Saturday, February 13, 2016
Tuesday, January 5, 2016
మనకు వినోదం పంచేవాడికి ఉన్న విలువ మన ప్రాణాలను కాపాడేవాళ్ళకు ఇవ్వని దౌర్భాగ్యులం మనం...
ఒక సినిమా హీరోనో లేక మరో సినీప్రముఖుడో పోతే మన సొంత మనిషే పోయాడన్నంతగా బాధపడతాము. మంచిదే అతడు మీకు వినోదాన్ని పంచాడు. కాని వినోదం ఎప్పటివరకు ? మన ప్రాణం ఉన్నంతవరకే.
మరి ఆ ప్రాణాలను కాపాడడానికే అనుక్షణం జీవిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరజవానుల కోసం ఒక కన్నీటిబొట్టైనా రాలదే !
మన మనసు అంత బండబారిపోయిందా ?
పఠాన్కోట్ అమర జవానులకు నివాళులు మరియు దేశసైన్యానికి వందనాలు.
Friday, January 1, 2016
కూడలి బ్లాగుల సంకలిని(అగ్రిగేటర్) మూతపడడం మనసుకు బాధగా ఉంది
ఇప్పుడే చూస్తున్నాను. కూడలి వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే కూడలిని మూసివేస్తున్నట్లు ప్రకటన.
బ్లాగు రాయడం మొదలు పెట్టినప్పటి నుండి కూడలికి బాగా అలవాటు పడ్డాను. ఒక్కసారిగా ఇలా అయ్యేసరికి ఇంకా మనసు స్వీకరించలేకపోతోంది. అసలు ఏమయ్యిందో అర్థం కావడం లేదు.
చాలా బాధాకరంగా ఉంది.
Tuesday, December 15, 2015
Friday, December 11, 2015
మీ పాటకు ఒక్క తీగ చాలదా ? నాలుగు కావాలా? (ఒక నిజ సంఘటన)
ప్రఖ్యాత ఫిడేల్ వాయిద్య విద్వాంసులుగా శ్రీ కృష్ణయ్యర్ గారి గురించి చాలామందికి తెలుసు.
వారి జీవితములో ఒకసారి జరిగిన సంఘటన ద్వారా వారెంత సాధకులో,విద్వాంసులో తెలుస్తుంది.
ఒకసారి ఒక కచేరీలో గాయకులకు ప్రక్కవాద్య సహకారంగా కృష్ణయ్యర్ గారు ఫిడేలు వాయిస్తున్నారు. ఉన్నట్టుండి ఫిడేల్ లో ని ఒక తీగ తెగిపోయింది. గాయకుడు కృష్ణయ్యర్ గారి వైపు "పాటకు అనుగుణంగా వాయించలేక కావాలని తీగ తెంపుకున్నావు" అన్నట్లు వ్యంగముగా చూసారట. ఫిడేలుకు 4 తీగలు ఉంటాయి. కృష్ణయ్యర్ గారికి కోపం వచ్చి "మీ పాటకు ఒక తీగ చాలు మిగతా 3 కూడా అవసరం లేదు" అని మిగతా రెండు తీగలు కూడా తెంపేసి ఒక్క తీగ తోనే మొత్తం కచేరీకి అత్యద్భుతంగా వాద్య సహకారం అందించారు. కానీ ఎవరికీ అనుమానం రాలేదు.
చూసారా ఇలాంటి మహానుభావుల సాధనా బలం.
- వాసుదేవ గారి "స్మృతులు" గ్రంధం నుండి
Monday, December 7, 2015
నీలము - ఆ రంగుకు (తెలుగు భాషలో) ఈ పేరెలా వచ్చింది ? (నా అభిప్రాయము)
కొన్ని ఉన్నట్టుండి అనూహ్యంగా,అకస్మాత్తుగా మనసుకు తడుతూఉంటాయి. అలా నిన్న పడుకున్నప్పుడు ఉన్నట్టుండి మెరుపులా నాకు కలిగిన భావన ఇది.
నాకు తట్టిన ఊహ ప్రకారము :
మనకు తెలుసు సముద్రము ఆకాశము రంగులో అంటే నీలపు రంగులో ఉంటుందని (రామన్ ఎఫెక్ట్ దీనినే వివరించింది).నీటిని తెలుగులో నీళ్ళు, నీరు గ్రాంధిక భాషలో "నీరము" అని కూడా అంటారు.
భాష అభివృద్ధి దశలో మన తెలుగువారు ఎప్పుడైనా నీలము రంగును చుసినప్పుడు అది ఏ రంగులో ఉంది అనే ప్రశ్న వచ్చినప్పుడు (ఇంకా నీలము అనే పదము లేదు కాబట్టి) వారు సముద్రపు రంగును దృష్టిలో పెట్టుకొని "నీళ్ళ రంగులో" లేక "నీరము రంగులో" ఉంది అనేవారు అని నా భావన.
ఈ భావమే తర్వాతి కాలములో నీరము అనేది నీలము అని మారిందని నా ఊహ. నీరు అనేది "నీలి" అని మారి ఉండవచ్చు..
ఇది కేవలం నా భావన మాత్రమే.ఇదే నిజమని నేను చెప్పలేను.
ఇదండీ నాకు నిన్న అకస్మాతుగా మెరుపులా వచ్చిన ఊహ.
Saturday, July 25, 2015
జీవితాంతం తప్పుడు పనులు చేస్తూ చనిపోయేముందు మాత్రం భగవంతుడిని స్మరిస్తే ఆయనను పొందగలమా ?
జీవితాంతం తప్పుడు పనులు చేస్తూ చనిపోయేముందు మాత్రం భగవంతుడిని స్మరిస్తే ఆయనను పొందగలమా ?
పొందగలము.
కానీ...........ఇది చదవండి..
శ్రీ భగవద్గీత లోని 8 వ అధ్యాయం ఐన అక్షరపరబ్రహ్మ యోగం లోని 5 వ శ్లోక భావం అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఆ శ్లోకం ఏమిటంటే
"అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః"
దీని అర్థము
"ఎవరైతే మరణ సమయములో నన్ను స్మరిస్తూ ప్రాణాలు వదులుతారో వారు నన్నే పొందుతారు. ఈ విషయంలో సందేహము లేదు " అని
సరే ఒక విషయం ఆలోచించండి. మనకు ఏదైనా ఒక ప్రమాదం జరిగి దెబ్బలు తగిలి రక్తం వస్తున్నదనుకోండి. తగిలిన వెంటనే మనం "అమ్మా" అనో, "అబ్బా" అనో అంటాము. అంటే మనకు ఆపద సమయములో దేవుడు గుర్తుకు వస్తున్నాడా? 99.99 శాతము గుర్తుకు రాడు.
మరి అన్నిటికన్నా పెద్ద సంఘటన ఐన మరణసమయములో ,మనకు మరణము తప్పదన్న విషయం తెలిసిన క్షణములో దేవుడు గుర్తుకు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అదే సమాధానం 99.99 శాతం గుర్తుకు రాడు. మనకు అత్యంత ఇష్టమైన సంఘటన లేక ఇష్టులు లేక పెళ్ళాము లేక మొగుడు,బిడ్డలు లేదా తల్లిదండ్రులు లేదా డబ్బో, ఇన్సూరెన్స్(భీమా) పాలసీ నో గుర్తుకువస్తాయి. అంటే ఆప్తులు మాత్రం గుర్తుకువస్తారు.నిజమే కదా?
ఇప్పుడు చెప్పండి. చావు సమయములో భగవంతుడు గుర్తుకు రాడు కదా?
మరి దేవుడు గుర్తుకు రావాలి అంటే మన మనసు సంపూర్ణముగా దైవచింతనతో నిండి ఉండాల్సిన అవసరము ఉంది. అలా ఉండాలంటే మనము ప్రతిరోజూ భగవంతుని స్మరిస్తూ ఉండాలి కదా. మనకు అత్యంత ఆప్తుడుగా భగవంతున్ని మనం భావించాలి కదా, అప్పుడు మాత్రమే భగవంతుడు మనకు మరణసమయంలో గుర్తుకువస్తాడు.
అత్యంత ఆప్తుడు కావాలంటే ఒక ప్రియుడు(ప్రేయసి) తన ప్రియురాలిని(ప్రేమికున్ని) ప్రేమించినట్లు లేక ఒక తల్లి తన బిడ్డను లేక ఒక బిడ్డ తన తల్లిని ప్రేమించినట్టు మనం కూడా భగవంతున్ని ప్రేమించాలి. పైన పేర్కొన్న వారిలో ఏ జంటలోని వ్యక్తులూ ఒకరు లేకుండా మరొకరు జీవించలేరు. అంతే సంబంధము మనిషికీ,దేవునికీ ఉండాలి. అప్పుడు మాత్రమే మరణసమయములో కూడా భగవంతుడు గుర్తుకు వస్తాడు.
అలానే భగవంతుని గురించి ప్రతిరోజూ ఆలోచిస్తే అతడిని మరణసమయములో కూడా భగవంతుడు గుర్తు వస్తాడు కానీ ఎప్పుడూ ఆలోచించకుండా అప్పుడే గుర్తుకురావడం అనేది 99.99 శాతం అసాధ్యం.
మిగతా 0.01 శాతం అత్యంతఅరుదుగా మనకు తటాలున ఏదైనా విషయం గుర్తుకు వచ్చినట్లు భగవంతుడు కూడా గుర్తుకు రావచ్చు.
పొందగలము.
కానీ...........ఇది చదవండి..శ్రీ భగవద్గీత లోని 8 వ అధ్యాయం ఐన అక్షరపరబ్రహ్మ యోగం లోని 5 వ శ్లోక భావం అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఆ శ్లోకం ఏమిటంటే
"అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః"
దీని అర్థము
"ఎవరైతే మరణ సమయములో నన్ను స్మరిస్తూ ప్రాణాలు వదులుతారో వారు నన్నే పొందుతారు. ఈ విషయంలో సందేహము లేదు " అని
సరే ఒక విషయం ఆలోచించండి. మనకు ఏదైనా ఒక ప్రమాదం జరిగి దెబ్బలు తగిలి రక్తం వస్తున్నదనుకోండి. తగిలిన వెంటనే మనం "అమ్మా" అనో, "అబ్బా" అనో అంటాము. అంటే మనకు ఆపద సమయములో దేవుడు గుర్తుకు వస్తున్నాడా? 99.99 శాతము గుర్తుకు రాడు.
మరి అన్నిటికన్నా పెద్ద సంఘటన ఐన మరణసమయములో ,మనకు మరణము తప్పదన్న విషయం తెలిసిన క్షణములో దేవుడు గుర్తుకు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అదే సమాధానం 99.99 శాతం గుర్తుకు రాడు. మనకు అత్యంత ఇష్టమైన సంఘటన లేక ఇష్టులు లేక పెళ్ళాము లేక మొగుడు,బిడ్డలు లేదా తల్లిదండ్రులు లేదా డబ్బో, ఇన్సూరెన్స్(భీమా) పాలసీ నో గుర్తుకువస్తాయి. అంటే ఆప్తులు మాత్రం గుర్తుకువస్తారు.నిజమే కదా?
ఇప్పుడు చెప్పండి. చావు సమయములో భగవంతుడు గుర్తుకు రాడు కదా?
మరి దేవుడు గుర్తుకు రావాలి అంటే మన మనసు సంపూర్ణముగా దైవచింతనతో నిండి ఉండాల్సిన అవసరము ఉంది. అలా ఉండాలంటే మనము ప్రతిరోజూ భగవంతుని స్మరిస్తూ ఉండాలి కదా. మనకు అత్యంత ఆప్తుడుగా భగవంతున్ని మనం భావించాలి కదా, అప్పుడు మాత్రమే భగవంతుడు మనకు మరణసమయంలో గుర్తుకువస్తాడు.
అత్యంత ఆప్తుడు కావాలంటే ఒక ప్రియుడు(ప్రేయసి) తన ప్రియురాలిని(ప్రేమికున్ని) ప్రేమించినట్లు లేక ఒక తల్లి తన బిడ్డను లేక ఒక బిడ్డ తన తల్లిని ప్రేమించినట్టు మనం కూడా భగవంతున్ని ప్రేమించాలి. పైన పేర్కొన్న వారిలో ఏ జంటలోని వ్యక్తులూ ఒకరు లేకుండా మరొకరు జీవించలేరు. అంతే సంబంధము మనిషికీ,దేవునికీ ఉండాలి. అప్పుడు మాత్రమే మరణసమయములో కూడా భగవంతుడు గుర్తుకు వస్తాడు.
అలానే భగవంతుని గురించి ప్రతిరోజూ ఆలోచిస్తే అతడిని మరణసమయములో కూడా భగవంతుడు గుర్తు వస్తాడు కానీ ఎప్పుడూ ఆలోచించకుండా అప్పుడే గుర్తుకురావడం అనేది 99.99 శాతం అసాధ్యం.
మిగతా 0.01 శాతం అత్యంతఅరుదుగా మనకు తటాలున ఏదైనా విషయం గుర్తుకు వచ్చినట్లు భగవంతుడు కూడా గుర్తుకు రావచ్చు.
Friday, July 24, 2015
Monday, January 12, 2015
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్పురద్రూపి..ఒక్క మాటలో చెప్పాలంటే Manly person.
అ వేశ్యలు విటుల కోసం చేసే హావభావాలను చూసి ఆ వ్యక్తి సహచరులలోని స్త్రీలు ఆ వేశ్యలను చూసి భయపడ్డారు. అందుచేత వారు ఆ వ్యక్తిని అక్కడ నుండి పక్కకు వచ్చేయమని వారించారు.కాని ఆ వ్యక్తి సూటిగా ఆ వేశ్యల వద్దకు వెళ్ళి వారి వద్ద కూర్చొని " వీరు తమ దివ్యత్వాన్ని బాహ్యమైన అందం రూపంలో వ్యక్తపరుస్తున్నారు( They put their divinity into beauty)" అని కన్నీళ్ళు కారుస్తూ అన్నాడు. అతని ఈ మాటలు ఆ వేశ్యలను ఎంతగా ప్రభావితం చేశాయంటే ఆ వేశ్యలలో కొందరు తమ జీవితాన్ని తలుచుకొని మొహం కప్పుకొని ఏడవసాగారు. ఒక వేశ్య ఈ వ్యక్తి అంగీ కొనను పట్టుకొని " నేడు నేను ఒక దైవదూత అంగీని ముట్టుకొని ధన్యత చెందాను" అన్నది. ఆ వ్యక్తి మీ అందరి కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నాడు.
ఇంతలో ఆ వ్యక్తి సహచర స్త్రీలు ఆయనను పక్కకు లాక్కుపోయారు.
ఎవరు ఈ వ్యక్తి? మీలో చాలా మంది ఊహించే ఉంటారు. తన వ్యక్తిత్వంచే నేటికీ, ఎల్లప్పటికీ ప్రభావితం చేస్తున్న స్వామి వివేకానందుడే ఆ వ్యక్తి.
జనవరి 12 న జాతీయ యువజన దినోత్సవమని, వివేకానందుల పుట్టినరోజని జరుపుకోవడం ఇదేనా ఆ మహానుభావుడికి మనం ఇచ్చే నివాళి ?
ఆయన ఉపదేశాలలో ఒక్కటి మనస్పూర్తిగా ఆచరించినా మన జీవితమే అత్యధ్బుతంగా తీర్చిదిద్దబడుంది.
Thursday, September 11, 2014
ప్రపంచ చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత చాలా ఆనందం,అద్భుతం,ఆశ్చర్యం,బాధాకరం
సెప్టెంబరు 11,1893:

సరిగ్గా నేటికి 121 సంవత్సరాల క్రిందట చికాగోలో
స్వామివివేకానంద "అమెరికా సోదరసోదరీమణులారా!.."
అంటూ ఇచ్చిన ఉపన్యాసం సనాతన హైందవధర్మాన్ని నిలబెట్టింది.
భారతదేశాన్ని ప్రపంచం ముందు తిరిగి తలెత్తుకొనేలా చేసింది మరియు
భవిష్యత్తుకై బాట వేసింది.
సెప్టెంబరు11,2001:
నేటికి 13 సంవత్సరాల క్రింద ఉగ్రవాదుల దాడిలో న్యూయార్క్ లోని WTO ట్విన్ టవర్స్ ధ్వంసం అయ్యాయి.

మొదటిది ధర్మస్థాపన కోసం నాంది అయితే రెండవది అధర్మానికి వేదిక
అయింది.
మీరు సరిగా గమనిస్తే ఒక వింత కనిపిస్తుంది.
అదేమంటే తేడా 108 సంవత్సరాలు. మన హిందూధర్మం లో 108 ప్రాముఖ్యత మీకు తెలిసిందే. దీనికై నా గత టపా
లోని మాటలు ఇక్కడ చూడండి.
1.వేదాల ప్రకారం
#భూమికి,చంద్రునికి మధ్యదూరం,చంద్రుని వ్యాసానికి 108 రెట్లు
#భూమికి,సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు
#సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.
నేటి విజ్ఞానం ప్రకారం కూడా ఇవి దాదాపు సరిపోలాయి.
2.ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మర్మస్థానాలు 108.
3.నక్షత్రాలు 27.వాటికి ఒక్కొక్కటికి గల పాదాలు 4. 27*4=108
4.రాశులు 12.గ్రహాలు 9. 12*9=108.
5.భరతనాట్యంలో మొత్తం నాట్యభంగిమలు 108.
6.ఉపనిషత్తులు 108.
7.108=1*2 వర్గం*3 ఘనం=1*(2*2)*(3*3*3).
8.భగవద్గీత అధ్యాయాలు 18.మహాభారత పర్వాలు 18.ఇవి 108 యొక్క కారణాంకాలు.

సరిగ్గా నేటికి 121 సంవత్సరాల క్రిందట చికాగోలో
స్వామివివేకానంద "అమెరికా సోదరసోదరీమణులారా!.."
అంటూ ఇచ్చిన ఉపన్యాసం సనాతన హైందవధర్మాన్ని నిలబెట్టింది.
భారతదేశాన్ని ప్రపంచం ముందు తిరిగి తలెత్తుకొనేలా చేసింది మరియు
భవిష్యత్తుకై బాట వేసింది.
సెప్టెంబరు11,2001:
నేటికి 13 సంవత్సరాల క్రింద ఉగ్రవాదుల దాడిలో న్యూయార్క్ లోని WTO ట్విన్ టవర్స్ ధ్వంసం అయ్యాయి.

మొదటిది ధర్మస్థాపన కోసం నాంది అయితే రెండవది అధర్మానికి వేదిక
అయింది.
మీరు సరిగా గమనిస్తే ఒక వింత కనిపిస్తుంది.
అదేమంటే తేడా 108 సంవత్సరాలు. మన హిందూధర్మం లో 108 ప్రాముఖ్యత మీకు తెలిసిందే. దీనికై నా గత టపా
108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది?
1.వేదాల ప్రకారం
#భూమికి,చంద్రునికి మధ్యదూరం,చంద్రుని వ్యాసానికి 108 రెట్లు
#భూమికి,సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు
#సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.
నేటి విజ్ఞానం ప్రకారం కూడా ఇవి దాదాపు సరిపోలాయి.
2.ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మర్మస్థానాలు 108.
3.నక్షత్రాలు 27.వాటికి ఒక్కొక్కటికి గల పాదాలు 4. 27*4=108
4.రాశులు 12.గ్రహాలు 9. 12*9=108.
5.భరతనాట్యంలో మొత్తం నాట్యభంగిమలు 108.
6.ఉపనిషత్తులు 108.
7.108=1*2 వర్గం*3 ఘనం=1*(2*2)*(3*3*3).
8.భగవద్గీత అధ్యాయాలు 18.మహాభారత పర్వాలు 18.ఇవి 108 యొక్క కారణాంకాలు.
Monday, August 11, 2014
కాకతాళీయం లేక యాదృచ్చికం అయ్యుండచ్చు...కాని మాయగా కూడా అనిపిస్తాయి!
మన నిత్యజీవితం లో జరిగే కొన్ని సంఘటనలు మనలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. అలాంటి సంఘటనలు యాదృచ్చికమో లేక కాకతాళీయమో అయ్యొండొచ్చు.కాని మనలను చెప్పలేనంత ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. ఇలాంటి రెండు సంఘటనలు నా జీవితంలో జరిగినవి చెప్తాను.
ఈ మధ్యే అంటే 10 రోజుల క్రిందట జరిగిన ఒక సంఘటన.
రాఘవేంద్రస్వామి వారి శ్లోకం
"పూజ్యా రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయచ|
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే|"
ఈ శ్లోకం నాకు వచ్చినప్పటికీ 10 రొజుల క్రిందట శ్లోకం లో మొదటిపాదం ఒకటే గుర్తుకువచ్చేది. రెండవ పాదం గుర్తుకు వచ్చేది కాదు. ఎక్కడా చదవకుండా, ఎవరితోనూ అడగకుండా రెండవ పాదం గుర్తుకుతెచ్చుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేసేవాడిని. 10 రోజుల క్రిందట బెంగళూరు లో సిటీ బస్సులో వెళ్ళేటప్పుడు గుర్తుతెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను. నా ఎదురుగా ఒక అబ్బాయి(బహుశా భవననిర్మాణ కార్మికుడు అనుకొంటాను) చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఊగిపోతూ పాటలు వింటున్నాడు.అప్పుడప్పుడు hum చేసుకొంటున్నాడు. ఆ అబ్బాయి తెలుగు పాట వింటున్నాడని అర్థమైంది. ఆ అబ్బాయి ఎందుకో ఇయర్ ఫోన్స్ తీసివేశాడు. ఇంతలో నాకు అకస్మాత్తుగా రెండవపాదం గుర్తుకు వచ్చింది. హమ్మయ్య అనుకున్నాను. ఆ అబ్బయితో మీది ఏ ఊరు అన్నాను. ఆ అబ్బాయి "అన్నా మాది "మంత్రాలయం", అదే అన్నా రాఘవేంద్రస్వామి మఠం ఉన్న ఊరు " అన్నాడు.
ఈ సంఘటన యాదృచ్చికమే అయ్యుండచ్చు. కాని ఆ క్షణంలో నాకు మాయగా అనిపించింది.
ఇక రెండవ సంఘటన ఏమంటే నా బ్లాగు "లేవండి,మేల్కొనండి..." పేరు 2009 వ సంవత్సరం మొదటిదాక "సత్యమేవజయతే" అనే పేరుతో నడిపేవాడిని. ఒకరోజు రాత్రి అనుకోకుండా బ్లాగుపేరు మార్చేశాను. మరుసటిరోజే "సత్యం" రామలింగరాజు గారు తమ మోసం ఒప్పుకోవడం, "సత్యం" కంపెనీ తిరోగమనం మొదలైంది.
ఈ సంఘటన అత్యంత యాదృచ్చికం,కాకతాళీయం ఐనా నాకు మాత్రం వింతగా అనిపించింది.
ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు సాధారణంగా సంభవిస్తుంటాయి. అను భవించేవాడికి మాత్రం వింతగా,మాయగా,అద్బుతంగా అనిపిస్తాయి.
Monday, June 16, 2014
ఇకనైనా మారండయ్యా చులకన అయినది చాలు!
తరాలు మారినా మనకు మాత్రం సిగ్గు రావడం లేదు. ఎందుకండీ సాధువులారా! మీ సాధుత్వం? హాయిగా సంసారంలోకి రండి. రాగద్వేషాలు ఉన్నచోట సాధువుకీ సంసారికీ తేడా ఏముంది? సంసారి సంసారం కోసం కొట్టుకొంటున్నాడు, కొందరు సాధువులు పంతం కోసం కొట్టుకొంటున్నారు.
లేకుంటే ఏంటి ఇది..మొన్న భద్రాచలం లో సీతారాముల నిత్యకళ్యాణంలో ప్రవర చెప్పేటప్పుడు "రామనారాయణ" అన్నారట...అలా అనకూడదని కొందరు సాధువులు గగ్గోలు పెట్టారట..
శ్రీరాముడి నామాలలో "రామనారాయణ" కూడా ఒకటి...అంటే నారాయణ స్వరూపమైన రాముడు అని అర్థం..ఇది కూడా తెలియని సాధువులా వీరు?
ప్రసిద్ది చెందిన క్రింది స్తోత్రం చూడండి:
అచ్యుతం కేశవం రామనారాయణం!!
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్!!
శ్రీధరం మాధవం గోపికావల్లభం!!
జానకీనాయకం రామచంద్రం భజే!!
అచ్యుతం కేశవం సత్యభామాధవం!!
మాధవం శ్రీధరం రాధికారాధితమ్!!
ఇందిరామందిరం చేతసా సుందరం!!
దేవకీనందనం నందజం సందధే!!
శివ కేశవుల భేధమే అంతరించిపోతున్న ఈ కాలంలో ఇంకా ఇలాంటి సంకుచిత భావాలతో ఇలాంటి వారు సనాతనధర్మానికి ఎంత ద్రోహం చేస్తున్నారో వీరికి తెలుస్తోందా?
ఇతర మతస్థులు మన ధర్మం గురించి తెలియక విమర్శిస్తే ఏమన్నా అనుకోవచ్చు, కాని మనవారే మనలనే కించపరుచుకుంటూ ఉంటే మనకు ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించరా? "
ఏకం సత్ విప్రా బహుదా వదంతి" (ఉన్నది ఒక్కటే, కాని అది పలురకాల పేర్లతో పిలువబడుతోంది) అన్న విషయం జీర్ణించుకుపోని సాధువులు ఎందుకు. సంసారులకు ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు.కాని భగవంతుడి కోసం అని చెప్పుకుని సంసారాన్ని వదిలివేసి సాధువుల వేషం కట్టిన ఇలాంటి సాధువులు ఘోరమైన దుర్గతి పాలవుతారు.
గమనిక: ఈ పోస్ట్ కుహనా (Half minded) మరియు ఢాంభికులైన సాధువులను ఉద్దేశించి వ్రాసినది.
Monday, June 2, 2014
Tuesday, April 8, 2014
రామ నామం అత్యంత శక్తివంతం అని ఎందుకంటారు ?
మన ఆనందం కానీ వేదాలు యే పురుషోత్తముని పరబ్రహ్మంగా స్తుతిస్తూ ఉన్నాయో ఆ శ్రీరాముడు జన్మించడం ఏమిటి... మనం వారి పుట్టినరోజును శ్రీరామనవమిగా జరుపుకోవడం ఏమిటి...నిజమే ఆ భగవంతుడే కౌసల్యా,దశరథుల పుత్రుడిగా ప్రజలకు ఆదర్శ జీవితం చూపించడానికి జన్మించాడు. ఇక రామాయణం అందరికీ తెలిసినదే...
రాముడు వేరు రామనామం వేరు కాదు... ఫలానా వివేకానందుని పేరు వినపడితే వివేకానందుని రూపం ఎలా గుర్తుకొస్తుందో అలానే వివేకానందుని ఫోటో చూస్తే అతడి పేరు ఎలా గుర్తుకొస్తుందో అలానే రాముడూ,రామనామమూను.
అసలు రామనామం ఎందుకు అంత శక్తివంతం ఎందుకు...చాలా మందికి తెలుసు..కానీ తెలియని వారికోసం నేను పెద్దల ద్వారా తెలుసుకున్నది చెప్తాను.
"రా" అనే అక్షరం అష్టాక్షరీ మంత్రం అయిన "ఓం నమో నారాయణాయ" నుండి, "మ" అనే అక్షరం పంచాక్షరీ మంత్రం అయిన "ఓం నమశ్శివాయ" నుండి వచ్చాయి.
ఈ రెండు అక్షరాలనే ఎందుకు తీసుకొన్నారు ? ఎందుకంటే ఈ రెండు అక్షరాలు ఆ మంత్రాల యొక్క బీజాక్షరాలు మరియు ప్రాణాక్షరాలు.
"రా" తీసివెస్తే "ఓం నమో నారాయణాయ" కాస్తా "ఓం నమో నాయణాయ" అవుతుంది. అసలు విరుద్దమైన అర్థం వస్తుంది. "నారాయణునకు నమస్కారం" అనే అర్థం బదులు "నడక లేక కదలిక లేని వాటికి అనగా అచైతన్యం(చైతన్యం లేనిది)కి నమస్కారం" అవుతుంది. ఆయణం అనగా నడక అని అర్థం. ఇంకా వేరే అర్థాలు ఉన్నాయి.ఇక్కడ ఈ అర్థం తీసుకోబడింది.
ఇక "మ" ను తీసివేస్తే "ఓం నమశ్శివాయ" కాస్తా "ఓం నశ్శివాయ" అవుతుంది. శివం అనగా చైతన్యం శవం అనగా చైతన్యం లేనిది అని అర్థం. "నశ్శివాయ" అనగా శివం కానిదానికి నమస్కారం అని అర్థం వస్తుంది.
చూసారుకదా రా,మ అనే పదాలు తీసివేస్తే ఎంత అర్థం మారిపోయిందో..అందుకే ఇవి బీజాక్షరాలు లేక ప్రాణాక్షరాలు అయ్యాయి.
అందుకే ఈ రెండింటినీ కలపడం ద్వారా వచ్చిన "రామ" నామం అత్యంత శక్తివంతం అని అంటారు.
ఇదీ పెద్దల వద్ద తెలుసుకున్న విషయం.
"శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే"
"రామాయ రామ భధ్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథ నాథ నాథాయ సీతాయాః పతయే నమః"
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
Friday, March 21, 2014
కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి తేరు(రథం) మరియు తేరును లాగే త్రాడు
Wednesday, March 19, 2014
మనం జయించామనుకుంటాం..కానీ ఇంతలో మళ్ళీ ప్రత్యక్షమవుతుంది..
నేను చాలా నాచురల్ గా ఉంటాను..ఏం పెట్టినా తింటాను..వాళ్ళ మనసు ముఖ్యం..వాళ్ళు మనస్పూర్తిగా అన్నం పెడ్తే చాలు..వాళ్ళ నుండి నాకు మర్యాద ఏమీ అవసరం లేదు..ఇలా సాగుతుంది మన ఆలోచనా వ్యవహారం.
కానీ అనుకున్నంతసేపు ఉండదు ఈ వ్యవహారం. నాకు అహంకారం అంటూ ఏదీ లేదని నేను అనుకోవచ్చు.కానీ అంతలోనే అది ఎక్కడనుంచో ఊడిపడుతుంది. ఉదాహరణకు కలలో మనం చాలా భయపడిఉంటాము..మేల్కొన్న తర్వాత కూడా గుండె తీవ్రంగా కొట్టుకోవడం మనం గమనించవచ్చు. ఈ అహంకారం కూడా అచ్చం అలాంటిదే. నేను దానిని పారద్రోలానని అనుకుంటాను.కాని అది ఎక్కడి నుండో ప్రత్యక్షం అవుతుంది.అప్పుడు నేను బాధపడుతూ"ఏమిటి! నాకు సరైన మర్యాద చూపలేదు!" అంటాను.
గొప్పవారి నుండి సామాన్యులను దూరం చేస్తున్నదేమిటి?
ఒక చిన్నకథ.
శ్రీరామకృష్ణ పరమహంస గారు ఒకసారి కలకత్తాలో సబ్జడ్జ్ గా పనిచేసి కాలధర్మం చెందిన కాశీశ్వరమిత్రా అనే వారి ఇంటికి మిత్రాగారి కొడుకులైన శ్రీనాథ్,యజ్ఞనాథ్ అనే వారి బలవంతం మీద వెళ్ళారు. వారిద్దరూ వయసులో చాలా చిన్నవారు.అక్కడ ఏదో ఉత్సవం జరిగిన తర్వాత రామకృష్ణులను మిగతా అతిథుల వద్ద ఉంచారు.కలకత్తాలోని కొందరు గొప్పవారు కూడా ఆ ఉత్సవానికి రావడం వలన వారి భోజన ఏర్పాట్లలో ఉండి రామకృష్ణులను పట్టించుకోలేదు.చాలా సమయం తర్వాత భోజనానికి పిలుపు వచ్చింది. వచ్చిన అతిథులు ఎక్కువ మంది ఉండడం చేత రామకృష్ణులకు భోజనశాలలో ఒకమూల స్థలం దొరికింది.అంతేకాక ఆ కూర్చున్న స్థలం కూడా శుభ్రంగా లేదు.
ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తాము?
నిజాయితీగా చెప్పాలంటే మొదట భోజనానికి ఆలస్యం అయినందుకే మనకు కోపం ఎలా ఉంటుందంటే అమిత జ్వరం వచ్చినవాడి నోటిలోని ధర్మామీటర్లో పాదరసం మట్టం ఎలా పెరుగుతూంటుందో అలా పెరుగుతూంటుంది.సరే అదలా ఉండనివ్వండి తర్వాత భోజన స్థలం,ఆ ఇరుకులో కూర్చోవడం...నిజం గా మన రక్తం ఉడికిపోతూంటుంది కదా.కోపంతో అక్కడి నుండి లేచిపోవాలనిపిస్తుంది.మనకు గతిలేక అక్కడకు వచ్చామా అని కూడా మనం అనవచ్చు.
కాని రామకృష్ణులు ఏమి చేసారు? పిలిచినవారు ఇద్దరూ వయసులో చిన్నవారు,వారికి అతిథులను సముచితరీతిలో గౌరవించడం ఇంకా అంతగా తెలియదు అనుకొని కోపం చెందలేదు.వారి ఆతిథ్యాన్ని నవ్వుతో స్వీకరించారు.
ఇక్కడ మనం రామకృష్ణుల వంటి గొప్పవారం కాదే అని అనుకోనవసరం లేదు అలా ప్రవర్తించడానికి. ఇది చాలా సాధారణంగా జరిగే విషయం.ఒక వ్యక్తి గొప్పతనం అనేది అతడు చేసే గొప్పపనుల వలన కాక నిత్యజీవితంలో చిన్నచిన్న సమస్యల పట్ల అతడి దృక్పథం ఎలా ఉంటుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.
ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".
ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.
కానీ అనుకున్నంతసేపు ఉండదు ఈ వ్యవహారం. నాకు అహంకారం అంటూ ఏదీ లేదని నేను అనుకోవచ్చు.కానీ అంతలోనే అది ఎక్కడనుంచో ఊడిపడుతుంది. ఉదాహరణకు కలలో మనం చాలా భయపడిఉంటాము..మేల్కొన్న తర్వాత కూడా గుండె తీవ్రంగా కొట్టుకోవడం మనం గమనించవచ్చు. ఈ అహంకారం కూడా అచ్చం అలాంటిదే. నేను దానిని పారద్రోలానని అనుకుంటాను.కాని అది ఎక్కడి నుండో ప్రత్యక్షం అవుతుంది.అప్పుడు నేను బాధపడుతూ"ఏమిటి! నాకు సరైన మర్యాద చూపలేదు!" అంటాను.
గొప్పవారి నుండి సామాన్యులను దూరం చేస్తున్నదేమిటి?
ఒక చిన్నకథ.
శ్రీరామకృష్ణ పరమహంస గారు ఒకసారి కలకత్తాలో సబ్జడ్జ్ గా పనిచేసి కాలధర్మం చెందిన కాశీశ్వరమిత్రా అనే వారి ఇంటికి మిత్రాగారి కొడుకులైన శ్రీనాథ్,యజ్ఞనాథ్ అనే వారి బలవంతం మీద వెళ్ళారు. వారిద్దరూ వయసులో చాలా చిన్నవారు.అక్కడ ఏదో ఉత్సవం జరిగిన తర్వాత రామకృష్ణులను మిగతా అతిథుల వద్ద ఉంచారు.కలకత్తాలోని కొందరు గొప్పవారు కూడా ఆ ఉత్సవానికి రావడం వలన వారి భోజన ఏర్పాట్లలో ఉండి రామకృష్ణులను పట్టించుకోలేదు.చాలా సమయం తర్వాత భోజనానికి పిలుపు వచ్చింది. వచ్చిన అతిథులు ఎక్కువ మంది ఉండడం చేత రామకృష్ణులకు భోజనశాలలో ఒకమూల స్థలం దొరికింది.అంతేకాక ఆ కూర్చున్న స్థలం కూడా శుభ్రంగా లేదు.
ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తాము?
నిజాయితీగా చెప్పాలంటే మొదట భోజనానికి ఆలస్యం అయినందుకే మనకు కోపం ఎలా ఉంటుందంటే అమిత జ్వరం వచ్చినవాడి నోటిలోని ధర్మామీటర్లో పాదరసం మట్టం ఎలా పెరుగుతూంటుందో అలా పెరుగుతూంటుంది.సరే అదలా ఉండనివ్వండి తర్వాత భోజన స్థలం,ఆ ఇరుకులో కూర్చోవడం...నిజం గా మన రక్తం ఉడికిపోతూంటుంది కదా.కోపంతో అక్కడి నుండి లేచిపోవాలనిపిస్తుంది.మనకు గతిలేక అక్కడకు వచ్చామా అని కూడా మనం అనవచ్చు.
కాని రామకృష్ణులు ఏమి చేసారు? పిలిచినవారు ఇద్దరూ వయసులో చిన్నవారు,వారికి అతిథులను సముచితరీతిలో గౌరవించడం ఇంకా అంతగా తెలియదు అనుకొని కోపం చెందలేదు.వారి ఆతిథ్యాన్ని నవ్వుతో స్వీకరించారు.
ఇక్కడ మనం రామకృష్ణుల వంటి గొప్పవారం కాదే అని అనుకోనవసరం లేదు అలా ప్రవర్తించడానికి. ఇది చాలా సాధారణంగా జరిగే విషయం.ఒక వ్యక్తి గొప్పతనం అనేది అతడు చేసే గొప్పపనుల వలన కాక నిత్యజీవితంలో చిన్నచిన్న సమస్యల పట్ల అతడి దృక్పథం ఎలా ఉంటుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.
ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".
ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.
Monday, March 17, 2014
"మనం చేయగలిగినంత వరకు చేయడమే - ఫలితం భగవంతుడిదే" అని ఎందుకంటారు?
ఈ టపా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే ఈ మధ్య చదివిన ఒక చారిత్రక సంఘటన.
విజయనగర సామ్రాజ్యం స్థాపకుడైన విద్యారణ్యుల వారికి వేదవ్యాసులు చెప్పిన విషయం ఏమంటే 360 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం విలసిల్లుతుందని.
కానీ ఇంకా ఎక్కువ కాలం సామ్రాజ్యం ఉండాలని 3600 సంవత్సరాలు నిలబడగల ముహూర్తం పెట్టారు విద్యారణ్యుల వారు. తను ఆ ముహూర్త సమయానికి శంఖం ఊదుతానని అప్పుడు సరిగా భూమిపూజ మొదలు పెట్టాలని తమ శిష్యులకు ఆదేశించారు విద్యారణ్యులు.
సరిగా శంఖ ధ్వని వినిపించగానే భూమిపూజ మొదలు పెట్టారు శిష్యులు. కాని మళ్ళీ రెండవసారి శంఖ ధ్వని విని శిష్యులకు ఎందుకలా గురువు గారు రెండూ సార్లు ఊదారు అని విద్యారణ్యుల వారి వద్దకు వెళ్ళి అడిగారు.
విద్యారణ్యులవారు అప్పుడు దివ్యదృష్టితో మొదటిసారి శంఖ ధ్వని ఒక జంగము వాడు భిక్ష కోసం (నేటికీ వీరు ఇళ్ళ వద్ద భిక్ష అడిగేటప్పుడు శంఖం ఊదుతారు)ఊదగా వచ్చినదని గ్రహించారు. చాలా బాధపడి వేదవ్యాసుల వారి మాటే నిజమైనది కదా,విధి చాలా బలీయమైనదని నిట్టూర్చారు.
చూసారు కదా ఇదీ జరిగింది.ఇక్కడ మానవప్రయత్న లోపం ఏమైనా జరిగిందా. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలోని సాంఖ్యయోగము లో ఇలా అన్నారు.
విజయనగర సామ్రాజ్యం స్థాపకుడైన విద్యారణ్యుల వారికి వేదవ్యాసులు చెప్పిన విషయం ఏమంటే 360 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం విలసిల్లుతుందని.
కానీ ఇంకా ఎక్కువ కాలం సామ్రాజ్యం ఉండాలని 3600 సంవత్సరాలు నిలబడగల ముహూర్తం పెట్టారు విద్యారణ్యుల వారు. తను ఆ ముహూర్త సమయానికి శంఖం ఊదుతానని అప్పుడు సరిగా భూమిపూజ మొదలు పెట్టాలని తమ శిష్యులకు ఆదేశించారు విద్యారణ్యులు.
సరిగా శంఖ ధ్వని వినిపించగానే భూమిపూజ మొదలు పెట్టారు శిష్యులు. కాని మళ్ళీ రెండవసారి శంఖ ధ్వని విని శిష్యులకు ఎందుకలా గురువు గారు రెండూ సార్లు ఊదారు అని విద్యారణ్యుల వారి వద్దకు వెళ్ళి అడిగారు.
విద్యారణ్యులవారు అప్పుడు దివ్యదృష్టితో మొదటిసారి శంఖ ధ్వని ఒక జంగము వాడు భిక్ష కోసం (నేటికీ వీరు ఇళ్ళ వద్ద భిక్ష అడిగేటప్పుడు శంఖం ఊదుతారు)ఊదగా వచ్చినదని గ్రహించారు. చాలా బాధపడి వేదవ్యాసుల వారి మాటే నిజమైనది కదా,విధి చాలా బలీయమైనదని నిట్టూర్చారు.
చూసారు కదా ఇదీ జరిగింది.ఇక్కడ మానవప్రయత్న లోపం ఏమైనా జరిగిందా. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలోని సాంఖ్యయోగము లో ఇలా అన్నారు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి (2-47)
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి (2-47)
పని చెయ్యి.కాని ఫలితంపైన ఆసక్తి పెంచుకోకు.అలా అని పని చేయడం ఆపకు.
Tuesday, March 11, 2014
సహనం,ఓర్పు మరియు పట్టుదలలు విజయాన్ని కల్గిస్తాయనడానికి సజీవ ఉదాహరణ - నితిన్
నితిన్...వీరే ఆ సజీవ ఉదాహరణ..సినీతెరపై అడుగుపెట్టింది 2002 లో, చివరిసారిగా విజయం సాధించినది 2004 లో. మళ్ళీ మరో విజయం కోసం 8 సంవత్సరాలు ఆగవలసి వచ్చింది.మధ్యలో ఎన్నో ఆటుపోట్లు...తన ఆరాధ్య హీరో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అంతే...కాని పవన్ కళ్యాణ్ గారికి బలమైన నేపథ్యం ఉంది...నితిన్ గారికి బలమైన నేపథ్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ పరాజయాల కాలంలో రాటుదేలి తన లోపాలను సరిజేసుకుంటూ ఎవరు తన వెంట లేకపోయినా ఓర్పుతో అంతకు మించి సహనం,పట్టుదల లతో 2012 లో ఇష్క్ సినిమాతో విజయం సాధించాడు...తర్వాత గుండె జారి గల్లంతయ్యిందే,హార్ట్ ఎటాక్ లతో విజయాలతో దూసుకెళ్తున్నాడు..ఇప్పుడు విజయాలు ఇస్తున్న మత్తులో పట్టుజారిపోకుండా అత్యంత జాగరూకతతో మరిన్న విజయాలు పొందాలని ఆశిస్తున్నాను.
నేను
వ్యక్తిగతంగా ఏ హీరోకూ అభిమాని కాను.కాని ఏ రంగంలోనైనా ఇటువంటి పట్టుదల,ఓర్పు మరియు సహనములు ఉంటే విజయాలు వెతుక్కుంటూ వస్తాయని నిరూపించిన నితిన్ గారి లాంటి వారిని చూస్తే ఆనందం కలుగుతుంది. ఇంకా ఎందరో ఉన్నారు.ప్రస్తుతానికి వీరి గురించి చెప్పుకోవాలనిపించింది.
కాకతాళీయం ఏంటంటే ఇదే పరిస్థితి చవిచూసిన నితిన్ గారి అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా తన విజయాన్ని నితిన్ లానే 2012 లో గబ్బర్ సింగ్ తో పొందడం.
Thursday, January 30, 2014
Wednesday, January 29, 2014
Friday, January 24, 2014
Wednesday, January 1, 2014
Monday, December 30, 2013
హృదయవాసి రమణులకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
కొందరిపై ఎందుకు ప్రేమ పుడుతుందో తెలియదు..చూడగానే వారికీ,మనకూ జన్మజన్మల సంబంధం ఉందని అనిపిస్తుంది..వారి పేరు వినగానే,వారి రూపం చూడగానే ఏదో తెలియని ఆనందం మనసును ఆక్రమిస్తుంది.అలా నాకు ఫోటో చూడగానే ప్రేమ,ఆరాధన పుట్టినవారిలో స్వామి వివేకానందులు మొదటివారు.
ఇక భగవాన్ రమణులు రెండవవారు.రామకృష్ణులు,శారదామాతలను కూడా చూడగానే ఇలాంటి భావమే కలుగుతుంటుంది.
4వ తరగతి చదువుతున్నప్పుడే(అతిశయోక్తి అనిపించవచ్చు కానీ నిజం) రమణుల ఒక వాక్యం ("నేను" గురించి)ఏదో పుస్తకంలో చదివి మా తాత గారిని అడగడం ఇప్పటికీ గుర్తు వస్తూ ఉంటుంది.
ఇప్పటికీ వీరి పేర్లు ఎవరి నోటైనా అనుకోకుండా విన్నా మనసు తెలియకుండానే ఆ మాటల వైపు వెళ్ళిపోతూంటుంది.
ప్రతిరోజూ ఏదో ఒక సందర్భం లో నా హృదయంలో తిరుగాడే నా హృదయవాసి అయిన భగవాన్ రమణులకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
"భక్తి జ్ఞానమునకు తల్లి"
- భగవాన్ రమణులు
Sunday, December 8, 2013
ఓ మాదిరి తెలివి చాలా కొద్దిగా గణిత పరిజ్ఞానం ఉపయోగించి ఈ ప్రశ్నకు జవాబు ప్రయత్నించండి - సమాధానం
నిన్నటి ప్రశ్న:
మీకు నలుగురు స్నేహితులు ఉన్నారు.
ఆ నలుగురూ ఎప్పుడూ నిజం చెప్తారు.
వారి జీతాలెంతో చెప్పడం వారిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదు.
ఒక వేళ మీ జీతం ఎంత అని అడిగితే చెప్పడం మాకు ఇష్టం లేదంటారు.
వారిలో వారికి కూడా ఒకరి జీతం ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారి జీతాలు ఎవరికీ తెలియనవసరం లేకుండానే వారి జీతాల మొత్తం వారి ద్వారానే కనుక్కోవాలి.
సమాధానం:
నలుగురు వ్యక్తులు a,b,c,d అనుకుందాము. ఒక కాగితం తీసుకొని a తో తన జీతం మొత్తానికి తన ఇష్టమొచ్చినంత కలిపి వ్రాయమనాలి. ఉదాహరణకు a జీతం 15000 అనుకుంటే అతను 547 కలిపాడనుకోండి 15547 వ్రాస్తాడు. ఇలా ఎంత కలిపితే అంత వ్రాస్తాడు. జీతం వ్రాయడు (కాబట్టి తెలిసేందుకు అవకాశం లేదు) కాని కలిపిన మొత్తంతో కలిపి వ్రాస్తాడు. తర్వాత అదే కాగితాన్నిb,c,d లకు ఇచ్చి అధే విధంగా చేయమంటాము. ఇప్పుడు మొత్తము(జీతాల మొత్తము + వాళ్ళు కలిపిన మొత్తము) వస్తుంది. ఇప్పుడు వచ్చిన దాన్లో వాళ్ళు కలిపిన మొత్తాలను తీసివేయమనాలి.ఇప్పుడు మిగిలేదే వాళ్ళ జీతాల మొత్తము.
ఉదాహరణకు a,,b,c.d ల జీతాలు A,B,C,D అనుకొంటే మరియు కలిపిన మొత్తాలు w,x,y,z అనుకొంటే
అందరూ కలిపిన మొత్తం
(A+w) + (B+x) + (C+y) + (D+z) అవుతుంది
ఇందులో మళ్ళీ w,x,y,z లను తీసేస్తే A+B+C+D (అంటే జీతాల మొత్తం) వస్తుంది.
ఇక్కడ వారెంత కలిపారో మనకు తెలియనవసరం లేదు మరియు ముఖ్యంగా వారి జీతాలు కూడా తెలియనవసరం లేదు.
చూసారా ఎంత సులభమో.
వారి జీతాలెంతో చెప్పడం వారిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదు.
ఒక వేళ మీ జీతం ఎంత అని అడిగితే చెప్పడం మాకు ఇష్టం లేదంటారు.
వారిలో వారికి కూడా ఒకరి జీతం ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారి జీతాలు ఎవరికీ తెలియనవసరం లేకుండానే వారి జీతాల మొత్తం వారి ద్వారానే కనుక్కోవాలి.
సమాధానం:
నలుగురు వ్యక్తులు a,b,c,d అనుకుందాము. ఒక కాగితం తీసుకొని a తో తన జీతం మొత్తానికి తన ఇష్టమొచ్చినంత కలిపి వ్రాయమనాలి. ఉదాహరణకు a జీతం 15000 అనుకుంటే అతను 547 కలిపాడనుకోండి 15547 వ్రాస్తాడు. ఇలా ఎంత కలిపితే అంత వ్రాస్తాడు. జీతం వ్రాయడు (కాబట్టి తెలిసేందుకు అవకాశం లేదు) కాని కలిపిన మొత్తంతో కలిపి వ్రాస్తాడు. తర్వాత అదే కాగితాన్నిb,c,d లకు ఇచ్చి అధే విధంగా చేయమంటాము. ఇప్పుడు మొత్తము(జీతాల మొత్తము + వాళ్ళు కలిపిన మొత్తము) వస్తుంది. ఇప్పుడు వచ్చిన దాన్లో వాళ్ళు కలిపిన మొత్తాలను తీసివేయమనాలి.ఇప్పుడు మిగిలేదే వాళ్ళ జీతాల మొత్తము.
ఉదాహరణకు a,,b,c.d ల జీతాలు A,B,C,D అనుకొంటే మరియు కలిపిన మొత్తాలు w,x,y,z అనుకొంటే
అందరూ కలిపిన మొత్తం
(A+w) + (B+x) + (C+y) + (D+z) అవుతుంది
ఇందులో మళ్ళీ w,x,y,z లను తీసేస్తే A+B+C+D (అంటే జీతాల మొత్తం) వస్తుంది.
ఇక్కడ వారెంత కలిపారో మనకు తెలియనవసరం లేదు మరియు ముఖ్యంగా వారి జీతాలు కూడా తెలియనవసరం లేదు.
చూసారా ఎంత సులభమో.
Saturday, December 7, 2013
ఓ మాదిరి తెలివి చాలా కొద్దిగా గణిత పరిజ్ఞానం ఉపయోగించి ఈ ప్రశ్నకు జవాబు ప్రయత్నించండి.
మీకు నలుగురు స్నేహితులు ఉన్నారు.
ఆ నలుగురూ ఎప్పుడూ నిజం చెప్తారు.
వారి జీతాలెంతో చెప్పడం వారిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదు.
ఒక వేళ మీ జీతం ఎంత అని అడిగితే చెప్పడం మాకు ఇష్టం లేదంటారు.
వారిలో వారికి కూడా ఒకరి జీతం ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారి జీతాలు ఎవరికీ తెలియనవసరం లేకుండానే వారి జీతాల మొత్తం వారి ద్వారానే కనుక్కోవాలి.
అందరూ సమాధానం కోసం ప్రయత్నించేందుకు వీలుగా సాయంత్రం వరకు కామెంట్ మాడరేషన్ పెడుతున్నాను.
Friday, December 6, 2013
అరటిపండు తిన్నంత సులభమేనా ఈ ఇంటర్వ్యూ ప్రశ్నకు సమాధానం చెప్పడం?
16 రూపాయలకు "ఎన్ని" అరటిపండ్లు వస్తాయో, "అన్ని" రూపాయలకు 36 అరటిపండ్లు వస్తాయి. ఐతే డజను అరటిపండ్ల ఖరీదెంత?
( వివరణ: ఉదాహరణకు 16 రూపాయలకు "X" అరటిపండ్లు వస్తే, "X" రూపాయలకు 36 అరటిపండ్లు వస్తాయన్న మాట)
అందరూ సమాధానం కోసం ప్రయత్నించేందుకు వీలుగా సాయంత్రం వరకు కామెంట్ మాడరేషన్ పెడుతున్నాను.
Thursday, December 5, 2013
మీ క్రికెట్ పరిజ్ఞానానికి ఒక పరీక్ష (గణిత మరియు ఆట నియమాలకు సంబంధించినది)
మనదేశంలో క్రికెట్ అంటే తెలియనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మరి క్రికెట్ కు సంబంధించిన గణిత శాస్త్రపు ప్రశ్నకు సమాధానం చెప్పండి చూద్దాం.
ప్రశ్న:
9 వికెట్లు పడిపోయాయి.భారత్ తరపున చివరి ఇద్దరు బ్యాట్స్మెన్ ఆడుతున్నారు. ఇద్దరూ చెరి 94 పరుగుల మీద ఉన్నారు. ఇంకా 7 పరుగులు చేస్తే విజయం లభిస్తుంది. ఇక రెండే బంతులు ఉన్నాయి. భారత్ గెలవాలి మరియు ఇద్దరివీ సెంచరీలు కావాలి. ఎలా సాధ్యం అవుతుంది?
కష్టమనుకుంటున్నారా! క్రింది ప్రశ్న చూడండి. పై దానితో పోలిస్తే కొంచెం సులభం.
ఒక వేళ 8 వికెట్లు పడి ఉన్నప్పటి పరిస్థితి ఉంటే ఎలా సాధ్యం అవుతుంది.
ప్రశ్న:
9 వికెట్లు పడిపోయాయి.భారత్ తరపున చివరి ఇద్దరు బ్యాట్స్మెన్ ఆడుతున్నారు. ఇద్దరూ చెరి 94 పరుగుల మీద ఉన్నారు. ఇంకా 7 పరుగులు చేస్తే విజయం లభిస్తుంది. ఇక రెండే బంతులు ఉన్నాయి. భారత్ గెలవాలి మరియు ఇద్దరివీ సెంచరీలు కావాలి. ఎలా సాధ్యం అవుతుంది?
కష్టమనుకుంటున్నారా! క్రింది ప్రశ్న చూడండి. పై దానితో పోలిస్తే కొంచెం సులభం.
ఒక వేళ 8 వికెట్లు పడి ఉన్నప్పటి పరిస్థితి ఉంటే ఎలా సాధ్యం అవుతుంది.
Saturday, November 9, 2013
Thursday, November 7, 2013
చాలా మందికి తెలిసిన ఈ కథ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఈ కథ చాలామంది చదివి ఉండవచ్చు.ఒక నిరుద్యోగి ఒక సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూకు రానూ,పోనూ చార్జీలు ఆ సంస్థే ఇస్తుంది. కాని ఇంటర్వ్యూ సరిగా చేయలేక పోవడం వలన ఆ నిరుద్యోగి ఆ ఉద్యోగం పొందలేకపోయాడు. బయటకు వచ్చేసాడు.ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ బయటకు వచ్చాడు.
ఈ నిరుద్యోగి ఇంకా అక్కడే తిరుగుతుండడం చూసి అతను " ఏం బాబూ!నువ్వు ఎంపిక కాలేదు కదా? ఇంకా ఇక్కడే ఎందుకు తిరుగుతున్నావ్?" అన్నాడు.
దానికి ఆ నిరుద్యోగి "సార్! మీరు రానూ,పోనూ చార్జీలు ఇచ్చారు కదా. మీరు ఇచ్చినదాని కన్నా మా ఊరికి చార్జీలు తక్కువే. అందుకే మిగిలిన డబ్బును మీకు తిరిగి ఇద్దామని ఇక్కడే ఉన్నాను." అన్నాడు.
ఆశ్చర్యచకితుడైన ఆ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ " బాబూ! నువ్వు ఉద్యోగం లో చేరవచ్చు. సబ్జెక్ట్లో (ఉద్యోగం లో) నీకు నేను సహాయం చేయగలను. నీవు నేర్చుకోగలవు. కానీ నిజాయితీ అనేది ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు. అది నీకు ఉంది. చాలా సంతోషం. మా సంస్థలో చేరు" అన్నారు.
ముందే చెప్పినట్లు ఈ కథ చాలామంది చదివి ఉండవచ్చు.
కానీ ఇది జరిగింది ఎక్కడో తెలియనివారి కోసం ఈ టపా.
ఆ నిజాయితీ గల నిరుద్యోగి పేరు తెలియనందుకు క్షమాపణలు.
ఆ సంస్థ : భారతీయ వైజ్ఞానిక సంస్థ (IISc),బెంగళూరు.
ఆ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ : సర్ సి.వి.రామన్ గారు.
రామన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Wednesday, October 2, 2013
నేను ఆచరించిన తర్వాతే మిగతా వాళ్ళ గురించి బాధపడగలను..
జగద్గురువుల చిన్న కథ:
ఆజ్ఞవల్ల బయలుదేరి వెళ్ళారు. పని పూర్తిచేసుకొని నదిదాటి ఇవతలకి వచ్చారు.ఆ తరువాత మనం అందరం
దాటి వచ్చామా లేదా అని లెక్క పెట్టుకుందాం అనుకున్నారు. లెక్కవేయడం మొదలు పెట్టారు. ఒకడు
తగ్గుతున్నాడు. ఒకడు నదిలో కొట్టుకుపోయాడు అని అనుకున్నారు. ఒకాయన దోవన పోతూ అటుగా
వచ్చాడు. విషయం అతనికి చెప్పారు. ఒరేయ్ ఆ పదో వాడివి నువ్వేరా..నిన్ను ఎందుకు విడిచి పెట్టావు?
నువ్వూ ఆలెక్కలోకి వస్తావురా. అందరూ ఉన్నారు అన్నాడు. ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతివాడూ తనని
మాత్రం విడిచి పెడుతున్నాడు. మైకు ముందు కూర్చొని తనని మాత్రం లెక్క వేసుకోకుండా మిగతా వాళ్ళని
ధర్మం ఆచరించడం లేదు అంటున్నాడు ప్రతివాడూ. అందులో నాపాత్ర కూడా ఉన్నది అని ఎవరూ అనుకోవడం
లేదు. నా మటుకు నేను ధర్మాన్నిఆచరిస్తాను అని ప్రతివాడూ అనుకుంటే ఎలా నశించిపోతుంది? ఒక
రథోత్సవంలో త్రాటిని అందరూ పట్టుకొని నడుపుతున్నారు. నా ఒక్కడివల్ల రథం ముందుకు పోతోందా? అని
ప్రతి ఒక్కడూ అనుకొని రథాన్ని వదిలేస్తే రథం ఎలా కదులుతుంది? అలాగే ధర్మాచరణలో కూడా ప్రతి ఒక్కరి
పాత్ర ఉన్నది. కర్తవ్య లోపం నావల్ల కాకూడదు. తండ్రి ధర్మం ఆచరించకుండా కొడుకును చేయడమంటే
కొడుకు ఎలా చేస్తాడు? అలాగే సమాజం విషయంలో కూడా.
Wednesday, September 25, 2013
చెన్నై మిత్రులు(బ్లాగర్లు లేక చెన్నై లో బంధుమిత్రులు ఉన్నవారు) ఎవరైనా ఉంటే సహాయం చేయగలరు.
మిత్రులారా!
మా అబ్బాయి యతీశ్వర్(వయసు 1.5 సంవత్సరాలు) ఆరోగ్య సమస్య రీత్యా చెన్నై నగరములో 1 నుండి 2 నెలలు ఉండవలసి ఉంది. 4000 నుండి 6000 అద్దెలో మైలాపూరు లేక మందవేలి ప్రాంతాలలో అద్దె ఇల్లు (4 గురు సభ్యులకు) ( 1 నుండి 2 నెలలకు) ఏమైనా ఉంటే చెప్పగలరు. ఈ నెలాఖరులోగా ఈ సహాయం వీలైతే చేయగలరు.
Tuesday, September 24, 2013
ఈశావాస్య ఉపనిషత్తు pdf కావలిస్తే download చేసుకోగలరు.
నా "ఉపనిషత్తులు - మన మహోన్నత విజ్ఞానము" బ్లాగులో వ్రాసిన "ఈశావాస్య ఉపనిషత్తు" pdf కావలిస్తే download చేసుకోగలరు.
link: ఈశావాస్య ఉపనిషత్తు(Ishavasya upanishat)
link: ఈశావాస్య ఉపనిషత్తు(Ishavasya upanishat)
Monday, September 16, 2013
Tuesday, September 3, 2013
ఈ మధ్య నేను చదివిన అత్యద్భుత పుస్తకం పరుసవేది ( The Alchemist)
చాలామంది పాలో కొయిలో వ్రాసిన "The Alchemist" అనే పుస్తకం గురించి వినే ఉంటారు. ఎందరో ఈ పుస్తకం బాగుందని చెప్తుంటే చదవాలని ఈ పుస్తకం కొన్నాను.కానీ చదవలేదు. ఈ మధ్య కినిగె వారి వెబ్సైట్ చూస్తుంటే ఈ పుస్తకం తెలుగు అనువాదం "పరుసవేది" కనిపించింది. వెంటనే అద్దెకు డౌన్లోడ్ చేసుకొని చదివాను. చాలాచాలా బాగుంది.
జీవితగమ్యాన్ని చేరుకోవడంలో కష్టనష్టాలు, పరిస్థితులను ఎలా ఉపయోగించుకోవాలి ఇలాంటివి ఒక పాత్రద్వారా రచయిత అద్భుతంగా వివరించాడు.
కొన్ని కాల్పనిక సన్నివేశాల సహాయం తీసుకొన్నా మనలను ఈ పుస్తకం ఏకబిగిన చదివిస్తుంది. కొన్ని వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి.
ఉదాహరణకు
"ఒక నిర్ణయం ధృఢంగా తీసుకోవడం అనేది ఉధృతంగా ప్రవహించే ఏరులోకి దూకడం లాంటిది. అది ఎక్కడకు తీసుకెళ్ళినా మనం సిద్ధంగా ఉండాలి."
"నీకు లేనిదాని గురించి వాగ్దానాలు చేయడం మొదలుపెట్టావంటే దానిని సాధించాలన్న కోరికను కోల్పోతావు".
వీలుంటే ఈ పుస్తకం చదవండి. చాలా బాగుంది.
జీవితగమ్యాన్ని చేరుకోవడంలో కష్టనష్టాలు, పరిస్థితులను ఎలా ఉపయోగించుకోవాలి ఇలాంటివి ఒక పాత్రద్వారా రచయిత అద్భుతంగా వివరించాడు.
కొన్ని కాల్పనిక సన్నివేశాల సహాయం తీసుకొన్నా మనలను ఈ పుస్తకం ఏకబిగిన చదివిస్తుంది. కొన్ని వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి.
ఉదాహరణకు
"ఒక నిర్ణయం ధృఢంగా తీసుకోవడం అనేది ఉధృతంగా ప్రవహించే ఏరులోకి దూకడం లాంటిది. అది ఎక్కడకు తీసుకెళ్ళినా మనం సిద్ధంగా ఉండాలి."
"నీకు లేనిదాని గురించి వాగ్దానాలు చేయడం మొదలుపెట్టావంటే దానిని సాధించాలన్న కోరికను కోల్పోతావు".
వీలుంటే ఈ పుస్తకం చదవండి. చాలా బాగుంది.
Wednesday, August 21, 2013
సత్యాన్ని పైకి తీసుకురావడానికి అసత్య సహాయం అవసరమా - జగద్గురు ఆదిశంకర చిత్రం
నిన్న జగద్గురు ఆదిశంకర చిత్రం చూసాను. ఎక్కడా బోరు కొట్టలేదు. ఆదిశంకరుల గురించి తెలుసుకోవాలనుకొనేవారికి ఈ చిత్రం చూస్తే పైపూతగా కొద్దిగా తెలుసుకోవచ్చు. ఆయన ఎందుకై భూమిపైకొచ్చిందీ, ఏం సాధించిందీ తెలుసుకోవచ్చు.
కానీ ఆదిశంకరుల జీవితచరిత్ర తెలిసిఉన్నవారిని మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా బాధపెడుతుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు.
ఒక చారిత్రిక మహాత్ముని గురించి చెప్పాలనుకొన్నప్పుడు అసలు చరిత్ర కు భంగం వాటిల్లకుండా చూడాలి. అంతేకానీ నేనేదో మహత్కార్యం చేస్తున్నాననుకొని ఆ కార్యం నిమిత్తం మనకు ఇష్టమొచ్చింది, సత్యదూరమైనది చేయడం భావ్యం కాదు.
కాటికాపరితో సంభాషణ కానీ, మండనమిశ్రునితో వాదం కానీ ఇంకా అనేక విషయాలు సినిమా చూడడానికి వచ్చినవారికి బాగా అనిపిస్తాయేమో కానీ స్వామివారి చరిత్ర చదివున్నవారికి ఏమాత్రం మింగుడుపడవు.
ఇలా సత్యదూరమైన విషయాలతో సినిమా తీయడం వలన మొదటిసారి ఆదిశంకరుల గురించి తెలుసుకోవాలనుకున్న వారికి తెలిసేది ఏమిటి? వారికి తెలియకుండానే ఇదే ఆదిశంకరుల చరిత్ర అనుకుంటారు. తద్వారా అసలు చరిత్ర కాస్తా తెలుసుకోలేకపోతారు.
కానీ ఆదిశంకరుల గురించి నేటి తరానికి తెలియచెప్పాలన్న దర్శకుడి తాపత్రయం మెచ్చుకోవాలి.
సినిమా చూస్తున్నంతసేపూ మరియు సినిమా అయిపోయినతర్వాత నాకు ఒకటే అనిపిస్తూనే ఉంది " సత్యాన్ని తెలియజెప్పేందుకై అసత్య సహాయం అవసరమా?" అని.
కానీ ఆదిశంకరుల జీవితచరిత్ర తెలిసిఉన్నవారిని మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా బాధపెడుతుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు.
ఒక చారిత్రిక మహాత్ముని గురించి చెప్పాలనుకొన్నప్పుడు అసలు చరిత్ర కు భంగం వాటిల్లకుండా చూడాలి. అంతేకానీ నేనేదో మహత్కార్యం చేస్తున్నాననుకొని ఆ కార్యం నిమిత్తం మనకు ఇష్టమొచ్చింది, సత్యదూరమైనది చేయడం భావ్యం కాదు.
కాటికాపరితో సంభాషణ కానీ, మండనమిశ్రునితో వాదం కానీ ఇంకా అనేక విషయాలు సినిమా చూడడానికి వచ్చినవారికి బాగా అనిపిస్తాయేమో కానీ స్వామివారి చరిత్ర చదివున్నవారికి ఏమాత్రం మింగుడుపడవు.
ఇలా సత్యదూరమైన విషయాలతో సినిమా తీయడం వలన మొదటిసారి ఆదిశంకరుల గురించి తెలుసుకోవాలనుకున్న వారికి తెలిసేది ఏమిటి? వారికి తెలియకుండానే ఇదే ఆదిశంకరుల చరిత్ర అనుకుంటారు. తద్వారా అసలు చరిత్ర కాస్తా తెలుసుకోలేకపోతారు.
కానీ ఆదిశంకరుల గురించి నేటి తరానికి తెలియచెప్పాలన్న దర్శకుడి తాపత్రయం మెచ్చుకోవాలి.
సినిమా చూస్తున్నంతసేపూ మరియు సినిమా అయిపోయినతర్వాత నాకు ఒకటే అనిపిస్తూనే ఉంది " సత్యాన్ని తెలియజెప్పేందుకై అసత్య సహాయం అవసరమా?" అని.
Monday, August 5, 2013
పవర్స్టార్ (అంతకు మించి మంచి మనసు ఉన్న)పవన్కళ్యాణ్ నోట మా ఊరు "కదిరి" నరసింహుని పాట
"కదిరి" అనే మా ఊరు అనంతపురం జిల్లాలోని ప్రముఖ పట్టణం. మా వైపు చాలా జనాదరణ పొందిన నరసింహస్వామి పాట "బేట్రాయి స్వామి దేవుడా" పాట రీమిక్స్ పవర్స్టార్ (అంతకు మించి మంచి మనసు ఉన్న)పవన్కళ్యాణ్ గారు ఒక సినిమా కోసం పాడారు. అందుకు వారికి మా కదిరి తరపున కృతజ్ఞతలు.
మా కదిరి గురించి తెలుసుకోవాలంటే క్రింది లింక్ నొక్కండి.
Monday, July 8, 2013
Friday, July 5, 2013
మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగల్ బార్ట్ (Douglas Engelbart)ఆత్మశాంతికై ప్రార్థిద్దాము.
కంప్యూటర్ అంటే తెలిసిన ప్రత ఒక్కరికీ "మౌస్(mouse)" గురించి తెలియకపోవడం అంటూ ఉండదు.
ఇప్పుడంటె లాప్టాప్ లు వచ్చి మౌస్ ఉపయోగం తగ్గింది కానీ ఆ మాటకొస్తే లాప్టాప్ కు కూడా మౌస్ తగిలించుకొని పనిచేసేవాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు.
ఇప్పుడంటె లాప్టాప్ లు వచ్చి మౌస్ ఉపయోగం తగ్గింది కానీ ఆ మాటకొస్తే లాప్టాప్ కు కూడా మౌస్ తగిలించుకొని పనిచేసేవాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు.
అసలు మౌసే లేకపోతే కంప్యూటర్ వినియోగం అత్యంత కష్టంగా ఉండేది అనడం అతిశయోక్తి కాదు.
అలాంటి మౌస్ సృష్టికర్త ఐన "డగ్లస్ ఎంగల్ బార్ట్ ((January 30, 1925 – July 2, 2013))" గారు జులై 2వ తేదీన మరణించారు.
అంతేకాక కంప్యూటర్ కు సంబంధించిన hyper Text, GUI(Graphical User Interface) యొక్క ఆవిష్కరణలలో వీరి పాత్ర ఉంది.
వారి ఆత్మశాంతికి భగవంతున్ని ప్రార్థిస్తూ ఇంకా ఇటువంటి శాస్త్రవేత్తలను ప్రపంచానికి ఎంతోమందిని ప్రసాదించాలని భగవంతుని వేడుకుందాము.
Thursday, July 4, 2013
వివేకానందుడు ఏం చేసాడో ఇంకో వివేకానందుడు ఉంటే తెలుసుకోగలడు
ఈ మాటలు ఎవరో అన్నది కాదు, వివేకానందుడే తన చివరి రోజులలో అనుకోవడం బాబూరాం(ప్రేమానంద స్వామి) విన్నాడు.
స్వామి వివేకానంద గురించి మనం ఏమని చెప్పుకోగలం? అసలు మనకు ఏమి తెలుసని.
1.ఉక్కు పరిశ్రమ పితామహుడైన జంషెడ్జీ టాటా కు దిశానిర్దేశం చేసిందెవరు ?
2.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఆచార్యపదవిని సున్నితంగా తిరస్కరించిన వారు ఎవరు?
3.ఆధునిక విద్యుచ్చక్తి శాస్త్రజ్ఞుడైన నికోలా టెస్లా(Nikola Tesla) తన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలలో ఆధ్యాత్మిక సహాయం చేయమని స్వయంగా ఆహ్వానించిన వ్యక్తి ఎవరు?
4.బిల్గేట్స్,అన్నాహజారే,ఒబామా,గాంధిజీ,నెహ్రుజీ,సుభాష్చంద్రబోస్,సర్వేపల్లి రాదాక్రిష్ణన్,అరవిందయోగి లాంటి గొప్పగొప్ప వ్యక్తుల కే స్పూర్థినిచ్చిన ఆ మహావ్యక్తి ఎవరు?
5.బెంగళూరులోని IISc కు మొట్టమొదటి Director గా ఉండమని టాటాలచే ఆహ్వానింపబడ్డ వ్యక్తి ఎవరు?
6.అడవులలోని వేదాంతాన్ని సమాజంలోనికి తీసుకువచ్చిన వారెవరు?
7.స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అధిక సంఖ్యాకులకి స్పూర్థిప్రదాత ఎవరు?
8.కొడగట్టిన దీపంలా ఉన్న హిందూమత ప్రాభవాన్ని విశ్వ వినువీధులలో నిలబెట్టిన ఘనుడెవరు ?
9.మానవసేవే మాధవసేవ అని గురువుగారైన రామకృష్ణపరమహంస గారి ఉపదేశాన్ని స్వీకరించి విశ్వంలో చాటిన మహానుభావుడెవరు ?
10.మతరహితంగా సర్వసమాజానికీ సేవలు చేస్తున్న రామకృష్ణ సంస్థల స్థాపకుడెవరు ?
11.వంద సంవత్సరాలు దాటినా ఇంకా లక్షలమందికి స్పూర్థిప్రదాతగా వెలుగొందుతున్న ఏకైక మహానుభావుడెవరు ?
12.యువతకు కావలసినవి ఇనుపకండలు, ఉక్కు నరాలు అని తెల్పిన మహానుభావుడు ఎవరు?
ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నని చెప్పుకోవాలి?
వీటన్నిటికీ సమాధానం స్వామి వివేకానంద అని మనకు తెలుసు.
ఆ మహానుభావుడు శివసాయుజ్యం పొంది నేటికి 111 సంవత్సరాలు. స్వామీజీ స్థాపించిన రామకృష్ణ సంస్థలు నేటికీ వివాద రహితంగా సేవలు అందిస్తూనే ఉన్నాయి.
తన సందేశం 1500 సంవత్సరాలకు సరిపడినంత ఇచ్చానని స్వామి వివేకానందుడే స్వయంగా చెప్పారు.
"వివేకానందుడే బ్రతికి ఉంటే ఆ మహాపురుషుడి కాళ్ల దగ్గర ఒక శిష్యపరమాణువుగా కూర్చుని ఉండేవాడిని."
-సుభాష్ చంద్రబోస్
చివరగా స్వామి వివేకానందుడు చెప్పిన ఒక సందేశంతో మనం ఆయనకు నివాళులర్పిద్దాం.
"లేవండి,మేల్కొనండి, గమ్యం చేరువరకూ విశ్రమించకండి".
Monday, July 1, 2013
Saturday, June 29, 2013
Friday, June 28, 2013
నా కొత్త బ్లాగు "భారతీయ మహాయోగులు - భారతమాత ముద్దుబిడ్డలు"
నా కొత్త బ్లాగు "భారతీయ మహాయోగులు - భారతమాత ముద్దుబిడ్డలు".
ఈ బ్లాగులో మన భారత యోగుల, మహర్షుల గురించి సంక్షిప్త చరిత్రలు వ్రాయాలని నా సంకల్పము.
ముఖ్యంగా ఆధునిక కాలానికి చెందిన యోగుల గురించి వ్రాయాలని సంకల్పము.
ఈ బ్లాగులో మన భారత యోగుల, మహర్షుల గురించి సంక్షిప్త చరిత్రలు వ్రాయాలని నా సంకల్పము.
ముఖ్యంగా ఆధునిక కాలానికి చెందిన యోగుల గురించి వ్రాయాలని సంకల్పము.
భగవంతుడి దయ మేరకు వ్రాస్తాను.
Tuesday, June 25, 2013
Monday, June 17, 2013
హమ్మయ్య! ఇన్నాళ్లకు నా HTC Desire X మొబైల్ ఫోను తెలుగు చూపిస్తోంది.
HTC కంపెనీ వాళ్ళు వారి కొత్త మొబైల్ ఫోన్లలో భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తున్నారంటే విని అప్పుడే విడుదలైన HTC Desire X అనే మోడల్ (19,000 రూపాయలు) ఫోన్ ను గత అక్టోబర్ 29 న కొన్నాను.
కాని తీరా చూస్తే అందులో హింది,మరాఠి,తమిళం మరియు బెంగాళి భాషలు మాత్రం కనిపించాయి. మన తెలుగు బ్లాగులు ఓపెన్ చేస్తే అంతా ఖాళీగా దర్శనం ఇచ్చేవి. సర్లే నా ప్రాప్తం ఇంతేలే అనుకొని ఒపెరా బ్రౌజర్ లో మాత్రం తెలుగు చూసుకొని సర్దుకుపోయేవాణ్ణి.
కాని మొన్న జూన్ 10 వ తేదీ జెల్లీబీన్ అనే కొత్త ఆండ్రాయిడ్ వర్షన్ కు update చేసుకొమ్మని HTC నుండి కాల్ వచ్చింది. update అయిన తర్వాత చూస్తే తెలుగుతో పాటు భారతీయ భాషలు అన్నిటికీ సపోర్ట్ ఉంది.
అంతేకాకుండా మన భారతీయభాషలలో మెసేజులు కూడ పంపించుకొనే సౌకర్యం కంపెనీవాడే ఇచ్చాడు.
తెలుగు చూపిస్తున్న చిత్రం చూడండి.
చాలాచాలా ధన్యవాదాలు HTC వారికి.
కాని తీరా చూస్తే అందులో హింది,మరాఠి,తమిళం మరియు బెంగాళి భాషలు మాత్రం కనిపించాయి. మన తెలుగు బ్లాగులు ఓపెన్ చేస్తే అంతా ఖాళీగా దర్శనం ఇచ్చేవి. సర్లే నా ప్రాప్తం ఇంతేలే అనుకొని ఒపెరా బ్రౌజర్ లో మాత్రం తెలుగు చూసుకొని సర్దుకుపోయేవాణ్ణి.
కాని మొన్న జూన్ 10 వ తేదీ జెల్లీబీన్ అనే కొత్త ఆండ్రాయిడ్ వర్షన్ కు update చేసుకొమ్మని HTC నుండి కాల్ వచ్చింది. update అయిన తర్వాత చూస్తే తెలుగుతో పాటు భారతీయ భాషలు అన్నిటికీ సపోర్ట్ ఉంది.
అంతేకాకుండా మన భారతీయభాషలలో మెసేజులు కూడ పంపించుకొనే సౌకర్యం కంపెనీవాడే ఇచ్చాడు.
తెలుగు చూపిస్తున్న చిత్రం చూడండి.
చాలాచాలా ధన్యవాదాలు HTC వారికి.
Thursday, June 6, 2013
Monday, May 27, 2013
పదాలతో ఆడుకోవడం అంటే ఇలా ఆడుకోవాలి....అన్నమయ్య కీర్తన
తెలుగు బాష యొక్క సొగసు,సింగారాలను మనం ఎంతగా కోల్పోతున్నామో ఎందరికి తెలుసు. రామాయణంలోని హనుమంతుని సీతాన్వేషణ ను వర్ణిస్తూ ఉన్నటువంటి ఈ క్రింది అన్నమయ్య కీర్తన వింటూ చదవండి. అప్పుడు తెలుస్తుంది తెలుగు బాష యొక్క సొగసుతనం.
అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్యా ||
రామ నిను బాసి నీరామ నే చూడగ నా
రామమున నిను బాడె రామరామ యనుచు
ఆ మెలుత సీతయని యపుడునే తెలిసి
నీ ముద్ర వుంగరము నే నిచ్చితిని ||
కమలాప్త కులుడ నీకమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారి దూరె
నెమకి యాలేమను నీదేవి యని తెలిసి
అమరంగ నీసేమమటు విన్నవించితిని ||
దశరథాత్మజ నీవు దశశిరుని చంపి, యా-
దశనున్న చెలి గావు దశదిశలు పొగడ
రసికుడ శ్రీ వేంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ||
Thursday, May 23, 2013
మన పని మనం చేసుకోవడానికి మొహమాటం ఎందుకు? (అబ్రహం లింకన్ జీవితపు చిన్న సంఘటన)
అబ్రహం లింకన్ యొక్క మహోన్నతపు వ్యక్తిత్వం మనకు పరిచయమే.వారి జీవితం నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
ఒక చిన్న సంఘటన.
ఒక సారి లింకన్ గారి స్నేహితుడు లింకన్ గారి ఇంటికి వెళ్ళేటప్పటికి లింకన్ గారు తమ బూట్లు పాలిష్ చేసుకుంటున్నారు.
అది చూసి వారి స్నేహితుడు "అదేంటి లింకన్! నీ బూట్లు నువ్వే పాలిష్ చేసుకుంటున్నావ్?" అన్నాడు.
వెంటనే లింకన్ గారు " మరి నువ్వు ఎవరి బూట్లు పాలిష్ చేస్తావ్?" అన్నారు.
లింకన్ మాటల్లోని అంతరార్థం తెలుసుకుని ఆ స్నేహితుడు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకుందాం.
స్వామి వివేకానందులు చెప్పినట్లు " ఒకరి గొప్పతనం వారు చేసిన గొప్ప కార్యాల వలన కాక వారు తమ దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులు ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి ఉంటుంది."
వర్గాలు
మహనీయుల జీవితాలలో మధురఘట్టాలు
Friday, April 26, 2013
ఒక శ్రేయోభిలాషి వ్యాఖ్యగా వ్రాసిన ఒక కవిత
సురేష్ గారు..
మీ వ్యాఖ్యలు/ఉత్తరాలు చదువుతూంటే..
అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్న చద్దన్నం రుచి గుర్తొచ్చినట్లు.... కమ్మగా...
మనకు ఇష్టమైన పాత సినిమాలోంచి ఘంటసాల గారు పాడిన పాట వింటున్నట్లు.. తియ్యగా...
మన ఎలిమెంటరీ స్కూల్లో.. తెలుగు మాష్టారు పాఠం మధ్యలో, ఉదాహరణల కోసం.. చెప్పే చిట్టి కథంత.. మధురంగా...
వేసవి కాలం సెలవుల్లొ వచ్చే.. ఐస్ బండిలోంచి ఇచ్చే.. చిన్న కలర్ ఐస్ ముక్కంత, చల్లగా....
ఉంటాయండి...
నిజంగా.. ఇది ఒక అరుదైన అనుభూతి..
మీరు ఇలాగే కొత్తగా.. మనం (సమాజం) మరిచిపోతున్న పాతదనాన్ని గుర్తు చేస్తూ.. ఉండాలని..
- మీ శ్రేయోభిలాషి
మీ వ్యాఖ్యలు/ఉత్తరాలు చదువుతూంటే..
అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్న చద్దన్నం రుచి గుర్తొచ్చినట్లు.... కమ్మగా...
మనకు ఇష్టమైన పాత సినిమాలోంచి ఘంటసాల గారు పాడిన పాట వింటున్నట్లు.. తియ్యగా...
మన ఎలిమెంటరీ స్కూల్లో.. తెలుగు మాష్టారు పాఠం మధ్యలో, ఉదాహరణల కోసం.. చెప్పే చిట్టి కథంత.. మధురంగా...
వేసవి కాలం సెలవుల్లొ వచ్చే.. ఐస్ బండిలోంచి ఇచ్చే.. చిన్న కలర్ ఐస్ ముక్కంత, చల్లగా....
ఉంటాయండి...
నిజంగా.. ఇది ఒక అరుదైన అనుభూతి..
మీరు ఇలాగే కొత్తగా.. మనం (సమాజం) మరిచిపోతున్న పాతదనాన్ని గుర్తు చేస్తూ.. ఉండాలని..
- మీ శ్రేయోభిలాషి
Tuesday, April 2, 2013
ఈ ప్రశ్నకు ఎంతమంది సమాధానం చెప్పగలరు?
పెదవులు, నాలుక అవసరం లేకుండా మనం పలుకగలిగే ఏకైక దేశం పేరు ఏమిటో చెప్పగలరా?
Friday, March 22, 2013
ఈ ఏడు మరియు మూడు తలల పామును చూసి మీ జన్మ ధన్యం చేసుకున్నారా?
ఈ మధ్య ఇంటర్నెట్ లో ప్రచారం అవుతున్న విషయం. ముఖ్యం గా facebook లో.
తిరుమలకు వెళ్ళే దారిలో తుంబురు కోన దగ్గర శివాలయానికి సమీపం లో 7 తలల సర్పము కనిపించింది ....దీనితో అందరు కలియుగ దైవం వేంకటేశ్వరుడు కనిపించాడని....
ఆ దారి లో వెళ్ళే భక్తులంత చూశారు .కానీ అర నిముషం కనపడి మాయమైపోయింది .......
దీన్ని చూసి షేర్ చేసిన వారి జన్మ ధన్యం అవుతుంది ....అని పూజారులు , TTD పండితులు చెప్పారు.
అలాగే మూడు తలల సర్పము కనిపించిందని మరో రాష్ట్రపు పూజారులు చెప్పారు.
అలాగే ఒక తల సర్పము కనిపించిందని ఇంకో రాష్ట్రపు పూజారులు చెప్పారు.
మీరు కూడా ఈ చిత్రాలు చూసి జన్మ ధన్యం చేసుకోండి.
Friday, March 1, 2013
అయ్యో నా పుట్టినరోజు క్యాలెండరులో కనిపించడం లేదెందుకని?
అయ్యో నా పుట్టినరోజు క్యాలెండరులో కనపడ్డం లేదు.
ఏం ఫరవాలేదు, ఫిబ్రవరి 29 రాకున్నా దాని బదులు మార్చ్ 1 వచ్చింది.
కాబట్టి ఈరోజే నా పుట్టినరోజు.
Subscribe to:
Posts (Atom)
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...






















