Wednesday, October 2, 2013
నేను ఆచరించిన తర్వాతే మిగతా వాళ్ళ గురించి బాధపడగలను..
జగద్గురువుల చిన్న కథ:
ఆజ్ఞవల్ల బయలుదేరి వెళ్ళారు. పని పూర్తిచేసుకొని నదిదాటి ఇవతలకి వచ్చారు.ఆ తరువాత మనం అందరం
దాటి వచ్చామా లేదా అని లెక్క పెట్టుకుందాం అనుకున్నారు. లెక్కవేయడం మొదలు పెట్టారు. ఒకడు
తగ్గుతున్నాడు. ఒకడు నదిలో కొట్టుకుపోయాడు అని అనుకున్నారు. ఒకాయన దోవన పోతూ అటుగా
వచ్చాడు. విషయం అతనికి చెప్పారు. ఒరేయ్ ఆ పదో వాడివి నువ్వేరా..నిన్ను ఎందుకు విడిచి పెట్టావు?
నువ్వూ ఆలెక్కలోకి వస్తావురా. అందరూ ఉన్నారు అన్నాడు. ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతివాడూ తనని
మాత్రం విడిచి పెడుతున్నాడు. మైకు ముందు కూర్చొని తనని మాత్రం లెక్క వేసుకోకుండా మిగతా వాళ్ళని
ధర్మం ఆచరించడం లేదు అంటున్నాడు ప్రతివాడూ. అందులో నాపాత్ర కూడా ఉన్నది అని ఎవరూ అనుకోవడం
లేదు. నా మటుకు నేను ధర్మాన్నిఆచరిస్తాను అని ప్రతివాడూ అనుకుంటే ఎలా నశించిపోతుంది? ఒక
రథోత్సవంలో త్రాటిని అందరూ పట్టుకొని నడుపుతున్నారు. నా ఒక్కడివల్ల రథం ముందుకు పోతోందా? అని
ప్రతి ఒక్కడూ అనుకొని రథాన్ని వదిలేస్తే రథం ఎలా కదులుతుంది? అలాగే ధర్మాచరణలో కూడా ప్రతి ఒక్కరి
పాత్ర ఉన్నది. కర్తవ్య లోపం నావల్ల కాకూడదు. తండ్రి ధర్మం ఆచరించకుండా కొడుకును చేయడమంటే
కొడుకు ఎలా చేస్తాడు? అలాగే సమాజం విషయంలో కూడా.
Subscribe to:
Posts (Atom)
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...