తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, January 21, 2009

తెలుగు భాషను రక్షించుకొనే తరుణం వచ్చేసింది, ఇక ఆలస్యం వద్దు

ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. మనకు మంచి తరుణం వచ్చింది. అదే తెలుగు భాషను రక్షించుకునే సమయం,అందుకు గాను ప్రభుత్వాన్ని నిలదీసే సమయం.
ఈ సమయం లో నైతే ప్రభుత్వం కనీసం మన మాట ఐనా వింటుంది. అందుకు గాను మనం ఒక వినతి పత్రాన్ని తయారు చేసుకొందాము.అందులో ఉండాలి అని నేను అనుకొంటున్న అంశాలు
1.6 లేదా 7వ తరగతి వరకు నిర్బంధ తెలుగు మాధ్యమం ఉండాలి.ఆంగ్లం ఒక విషయం(subject ) మాత్రం గానే ఉండాలి.
2.ప్రభుత్వ వ్యవహారాలలోనూ, RTC లాంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనూ తెలుగు భాషకు సింహభాగం ఇవ్వాలి.
3.ప్రభుత్వ పథకాలకు తెలుగుదనం ఉట్టిపడే పేర్లు పెట్టాలి మరియు ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు లోనే ( తప్పనిసరి పరిస్థితులలో ఆంగ్లం లో కూడా) ఇవ్వాలి.
4.మన రాష్ట్రములో నడుపుతున్న ఆంగ్ల పాఠశాలలలో తెలుగు ఖచ్చితముగా భోధించాలి.
5.రాష్ట్రవ్యాప్తముగా ప్రతి సంవత్సరము తెలుగు పద్యాలు,వ్యాస రచన పోటీలు నిర్వహించాలి.
6.TV చానల్స్ లో కూడా తెలుగు భాషకు అత్యధిక ప్రాముఖ్యత నివ్వాలి.
7.అధికార భాషా సంఘానికి తెలుగుభాష అమలుపై పూర్తిగా అధికారాలివ్వాలి.తప్పనిసరి ఐతే తప్ప ప్రభుత్వం అధికారభాషా సంఘం వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు.

ఈ వినతిపత్రాన్ని తీసుకొని మన బ్లాగర్లు అందరు మరియు ఇంకా తెలుగుభాషా అభిమానులు అందరము ర్యాలీగా సచివాలయానికి వెళ్ళి ప్రభుత్వానికి అందజేద్దాము. ప్రభుత్వము ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా మన ఉద్యమము ప్రజలలో బాగా వ్యాప్తి చెందుతుంది.అలా వ్యాప్తి చెందిననాడు ప్రభుత్వము దిగరాక తప్పదు.

పైన పేర్కొన్న వినతిపత్రాన్ని అన్ని రాజకీయపార్టీ నాయకులకు ఇద్దాము.ఎవరైతే సానుకూలముగా స్పందిస్తారో వారికే ఓటు వేస్తామని చెబుదాము.
మన బ్లాగర్లలో మహానుభావులు,పండితులు మరియు అనుభవశీలురు ఉన్నారు.వీరందరికీ నా విన్నపము ఏమిటంటే పైన పేర్కొన్న నా ప్రతిపాదనకు ఏమైనా సవరణలు చేసి ఇంకా విషయాలను కలిపి మన ఉద్యమానికి కార్యరూపం గావించవలసింది గా కోరుకొంటున్నాను.పైన పేర్కొన్నవే అంతిమం కావు.పై పని వలన వచ్చే ఫలితం పైన మన తర్వాతి కార్యాచరణకు సిద్దం అవుదాము.
ఈ పనికి గాను ప్రాంత భేధము లేకుండా తెలంగాణా,రాయలసీమ,కోస్తా అన్ని ప్రాంతాల నుండి బ్లాగర్లు,భాషాభిమానులు నడుం కట్టవలసి ఉంటుంది.ఈ పని భాషకు సంబంధించినది. ప్రాంతమునకు సంబంధించినది కాదు.కుల,మత మరియు ప్రాంత భేధాలు లేకుండా మనము అందరము సంఘటితముగా ఉండి ఈ విషయంపై పోరాడాలి.
మంచిపనికి ముహూర్తాలు చూసుకోనవసరంలేదు.ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నిద్దాము.
తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం గారు,నల్లమోతు శ్రీధర్ గారు,వీవెన్ గారు,జ్యోతక్క,కత్తి మహేష్ కుమార్ గారు,లక్ష్మి గారు,"అమ్మఒడి" గారు,"దీప్తిధార" గారు, దుర్గేశ్వర్ గారు,నూర్‌భాషా గారు మొదలగు అనుభవశీలురకు మరియు అందరు బ్లాగర్లకు పేరుపేరునా నా విన్నపము.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు