Friday, March 27, 2009
తెలుగుజాతి కీర్తిని ఇనుమడింపజేసిన కొందరు తెలుగువారు
* శంకరంబాడి సుందరాచారి: రాష్ట్ర గీతమైన 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' అన్న గేయాన్ని రచించి తెలుగు జాతికి అంకితమిచ్చిన మహాకవి. తిరుపతి వాస్తవ్యులైన వీరికి నిన్నమొన్నటి దాకా దక్కాల్సినంత పేరు దక్కలేదు. ఈ మధ్యనే తిరుపతిలో సుందరాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
* పొట్టి శ్రీరాములు (1901-1952): ఆంధ్రరాష్ట్ర అవతరణకోసం ఆత్మార్పణం చేసిన త్యాగ ధనుడు. సత్యము, అహింస, హరిజనోద్ధరణ ప్రధానాశయాలుగా గాంధీజీ అడుగు జాడల్లో నడచిన మహనీయుడు. తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంకోసం నిరశన వ్రతం చేసి అసువులు బాసారు. తత్ఫలితంగానే నేటి ఆంధ్రప్రదేశ్ అవతరణ.
* గిడుగు రామమూర్తి పంతులు (1863-19409): ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందిరికి అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది.
* కందుకూరి వీరేశలింగం (1948-1919): గొప్ప సంఘ సంస్కర్త, సాహితీ వేత్త. కథ, నవల, వ్యాసం వంటి అనేక తెలుగు సాహిత్య శ్రీకారం చుట్టినవాడు. స్త్రీ విద్యను, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. వివేకవర్థిని పత్రికను స్థాపించి సమాజంలో అప్పటికే పేరుకుపోయిన మూఢాచారాలను, దురాచారాలను తూర్పార బట్టారు. అధికార వర్గాల్లోని అవినీతి, అక్రమాలను కలం బలంతో బట్టబయలు చేశారు.
* ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (19వ శతాబ్దం పూర్వార్థం): దేశ స్వాతంత్య్రంకోసం ఆత్మార్పణ చేసిన త్యాగధనుడు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి పదేండ్లకు పూర్వమే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి నిలిచిన ధీరుడు.
* గురజాడ అప్పారావు (1862-1915): 'దేశమును ప్రేమించుమన్నా' అంటూ దేశ భక్తి గీతాన్ని ప్రబోధించిన నవయుగ వైతాళికుడు. భాషా సాహిత్యాలు, కళలు దేశ హితానికి ఉపయోగపడాలని ఆకాంక్షించిన సమాజోద్ధరణాభిలాషి. గురజాడ సృష్టించిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యక అనే కావ్యాలు తెలుగు వారి కంట తడి పెట్టిస్తూనే ఆయన కాలం నాటికి సమాజంలో పాతుకుపోయిన మూఢాచారాలపై ధ్వజమెత్తాయి.
* రఘుపతి వెంకటరత్నంనాయుడు (1862-1939): సంఘ సంస్కర్త, బ్రహ్మ సమాజ ప్రచారకుడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థుల్లో రుజువర్తన, నైతిక శీలానికి ప్రాధాన్యమిచ్చినవాడు. మహామహులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావులు ఈయన శిష్యులేనంటే గురువుగా ఆయన ప్రభావమెంతటిదో అర్థమవుతుంది.
* టంగుటూరి ప్రకాశం పంతులు (1872-1957): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు. తెలుగు వారి గుండెలొల్లో ఆంధ్రకేసరిగా ఈయన స్థానం పదిలం. బారిస్టర్గా ప్రాక్టీసు పెట్టి కోట్లు సంపాదించే అవకాశమున్నా గాంధీజీ పిలుపుతో స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించాడు. సైమన్ కమిషన్ వచ్చినపుడు పోలీసుల తుపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డి నిలిచి ఆంధ్ర జాతి గుండెను గెలుచుకున్నారు.
* పింగళి వెంకయ్య (1878-1963): భారత జాతీయ త్రివర్ణ పతాక నిర్మాత. స్వాతంత్య్ర సమర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, గుండె నిండుగా దేశాభిమానమే కాదు, మెదడు నిండుగా విజ్ఞానాన్ని ధరించిన వాడు. కాంబోడియా పత్తి రకాన్ని పరిశోధించి, పండించి వ్యవసాయ శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు అనేక బంగారు, వెండి పతకాలను గెలుపొంది రాయల్ ఎగ్రికల్చర్ సొసైటీకి సభ్యుడుగా ఎన్నికయ్యారు.
* బండారు అచ్చమాంబ (1874-1905): స్త్రీ విద్యకు తీవ్ర వ్యతిరేక ఎదురవుతున్న ఆరోజుల్లోనే చదువుకోడమే కాకుండా రచనలు సైతం చేసిన ప్రజ్ఞాశాలి. ఎన్నో గ్రంథాలను శోధించి వెయ్యి సంవత్సరాల స్త్రీల చరిత్రను 'అబలా సచ్ఛరిత్ర రత్నమాల' పేరుతో ఒక్క చేతితో రాశారు. భర్త మాధవరావుతో కలిసి స్త్రీ జనాభ్యుదయానికి పాటుపడ్డారు. స్త్రీ సమాజాలను స్థాపించారు.
* డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు (1895-1948): ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త. ఆధునిక వైద్యంలో అనేక అద్భుత ఆవిష్కరణలు చేసిన వ్యక్తి. ముఖ్యంగా బోదకాలు వ్యాధి నివారణకు ఉపయోగించే డై ఈథైల్ కార్బామజీన్ అనే మందును కనుగొన్నారు. 1945లో ఆరియోమైసిన్ అనే యాంటీబయోటిక్ మందును ఆవిష్కరించారు. పాండురోగ నివారణకు పోలికామ్లం, క్షయ రోగానికి పసోనికోటినికాసిడ్ హైడ్రోజన్లను కనుగొన్నారు.
(ఈనాడు సౌజన్యము )
శ్రీ విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఈ కొత్త సంవత్సరము మన రాష్ట్రము,దేశము మరియు ప్రపంచము అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని
కోరుకొంటూ
సురేష్ బాబు
Thursday, March 26, 2009
ఆదర్శదాంపత్యం ఎలా ఉండాలి? (అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర)
పూర్వం స్వరోచి అనే రాజు ఉండేవాడు. ఆయన విద్యావంతుడు, బుద్ధిమంతుడై ఉండి ధర్మబద్ధంగా పరిపాలన చేస్తుండేవాడు. అలాంటి స్వరోచి ఓ సంఘటనలో ఒకేసారి ముగ్గురిని పెళ్ళాడాల్సి వచ్చింది. తొలిగా మనోరమను, ఆ తర్వాత ఆమె స్నేహితురాళ్ళయిన విభావసి, కళావతి అనే మరో ఇద్దరు కన్యలనూ వివాహమాడాడు. మనోరమను వివాహమాడినందుకు ఆమె తండ్రి నుంచి ఆయుర్వేద విద్యను, విభావసి వల్ల మృగ, పక్షి జాతుల సంభాషణలను తెలుసుకొనే విద్యలను, కళావతి వల్ల సర్వ అభీష్టాలు తీర్చే పద్మినీ అనే విద్యను పొందాడు స్వరోచి. పద్మినీ విద్య ప్రభావంతో సంమృద్ధిగా అన్నపానీయాలు, వస్త్రాభరణాలు తరగని సర్వసంపదలను సొంతం చేసుకున్నాడు. నిరంతర సుఖ జీవనం ఆయనకు ప్రాప్తించింది.
నిత్యం తన భార్యలను తీసుకొని గంగానది ఒడ్డున ఉన్న అందమైన ఇసుక తిన్నెల మీద పూలతోటల్లో సరోవర తీరాలలోనూ హాయిగా విహరిస్తుండేవాడు. ఇలా విహరిస్తున్న రోజుల్లో ఓ రోజున స్వరోచి అందమైన చందన వృక్షాల సమీపంలో ఉన్న ఒక సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ సరస్సులో ఆనందంగా విహరిస్తున్న ఓ ఆడహంస అక్కడికి సమీపంలో విహరిస్తున్న ఆడ చక్రవాక పక్షిని తన వద్దకు రమ్మని రహస్యంగా పిలిచింది. స్వరోచిని.. అతడి భార్యలను చూపించింది. ఇలా ఏ భేదమూ లేకుండా ముగ్గురు స్త్రీలు ఒక పురుషుడితో జత కూడి వినోదించటమంటే ఎంత అదృష్టమోగదా, వారు పూర్వ జన్మలలో ఎంత గొప్ప తపస్సు చేశారో కదా అని అంది.
అలాగే భార్యకు భర్తపైన, భర్తకు భార్యపైన వలపు కలగటం లోకసామాన్యమైన విషయమే కానీ భార్యాభర్తలిద్దరికీ ఒకరిమీద మరొకరికి కొద్దిగా కూడా తేడా లేకుండా వలపు సమానంగా ఉండటం మాత్రం పూర్వజన్మ పుణ్యఫలమనే నా భావన. ఈ ముగ్గురు స్త్రీల మీద రాజుకు ప్రేమ ఉన్నట్లే ఆ రాజుపై కూడా స్త్రీలకు సమాన ప్రేమ ఉంది. పువ్వు, పరిమళం పరస్పరం కలిసి ఉన్నట్టే వీరి ప్రేమానురాగాలు నాకు కనిపిస్తున్నాయి అని అంది ఆడహంస.
అప్పుడు చక్రవాకం హంసికి వాస్తవం ఏంటో నిర్మొహమాటంగా తెలియజెప్పాలనుకొని ఇలా అంది. 'చూడు హంసి.. పైపైకి కన్పిస్తున్న ఈ భోగాల మెరుగులు చూసి ఇవన్నీ గత జన్మపుణ్య ఫలాలని అనుకోవటం నాకు వింతగా అనిపిస్తుంది. ఈ రాజు ఒక స్త్రీతో మిగిలిన ఇద్దరిముందూ రమిస్తున్నా ఆ ఇద్దరూ వారిని ఏవగించటం, కోపగించటం ఏమీ చేయటం లేదు. ఆత్మ గౌరవాన్ని వదిలి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ప్రేమను నీవు కూడా సమర్థిస్తూ స్తుతించటం ఏమీ బాగాలేదు. ఇలాంటిది కపట ప్రేమ తప్ప మరేమీ కాదు.
ఒక పురుషుడికి అనేక స్త్రీల మీద, అనేక స్త్రీలకు ఒక పురుషుడి మీద అనురాగం కలగటంలో ఎప్పుడూ పారదర్శకత ఉండదు. స్వరోచికి అతడి భార్య మీదకానీ, భార్యలకు స్వరోచిపై కానీ నిజమైన ప్రేమ కొంచెం కూడా లేదన్నది నా భావన. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను విను. రాజు తనను సేవించే పరివారం అందరితో అనుకూలంగానే మాట్లాడినా అందరి మీదా అతడికి స్వచ్ఛమైన అనురాగం ఉండదు. అలాగే ఎంతమంది భార్యలున్నా మగవాడికి ఆ అందరి మీద గాఢానురాగం ఉండదు.
తన భర్త మరొక స్త్రీని తన ఎదుటే కలిస్తే ఏ స్త్రీ కూడా ఆ భర్తపై మమకారంతో మెలగదు. ఇది అక్షర సత్యం. కనుక ఈ స్త్రీలకు ఈ రాజుమీద అభిమానం, మమకారం అనేవి ఉండనే ఉండవు. మరి ఎందుకిలా కలిసి ఉన్నారంటావా? అదంతా ధనాన్ని ఆశించి మాత్రమే. దాసదాసీ జనం ధనవంతుడిని చేరినట్లే వీరూ అలా చేరారు. అందుకనే వీరి దాంపత్యాన్ని నేను గొప్ప దాంపత్యం అని అనడం లేదు. ఒక పురుషుడికి ఒక స్త్రీ మీద, ఒక స్త్రీకి ఒక పురుషుడి మీద మాత్రమే కలిగిన అనురాగం శ్రేష్టమైంది. స్త్రీలలో నేను, పురుషుల్లో నా భర్త ఈ వాస్తవాన్ని గ్రహించి అలా మెలుగుతున్నాం కనుకనే మాది ఆదర్శ దాంపత్యం అయింది. ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఉంటేనే అన్ని విధాలా శ్రేయోదాయకం' అని ఆడ చక్రవాక పక్షి హంసితో చెప్పింది.
ఏనాడో పెద్దన చేతుల్లో రూపొందిన మనుచరిత్రలో ఈనాటి వారిక్కూడా ఆచరణ యోగ్యమైన నైతిక విలువలతో కూడిన ఒక జీవన సూత్రం ఇలా ఇక్కడ కనిపిస్తోంది. స్త్రీ లౌల్యాన్ని నిరసిస్తూ రెండు పక్షుల మాటల్లో అల్లసాని పెద్దన ఇంత చక్కటి సందేశాన్ని మానవాళికి అందించాడు.
Tuesday, March 24, 2009
కుహనా లౌకికవాదుల,మీడియా వక్రబుద్ధి
ఈ మధ్య వరుణ్గాంధీ ముస్లిములకు వ్యతిరేకముగా ఏవో వ్యాఖ్యలు చేసాడని వార్తలు వచ్చాయి. అలా గనుక అతను చేసుంటే అది తప్పే ఖండించవలసిందే.ఈ విషయాన్ని ప్రముఖవార్తగా అన్ని ఆంగ్లపత్రికలు, అన్ని ఆంగ్ల TV ఛానళ్ళూ ప్రసారం చేస్తున్నాయి. ఇక TimesNow,NDTV,CNN-IBN లాంటి ఆంగ్ల ఛానళ్ళకైతే ఇదే ప్రముఖ వార్త. వీళ్ళు ఎన్నిసార్లు వేస్తారంటే అలా చూపించడం వలనే ఇంకా మతకలహాలు ఎక్కువ చెలరేగే అవకాశం ఉంది. సరే వారు నిజమే కదా ప్రసారం చేస్తున్నారు అనుకొందాం.
అలా ఐతే ఇలాంటి అన్ని విషయాలనూ అలానే ప్రసారం చేయాలి కదా, పత్రికలు కూడా అలానే ప్రచురించాలి కదా.
M.F.హుస్సేన్ అనే ప్రముఖ(???)చిత్రకారుడు హిందూ దేవతల చిత్రాలను నగ్నముగా గీస్తూ దానిని సృజనాత్మకత(creativity) అని చెప్పుకుంటుంటే అది వార్త కాదా? పైగా దానికి నిరసన తెల్పితే,తెలిపిన వారిపై పోలీసుకేసులు. దానికి హిందువుల మనోభావాలు దెబ్బతినవా? వరుణ్గాంధీ కేవలం రెచ్చగొట్టే మాటలు మాత్రం మాట్లాడాడు. కాని హుస్సేన్ చెసిందేమిటి? ఏకముగా హిందువుల దైవాలపైనే గురిపెట్టాడు.కాని అతనిపై ఈగ కూడా వాలనివ్వరు. ఇక ఈ మీడియా ఉందే, వారికి ఇవి ఏ మాత్రం పట్టవు. అసలు ఇలాంటి వార్తలను పత్రిక మధ్య కాగితాలలో వేసి ఇక చేతులు దులుపుకొంటారు. మొదటి కాగితములో మాత్రం అసలు వేయరు. ఏమంటే లౌకికవాదం అంటారు.ఇదా లౌకికవాదం?ఆంగ్ల TV చానళ్ళకైతే అసలు ఇది ఒక వార్తే కాదు.
అసలు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం గారి ప్రకారం మనుషులను రెచ్చగొట్టే,బాధపెట్టే వార్తలను పత్రిక మొదటి కాగితంలో అసలు వేయరాదు.
ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి వారి వక్రబుద్ధిని తెలిపే సంఘటనలు.
Friday, March 20, 2009
అంగరంగవైభవముగా జరిగిన కదిరి నృసింహుని రథోత్సవం - దృశ్యమాలిక
Tuesday, March 10, 2009
భావోద్వేగాలను నియంత్రించడం అంటే ఇదీ - నిజముగా జరిగిన సంఘటన
ఆ ప్రశ్న ఏమిటంటే:
"మీ అమ్మ గనుక వేశ్య ఐతే?"
చాలామంది అభ్యర్థులు ఈ ప్రశ్న విని నిశ్చేష్టులయ్యారు. కొందరు కన్నీళ్ళు పెట్టుకొన్నారు. కొందరు ప్రశ్నించిన అధికారిని కొట్టబోయారు. ఇంచుమించు మనము కూడా అలానే ప్రవర్తిస్తామనుకోండి.
కాని ఒకే ఒక అభ్యర్థి తడుముకోకుండా ఆలోచించి చెప్పిన సమాధానం ఏమంటే:
"మా అమ్మ గనుక వేశ్య ఐతే మా నాన్న ఒక్కడే ఆమెకు విటుడు"
ఆశ్చర్యపోయారా ? ఎంతమందికి ఇంత మానసిక స్థైర్యం ఉంటుంది?
ఇది మన భారతదేశంలోని ఒక యాజమాన్య సంస్థ (management institute) లో నిజముగా అడిగిన ప్రశ్న.
Sunday, March 1, 2009
అంతా మోసం,ఈ రోజు నా పుట్టినరోజు కనబడటంలేదు
Friday, February 27, 2009
ఏ కులమని నన్నడిగితె ఏమని చెప్పను దున్నపోతులకు, లోకులకు, దుష్టులకు
పలుకాకులకు, దుష్టులకు, దుర్మార్గులకు, దున్నపోతులకు,
అంతున పుట్టిందే కులమె
ముట్టంటున పెరిగెందే కులమె
అంటున శివుడు, ముట్టున మురుడు, ఎంతన ఈశ్వరుడు,
ముగ్గురు మూర్తుల దెలెపందె ఏకులమె
ఇంటిలోపల ఇల్లు కట్టుకొని
కంటి లోపల కదురు పెట్టుకొని
నారాయణ అని నరం తీసికొని
పంచాద్రి అని తడికి వేసుకొని
గోవింద అని గుడిప దీసికొని
గబ గబ, దబ దబ, ఏకెనిదె ఏకులం
దూదేకుని కులమె నాకులం
ఏ కులమని నన్నెవరు అడిగితె ఏమని చెప్పను లోకులకు,
పలుకాకులకు, దుష్టులకు, దుర్మార్గులకు, దున్నపోతులకు,
పంచాద్రి అని పంచె తీసికొని
ఎరబ్రహ్మ అని శాలువ కప్పుకొని
పూజల నడిపెందికులమె నాకులం
వంటరి గాడు ఏ కులమె శ్రీజంతనె
కలసిందె కులమె నాకులం
ఏ కులమని నన్నెవరు అడిగితె ఏ మని చెప్పను లోకులకు,
పలుకాకులకు, దుష్టులకు, దుర్మార్గులకు, దున్నపోతులకు.
ఈ కవిత బ్రహ్మం గారి శిష్యుడు ఐన సిద్దయ్య గారిచే రచింపబడినది.
Tuesday, February 17, 2009
మనిషి ఉన్నతిని, అభివృద్ధిని,సుఖశాంతులను కోరుతున్న వేదాలు
1. అమృతం అసి : అమరుడు అవు
2. శర్మ అసి : సుఖవంతుడు అవు
3. శుక్రం అసి : శక్తివంతుడు అవు
4. తేజః అసి : తేజము అవు
5. ధామనామ అసి : కీర్తిని పొందు
6. తేజఃవేష్ప అసి : తేజస్సుకు నిలయమము అవు
7..శత వల్మః విరో హః నిండు నూరేళ్ళు వర్ధిల్లుము
8. సర్వేపి సుఖినస్సంతు : అంతా సుఖించాలి
9.సర్వేసంతు నిరామయా : అంతా వ్యాధిరహితులు కావాలి
10.సర్వే భద్రాణి పశ్యంతు : అందరూ శుభాలను చూడాలి
11.మాకశ్చిద్దుఃఖభాగ్భవేత్ : ఏ ఒక్కడూ దుఃఖంచే బాధించబడరాదు
Saturday, February 14, 2009
దేవుడు మనుషుల కొసం ఎంతగా దిగివస్తాడో చూడండి
1.మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.
ఇది మొదటిది. దేవుని యందు మనసును,బుద్ధిని లగ్నము చేయడము. ఈ ప్రపంచములో పూట గడవడానికే ఇబ్బందిగా ఉంది, మా పనులనే మేము చేసుకోలేకపోతున్నాము ఇక దేవునిపై దృష్టి ఎలా పెట్టగలము అంటారా. ఐతే క్రిందది చూడండి.
2.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.
ఇక్కడ అభ్యాసయోగం అనగా మనసును ప్రాపంచిక విషయాలపై నుండి మరల్చి దేవునిపై పెట్టడం.అంటే పనులు మానుకొనమని కాదు. దీనిని ఒక ఉదాహరణ ద్వారా చెపుతాను. పిల్లలు గుండ్రముగా తిరిగే ఆట మీరు చూసుంటారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని తిరుగుతుంటారు. అలాకాక ఒకరే ఆధారం లేకుండా ఎంతసేపు తిరగగలరు? అలా ఎక్కువసేపు తిరిగితే క్రిందపడి పోతారు. అదే ఏ గుంజనో,స్థంభాన్నో గట్టిగా పట్టుకొని తిరిగారనుకోండి క్రిందపడరు. అలాగే మనం ఏ పని చేస్తున్నా భగవంతుని ఆధారం చేసుకొంటే ఏ సమస్యా ఉండదు. రోజుకు కొంతసేపు అభ్యాసం(ధ్యానం) నియమితవేళలలో గాని,మనకు అనుకూలమైన వేళలలో కాని చేస్తే మనసు మన చేతిలోనికి వస్తుంది.
3.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.
స్వామి ఇంకా దిగివచ్చాడు. ఇది కూడా మనకు సాధ్యం కాకపోతే దేవునికి ఇష్టమైన పనులు అనగా సత్యం పలకడం, ఇతరులకు హాని కల్గించకుండా ఉండడం,ఇతరులకు సహాయం చెయ్యడం, ప్రజోపయోగ కార్యక్రమాలు చెయ్యడం మొదలగునవి అన్నమాట.
4.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్పించు.
దీని గురించి వివరముగా నా పూర్వపు టపా "కర్మయోగ రహస్యము" లో చూడండి.ఆ టపాలోని విషయాన్నే క్రింద చూడండి.
1.కర్మ చేయుటకు నీకు అధికారము గలదుకాని దాని ఫలితమందు ఆసక్తి కలిగివుండుటకు లేదు.అట్లని కర్మలు చేయుట నీవు మానరాదు.
2.ఏ కర్మ చేయుచున్నను నీవు అసంగత్వం తో మరియు శ్రద్దగా నిపుణత్వం తో చేయాలి.అనగా నీవు కావాలనుకున్నప్పుడు ఏ క్షణము లో నైనా ఆ పనితో సంబంధం లేకుండా బయటకు వచ్చేయగలగాలి.
ఈ ప్రపంచములో గెలుపు,ఓటములు అనేవి కేవలము మన శ్రమ పైనే ఆధారపడిలేవు.ఒక పని కావడానికి మన శ్రమ అత్యంత ముఖ్యము ఐనప్పటికీ ఆ పని విజయవంతము కావడానికి ఇంకా చాలా పరిస్థితులు అనుకూలించాలి.ఆ పరిస్థితులలో చాలామటుకు మన చేతులలో ఉండవు.కాబట్టి మన భాద్యత ఏమిటటంటే ప్రయత్న లోపం లేకుండా మన పనిని మనము నిర్వర్తించడం.అటువంటప్పుడు పని సఫలమైనప్పుడు విజయానందం,ఒకవేళ కాకపొతే పనిని నిర్వర్తించిన ఆనందం కలుగుతాయి.అందువలనే పని యొక్క ఫలితంపైన ఆసక్తి ఉంచుకోరాదు.
ఉదాహరణగా యజమాని ఇంట్లో పనిచేయు దాది ని చెప్పుకోవచ్చు. ఆ దాది తన యజమాని బిడ్డలను తన బిడ్డలగా భావించి పెంచుతున్నప్పటికి ఆమె ధ్యాస అంతా తన సొంత ఇంటి పైనే ఉంటుంది.అలా అని ఆమె తన యజమాని పని కూడా శ్రద్దగానే చేస్తుంది.ఏ లోటూ రానివ్వదు.అంటే మనము పని చేయుచున్నప్పటికి మన మనసు భగవంతుని దగ్గర ఉండాలి.
చివరగా భగవంతుని ప్రతిజ్ఞ చూడండి:
ఎవరైతే సర్వకాల,సర్వావస్థలలో నన్నే శరణు జొచ్చుతారో, నాపై నిష్కల్మషమైన భక్తి కలిగిఉంటారో వారి యోగక్షేమాలు నేనే చూసుకొంటాను.
అర్జునా నా భక్తుడు ఎప్పుడూ చెడిపోడని శపథం చేసి చెపుతున్నాను.
Friday, February 13, 2009
మేము మారము గాక మారము, మేమింతే - నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు
సంస్కృతీ పరిరక్షణ అంటూ కొందరు, తమ మతమే గొప్పదని,తమ మతం తప్ప వేరే దిక్కు లేదని కొందరు , హక్కులే తప్ప బాధ్యత మాకు పట్టదని యువత ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో.
ఆ మధ్య సంస్కృతీపరిరక్షకులమంటూ కొందరు మంగళూరు లో పబ్బుపై దాడి చేసారు. ఆ కుహనా పరిరక్షకులలో అందరూ యువకులే పాల్గొన్నారు. ఆకలిగొన్న పేదలకు ఒక పూట తిండి పెట్టలేని వారు, వారికి ఒక పూరిపాక నిర్మించలేనివారు, కట్టుకోవడానికి కనీసం తమ పాతబట్టలు కూడా ఇవ్వలేని వారు వీరండీ సంస్కృతీ పరిరక్షకులు. అసలు ఒకరి వ్యక్తిగత స్వాతంత్ర్యము, వ్యక్తిగత జీవితము పై వీరి అధికారము ఏంటి? ఎవరి హద్దులలో వారు ఉంటే మంచిది. ఎవరికీ ఎవరిపై పెత్తనము చలాయించే హక్కు గాని, అధికారము గానీ లేవు.
"అన్నమో రామచంద్రా! అంటున్న వారికి మత భోధనలు ఎందుకు, వారికి పట్టెడన్నం పెట్టండి.ఒక కుక్కకు ఆకలి తీర్చడం కొరకు వెయ్యిజన్మలు ఎత్తడానికైనా,వేయిసార్లు నరకానికి పోవడానికైనా సిద్దమే" అన్న వివేకానందుని వాక్యాలు తెలుసుకోవాలి.
ఇక నేటి విద్యార్థుల (యువత) విషయానికి వద్దాము.
ప్రేమికులను కలపడానికి, వారి ప్రేమను నిలపడానికి తమ ప్రాణాలనైనా ఇస్తామంటారు. అదే సాటి మనిషి కొనప్రాణముతో కొట్టుమిట్టాడుతున్నా స్పందించరు.అది మా పని కాదు. ప్రభుత్వపు పని అంటారు. వెళ్ళే సినిమా హాళ్ళ వద్ద ,తాగే పబ్బుల వద్ద ఒక రూపాయి ఇమ్మంటూ అడిగే వారిని, తినడానికి ఏమైనా ఇమ్మనే వారిని చీదరించుకొంటారు. ఏం! యువతకు సంఘబాధ్యత (Social responsibility) లేదా?
ఈ ఫిబ్రవరి 14 ప్రేమికులదినోత్సవమును ఎవరూ ఆపలేరని,అది తమ హక్కు అని బెంగళూరులో చాలా కళాశాలల విద్యార్థినీ,విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహించబోతున్నారు.అదీ అందరూ కలిసి. ప్రేమికులదినోత్సవం గా ని మరే దినోత్సవం కాని జరుపుకోవడంలో తప్పులేదు.నిరభ్యరంతరముగా జరుపుకోవచ్చు.అది మన హక్కు.
కాని ఏనాడైనా అన్ని కళాశాలలూ కలిసి ఈ విధముగా పోరాడినట్టు ప్రజాసమస్యలపై పోరాడారా? కాని హక్కుల కోసం పోరాడుతున్నామే కాని,బాధ్యతల గురించి పట్టించుకోమా? ఇప్పుడు ఇలా ర్యాలీ చేస్తున్నామే,ఎప్పుడైనా ఇంతగా మనలను ఈ ర్యాలీ ద్వారా ప్రజలను ఆకర్షించింట్లు సమాజంలోని అవినీతిపై గాని, అందరికీ కనీస అవసరాల కోసం కాని ఉద్యమించామా? అప్పుడప్పుడు ఎయిడ్స్ పై అవగాహన కోసం ర్యాలీలనునిర్వహిస్తుంటాము,అదీ కళాశాలల తరపున ,వారు నిర్వహిస్తామంటేనే. ఇక్కడ అందరినీ అనడం లేదు.కాని చాలామందినే అంటున్నాను.
ఎవరు అడ్డొచ్చినా మేము దినోత్సవాలు జరుపుకొంటామంటామే కానీ, ఎవరు ఏమన్నా లంచాలు ఇవ్వము,కనీస అవసరాల కోసం ఉద్యమిస్తాము అని యువత అంటున్నదా? పైగా మీడియా కూడా ఇలాంటి వార్తలకు ఇస్తున్నంత ప్రచారం మనిషి కనీస అవసరాలకై ఉద్యమిస్తున్న వారికి ప్రచారం కల్పిస్తోందా?లేదు. వారికి సంచలన వార్తలు, సున్నితాంశాలపై ప్రజలను ఆడుకోవడం తద్వారా తమ సర్క్యులేషన్ పెంచుకోవడం,డబ్బు సంపాదించడం ఇవే కావాలి.
కళాశాలల్లో ర్యాగింగ్ చేస్తారు. సాటి విద్యార్థులనే బాధ పెడతారు. ఇలాంటివారా దేశానికి భవిష్యత్తు? వీరా దేశాన్ని అభివృద్ధిపథములో నడిపేవారు?
ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. సంఘం బాగుంటేనే అందరమూ బాగుంటాము.
ఒక మదర్థెరెసా, ఒక వివేకానంద, ఒక గాంధీజీ, ఒక అబ్దుల్కలాం, భగత్సింగ్, సుభాష్ చంద్రబోస్,దేశ సైనికుడు వీరు నిజముగా యువతకు ఆదర్శముగా ఉండాలి.
హక్కుల కోసం పోరాడుతూ బాధ్యతలను విస్మరించడము దేశపతనానికే దారితీస్తుంది. మనిషి కనీస అవసరాలు తీర్చగలిగిన రోజు, ఏ ఒక్కరూ ఆకలితో చనిపోని రోజు ఆ రోజుకై పోరాడదాం.
గమనిక : ఇక్కడ నేను అందరినీ ఉద్దేశించి వ్రాయలేదు.
Thursday, February 12, 2009
షిర్డి సాయిబాబా గారు మరణించి తిరిగి మూడు రోజుల తర్వాత ఎందుకు లేవవలసివచ్చింది?
సాయిబాబా గారు మూడు రోజుల తర్వాత తిరిగి మరణించి లేచినప్పుడు సాయిబాబా గారే స్వయముగా చెప్పినది.
"నేను అల్లా దగ్గరికి వెల్లి ఓ దేవా నేను ఇక జన్మ చాలించి మీదగ్గరికి వచ్చేద్దామని అనుకుంటున్నానని అన్నాను.కాని అల్లా ఏమన్నాడంటే సాయీ!గదాధరుడు అనే మహాత్ముడు కూడా చాలారోజులనుండి నా దగ్గరకు వస్తానని వేడుకుంటున్నాడు.భూలోకంలో అతని కార్యం ముగిసినది.నీ కార్యం ఇంకా ఉన్నది.అందువలన నీవు తిరిగి భూలోకానికి వెళ్ళు.గధాదరుడు నా దగ్గరికి వస్తాడు"అన్నాడు.
ఇక్కడ గధాదరుడు అంటే వేరెవరోకాదు శ్రీరామకృష్ణపరమహంస గారు.సాయిబాబా గారు అర్దరాత్రి ఒంటి గంటకు తిరిగిలేచారు.సరిగా అదే సమయంలో అదే రోజు శ్రీరామకృష్ణపరమహంస తన దేహం చాలించారు.
బ్లాగరుల సమావేశ విశేషాలు ఎవరూ వ్రాయలేదేమి?
Wednesday, February 11, 2009
స్వామి వివేకానందుని జీవితంలో మనకు తెలియని వింత
యువతకు స్పూర్తి దాయకుడైన వివేకానందుడు అందరికీ ఆదర్శమే. అతను ఎన్నో అధ్యాత్మిక అనుభవాలు చివరికి అత్యున్నతమైన అద్వైత స్థితిని కూడా పొందాడు. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. అదేమిటంటే ఇంత మహానుభావునికి సిద్ధులు అనగా అతీతశక్తులు ఉండవా అని. ఉన్నాయి. కాని అతను ఎప్పుడూ వాటిని బహిరంగముగా ప్రదర్శించలేదు.ఇప్పుడు శ్రీ పరమహంస యోగానంద గారి గురించి చూద్దాం.
స్వామి పరమహంస యోగానంద క్రియాయోగమును భారత మరియు అమెరికా,ఇంగ్లండు లలో వ్యాప్తి చేసిన ఒక యోగి. ఇతను రచించిన ఆత్మకథ పేరు "ఒక యోగి ఆత్మకథ". ఈ పుస్తకం చాలా ప్రచారం పొందింది.ఈ పుస్తకమును అనేక అమెరికా విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశముగా పెట్టారు. ఈ పుస్తకములోనే మనకు తెలియని వివేకానందుని అతీత శక్తి గురించి ఉంది.సరే ఆ సంఘటన చూద్దాం.
####################################################################
పరమహంస యోగానంద గారు రెండవ సారి అమెరికా వెళ్ళినప్పుడు తన పాశ్చాత్య శిష్యుల కోసం ఎన్నో కానుకలు తీసుకెళ్ళారు.
అక్కడ అందరికీ కానుకలు ఇస్తున్నారు. ఒక శిష్యునికి ఒక వెండి కప్పు బహుమానముగా ఇచ్చారు.ఈ శిష్యుడు యోగానందుల కంటే వయసులో పెద్దవాడు. అప్పుడు ఆ శిష్యుడు నిశ్చేష్టుడై నోట మాట రాక ఒక మూల ఏడుస్తూ కూర్చుండిపోయాడు. యోగానంద గారు అది గమనించి అప్పటికి ఏమీ అనకుండా చివరలో ఏకాంతముగా ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ శిష్యుడు అవి ఆనందభాష్పాలు అని చెప్పాడు. యోగానంద గారు కారణం అడిగారు.
అప్పుడు ఆ శిష్యుడు తన చిన్ననాటి సంఘటన గురించి చెప్పాడు. అతని చిన్నతనంలో ఒకసారి అతను నీళ్ళల్లో మునిగిపోబోతూ రక్షించండని అరవసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి గాలిలో సూర్యకాంతివెలుగుతో ప్రత్యక్షమై "లే" అన్నాడు. ఈ శిష్యుడు ఎలాగో బయట పడ్డాడు. కొన్ని రోజులకు ఆ విషయం మరిచిపోయాడు.
తర్వాత చికాగోలో విశ్వమతమహాసభ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి లోపలికి పోవడం చూసి ఈ అబ్బాయి నిశ్చేష్టుడై తన తల్లితో "అమ్మా! చిన్నప్పుడు నాకు గాలిలో కనిపించిన వ్యక్తి అతనే" అంటూ వడివడిగా లోనికి ప్రవేశించారు. ఆ వ్యక్తే స్వామి వివేకానంద. వివేకానందులు ఈ అబ్బాయిని చూడ్డంతోనే నవ్వుతూ " నీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు" అన్నారు.ఈ అబ్బాయి ఆనందభాష్పాలు రాలుస్తూ శిష్యునిగా చేర్చుకోమన్నాడు. అందుకు వివేకానందులు "నీ గురువు నేను కాదు. అతను మరో పాతిక సంవత్సరాల తర్వాత వస్తాడు. దానికి గుర్తు అతడు నీకు ఒక "వెండి కప్పు"ను బహుమానముగా ఇస్తాడు" అన్నాడు.
వివేకానందులకు తనను శిష్యునిగా చేసుకోవడం ఇష్టములేక ఇలా అంటున్నాడని బాలుడు అనుకొన్నాడు. కాని ఇప్పుడు అతని భవిష్యవాణి ఇలా జరగడం చూసి ఆనంద భాష్పాలు రాల్చాడు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వమత మహాసభ జరిగినది 1893 సెప్టెంబరులో. యోగానంద గారు పుట్టినది 1893 జనవరి 5 న.
####################################################################
వివేకానందులు సిద్ధులను అనగా మహిమలను అసహ్యించుకొనేవారు. అందువలన అత్యంత అవసర పరిస్థితులలోనే తన శక్తులను ఉపయోగించారు. పైన పేర్కొన్న మానవాతీతశక్తి గురించి కూడా స్వామి వివేకానందులు ఎవరికీ స్వయముగా చెప్పలేదు.అందువలనే వివేకానందులు స్థాపించిన శ్రీ రామకృష్ణ మఠం వారి పుస్తకాలలో ఎక్కడా ఈ విశేషముగాని మరే ఇలాంటి విశేషాలు కాని పేర్కొనబడలేదు.
Monday, February 9, 2009
శ్రీ భగవద్గీతలోని కర్మ,వికర్మ,అకర్మ లకు వివరణలు
కర్మ: కర్మ అనగా సాధారణముగా పని అని అర్థము.ఈ పని ఏవిధముగా ఉండవలనంటే లోకమునకు విరుద్ధముగా ఉండకుండా అనగా లోకహానికి కారణము కాకుండా ఉండాలి. మనము కర్మలను మనఃపూర్వకముగా చేయాలి.కాని వాటి ఫలితముపై ఆసక్తి చూపరాదని భగవద్గీతలో భగవంతుడు అంటాడు. కర్మ కోసమే కర్మ,ప్రేమ కోసమే ప్రేమ ఉండాలి.
వికర్మ: అనగా చేయకూడని కర్మ(పని). అనగా లోకహితము కాని పనులు.
అకర్మ: అకర్మ అనగా పనిచేయకుండా ఉండడము అనేది సామాన్య అర్థము. కాని అసలు అర్థము అది కాదు. అకర్మ అనగా కర్మ చేస్తున్నా మన మనసు ప్రశాంతముగా ఉండాలి. భగవద్గీతలో భగవానుడు దీనినే అత్యంత స్పష్టముగా చెప్పాడు. "ఎవరైతే అత్యంత కర్మ(పని) స్థితిలో ఉన్నా అతని మనసు అత్యంత ప్రశాంతముగా ఉంటుందో(అకర్మను చూస్తాడో), అలాగే అత్యంత ప్రశాంత స్థితిలో కూడా(అకర్మలో కూడా) తీవ్రమైన కర్మను చూస్తుంటాడో అతనే నిజముగా కర్మను తెలిసినవాడు.అతనే కర్మ యోగి."
దీనినే కొద్దిగా వివరముగా చూద్దాం.మీరు పూర్తిగా ట్రాఫిక్జాము లో ఇరుక్కుపోయారనుకోండి. చుట్టుప్రక్కల నుండి అందరూ హారన్లు మ్రోగిస్తున్నారు. ఎవరో గలాట పడుతున్నారు. అంతా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ మీ మనసు యొక్క ప్రశాంతతకు ఏ విధమైన భంగము కలగకుండా ఉండాలి.అంటే ఎవరూలేని ఏకాంత గుహలో మీ మనసు ఎలా నిశ్చల స్థితిలో ఉంటుందో అలా ఉండాలి.అనగా శరీరం అత్యంత కార్యనిర్వహణలో ఉన్నా మనసు అత్యంత ప్రశాంతముగా ఉండాలి.అదీ నిజమైన కర్మయోగి స్థితి.
అలాకాక ఏకాంతగుహలో ఉన్నా మనసు ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుంటూంటే అది నిజమైన కర్మ అనిపించుకోదు.
ఇక అకర్మ లో కర్మను చూడడము అంటే చుట్టూ జరుగుతున్న పనులను లేక జగద్వ్యాపారమును ఎటువంటి మనశ్చాంచల్యము లేకుండా ఒక సాక్షిగా చూడడము.
ఎవరైనా చెస్(చదరంగము) ఆడుతుంటే వారికి కూడా రాని మంచి ఎత్తులు ఊరకే చూసే మనకు వస్తుంటాయి. అలాగే మన ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నాయనే భావం మనలో కనుక ఉంటే మనం సాక్షిగా ఆ పని ఇంకా బాగా చేయగలము.
మీరు ఒకటి గమనించే ఉంటారు.పంకా(fan) అత్యంత వేగముగా తిరిగేటప్పుడు అసలు అది తిరగనట్టే నిశ్చలస్థితిలో ఉన్నట్టు కనపడుతుంది.ఇక్కడ తీవ్రకార్యపరత్వములో ఉన్నప్పటికీ ప్రశాంతముగా ఉన్నట్టే అనిపిస్తుంది.
దీనినే ఇంకా వివరముగా చూడాలంటే "కర్మయోగ రహస్యము" చూడండి.
ఉదాహరణలు:
మనము తిరుపతి నుండి రాత్రి బయలుదేరి ప్రొద్దున్నే హైదరాబాదుకు చేరుతాము. మనము బస్సు కానీ రైలుకానీ ఎక్కినా మనము నిద్రపోతాము. ప్రొద్దున్నే చేరుతాము. అక్కడ మనం చేసిన పని ఏమీ లేదు. ఆ వాహనమే మనలను తీసుకు వచ్చింది. కాని మనమే వచ్చామంటాము. ఇది అకర్మలో కర్మను చూడడం.
పిల్లవాడు బాగా అలసిపోయి ఏమీ తినకుండా రాత్రి పడుకున్నాడనుకొందాం. అమ్మ వాడిని లేపి అన్నం తినిపిస్తుంది. వాడు నిద్రలోనే తింటాడు. వాడికేమీ గుర్తుండదు. ప్రొద్దునలేచి రాత్రి నేను ఏమీ తినలేదు అంటాడు. దీనిని కర్మలో అకర్మను చూడడము అంటారు.
వీటిని కేవలం ఉదాహరణలుగా మాత్రమే తీసుకోండి.
అలాగే మన మనసు సదా భగవంతుని పాదచరణాలపైనే ఉంటూ మన శరీరం మాత్రం దాని పని అది చేస్తూ ఉండాలి. మన ఇంద్రియాలు వాటి పనులు అవి చేస్తున్నాయని,నేను ఏమీచేయడం లేదనే భావంలో మనం నెలకొని ఉండాలి.
Saturday, February 7, 2009
మా ఊరు కదిరి పట్టణము విశేషాలు


ఇన్నిరోజులుగానేను టపాలువ్రాస్తున్నామా కదిరిపట్టణముగురించివ్రాయకపోవడం నాకే ఆశ్చర్యముగా ఉంది. వికీపీడియా లో కదిరి గురించి వ్రాశాను.
మా ఊరి గురించి కొన్ని విశేషాలు.
కదిరి పట్టణము అనంతపురం జిల్లాలో ఉంది.
ఆంధ్ర రాష్ట్రములో తాలూకాలు ఉన్నప్పుడు కదిరి తాలూకా రాష్ట్రములోనే అతి పెద్ద తాలూకా.
రాష్ట్రములోని నవ నారసింహ క్షేత్రాలలో కదిరి ఒక నారసింహక్షేత్రము.ఇక్కడి నరసింహుని శ్రీలక్ష్మీనరసింహస్వామిఅంటారు. మరే ప్రాంతములో లేని విధముగా ఇక్కడ స్వామి వారి మూలవిరాట్టు ముందు భక్త ప్రహ్లాదుని విగ్రహంచేతులు జోడించుకొని స్వామిని శాంతపరుస్తునట్టు ఉంటుంది. నరసింహుని విగ్రహం హిరణ్యకశిపుని చీలుస్తున్నట్టుఉంటుంది. మూలవిరాట్టు స్వయంభూవిగ్రహము.
ఇక్కడి నరసింహస్వామి బెంగళూరు, కోలారు ప్రాంతాలలో చాలా మందికి ఇంటి దైవము. కదిరి లక్ష్మీనరసింహ స్వామిబ్రహ్మోత్సవాలు ఏటా వైభవముగా జరుగుతాయి. ముఖ్యముగా బ్రహ్మరథోత్సవం(తేరు) నాడు సుమారు 5 లక్షలమంది కి పైన పాల్గొంటారు. కర్ణాటక,తమిళనాడుల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
స్వామి వారికి కులమత భేధాలు లేవు. దీనికి ఋజువుగా స్వామి వారి తేరు(రథము) కదలవలనంటే కదిరికి రెండుకిలోమీటర్ల దూరంలోని కుటాగుల్ల గ్రామం నుండి బోయవాల్లు వస్తేనే వీలవుతుంది. వారు రాకుంటే ఎన్ని లక్షలమందిలాగినా,తోసినా కదలదు. మరియు సంక్రాంతి మరుసటి రోజు కనుమ నాడు స్వామి వారి రథము హరిజనల ఇళ్ళల్లోకివెళ్తుంది.
గుడి వెనకాల ఒక కోనేరు ఉంది.దానిని భృగుతీర్థము అంటారు. ఇంకా అగస్థ్యతీర్థము,కుంతితీర్థము, వ్యాసతీర్థముమొదలగు 12 తీర్థాలు ఉన్నాయి.
ఇక గుడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో కదిరికొండ ఉంది.ఈ కొండను లఘువమ్మకొండ మరియు అలివేలుమగమ్మకొండ అని అంటారు. దీని క్రింది భాగాన సీతాదేవి సమేత రాముడి గుడి ఉంది. కొండల నరసింహ స్వామి గుడి కూడాఉంది. కొండపై గుహను సప్తర్షుల గుహ అంటారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రిందట సప్తర్షుల విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు మూడు విగ్రహాలు మాత్రం ఉన్నాయి.
ఇక కదిరి చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాల గురించి చెప్పుకోవాలంటే కదిరికి 10 కిలోమీటర్ల దూరంలో మహాకవిమరియు యోగివేమన పరమపదించిన ప్రదేశము కటారుపల్లి ఉంది. అక్కడ వేమన గారి సమాధి ఉంది. పర్యాటకశాఖవారు ఈ ప్రదేశాన్ని బాగా అభివృద్ధి చేశారు.
కదిరి కి 26 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే విస్తీర్ణములో అతి పెద్దదైన మర్రిచెట్టు (తిమ్మమ్మ మర్రిమాను) ఉంది.దీనివిస్తీర్ణము 5 ఎకారాల పైనే ఉంటుంది.
కదిరి పట్టణము జిల్లా కేంద్రమైన అనంతపురానికి 90 కిలోమీటర్ల దూరంలో అనంతపురం నుండి చెన్నైకు వెళ్ళే జాతీయరహదారిలో ఉంది. బెంగళూరుకు 175 కిలోమీటర్ల దూరంలో, ముఖ్యమంత్రి గారి పులివెందులకు 45 కిలోమీటర్లదూరంలోణు, పుట్టపర్తికి 42 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. అన్ని చోట్ల నుండి బస్సు మార్గము ఉంది. బ్రాడ్గేజ్ రైలుమార్గం వేస్తున్నారు.
Friday, February 6, 2009
స్త్రీలకు గౌరవం ఇవ్వడం పై మన వేదాలు,స్మృతులు ఏమంటున్నాయి?
1."యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః
యత్రైతాస్తునపూజ్యన్తే సర్వాస్తత్రా ఫలాఃక్రియాః" (మనుస్మృతి 3-56)
స్త్రీలు ఏ గృహమునందు పూజింపబడుచున్నారో ఆ గృహములందు దేవతలు క్రీడించుచున్నారు.అలా పూజింపబడనిచోట ఎన్ని మంచి పనులు చేసినా నిరుపయోగమే.
స్త్రీలు ఇంటిని ప్రకాశింపచేయు దీపములు,మరియు వారు సాక్షాత్ లక్ష్మీదేవుల స్వరూపమే. (మనుస్మృతి 9-26)
2."ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతం పితా,
సహస్రంతు పితౄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే." (మనుస్మృతి 2-145)
10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి, 1000 మంది తండ్రుల కంటే తల్లిపూజ్యురాలు.
3."పతితఃపితా పరిత్యాజ్యోమాతాతు పుత్రే నపతతి "(వసిష్ఠ 13-15)
పతితుడైన తండ్రిని వదిలివేయచ్చు గాని తల్లి ఒకవేళ పతితురాలైనను వదిలివేయరాదు.
4."పతిర్జాయాం సంప్రవిశతి గర్భోభూత్వేహమాతరం
తస్యాం పునర్నవోభూత్వా నవమేమాసిజాయతె.
తజ్జాయా జాయాభవతియ దస్యాం జాయతే పునః" (ఐతరేయ బ్రాహ్మణం 7-3-13)
భర్త భార్యలో ప్రవేశించుచున్నాడు. భార్యనే తల్లిగా చేసుకొనుచున్నాడు. ఎలాగంటే తొమ్మిదిమాసముల పిదపభార్యయందు తిరిగి పుట్టుచున్నాడు.
కాబట్టి భార్య కూడా తల్లిలా పూజ్యురాలే.
5."పత్నీ పారీణహ్యస్యేశే" (తైత్తిరీయ 6-2-1-1)
ఇంటిలోని ధనమునకు యజమాని స్త్రీయే.
మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులకు వేదాలు దైవ స్థానాలను కల్పించినా, బ్రహ్మదేవుడు అంతటా తానేఉండాలన్న భావంతో తనకు బదులుగా తల్లిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నా ఈనాటి మనుషులకు మాత్రంఇవేమీ పట్టవు. భార్యను తప్ప మిగతా స్త్రీలను అందరినీ తల్లిగా చూడాలని అన్నా ఎందరు పాటిస్తున్నారు చెప్పండి.
Thursday, February 5, 2009
ఎన్ని రోజులు ఈ అనుకరణ ? సొంతమంటూ ఏదీ లేదా? ఉన్నా పాటించరా?
Wednesday, February 4, 2009
ఋషులు చెప్పిన కలియుగ లక్షణాలు
"కలికాలమున రోజురోజుకు సత్యము,ధర్మము,దయ,క్షమ,ఆయువు మరియు జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి.
ధనవంతుడే ఆచారవంతుడు,గుణవంతుడు,ధర్మపరుడు,న్యాయపరుడు మరియు సర్వనియంత అవుతాడు.( ప్రస్తుతం ధనమున్న అమెరికా దేశం ఇలా ఉంది.)
పెండ్లిండ్లలో కులం,శీలము,యోగ్యత చూడరు. ప్రేమవివాహాలు యువతీయువకులు తమకు నచ్చిన వారినే వివాహమాడతారు(ప్రేమవివాహాలు) .కాని ఆ ప్రేమలలో నిజాయితీపాలు చాలా తక్కువగా ఉంటుంది.
మోసం చేయగలవారు ,అబద్దాలు చెప్పువారు వ్యవహారదక్షులు అవుతారు.
బ్రాహ్మణత్వం బ్రహ్మజ్ఞానంచేకాక జందెము వలన వ్యక్తము అవుతుంది.( బ్రాహ్మణుడు అంటే ఎవరనేది ఇంత స్పష్టముగా చెప్పినా ఈ విషయంపై మనవారి వాదాలకు అంతులేకుండాపోయింది ).
వాగినవాడు పండితుడు , మంచిగా ఉండకపోవడమే మంచితనము, కలిసిఉండడమే పెళ్ళిగా పరిగణింపబడతాయి.
దూరముగా ఉన్న మురికిగుంటయే పుణ్యతీర్థముగా,వెంట్రుకలు పెంచుకొనుట అందముగా, కడుపు
నింపుకొనుట పురుషార్థముగా, కుటుంబపోషణే ఘనకార్యముగా, కీర్తిని కోరుకొనుటే ధర్మాచరణగా
పరిగణిస్తారు.
"కలౌ వేంకటనాయకః" అంటే కలియుగానికి శ్రీవేంకటేశ్వరస్వామియే భగవంతుడు.ఈ విషయం ఎంత అక్షరసత్యమో మనకు తెలియంది కాదు.
"సంఘేశక్తిః కలియుగౌ" అంటే కలియుగంలో సంఘ శక్తిదే కాలం."
ఇదండీ మన ఋషులు చెప్పిన కొన్ని లక్షణాలు.ఇంకా చాలా ఉన్నాయి. కాని మన ఋషుల మంచితనం,దీర్ఘదృష్టి గురించి చెప్పడానికి వ్రాసిన టపా కాబట్టి అన్నీ వ్రాయడం లేదు. ఇవన్నీ నిజాలు కావడం మనము గమనిస్తూనే ఉన్నాము కదా.
Tuesday, February 3, 2009
ఋషులు అంటే సమాజహితం వదిలి స్వార్థం చూసుకొనేవారా?
మానవజీవితంలోని ప్రతి అంశం గురించి భారతీయ ఋషులు,మునులు చేసినంత అధ్యయనం,పరిశోధన,పరిశ్రమ మరెవ్వరూ చేయలేదు.ఇది సత్యం.
ఋషి మానవాభ్యుదయం కోసం సంసారాన్ని వదిలినవాడు.ఇతర విషయాలు అతనికి తెలియదు. పరిశోధనయే అతని లక్ష్యము.ప్రాపంచిక విషయాలు అతనికి తెలియదు. అంతటి దీక్ష అతడిది.అదే అతని తపస్సు.
అతనిని ఎవరూ నియమించలేదు. ఎవరూ జీతభత్యాలు ఇవ్వలేదు.స్వచ్ఛందముగా పరిశోధనకు పూనుకొన్నవాడు.
ఋషి కోరిందేమీ లేదు.కేవలం జగత్కల్యాణం, మానవజీవితం సుఖమయం,శాంతిమయం కావడం ఒక్కటే ఋషి ఆశయం.
ఇదీ అతని లక్ష్యం.ఈరోజు మనం ఈ మాత్రం జీవిస్తున్నామంటే కారణం మహర్షుల కృషి,తపస్సే కారణం.
పాశ్చాత్యుల భాషలో శాస్త్రవేత్త అంటే జీతగాడు,వ్యాపారి. వారు కనుగొంటున్న,కనుగొన్న వాటి వలన కల్గుతున్న సుఖం తక్కువ.దుఃఖమే ఎక్కువ అన్న విషయం అందరికీ తెలుసు.
ఋషులు తమ తపస్సు ద్వారా కనుగొన్న విషయాలు మనిషి సుఖజీవితానికి ఎంతగా ఉపయోగపడతాయో శాంతియుత జీవితానికి కూడా అలానే ఉపయోగపడతాయి.ఇక్కడే మర్మము ఉంది. నేటి శాస్త్రవేత్తలు కనుగొంటున్న విషయాలతో మనం సుఖ(Luxury)జీవితం గడపగలుగుతున్నాము కానీ శాంతియుతజీవితం గడపడంలేదన్న విషయం మనకు తెలుసు.
ఋషులు కేవలం ఆధ్యాత్మిక విషయాలే కనుగొన్నారా అంటే కాదనే అనాలి. పరమాణువు(కణము)ను కనుగొన్న కణాదుడు, గణితములో సంచలనాలు సృష్టించిన భాస్కరాచార్యుడు,ఆర్యభటుడు మరియు శస్త్రచికిత్సా పితామహుడు సుశ్రుతుడు,వైద్యశాస్త్రవేత్త చరకుడు , వైమానికశాస్త్రం రచించిన మహర్షి భరధ్వాజుడు వీరు కూడా ఋషులే అన్న విషయం మరిచిపోరాదు.వీరు ఆధ్యాత్మికముగా కూడా ఎంతో పురోభివృద్ధి సాధించినవారు.
ఇప్పటికైనా మనం ఋషుల గొప్పతనం గ్రహించి, వారి మీద గల దురభిప్రాయాలను తొలగించుకోవడం సమాజానికి చాలా మంచిది.
Friday, January 30, 2009
ఆర్థిక మాంద్యం(rescission) అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడింది? దయచేసి వివరించండి
దయచేసి మన బ్లాగు మిత్రులకు ఎవరికైనా ఈ విషయం పై స్పష్టమైన అవగాహన ఉంటే ఈ టపాకు వ్యాఖ్య రూపంలో కాని లేక తమ బ్లాగు లో టపా రూపం లో కాని వివరణ ఇవ్వండి. తమ బ్లాగు టపా రూపంలో ఇస్తే మాత్రం ఆ టపా లంకె(Link) ఇవ్వడం మాత్రం మరిచిపోకండి.
Thursday, January 29, 2009
తెలుగు పునర్వైభవం అంటే ఆంగ్లం అసలు వద్దని కాదు
ఒక వ్యక్తి మానసికముగా కానీ, సామాజికముగా కానీ అభివృద్ధి చెందాలంటే మాతృభాష లోనే ఆ వ్యక్తి యొక్క ప్రాథమికవిద్య ఉండాలనేది ఎందరో మేధావులు,అనుభవశీలురు చెబుతున్న విషయం. ప్రాథమిక దశను దాటిన తర్వాత అతను ఏభాషలో తన విద్యను అభ్యసించినా అతను నెగ్గుకు రాగలడు.అప్పుడు ఆ వ్యక్తి ఆంగ్లం అభ్యసించినా చాలా సులభముగాపైకి రాగలడు.
మనం తెలుగును ప్రేమించడం అంటే ఆంగ్లాన్ని ద్వేషించడం అని అర్థం కాదు అన్న విషయాన్ని కొందరు కడుపుకాలుతున్న బ్లాగ్మిత్రులు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరూ వద్దనలేదు ఆంగ్లం చదవద్దని. తెలుగును మాత్రం మరవద్దు, చిన్నచూపును చూడవద్దు అని మాత్రమే మేము అంటున్నాము. అవసరమైన చోట ఆంగ్లాన్ని వాడవద్దని ఎవరూవద్దనడం లేదు. కాని నిత్యజీవితం లో తెలుగు వాడకాన్ని ప్రోత్సహిద్దాం, మనము కూడా అలానే పాటిద్దాం అనిఅంటున్నాము.
ప్రపంచం కుగ్రామం ఐపోతోంది కాబట్టి అందరినీ కలిపే భాష ఆంగ్లం అని అనవచ్చు.తప్పు లేదు. మనం మన రాష్ట్రం,దేశంకానివారితో ఆంగ్లం లోనే మాట్లాడుదాం. దానికోసం ఆంగ్లం నేర్చుకొందాం. మన ఉన్నతవిద్యలు కావాలంటే ఆంగ్లంలోనేచదువుదాం. కాని మన పిల్లలను తమ ప్రాథమిక విద్యను తెలుగులోనే చదివిద్దాం ,ఇప్పటి పరిస్థితుల ప్రకారం వారిఉన్నతవిద్యలను ఆంగ్లంలో చదివిద్దాం. కాని మన తెలుగుభాష ఔన్నత్యాన్ని ,మధురత్వాన్ని ఖచ్చితముగాకాపాడుకోవలసిన అవసరం లేదంటారా?
మనవారు ఆంగ్లంలో మాట్లాడడమే గొప్ప అని తలుస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి తెలుగు మన ఆత్మ ,ఆంగ్లంకేవలం మనసు లాంటిది మాత్రమే. మనసు బయటికి శక్తివంతమే కానీ ఆత్మ లేని మనసు ఉనికి లేనిది.
మనం ఆంగ్లం మాట్లాడేటప్పుడు మన మనసు తన భావాలను మొదట తెలుగు రూపం లోనే సృష్టించి తర్వాత ఆభావాలను ఆంగ్లంలోనికి తర్జుమా చేసి బయటకు పంపుతుంది. ఎంతో సాధన తర్వాత మాత్రమే ఈ పని లేకుండాఒకేసారి ఆంగ్లంలో మాట్లాడగలం. ఈ విధముగా తెలుగు (మాతృభాష) సహాయంతో మాత్రమే మనం ఆంగ్లం నేర్చుకొనిబయట ఎక్కడైనా బ్రతకగలం. ఇంత సేవ చేసిన మన మాతృభాషకు మనం ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నామా? ఓ! కడుపు కాలుతున్న బ్లాగ్మిత్రులారా గుండె పై చేయి పెట్టుకొని చెప్పండి.
మన భాష రానివారితో మనం ఆంగ్లంలోనే మాట్లాడుదాం.కాని మనలో మనం తెలుగులోనే మాట్లాడుకొందాం.మనలోమనం ఆంగ్లంలో మాట్లాడుకోవలసిన దౌర్భాగ్యం మనకు ఎందుకు? మన భాష అంత గొడ్డుపోయిందా?
ఒక పోతన,ఒక వేమన, ఒక అన్నమాచార్యుడు లాంటి తెలుగు వారు గర్వించే మహానుభావులు పుట్టిన రాష్ట్రం మనది. పోతన గారి పద్యాలలో మధురత్వం,వేమన పద్యాలలోని సమాజంలో ఎలా ఉండాలి అనే విషయం మరియుఅన్నమాచార్యుల కీర్తనలలోని భక్తి భావం మన తర్వాత తరాలవారికి కూడా అందించవలసిన భాధ్యత ఉంది.అందుకోసంకూడా తెలుగును రక్షించవలసిన అవసరం మన పై ఉంది.
ఒక మనిషి యొక్క సంస్కృతిని,సంస్కారాన్ని అతని వేష"భాష"లే తెల్పుతాయి అనడం మనకు తెలుసు.మనలో మనంకూడా ఆంగ్లం మాట్లాడుకుంటే,మన పిల్లలకు తెలుగుపై రుచి ఎలా కల్గుతుంది? మనకంటూ ఒక సొంతభాషనుకోల్పోయినప్పుడు ఇతరులు మాత్రం మనలను ఎవరు గౌరవిస్తారు?
దీనికి ఒక ఉదాహరణగా మన రాజధానిలో కూకట్పల్లి లో "మెట్రో" అనే ఒక పెద్ద వాణిజ్యసముదాయం ఉంది. వారుమొదట దానిని ప్రారంభించినప్పుడు ఆ భవనం పైన తెలుగులో పెద్ద అక్షరాలతో "మెట్రో" అని ఒక నామఫలకం, దాని క్రిందఆంగ్లంలో ఒక నామఫలకం ఏర్ఫాటు చేసారు. ఈ ముచ్చట ఎంతోకాలం సాగలేదు. వారికి మన భాషాభిమానం ఏ పాటిదోతెలిసిపోయి కొన్నిరోజులలోనే రెండు ఫలకాలనూ ఆంగ్లంలోనికే మార్చివేసారు.ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనగడ్డపైనే మన భాషకు ఇలాంటి అవమానం జరుగుతోంది.
వారిని ఆంగ్లం వ్రాయవద్దని అనలేదే, తెలుగులో కూడ వ్రాయమని అడుగుతున్నాం.
ఇక మన వారే మన రోడ్డు రవాణా సంస్థ వారే తమ గరుడ,అంతర రాష్ట్ర బస్సులపై తెలుగును మొత్తం తీసివేసి అంతాఆంగ్లమే వాడుతుంటే మన రాష్ట్రం లోనికి వచ్చి బ్రతికే ఇతరులకు మన భాషకు ఏ మాత్రం గౌరవం ఇస్తారు చెప్పండి?
ప్రస్తుతం ప్రపంచంలో చలామణి అవుతున్న ఏ భాషా స్వచ్ఛమైనది కాదు. ప్రతి భాషా ఇతర భాషల నుండి కొన్నిపదాలను కలుపుకొంటుంది.తెలుగు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాని ఇతర భాషలు తమ భాషలో ఇతరభాషలకు చెందిన పదాలకు సమాన పదాలు లేకుంటేనో లేక అది ఒక క్రొత్త పదం అయితేనో ఆ పదాన్ని యధాతథంగాతన భాష లోనికి తీసుకొంటాయి.ఉంటే కనుక ఉన్న పదాలనే వాడుతాయి. కాని మన తెలుగు భాష మాట్లాడేవారుతెలుగులో ఆంగ్లమో లేక మరే ఇతర భాషలోని పదాలకు తెలుగులో సమానార్థక పదాలున్నా అవి వాడరు.నాచిన్నప్పుడు నువ్వు ఏ తరగతి చదువుతున్నావు అంటే ఫలానా తరగతి చదువుతున్నాను అని పిల్లలు సమాధానాలుఇచ్చేవారు. కాని ఇప్పుడు తరగతి అనే పదాన్ని పెద్దలే వాడడం లేదు ఆ స్థానే "క్లాస్" అనే ఆంగ్ల పదం చేరిపోయింది. పిల్లలు కూడా మేము ఫస్ట్ స్టాండర్డ్ అనో లేక ఫస్ట్ క్లాస్ అనో చదువుతున్నామని అంటున్నారు. ఇలా మూలం దగ్గరేతెలుగును వాడకపోతే ఎలా?
చివరిగా ఒకమాట.మాతృభాష అనేది ఒక ఇంటికి కాని మరే నిర్మాణానికి కాని వేసే పునాది వంటిది. పునాది లేనినిర్మాణం ఎలా నిలబడదో మాతృభాష పునాది లేని జీవితం అలా నిలబడదు.పునాది వేసిన తర్వాతే దాని పై ఇతరనిర్మాణం ఎలా గావించగలమో అలానే మాతృభాష పునాది పైనే మనిషి ఉన్నతి నిర్ణయించబడుతుంది.
Tuesday, January 27, 2009
కొన్ని ఆచారాలు - వాటి మూలాలు
ముగ్గులు:
దుష్ట శక్తులు ఇళ్ళలోకి ప్రవేశించకుండా ఉండటం అని మనకు తెలిసిన కారణము.కానీ మన పూర్వీకుల ఉద్దేశ్యము చీమల లాంటి వాటికి ఆహారము కొరకు.అందుకే ముగ్గుపిండి ని మిగిలిపొయిన బియ్యపుపిండి తో ఎలాంటి రసాయనాలు కలపకుండా తయారు చేసి ముగ్గులువేయాలి.అంతేకాని బాగాకనిపించాలని సుద్ద ముక్కలతో లేక పెయింట్ లతో వేయడము ముగ్గుల పరమార్థాన్ని మరిచిపోవడమే అవుతుంది.
ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపకూడదంటారు.ఎందుకు?:
సైంటిఫిక్ కారణము ఏమంటే ఇలా చేయడము వలన దీర్ఘకాలము లో పక్షవాతము వచ్చే అవకాశము చాలా ఎక్కువ.అంతేకాక ఇలా చేయడము వలన ఎదురుగా కూర్చున్నవారికి కాలు చూపిస్తున్నట్టు అవుతుంది.
పెళ్ళిలో జీలకర్ర, బెల్లము తలపైన పెట్టుకోవడము:
పెళ్ళి అనగానే వధూవరుల మనసు ఎన్నో మానసిక మార్పులకు లోనవుతుంది.ముఖ్యముగా పెళ్ళికొడుకు లెక పెళ్ళికూతురును చేసినప్పటినుండి వారిద్దరికీ హడావుడి మొదలవుతుంది.పెళ్ళిపీటలపైన కూర్చున్నప్పుడు వారి శరీరాలు మరియు మనసు చాలా అలసిపోయుంటాయి. జీలకర్ర,బెల్లము కలిపిన మిశ్రమము చాలా శీతలకారి కనుక వారి తలలపైన పెట్టుకుంటారు.దీనివలన ముఖ్యముగా వారి శరీరాలు మరియు మనసు శాంతము పొందుతాయి.
కమెండోల్లారా మీకు మా తల వంచి పాదాభివందనాలు చేస్తున్నాము
కార్యక్రమం చలోక్తులు,హృదయం హత్తుకొనే సన్నివేశాలతో సాగిపోయింది.
కొన్ని సన్నివేశాలు:
1.ఇది మనకు తెలియని విషయం.నారీమన్ ప్రాంతంలో నివశిస్తున్న వ్యక్తి చెప్పినది. నారీమన్ హోటల్ పైకి హెలికాప్టర్ లో నుండి తాడు సహాయంతో ఒక కమెండో దిగుతున్నప్పుడు పొరపాటున జారి క్రిందపడ్డాడు. అప్పుడు అతని కాలు బెణికింది. కాని ఆ విషయం అతను పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయాడు.
2.ఒక సారి ఒక ఉగ్రవాది విసిరిన బాంబు కమెండో ప్రక్కనే పడింది. ఈ విషయం పసిగట్టిన కమెండో ముందుగానే నేల పై పడుకోవడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు.వెంటనే అతను పైకి లేచి ఉగ్రవాది వైపు పరిహాసపూర్వకముగా నవ్వాడు. అంత కఠిన పరిస్థితులలో కూడా ఆ కమెండో ప్రశాంతమైన చిరునవ్వును కోల్పోలేదు.
3. ఒక కమెండో(నవ్వుతూ) ధోనీ తో :
మీరు మొన్న ఒక వన్డేలో కీపింగ్ చేస్తూ "గంట వాయించు" అని అంటున్నారు.ఎందుకు?
ధోనీ: అప్పుడు ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ ఇయాన్ బెల్ ఆడుతున్నాడు. అతని పేరులో "బెల్" ఉండడం వలన మన హిందీ భాషలో బౌలర్కు అతని గంట వాయించమని చెప్పాను.(అందరిలో నవ్వులు)
4.ధోనీ కమెండోలతో : చివరి బంతికి 10 పరుగులు ఎలా కొట్టగలము ?
ఎవరూ జవాబు ఇవ్వలేదు.
ధోనీ: మమూలుగా ఎవరూ కొట్టలేరు.అది నోబాల్ ఐతే తప్ప.కాని అది నోబాల్ కాకున్నా అలా కొట్టగల వ్యక్తి ఒక్కడే ఉన్నాడు.అతను రజనీ కాంత్.అతను కనుక కొడితే బంతి రెండు ముక్కలై ఒక ముక్క బౌండరీకి,ఇంకో ముక్క సిక్స్ కు వెళ్తుంది.ఒక వేళ 24 పరుగులు కొట్టవలసి వస్తే బంతి ఆరు ముక్కలై అన్ని ముక్కలు బౌండరీకి వెళ్తాయి.(అందరిలో నవ్వులు)
5.ఒక కమెండో ఉద్విగ్నతతో :
మేము అక్కడ పోరాడుతుంటే పార్లమెంట్ లో కూర్చున్న కొన్ని ...... ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయి.
ఇంకొన్ని విశేషాలు తర్వాత
Monday, January 26, 2009
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఓ స్వతంత్ర సమరయోధులారా!
మిమ్ములను విస్మరించాము, మీ అడుగుజాడలను విస్మరించాము,
మీ పోరాటాల ఫలమైన స్వాతంత్రమును దుర్వినియోగ పరుస్తున్నాము,
స్వతతంత్ర దినమని, గణతంత్ర దినమని మా చంకలు గుద్దుకొంటున్నాము,
ఐనా సుందర భవిష్యత్తులో మీ త్యాగాలను వృథా పోనివ్వమని ఆశిస్తూ
-ఒక భారతీయుడు
ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకొంటూ
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Sunday, January 25, 2009
ఆచరణ లేని ఆలోచనలేల?( తెలుగు భాష)
Friday, January 23, 2009
తెలుగు భాష పట్ల ప్రజలలో అభిమానం పెంపొందేందుకు ఏ చర్యలు తీసుకొంటే బాగుంటుంది ? చర్చించండి.
Thursday, January 22, 2009
బ్లాగరులారా! స్పందించండి!
కార్యాచరణకు ఉపక్రమిద్దాం.
Wednesday, January 21, 2009
తెలుగు భాషను రక్షించుకొనే తరుణం వచ్చేసింది, ఇక ఆలస్యం వద్దు
ఈ సమయం లో నైతే ప్రభుత్వం కనీసం మన మాట ఐనా వింటుంది. అందుకు గాను మనం ఒక వినతి పత్రాన్ని తయారు చేసుకొందాము.అందులో ఉండాలి అని నేను అనుకొంటున్న అంశాలు
1.6 లేదా 7వ తరగతి వరకు నిర్బంధ తెలుగు మాధ్యమం ఉండాలి.ఆంగ్లం ఒక విషయం(subject ) మాత్రం గానే ఉండాలి.
2.ప్రభుత్వ వ్యవహారాలలోనూ, RTC లాంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనూ తెలుగు భాషకు సింహభాగం ఇవ్వాలి.
3.ప్రభుత్వ పథకాలకు తెలుగుదనం ఉట్టిపడే పేర్లు పెట్టాలి మరియు ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు లోనే ( తప్పనిసరి పరిస్థితులలో ఆంగ్లం లో కూడా) ఇవ్వాలి.
4.మన రాష్ట్రములో నడుపుతున్న ఆంగ్ల పాఠశాలలలో తెలుగు ఖచ్చితముగా భోధించాలి.
5.రాష్ట్రవ్యాప్తముగా ప్రతి సంవత్సరము తెలుగు పద్యాలు,వ్యాస రచన పోటీలు నిర్వహించాలి.
6.TV చానల్స్ లో కూడా తెలుగు భాషకు అత్యధిక ప్రాముఖ్యత నివ్వాలి.
7.అధికార భాషా సంఘానికి తెలుగుభాష అమలుపై పూర్తిగా అధికారాలివ్వాలి.తప్పనిసరి ఐతే తప్ప ప్రభుత్వం అధికారభాషా సంఘం వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు.
ఈ వినతిపత్రాన్ని తీసుకొని మన బ్లాగర్లు అందరు మరియు ఇంకా తెలుగుభాషా అభిమానులు అందరము ర్యాలీగా సచివాలయానికి వెళ్ళి ప్రభుత్వానికి అందజేద్దాము. ప్రభుత్వము ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా మన ఉద్యమము ప్రజలలో బాగా వ్యాప్తి చెందుతుంది.అలా వ్యాప్తి చెందిననాడు ప్రభుత్వము దిగరాక తప్పదు.
పైన పేర్కొన్న వినతిపత్రాన్ని అన్ని రాజకీయపార్టీ నాయకులకు ఇద్దాము.ఎవరైతే సానుకూలముగా స్పందిస్తారో వారికే ఓటు వేస్తామని చెబుదాము.
మన బ్లాగర్లలో మహానుభావులు,పండితులు మరియు అనుభవశీలురు ఉన్నారు.వీరందరికీ నా విన్నపము ఏమిటంటే పైన పేర్కొన్న నా ప్రతిపాదనకు ఏమైనా సవరణలు చేసి ఇంకా విషయాలను కలిపి మన ఉద్యమానికి కార్యరూపం గావించవలసింది గా కోరుకొంటున్నాను.పైన పేర్కొన్నవే అంతిమం కావు.పై పని వలన వచ్చే ఫలితం పైన మన తర్వాతి కార్యాచరణకు సిద్దం అవుదాము.
ఈ పనికి గాను ప్రాంత భేధము లేకుండా తెలంగాణా,రాయలసీమ,కోస్తా అన్ని ప్రాంతాల నుండి బ్లాగర్లు,భాషాభిమానులు నడుం కట్టవలసి ఉంటుంది.ఈ పని భాషకు సంబంధించినది. ప్రాంతమునకు సంబంధించినది కాదు.కుల,మత మరియు ప్రాంత భేధాలు లేకుండా మనము అందరము సంఘటితముగా ఉండి ఈ విషయంపై పోరాడాలి.
మంచిపనికి ముహూర్తాలు చూసుకోనవసరంలేదు.ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నిద్దాము.
తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం గారు,నల్లమోతు శ్రీధర్ గారు,వీవెన్ గారు,జ్యోతక్క,కత్తి మహేష్ కుమార్ గారు,లక్ష్మి గారు,"అమ్మఒడి" గారు,"దీప్తిధార" గారు, దుర్గేశ్వర్ గారు,నూర్భాషా గారు మొదలగు అనుభవశీలురకు మరియు అందరు బ్లాగర్లకు పేరుపేరునా నా విన్నపము.
Monday, January 12, 2009
Friday, January 2, 2009
మాజీ కేంద్రమంత్రి అంతూలే గారి నిజస్వరూపం
బయటపడిన కొన్ని సంభాషణలు:
"అగ్గి పెట్టండి,అగ్గి పెట్టండి" - పేలుళ్ళ తీవ్రతను పెంచవలసిందిగా ఆదేశాలు
"అలసిపోకుండా ఒకరొకరుగా దాడి చేస్తూ అప్పుడప్పుడు నిద్రపోతూ దాడులు కొనసాగించండి" - సుదీర్ఘ,ఉద్దేశ్యపూర్వక దాడుల కొరకు ఆదేశాలు
"అంతిమ క్షణాలు వచ్చేసాయి.నమాజు చేయండి.ఏమైనా సందేశము ఇవ్వాలనుకొంటున్నారా?" - కమెండోలు ఆపరేషన్ పూర్తి చేసే సమయంలో ఉగ్రవాదులకు వచ్చిన సందేశము
"కమీషనర్ను ఎవరైనా చంపేసారా?" - ఈ సందేశము ఆతృతగా అడిగారు.ఈ సందేశము ATF ముఖ్యనేత కర్కరే హత్యను ఉద్దేశించి ఆ హత్య జరిగిన విషయాన్ని రూఢి చేసుకొనుటకు అడిగినట్టు ఉంది.అతన్ని ప్రత్యేకము గా లక్ష్యము చేసుకొన్నారు.
అందరికీ తెల్సు మన మాజీ కేంద్ర మంత్రివర్యులు అంతూలే గారు చేసిన వ్యాఖ్యలు.ATF ప్రధానాధికారి హేమంత్ కర్కరే మృతిని మాలేగావ్ పేలుళ్ళకు లంకె పెడుతూ ఎవరో ముస్లిమేతరులు(ఆ ముస్లిమేతరులు ఎవరో కొత్తగా చెప్పనవసరం లేదనుకుంటాను) అతని హత్యకు కారణమని వ్యాఖ్యలు చేసాడు.ఎప్పుడెప్పుడు మతవిద్వేషాలు రెచ్చగొడదామా,లాభం పొందుదామా అని ఎదురుచూసే ఇలాంటి వెధవ రాజకీయనాయకులను కఠినముగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంతూలే గారి నిజస్వరూపం ఈ రోజు వచ్చిన పై వార్తతో బట్టబయలైంది.కేంద్ర ప్రభుత్వములో మైనారిటీ శాఖకు మంత్రిగా ఉంటూ ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మంత్రికి ఎలాంటి శిక్ష విధించినా పాపం ఉండదు.
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...
