఫ్ మీద తంతిని పంప సాగినాడు. డబ్బు ఇక్కడే వున్నదే? ఇతడేమో పోయి చేరుతుంది అని అంటున్నాడే. ఇదెట్లా సాధ్యం? అని పల్లెటూరి వాని సందేహం సందేహంగానే నిలచిపోయింది. మనియార్డరు మాత్రం పిల్లవానికి సురక్షితంగా పోయి చేరింది.
మనం పితరులకూ(అంటే చనిపోయినవారికి), దేవతలకూ అర్పించే వస్తువులు కూడా ఈ విధంగానే చేరవలసిన చోటుకుపోయి చేరుతాయి. శాస్త్రసమ్మతంగా మనం ఈ క్రియలను నిర్వర్తిస్తే పితృదేవతలు అవి ఎవరికి పోయి చేరవలయునో వారికి చేరేటట్లు చూస్తారు. ఒకవేళ చనిపోయినవారు ఆసరికే ఎక్కడో జంతువులుగానో లేక మనుషులుగానో లేక మరే విధముగానో పుట్టిఉంటే వారికి ఆహారరూపములోనో లేక మరే ఉపయోగకరమైన వస్తువుల రూపముగానో వారికి చేరుతాయి. ఈ విధంగా వస్తువులను తగిన రూపంలో చేరవేయటానికి వలసిన స్తోమతను పితృ దేవతలకు భగవంతుడుఇచ్చి వున్నాడు. అందు చేత శ్రాద్ధంలో మనము అర్పించే వస్తువులను స్వీకరించే దానికి వాళ్ళు ప్రత్యక్షంగా రావలసిన పనిలేదు.
శ్రాద్ధము అనగా శ్రద్ధతో చేయవలసిన క్రియ అని అర్థము.
ఒక ఉత్తరం వ్రాసి దాన్ని పోష్టు చేయబోతూ " ఈ తపాలాపెట్టె (పోష్టుబాక్సు) అందముగాలేదు, నా వద్ద ఇంతకంటే మంచి పెట్టె ఉంది. అందులో వేస్తాను" అని అనుకొంటే ఆ ఉత్తరం చేరవలసిన వారికి చేరుతుందా? అందుచేత మనం ఏ పని చేయాలన్నా మనము సఫలము కావాలి అనుకొంటే వాటివాటి విధులను పాటించాలి. పెద్దలు అందులకే 'యథాశాస్త్రం, యథావిధి' అన్నారు. కర్మ సఫలం కావాలంటే శాస్త్రవిధులను పాటించక తప్పదు.
మరోసారి మనవి చేసుకొంటున్నాను. దయచేసి నమ్మనివారు ఈ టపాను పట్టించుకోవద్దని, వ్యాఖ్యలు వ్రాయవద్దని మనవి.
ఈ కర్మలలో నువ్వులు,నీళ్ళు మొదలగునవి వదులుతారు కదా? మరి అవి చనిపోయినవారికి ఎలా చేరుతాయి అనే సందేహము వస్తుంది. బ్రతికిఉన్నవారికి ఏమైనా ఇస్తే వాళ్ళు పుచ్చుకొంటారు. మరి చనిపోయినవారికి ఎలా అందుతాయి?
ఒక చిన్నకథ ద్వారా దీనిని అర్థం చేసుకోవచ్చు.
ఒక పెద్దమనిషి తన కుమారుణ్ణి చదవటానికి పట్టణంలో వదలి పెట్టినాడు. ఆ పిల్లవాడు పరీక్షకు డబ్బుకట్ట వలసి వచ్చింది. వెంటనే తండ్రికి నీవు డబ్బును మని యార్డరు చేయవలసినదని కోరినాడు. కుమారుడు అడిగిన డబ్బు తీసుకొని తండ్రి తపాలా ఆఫీసుకు వెళ్ళినాడు. ఈ పెద్దమనిషి ఒక పల్లెవాడు,అమాయకుడు. డబ్బును తంతీ(Telegram) ఆఫీసు ఉద్యోగికి అప్పచెప్పి దానిని పంపవలసిన దని కోరినాడు- తంతుల ద్వారా ఆ డబ్బు ఉద్యోగి పంపుతాడని, ఆ అమాయకుడు అనుకొన్నాడు. ఉద్యోగి డబ్బును తీసి, మేజాలో భద్ర పరచి, సరే పంపుతాను'- అని అన్నాడు. 'నే నిచ్చిన డబ్బు నీదగ్గరే వుంచుకొన్నావే ? అది మా వాడికి ఎట్లా పోయి చేరుతుంది?' అని అతని ప్రశ్న. 'ఎట్లా చేరుతుందా? ఇదో ఈ విధంగా' అని అతడు టెలిగ్రాఫ్ మీద తంతిని పంప సాగినాడు. డబ్బు ఇక్కడే వున్నదే? ఇతడేమో పోయి చేరుతుంది అని అంటున్నాడే. ఇదెట్లా సాధ్యం? అని పల్లెటూరి వాని సందేహం సందేహంగానే నిలచిపోయింది. మనియార్డరు మాత్రం పిల్లవానికి సురక్షితంగా పోయి చేరింది.
మనం పితరులకూ(అంటే చనిపోయినవారికి), దేవతలకూ అర్పించే వస్తువులు కూడా ఈ విధంగానే చేరవలసిన చోటుకుపోయి చేరుతాయి. శాస్త్రసమ్మతంగా మనం ఈ క్రియలను నిర్వర్తిస్తే పితృదేవతలు అవి ఎవరికి పోయి చేరవలయునో వారికి చేరేటట్లు చూస్తారు. ఒకవేళ చనిపోయినవారు ఆసరికే ఎక్కడో జంతువులుగానో లేక మనుషులుగానో లేక మరే విధముగానో పుట్టిఉంటే వారికి ఆహారరూపములోనో లేక మరే ఉపయోగకరమైన వస్తువుల రూపముగానో వారికి చేరుతాయి. ఈ విధంగా వస్తువులను తగిన రూపంలో చేరవేయటానికి వలసిన స్తోమతను పితృ దేవతలకు భగవంతుడుఇచ్చి వున్నాడు. అందు చేత శ్రాద్ధంలో మనము అర్పించే వస్తువులను స్వీకరించే దానికి వాళ్ళు ప్రత్యక్షంగా రావలసిన పనిలేదు.
శ్రాద్ధము అనగా శ్రద్ధతో చేయవలసిన క్రియ అని అర్థము.
ఒక ఉత్తరం వ్రాసి దాన్ని పోష్టు చేయబోతూ " ఈ తపాలాపెట్టె (పోష్టుబాక్సు) అందముగాలేదు, నా వద్ద ఇంతకంటే మంచి పెట్టె ఉంది. అందులో వేస్తాను" అని అనుకొంటే ఆ ఉత్తరం చేరవలసిన వారికి చేరుతుందా? అందుచేత మనం ఏ పని చేయాలన్నా మనము సఫలము కావాలి అనుకొంటే వాటివాటి విధులను పాటించాలి. పెద్దలు అందులకే 'యథాశాస్త్రం, యథావిధి' అన్నారు. కర్మ సఫలం కావాలంటే శాస్త్రవిధులను పాటించక తప్పదు.
మరోసారి మనవి చేసుకొంటున్నాను. దయచేసి నమ్మనివారు ఈ టపాను పట్టించుకోవద్దని, వ్యాఖ్యలు వ్రాయవద్దని మనవి.
Thursday, April 29, 2010
చాలారోజులైంది బ్లాగు వ్రాశి, ఇప్పుడు మళ్ళీ వ్రాయాలంటే అంతా కొత్తగా ఉంది.
చాలా రోజులైంది బ్లాగు వ్రాసి. దాదాపు రెండున్నరనెలలు కావస్తోంది ఈ బ్లాగు ప్రపంచములోనికి వచ్చి. అంతా కొత్తగా ఉంది. ఎంతో మంది కొత్తగా వచ్చినట్లున్నారు మన బ్లాగులోకములోనికి. అందరికీ నా ఆత్మీయ స్వాగతం మరియు శుభాకాంక్షలు.
హరిద్వార్ కుంభమేళాకు వెళ్ళి రావడముతో మొదటిసారి భారతదేశపు విశాలత్వాన్ని, విభిన్నప్రజలను మరియు మన సనాతనధర్మ వైభవాన్ని ప్రత్యక్షముగా చూసివచ్చే భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు. అందుకు ఆయనకు అనంతకోటి కృతజ్ఞతలు.
ఇంకా అరుణాచలము కూడా వెళ్ళిరావడముతో అరుణాచలేశ్వర దర్శనభాగ్యము,
భగవాన్ రమణుల అశ్రమ సందర్శన భాగ్యము, వారు తపస్సు చేసుకొన్న విరూపాక్షగుహ,స్కందాశ్రమము చూసే అదృష్టము, శ్రీశేషాద్రిస్వామి ఆశ్రమ దర్శనప్రాప్తి ఇంకా అగ్నిలింగ అరుణాచల ప్రదక్షిణము అబ్బో ఆ భగవంతుని కృపను ఏమని వర్ణింపను? ఒళ్ళు పులకరిస్తోంది, తలుచుకొన్నంతనే కళ్ళు ఆనందభాష్పాలు కారుస్తున్నాయి.
ఇక మళ్ళీ బ్లాగులోకములోని ప్రవేశిస్తూ నా అనుభవాలను పంచుకుందామనుకుంటున్నాను.
అందుకు భగవంతుడిచే ఆశీర్వదింపబడెదని కోరుకొంటున్నాను.
హరిద్వార్ కుంభమేళాకు వెళ్ళి రావడముతో మొదటిసారి భారతదేశపు విశాలత్వాన్ని, విభిన్నప్రజలను మరియు మన సనాతనధర్మ వైభవాన్ని ప్రత్యక్షముగా చూసివచ్చే భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు. అందుకు ఆయనకు అనంతకోటి కృతజ్ఞతలు.
ఇంకా అరుణాచలము కూడా వెళ్ళిరావడముతో అరుణాచలేశ్వర దర్శనభాగ్యము,
భగవాన్ రమణుల అశ్రమ సందర్శన భాగ్యము, వారు తపస్సు చేసుకొన్న విరూపాక్షగుహ,స్కందాశ్రమము చూసే అదృష్టము, శ్రీశేషాద్రిస్వామి ఆశ్రమ దర్శనప్రాప్తి ఇంకా అగ్నిలింగ అరుణాచల ప్రదక్షిణము అబ్బో ఆ భగవంతుని కృపను ఏమని వర్ణింపను? ఒళ్ళు పులకరిస్తోంది, తలుచుకొన్నంతనే కళ్ళు ఆనందభాష్పాలు కారుస్తున్నాయి.
ఇక మళ్ళీ బ్లాగులోకములోని ప్రవేశిస్తూ నా అనుభవాలను పంచుకుందామనుకుంటున్నాను.
అందుకు భగవంతుడిచే ఆశీర్వదింపబడెదని కోరుకొంటున్నాను.
Wednesday, January 20, 2010
పుట్టినరోజుకు అబ్దుల్కలాం గారి నిర్వచనం

ఈ సంఘటన BBC వారు కలాం గారిని అడిగినప్పుడు జరిగింది.
"నీ జీవితములో నీవు ఏడ్చినప్పుడు మీ అమ్మ నవ్విన రోజు నీ పుట్టినరోజు మాత్రమే" (ప్రసవదినం).
Monday, January 18, 2010
నేను గ్రహణం సమయంలో ఏమీ తినలేదు, ఎందుకంటే.........కృతజ్ఞత

సూర్య లేక చంద్ర గ్రహణ సమయాలలో ఏమీ తినకూడదని శాస్త్రాలంటాయి. తినవచ్చని జనవిజ్ఞానవేదిక, హేతువాదం అంటాయి. ఐతే ఏది పాటించాలి అనే విషయంపై ఎన్నో వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. నాకూ శాస్త్రాలపై, సైన్సు పై గౌరవం ఉంది. ఐతే నేను శాస్త్రం చెప్పినదానికే ఓటు వేసి సూర్యగ్రహణ సమయంలో ఏమీ తినలేదు. ఒక్కటే కారణం "కృతజ్ఞత".
మన అందరికీ తెలుసు సూర్యుడి వలనే వానలూ, పంటలూ పండుతున్నాయని,మనం జీవనం సాగిస్తున్నామని. ఒక ఉదాహరణగా మనకు ఎంతో సహాయం చేసిన వ్యక్తి ప్రతిష్ఠకు అతని ప్రమేయం వలనో అతని తప్పు వలనో మచ్చ పడితే ఎంతో బాధపడతామే అలాంటిది అతని ప్రమేయం లేకుండానే ఏదైనా కళంకం కలిగిందంటే మనకు ఇంకెంత బాధ కలుగుతుందో ఊహించగలము.
నిత్యమూ మనకు సహాయపడే మనకు బాంధవులైన సూర్యచంద్రులకు గ్రహణం వలన తాత్కాలికముగా వారి సమయంలోనే వారి ప్రతిష్ఠ కు భంగం కలుగుతోంది. అంటే కనుమరుగు చేయబడుతున్నారు. లోక బాంధవులైన సూర్యుడు,చంద్రులకు సైన్సు చెప్పే ప్రకారం కావచ్చు లేక శాస్త్రాలు చెప్పే ప్రకారం కావచ్చు గ్రహణాలు ఏర్పడడం ద్వారా వారు మూసివేయబడుతున్నారు. వారి వలన ఆహారం తింటూ వారికి మచ్చ పడుతున్న సమయంలో ఆహారం తినడం కృతఘ్నత అని అనుకొంటున్నాను. అందుకే నేను తినలేదు.
ఈ వాదం పిచ్చివాడి ప్రేలాపన అనుకొన్నా ఫర్వాలేదు కాని నా ఉద్దేశ్యం మాత్రం కృతజ్ఞత ప్రకటించడమే.
Friday, January 8, 2010
సచిన్ టెండూల్కర్ లా ఆలోచిస్తే ఇంతటి విధ్వంసాలు జరుగుతాయా?

సచిన్ ఆట గురించి మనకు తెలుసు. క్రింది సంఘటన చూస్తే మన ప్రవర్తనతో ఎదుటివారి మనసులను ఎలా గెలుచుకోవచ్చో తెలుస్తుంది.
ఆ మధ్య ముంబాయిలో ఒక కొత్త ఇల్లు కట్టుకొన్నాడు. అతను అలా కట్టుకోవడం వలన తమ ప్రాంతంలో ఇళ్ళ ధరలు పెరిగాయని ,సచిన్ అంతటివాడు తమ మధ్యకు వస్తున్నాడని అందరూ ఆనందించారు. కాని సచిన్ ఇల్లు కట్టుకొనేప్పుడు ఎదుటివారికి కలిగే అసౌకర్యం గురించి ఎంత ఆలోచించాడంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటి వారికీ స్వయంగా ఉత్తరాలు వ్రాశాడు. ఆ ఉత్తరం లోని విషయం ఇది.
" నేను మీ ప్రాంతములో ఇల్లు కట్టుకొంటున్నాను. అది పెద్ద ఇల్లు. ఈ ఇంటి నిర్మాణమప్పుడు ఎన్నో లారీలు పగలు,రాత్రీ తిరగవలసి వస్తుంది. ఇంకా ఇంటి నిర్మాణంలో బండలు పగలగొట్టవలసి వస్తుంది. చిన్నచిన్న డైనమెట్లు కూడా అందుకు ఉపయోగించవలసి వస్తుంది. ఎవరికీ దెబ్బలు తగులకుండా ఏర్పాటుచేసాము. కాని శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. పగలురాత్రీ అని తేడా లేకుండా పని చేయాల్సి ఉండడం వలన మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. నన్ను మన్నించగలరు. ఈ ప్రాంతంలోకి నేను చేరిన తర్వాత నేను మీ కాలనీ అనే కుటుంబంలో ఒక సభ్యుడను అవుతాను కదా.
ఒక కుటుంబములో ఒక కొత్త సభ్యుడు రావడం అనేది ఒక తల్లికి బిడ్డ పుట్టడం లాంటిది. తల్లి నవమాసాలూ మోసేటప్పుడు చాలా కష్టాలు పడవలసి వస్తుంది. అప్పుడే బిడ్డ రాగలడు. అలానే మీ కాలనీ అనే కుటుంబములోనికి నేను కొత్తగా వస్తున్నాను కాబట్టి అందుకు మీరు కొంత కష్టం పడవలసిఉంటుంది అని తెలుపడానికి బాధపడుతున్నాను.. నన్ను మీ కుటుంబములోనికి చేర్చుకుంటారని ఆశిస్తున్నాను."
అసలు సచిన్ రావడమే తమకు ఎంతో గొప్పగా, ఆనందముగా భావించారు ఆ ప్రాంతవాసులు. ఐనా వారు ఏమీ అనలేదని సచిన్ ఊరుకోలేదు. వారి అసౌకర్యం ఊహించి ఎంత గొప్పగా వ్రాశాడో కదా.
ఇలా ఎదుటివారికి కలిగే బాధను మన విధ్వంసకారులూ (చీటికీమాటికీ ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులను తగులబెడుతున్నవారు) తెలుసుకొంటే బాగుంటుంది కదా
పాఠాలు నేర్పే గురువులను చులకనగా చూసేవారికి ఈ సంఘటన ఒక కనువిప్పు కావాలి.
ఈ సంఘటన నిజంగా జరిగిన సంఘటన.
కంచి కామకోటి పీఠంలో జగద్గురు పరమాచార్య చంద్రశేఖరేంద్రసరస్వతులవారు పీఠాధిపతిగా ఉన్న రోజులవి.
ఒక రోజు ఆయన గదిలో ఉండగా ప్రొద్దునపూట అక్కడి వేదపాఠశాలలో చదివే పిల్లలు అరుస్తూ ఆడుకొంటున్న శబ్దం వినిపించింది. ఈ సమయంలో తరగతిలో చదువుకొనకుండా బయట ఎందుకు ఆడుకొంటున్నారని పరమాచార్యులవారు బయటికి వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు తరగతికి వెళ్ళలేదు? అని అడిగారు. గురువు గారు రాలేదని ఆ పిల్లవాడు చెప్పాడు. పక్కన ఆడుకొంటున్న ఇంకో పిల్లవాడు జోక్యం చేసుకొని "గురువు గారు పాఠం చెప్తున్నారు. మేమే బయటకు వచ్చి ఆడుకొంటున్నాము" అన్నాడు. ఇద్దరిలో ఎవరిది నిజమో కనుగొనడానికి పరమాచార్యులవారు ఇద్దరినీ వెంటబెట్టుకొని తరగతి గది వద్దకు వెళ్ళి చూస్తే గురువుగారు లేరు.
అప్పుడు పరమాచార్యుల వారు రెండవ పిల్లవాడితో అబద్దం ఎందుకు చెప్పావంటూ ప్రశ్నించారు. ఆ పిల్లవాడు ఏ మాత్రం భయపడకుండా " రోజూ వచ్చే మా గురువు గారు ఈ రోజు ఏదో అత్యవసర పని మీద రాలేకపోయుంటారు. వారు రాకపోయినా తరగతిలో కూర్చొని చదువుకోవలసిన బాధ్యత మాది. కాని మేము అలా చేయలేదు. అంటే తప్పు మాది. గురువుగారు రాలేదని మీరు ఆయనను కోప్పడతారు. మీ కోపాన్నుండి ఆయననను తప్పించడానికి చిన్న అబద్దం చెప్పడం నేను ధర్మమే అనుకొంటున్నాను. ఈ సమయంలో చదువుకోక ఆడుకోవడం మా తప్పే." అన్నాడు.
అంతటి నడిచే దేవుడిగా పేరొందిన పరమాచార్యులవారు కూడా ఆ పిల్లవాడి గురుభక్తిని చూసి ఆశ్చర్యం పొందారు.
" నీవురా నిజమైన శిష్యుడివి "అంటూ ఆ పిల్లవాడి భుజం తట్టారు పరమాచార్యులవారు.
నేడు కళాశాల విద్యార్థులైనంత మాత్రాన కొమ్ములు వచ్చేసినట్లు ప్రవర్తిస్తూ గురువులను అవమానిస్తున్న వారిని, అలా చేయడానికి ప్రోత్సాహం ఇస్తున్న సినిమాలు,TVలు, పత్రికలు పైన పేర్కొనబడ్డ అబ్బాయి కాలి గోటికి సరిపోతారేమో ఆలోచించండి.
కంచి కామకోటి పీఠంలో జగద్గురు పరమాచార్య చంద్రశేఖరేంద్రసరస్వతులవారు పీఠాధిపతిగా ఉన్న రోజులవి.
ఒక రోజు ఆయన గదిలో ఉండగా ప్రొద్దునపూట అక్కడి వేదపాఠశాలలో చదివే పిల్లలు అరుస్తూ ఆడుకొంటున్న శబ్దం వినిపించింది. ఈ సమయంలో తరగతిలో చదువుకొనకుండా బయట ఎందుకు ఆడుకొంటున్నారని పరమాచార్యులవారు బయటికి వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు తరగతికి వెళ్ళలేదు? అని అడిగారు. గురువు గారు రాలేదని ఆ పిల్లవాడు చెప్పాడు. పక్కన ఆడుకొంటున్న ఇంకో పిల్లవాడు జోక్యం చేసుకొని "గురువు గారు పాఠం చెప్తున్నారు. మేమే బయటకు వచ్చి ఆడుకొంటున్నాము" అన్నాడు. ఇద్దరిలో ఎవరిది నిజమో కనుగొనడానికి పరమాచార్యులవారు ఇద్దరినీ వెంటబెట్టుకొని తరగతి గది వద్దకు వెళ్ళి చూస్తే గురువుగారు లేరు.
అప్పుడు పరమాచార్యుల వారు రెండవ పిల్లవాడితో అబద్దం ఎందుకు చెప్పావంటూ ప్రశ్నించారు. ఆ పిల్లవాడు ఏ మాత్రం భయపడకుండా " రోజూ వచ్చే మా గురువు గారు ఈ రోజు ఏదో అత్యవసర పని మీద రాలేకపోయుంటారు. వారు రాకపోయినా తరగతిలో కూర్చొని చదువుకోవలసిన బాధ్యత మాది. కాని మేము అలా చేయలేదు. అంటే తప్పు మాది. గురువుగారు రాలేదని మీరు ఆయనను కోప్పడతారు. మీ కోపాన్నుండి ఆయననను తప్పించడానికి చిన్న అబద్దం చెప్పడం నేను ధర్మమే అనుకొంటున్నాను. ఈ సమయంలో చదువుకోక ఆడుకోవడం మా తప్పే." అన్నాడు.
అంతటి నడిచే దేవుడిగా పేరొందిన పరమాచార్యులవారు కూడా ఆ పిల్లవాడి గురుభక్తిని చూసి ఆశ్చర్యం పొందారు.
" నీవురా నిజమైన శిష్యుడివి "అంటూ ఆ పిల్లవాడి భుజం తట్టారు పరమాచార్యులవారు.
నేడు కళాశాల విద్యార్థులైనంత మాత్రాన కొమ్ములు వచ్చేసినట్లు ప్రవర్తిస్తూ గురువులను అవమానిస్తున్న వారిని, అలా చేయడానికి ప్రోత్సాహం ఇస్తున్న సినిమాలు,TVలు, పత్రికలు పైన పేర్కొనబడ్డ అబ్బాయి కాలి గోటికి సరిపోతారేమో ఆలోచించండి.
Tuesday, December 29, 2009
ఎవరికుంటుందండీ శ్రీరాముడికి, హనుమంతుడికీ ఉన్నంత వినయం?

"విద్య యొసగు వినయంబు" అంటారు కదా. ఆ వినయం నేటి విద్యార్థులలో ఏ మాత్రం ఉందో అందరికీ తెలుసు. ఏ చిన్న విజయం సాధించినా ఉద్రేకాన్ని అణచుకోలేక విపరీతంగా పొంగిపోయి అహంకరించే నేటి మనుషులు ( ముఖ్యంగా విద్యార్థులు ) ఉన్న సమాజంలో ఇలాంటి విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ రోజు రామాయణంలో శ్రీరాముడి వినయం ఎలాంటిదో, హనుమంతుని వినయం ఎలాంటిదో చూసాను.
మొదట రామచంద్రుడి వినయం చూద్దాం.
అందరికీ తెలుసు అహల్యను తన పాదాలతో పాపవిమోచనం కలిగించాడని. ఇక్కడ శ్రీరాముడు తనే శాపవిమోచనం కలిగించాననే అహంకారం ఏమాత్రం లేకుండా అహల్య శాపవిమోచనం పొందిన వెంటనే ఆమె తన కన్నా వయసులో పెద్దది అవటం చేత మరియు ఒక ఋషి భార్య అవడం చేత తనే ముందుగా మోకాళ్ళ మీద కూచుని అహల్యకు నమస్కారం చేసాడు.
అలానే విశ్వామిత్రుడి యజ్ఞాన్ని అడ్డుకుంటున్న రాక్షసులను చంపిన తర్వాత ఋషులందరూ రాముడిని "ఇంత చిన్న వయసులోనే అలాంటి రాక్షసులను చంపగలిగావు కదా" అంటూ పొగిడారు. రాముడు ఏమాత్రం అహంకరించకుండా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
ఇక హనుమంతుని వినయం ఎంతటిదో చూద్దాం.
లంకలో సీతమ్మను కలుసుకొన్న తర్వాత సీతమ్మ " హనుమా! నీవు ఎంత బలవంతుడివి. ఇంత సముద్రాన్ని దాటి నువ్వొక్కడివే దాటగలిగావు" అంది. ఇలాంటి మాటే గనుక నేటి పిల్లలతో కానీ, పోటీలలో పాల్గొని కొద్దిగా బాగా ప్రదర్శన ఇచ్చిన పోటీదారుతో కాని అంటే ఉద్రేకంతో ఎంతగా అరుస్తారో,ఎంత అహంకరిస్తారో టీవీ లలో మనం చూస్తూనే ఉన్నాం. కాని ఇక్కడ హనుమంతుడు చూపిన వినయం చూస్తే నేటి సమాజం ఆశ్చర్యపోక మానదు.
హనుమంతుడన్నాడు, " అమ్మా! మా సైన్యంలో నాతో సమానమైన బలవంతులూ, నా కన్నా అధికులూ ఐన వారు ఉన్నారు. అంతేకాని నాకన్నా తక్కువ వారు లేరు. ఒక ఇంట్లో ఆడవారికి ఏదైనా కబురు చేయడానికి ఒక పిల్లవాడినో, ఇంట్లో అందరికన్నా తక్కువ వారినో పంపిస్తారు. అంతేకాని పెద్దవారు రారు కదా !".
హనుమంతుడు ఎంత బలవంతుడో మనకు తెలుసు. ఎవరూ రాలేకనే కదా హనుమంతున్ని పంపింది. కాని హనుమంతుని వినయం ఎంతగా ఉందో చూసారా? కనీసం అలాంటి వినయాన్ని ఊహించగలమా?
ఇప్పుడు చెప్పండి నేటి యువత కానీ, సమాజం కానీ, చదువుకొన్న,చదువుకుంటున్న విద్యార్థులు కానీ ఎంత వినయం నేర్చుకోవాలో.
Thursday, December 24, 2009
నా మరో బ్లాగు "భక్తి సామ్రాజ్యం".
నా మరో బ్లాగు "భక్తి సామ్రాజ్యం" పూర్తి ఆధ్యాత్మికంగా భగవంతుడి లీలలను, భక్తుల చరిత్రలను వ్రాస్తున్నాను. ఆశీర్వదించగలరు.
Sunday, December 20, 2009
భక్తులతో, భగవంతునితో పెట్టుకొని నాశనం కాకండి, సమైక్యవాదులైనా ! తెలంగాణావాదులైనా !
సమైక్యరాష్ట్రం కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. మంచిదే. పోరాడండి. కాని దేవుడిని, భక్తులను ఎందుకు ఈ విషయములోనికి లాగుతున్నారో అర్థం కావడంలేదు. ఈ విషయంపై కొన్ని జరిగిన సంఘటనలను చూద్దాం.
1. ఒక బ్లాగరి తన బ్లాగులో తెలుగు బాష విషయం పై వాదన చేస్తూ బమ్మెర పోతన తెలంగాణా వ్యక్తి అని వారే అసలైన తెలుగు వారని అందుకే భాగవతం చాలా బాగుంటుందని , నన్నయ ఆంధ్ర ప్రాంతం వ్యక్తి అని అందుకే అతను వ్రాశిన మహాభారతం అంత బాగోదని తేల్చేసాడు.
మీ మూర్ఖత్వాన్ని, వాదనలను మీ వద్దే పెట్టుకోండి.
భక్తులకు విశ్వమంతా ఒక్కటే. వారికి దేవుడు తప్ప ఇతరాలు కానరావు. మన అజ్ఞానంతో భక్తుల పట్ల అపచారాన్ని చేస్తున్నాము. దేవుడు తనను ఏమైనా అన్నా ఉపేక్షిస్తాడేమో గానీ, భక్తుల జోలికి వస్తే ఊరుకోడు.
2. విజయవాడ అమ్మ వారి ప్రసాదాన్ని వేములవాడకు పంపిస్తే ఆ ప్రసాదం ఆంధ్రప్రాంతం వారిదని త్రిప్పి పంపేశారట. దుర్గమ్మ జగన్మాత, అంతే కాని ఆంధ్రామత అనో లేక తెలంగాణా మాత మాత్రమో కాదు. భధ్రాచలం రాముడైనా, తిరుపతి వెంకన్న ఐనా ఇద్దరూ ఒకటే అని తెలిసినా మూర్ఖవాదాలతో కాలం సాగిస్తున్నారు.
ఎవరైనా ఎంతైనా పోరాడండి. హద్దుల్లో ఉండి పోరాడండి. అంతేకాని దేవుడి విషయంలో కాని, ఇంకా ముఖ్యముగా భాగవతుల(భక్తుల) విషయంలో కాని పొరపాటున ఐనా తప్పు చేస్తే లేక మన ప్రాంతీయవాదాల్ని వారికి అంటగడితే నాశనం కాకతప్పదు.
గమనిక : ఈ టపా ఏ ఉద్యమానికీ వ్యతిరేకంగానో లేక మద్దతుగానో వ్రాయబడలేదు. ఆధ్యాత్మిక సంబంధంగానే వ్రాయబడింది.
1. ఒక బ్లాగరి తన బ్లాగులో తెలుగు బాష విషయం పై వాదన చేస్తూ బమ్మెర పోతన తెలంగాణా వ్యక్తి అని వారే అసలైన తెలుగు వారని అందుకే భాగవతం చాలా బాగుంటుందని , నన్నయ ఆంధ్ర ప్రాంతం వ్యక్తి అని అందుకే అతను వ్రాశిన మహాభారతం అంత బాగోదని తేల్చేసాడు.
మీ మూర్ఖత్వాన్ని, వాదనలను మీ వద్దే పెట్టుకోండి.
భక్తులకు విశ్వమంతా ఒక్కటే. వారికి దేవుడు తప్ప ఇతరాలు కానరావు. మన అజ్ఞానంతో భక్తుల పట్ల అపచారాన్ని చేస్తున్నాము. దేవుడు తనను ఏమైనా అన్నా ఉపేక్షిస్తాడేమో గానీ, భక్తుల జోలికి వస్తే ఊరుకోడు.
2. విజయవాడ అమ్మ వారి ప్రసాదాన్ని వేములవాడకు పంపిస్తే ఆ ప్రసాదం ఆంధ్రప్రాంతం వారిదని త్రిప్పి పంపేశారట. దుర్గమ్మ జగన్మాత, అంతే కాని ఆంధ్రామత అనో లేక తెలంగాణా మాత మాత్రమో కాదు. భధ్రాచలం రాముడైనా, తిరుపతి వెంకన్న ఐనా ఇద్దరూ ఒకటే అని తెలిసినా మూర్ఖవాదాలతో కాలం సాగిస్తున్నారు.
ఎవరైనా ఎంతైనా పోరాడండి. హద్దుల్లో ఉండి పోరాడండి. అంతేకాని దేవుడి విషయంలో కాని, ఇంకా ముఖ్యముగా భాగవతుల(భక్తుల) విషయంలో కాని పొరపాటున ఐనా తప్పు చేస్తే లేక మన ప్రాంతీయవాదాల్ని వారికి అంటగడితే నాశనం కాకతప్పదు.
గమనిక : ఈ టపా ఏ ఉద్యమానికీ వ్యతిరేకంగానో లేక మద్దతుగానో వ్రాయబడలేదు. ఆధ్యాత్మిక సంబంధంగానే వ్రాయబడింది.
Monday, December 14, 2009
దక్షిణామూర్తి పూర్తి కథ

రవిచంద్ర గారు తమ బ్లాగులో దక్షిణామూర్తి కథ వ్రాశారు. ఆ టపాకు వ్యాఖ్య వ్రాద్దామంటే ఒక టపా అంత అవుతుంది. అందుకే ఈ టపా వ్రాస్తున్నాను.
బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక,సనందన,సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.
ఇక ఈ నలుగురూ గురువుకోసం వెదుకుతూ నారదమహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నారు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడనూ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.
పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు భోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు,మనసుకూ అందనివారు కాబట్టి అలా భోధించారు.
Friday, December 11, 2009
ఇదేనా చదివిన చదువు మనకు నేర్పింది ? సిగ్గుపడాలి.
తెలంగాణా విషయం మొదలైనప్పటి నుండి అసలు మన విద్యా వ్యవస్థ యొక్క పస ఏంటో, అది మనకు ఏం నేర్పుతోందో అర్థం అవుతోంది. అసలు విద్యార్థులు ఏం చదువుతున్నారో , ఎందుకు చదువుతున్నారో అర్థం కాకుండా ఉంది. "విద్య యొసగు వినయంబు " అంటారు , ఆ వినయంతో " విచక్షణా జ్ఞానం" వస్తుందని అంటారు. కాని ఎక్కడ వస్తోంది?
కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా, పాలిచ్చే ఆవును గాయపరిచినట్లుగా , పండిన పంటను తగలబెట్టినట్లుగా ఉంది విద్యార్థుల వ్యవహారం. లేకపోతే సమాజానికి ఉపయోగపడే బస్సులను, ఇతరుల వాహనాలను , పొట్టకూటికి జరుపుకొనే వ్యాపారాల పైనా వీరి ప్రతాపం? ఇప్పుడు బస్సులను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు . మళ్లీ అంతా సద్దుమణిగాక ఆ నష్టపోయిన ఆస్తులకు పరిహారం ఎవరు, ఎలా ఇస్తారు? ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రభుత్వం ఎలా తెస్తుంది? అదనపు పన్నులు ప్రజల పైన వేయడం ద్వారా . అంతే కదా? ఈ మాత్రం మూల విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా ?
రాజకీయనాయకులు రెచ్చగొడతారు. రెచ్చగొడితే చేసేయడమే. ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేక పొతే ఎలా ? అసలు ఈ మాత్రానికి చదవడం ఎందుకు ? డబ్బులు ఖర్చు చేయడం ఎందుకు ? ఏదైనా సాధించాలంటే ఒక మార్గం అంటూ ఉంటుంది. అది తెలుసుకోలేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎవరికి నష్టం? మన చదువు ఇదేనా మనకు నేర్పుతోంది?
కొన్ని పల్లెల ప్రజలు ఎన్నో రోజులు కష్టపడి, అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళావెళ్లా పడి తమ పల్లెలకు బస్సును వేయించుకొంటారు. ఇప్పుడు వీరు ధ్వంసం చేసే బస్సులలో అవి కూడా ఉన్నాయి. మళ్లీ ఆ పల్లెలకు బస్సులు తిరగాలంటే వారు ఎంత బాధపడాలి? ఎంతగా మళ్లీ తిరగాలి? మీ పైశాచికానందం కోసం, మీలోని శాడిసం ను తృప్తి పరచడం కోసం ప్రజల ఆస్తులను నాశనం చేస్తారా? అంతగా అవసరం ఉంటే మీ సొంత వాహనాన్ని అది సైకిలైనా , బైకైనా లేక కారైనా కావచ్చు, దాన్ని రోడ్డు పైకి తీసుకువచ్చి మీ కసితీరా ధ్వంసం చేసుకోండి. ఎవరూ ఏమి అనరు. ఈ మాటను కూడా నేను అనకూడదు. కాని ఇతరులకు , అందరికి ఉపయోగపడే వాటిని నాశనం చేసే బదులు మీవే నాశనం చేసుకొంటే సరిపోతుందికదా.మీ పైత్యం తీరాలి కదా.
ఇతరుల వరకు వస్తే మీకు అది మలం తో సమానం, మీ వరకు వస్తే అది పరమాన్నమా?
ఇక ఈ రోజు హైకోర్టు న్యాయవాదులు చేస్తున్న గలాటాను చూస్తే ఒళ్ళు మండిపోతోంది. ఏంటి వారు చదువుకొన్నది? వీరా మనకు న్యాయవాదులు? ఇలాంటి మనస్తత్వం కలవారా న్యాయం కోసం వాదించేది? ఇలాంటి వారి వద్దకు వెళ్తే మనకు న్యాయం జరుగుతుందని అనుకోగలమా?
ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్ని భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. మీరు చేసే తప్పులు ఎంత వేగంతో మిమ్మల్ను అవి తాకుతాయంటే మీ మాటను కూడా వినడానికి ఎవరూ ఉండరు. మీరు చదివి వృథా. మీకు పెట్టిన డబ్బును ఏ జంతువుకో పెడ్తే అది జీవితాంతం ఋణపడి ఉంటుంది.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో ఇలాంటివి చేయకుండా ఉంటే అందరికీ మేలు.
గమనిక: నేను ఈ టపాను అందరు విద్యార్థులను ఉద్దేశించి వ్రాయలేదు. ఎవరైతే చదువుకొని కూడా పై విధం గా ప్రవర్తిస్తున్నారో వారిని ఉద్దేశించి మాత్రమే వ్రాసాను. రాజకీయనాయకులు, కార్యకర్తలు, అసాంఘికశక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు. వారిలో కూడా విద్యార్థులు, చదువుకొన్నవారు ఉన్నారు కదా. వారిని ఉద్దేశించి మాత్రమే ఇదివ్రాసాను.
కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా, పాలిచ్చే ఆవును గాయపరిచినట్లుగా , పండిన పంటను తగలబెట్టినట్లుగా ఉంది విద్యార్థుల వ్యవహారం. లేకపోతే సమాజానికి ఉపయోగపడే బస్సులను, ఇతరుల వాహనాలను , పొట్టకూటికి జరుపుకొనే వ్యాపారాల పైనా వీరి ప్రతాపం? ఇప్పుడు బస్సులను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు . మళ్లీ అంతా సద్దుమణిగాక ఆ నష్టపోయిన ఆస్తులకు పరిహారం ఎవరు, ఎలా ఇస్తారు? ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రభుత్వం ఎలా తెస్తుంది? అదనపు పన్నులు ప్రజల పైన వేయడం ద్వారా . అంతే కదా? ఈ మాత్రం మూల విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా ?
రాజకీయనాయకులు రెచ్చగొడతారు. రెచ్చగొడితే చేసేయడమే. ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేక పొతే ఎలా ? అసలు ఈ మాత్రానికి చదవడం ఎందుకు ? డబ్బులు ఖర్చు చేయడం ఎందుకు ? ఏదైనా సాధించాలంటే ఒక మార్గం అంటూ ఉంటుంది. అది తెలుసుకోలేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎవరికి నష్టం? మన చదువు ఇదేనా మనకు నేర్పుతోంది?
కొన్ని పల్లెల ప్రజలు ఎన్నో రోజులు కష్టపడి, అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళావెళ్లా పడి తమ పల్లెలకు బస్సును వేయించుకొంటారు. ఇప్పుడు వీరు ధ్వంసం చేసే బస్సులలో అవి కూడా ఉన్నాయి. మళ్లీ ఆ పల్లెలకు బస్సులు తిరగాలంటే వారు ఎంత బాధపడాలి? ఎంతగా మళ్లీ తిరగాలి? మీ పైశాచికానందం కోసం, మీలోని శాడిసం ను తృప్తి పరచడం కోసం ప్రజల ఆస్తులను నాశనం చేస్తారా? అంతగా అవసరం ఉంటే మీ సొంత వాహనాన్ని అది సైకిలైనా , బైకైనా లేక కారైనా కావచ్చు, దాన్ని రోడ్డు పైకి తీసుకువచ్చి మీ కసితీరా ధ్వంసం చేసుకోండి. ఎవరూ ఏమి అనరు. ఈ మాటను కూడా నేను అనకూడదు. కాని ఇతరులకు , అందరికి ఉపయోగపడే వాటిని నాశనం చేసే బదులు మీవే నాశనం చేసుకొంటే సరిపోతుందికదా.మీ పైత్యం తీరాలి కదా.
ఇతరుల వరకు వస్తే మీకు అది మలం తో సమానం, మీ వరకు వస్తే అది పరమాన్నమా?
ఇక ఈ రోజు హైకోర్టు న్యాయవాదులు చేస్తున్న గలాటాను చూస్తే ఒళ్ళు మండిపోతోంది. ఏంటి వారు చదువుకొన్నది? వీరా మనకు న్యాయవాదులు? ఇలాంటి మనస్తత్వం కలవారా న్యాయం కోసం వాదించేది? ఇలాంటి వారి వద్దకు వెళ్తే మనకు న్యాయం జరుగుతుందని అనుకోగలమా?
ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్ని భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. మీరు చేసే తప్పులు ఎంత వేగంతో మిమ్మల్ను అవి తాకుతాయంటే మీ మాటను కూడా వినడానికి ఎవరూ ఉండరు. మీరు చదివి వృథా. మీకు పెట్టిన డబ్బును ఏ జంతువుకో పెడ్తే అది జీవితాంతం ఋణపడి ఉంటుంది.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో ఇలాంటివి చేయకుండా ఉంటే అందరికీ మేలు.
గమనిక: నేను ఈ టపాను అందరు విద్యార్థులను ఉద్దేశించి వ్రాయలేదు. ఎవరైతే చదువుకొని కూడా పై విధం గా ప్రవర్తిస్తున్నారో వారిని ఉద్దేశించి మాత్రమే వ్రాసాను. రాజకీయనాయకులు, కార్యకర్తలు, అసాంఘికశక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు. వారిలో కూడా విద్యార్థులు, చదువుకొన్నవారు ఉన్నారు కదా. వారిని ఉద్దేశించి మాత్రమే ఇదివ్రాసాను.
Monday, November 9, 2009
ఈ సంఘటనకు మీరైతే ఎలా స్పందిస్తారు? మేము లోకల్.
ఇది బెంగళూరులో నాకు నిజంగా జరిగిన సంఘటన.
పోయిన దీపావళి పండుగ రోజు బెంగళూరులో మేమున్న మారతహళ్ళిలో మేము మా రూం ముందు నిలుచునిఉన్నాము. అప్పుడు రాత్రి 7వ,8వ తరగతి పిల్లలు టపాకాయలు కాలుస్తున్నారు. కాల్చడములో ఎవరికీ అభ్యంతరము లేదు కానీ రోడ్డులో పోయేవాళ్ళపైకి చేత్తో టపాసులు కాల్చి విసురుతున్నారు. నేను,నా స్నేహితులు వద్దని వారించాము.
తర్వాత మేము వెనుకకు తిరగగానే ఒక పిల్లవాడు లక్ష్మీటపాసును మా మిత్రుడిపై విసిరాడు. దాంతో మా వాడికి కోపం వచ్చి వానిపై చెయ్యెత్తబోయాడు. కాని ఎందుకులే అని ఊరుకున్నాడు. కాని ఆ అబ్బాయిలు మా వద్దకు వచ్చి కన్నడంలో " మీరు ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.కానీ మేము ఇక్కడ Local. మా మీద చెయ్యెత్తేంత ధైర్యమా మీకు ? చెయ్యెత్తి ఇక్కడ ఉంటామనే అనుకుంటున్నారా?" అని అన్నాడు. మాకు చేష్టలుడిగిపోయాయి(shock). అన్నది పెద్దవారు కాదు. 13,14 ఏళ్ళు వయసు గల పిల్లలు. తప్పు వాళ్ళదే. ఐనా Local feeling వారికి ఎలా వచ్చినో ఇప్పటికీ అర్థం కావడం లేదు.
ఇక్కడ వ్యవస్థ తప్పా? లేక సినిమాల ప్రభావమా? లేక ప్రాంతీయ దురభిమానమా? ఏమో అస్సలు అస్సలు అర్థం కావడంలేదు.
పోయిన దీపావళి పండుగ రోజు బెంగళూరులో మేమున్న మారతహళ్ళిలో మేము మా రూం ముందు నిలుచునిఉన్నాము. అప్పుడు రాత్రి 7వ,8వ తరగతి పిల్లలు టపాకాయలు కాలుస్తున్నారు. కాల్చడములో ఎవరికీ అభ్యంతరము లేదు కానీ రోడ్డులో పోయేవాళ్ళపైకి చేత్తో టపాసులు కాల్చి విసురుతున్నారు. నేను,నా స్నేహితులు వద్దని వారించాము.
తర్వాత మేము వెనుకకు తిరగగానే ఒక పిల్లవాడు లక్ష్మీటపాసును మా మిత్రుడిపై విసిరాడు. దాంతో మా వాడికి కోపం వచ్చి వానిపై చెయ్యెత్తబోయాడు. కాని ఎందుకులే అని ఊరుకున్నాడు. కాని ఆ అబ్బాయిలు మా వద్దకు వచ్చి కన్నడంలో " మీరు ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.కానీ మేము ఇక్కడ Local. మా మీద చెయ్యెత్తేంత ధైర్యమా మీకు ? చెయ్యెత్తి ఇక్కడ ఉంటామనే అనుకుంటున్నారా?" అని అన్నాడు. మాకు చేష్టలుడిగిపోయాయి(shock). అన్నది పెద్దవారు కాదు. 13,14 ఏళ్ళు వయసు గల పిల్లలు. తప్పు వాళ్ళదే. ఐనా Local feeling వారికి ఎలా వచ్చినో ఇప్పటికీ అర్థం కావడం లేదు.
ఇక్కడ వ్యవస్థ తప్పా? లేక సినిమాల ప్రభావమా? లేక ప్రాంతీయ దురభిమానమా? ఏమో అస్సలు అస్సలు అర్థం కావడంలేదు.
Subscribe to:
Posts (Atom)
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...