తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, January 30, 2009

ఆర్థిక మాంద్యం(rescission) అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడింది? దయచేసి వివరించండి

ప్రస్తుతం ప్రపంచం అంతటా ఆర్థిక మాంధ్యం ఏర్పడి ఎందరో ఉద్యోగాలను కోల్పోతున్నారు. 2008 జనవరి లో 21,000 ఉన్నBSE సెన్సెక్స్ ప్రస్తుతం 9,000 కు పడిపోయింది. అసలు ఒక సంవత్సరంలో ఇంతగా ఎందుకు పరిస్థితి దిగజారింది? అసలు ఆర్థిక మాంధ్యం అంటే ఏమిటి ?
దయచేసి మన బ్లాగు మిత్రులకు ఎవరికైనా ఈ విషయం పై స్పష్టమైన అవగాహన ఉంటే ఈ టపాకు వ్యాఖ్య రూపంలో కాని లేక తమ బ్లాగు లో టపా రూపం లో కాని వివరణ ఇవ్వండి. తమ బ్లాగు టపా రూపంలో ఇస్తే మాత్రం ఆ టపా లంకె(Link) ఇవ్వడం మాత్రం మరిచిపోకండి.

Thursday, January 29, 2009

తెలుగు పునర్వైభవం అంటే ఆంగ్లం అసలు వద్దని కాదు

తెలుగు భాష పునరుద్ధరణ,పునర్వైభవం అనగానే తెలుగు కడుపుకు కూడుపెట్టదు, విషయం కడుపు కాలే వాళ్ళకుమాత్రం తెలుస్తుంది అని కొందరు బ్లాగ్మిత్రులు తమ టపాలలో వ్రాయడం చూసాను. అది వారి తప్పు కాదు.తెలుగు భాషపునరుద్ధరణ అనే విషయానికి ఒక వివరణ ఇవ్వవలసి ఉంటుంది.
ఒక వ్యక్తి మానసికముగా కానీ, సామాజికముగా కానీ అభివృద్ధి చెందాలంటే మాతృభాష లోనే వ్యక్తి యొక్క ప్రాథమికవిద్య ఉండాలనేది ఎందరో మేధావులు,అనుభవశీలురు చెబుతున్న విషయం. ప్రాథమిక దశను దాటిన తర్వాత అతను భాషలో తన విద్యను అభ్యసించినా అతను నెగ్గుకు రాగలడు.అప్పుడు వ్యక్తి ఆంగ్లం అభ్యసించినా చాలా సులభముగాపైకి రాగలడు.
మనం తెలుగును ప్రేమించడం అంటే ఆంగ్లాన్ని ద్వేషించడం అని అర్థం కాదు అన్న విషయాన్ని కొందరు కడుపుకాలుతున్న బ్లాగ్మిత్రులు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరూ వద్దనలేదు ఆంగ్లం చదవద్దని. తెలుగును మాత్రం మరవద్దు, చిన్నచూపును చూడవద్దు అని మాత్రమే మేము అంటున్నాము. అవసరమైన చోట ఆంగ్లాన్ని వాడవద్దని ఎవరూవద్దనడం లేదు. కాని నిత్యజీవితం లో తెలుగు వాడకాన్ని ప్రోత్సహిద్దాం, మనము కూడా అలానే పాటిద్దాం అనిఅంటున్నాము.
ప్రపంచం కుగ్రామం ఐపోతోంది కాబట్టి అందరినీ కలిపే భాష ఆంగ్లం అని అనవచ్చు.తప్పు లేదు. మనం మన రాష్ట్రం,దేశంకానివారితో ఆంగ్లం లోనే మాట్లాడుదాం. దానికోసం ఆంగ్లం నేర్చుకొందాం. మన ఉన్నతవిద్యలు కావాలంటే ఆంగ్లంలోనేచదువుదాం. కాని మన పిల్లలను తమ ప్రాథమిక విద్యను తెలుగులోనే చదివిద్దాం ,ఇప్పటి పరిస్థితుల ప్రకారం వారిఉన్నతవిద్యలను ఆంగ్లంలో చదివిద్దాం. కాని మన తెలుగుభాష ఔన్నత్యాన్ని ,మధురత్వాన్ని ఖచ్చితముగాకాపాడుకోవలసిన అవసరం లేదంటారా?
మనవారు ఆంగ్లంలో మాట్లాడడమే గొప్ప అని తలుస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి తెలుగు మన ఆత్మ ,ఆంగ్లంకేవలం మనసు లాంటిది మాత్రమే. మనసు బయటికి శక్తివంతమే కానీ ఆత్మ లేని మనసు ఉనికి లేనిది.
మనం ఆంగ్లం మాట్లాడేటప్పుడు మన మనసు తన భావాలను మొదట తెలుగు రూపం లోనే సృష్టించి తర్వాత భావాలను ఆంగ్లంలోనికి తర్జుమా చేసి బయటకు పంపుతుంది. ఎంతో సాధన తర్వాత మాత్రమే పని లేకుండాఒకేసారి ఆంగ్లంలో మాట్లాడగలం. విధముగా తెలుగు (మాతృభాష) సహాయంతో మాత్రమే మనం ఆంగ్లం నేర్చుకొనిబయట ఎక్కడైనా బ్రతకగలం. ఇంత సేవ చేసిన మన మాతృభాషకు మనం ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నామా? ! కడుపు కాలుతున్న బ్లాగ్మిత్రులారా గుండె పై చేయి పెట్టుకొని చెప్పండి.
మన భాష రానివారితో మనం ఆంగ్లంలోనే మాట్లాడుదాం.కాని మనలో మనం తెలుగులోనే మాట్లాడుకొందాం.మనలోమనం ఆంగ్లంలో మాట్లాడుకోవలసిన దౌర్భాగ్యం మనకు ఎందుకు? మన భాష అంత గొడ్డుపోయిందా?
ఒక పోతన,ఒక వేమన, ఒక అన్నమాచార్యుడు లాంటి తెలుగు వారు గర్వించే మహానుభావులు పుట్టిన రాష్ట్రం మనది. పోతన గారి పద్యాలలో మధురత్వం,వేమన పద్యాలలోని సమాజంలో ఎలా ఉండాలి అనే విషయం మరియుఅన్నమాచార్యుల కీర్తనలలోని భక్తి భావం మన తర్వాత తరాలవారికి కూడా అందించవలసిన భాధ్యత ఉంది.అందుకోసంకూడా తెలుగును రక్షించవలసిన అవసరం మన పై ఉంది.
ఒక మనిషి యొక్క సంస్కృతిని,సంస్కారాన్ని అతని వేష"భాష"లే తెల్పుతాయి అనడం మనకు తెలుసు.మనలో మనంకూడా ఆంగ్లం మాట్లాడుకుంటే,మన పిల్లలకు తెలుగుపై రుచి ఎలా కల్గుతుంది? మనకంటూ ఒక సొంతభాషనుకోల్పోయినప్పుడు ఇతరులు మాత్రం మనలను ఎవరు గౌరవిస్తారు?
దీనికి ఒక ఉదాహరణగా మన రాజధానిలో కూకట్పల్లి లో "మెట్రో" అనే ఒక పెద్ద వాణిజ్యసముదాయం ఉంది. వారుమొదట దానిని ప్రారంభించినప్పుడు భవనం పైన తెలుగులో పెద్ద అక్షరాలతో "మెట్రో" అని ఒక నామఫలకం, దాని క్రిందఆంగ్లంలో ఒక నామఫలకం ఏర్ఫాటు చేసారు. ముచ్చట ఎంతోకాలం సాగలేదు. వారికి మన భాషాభిమానం పాటిదోతెలిసిపోయి కొన్నిరోజులలోనే రెండు ఫలకాలనూ ఆంగ్లంలోనికే మార్చివేసారు.ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనగడ్డపైనే మన భాషకు ఇలాంటి అవమానం జరుగుతోంది.
వారిని ఆంగ్లం వ్రాయవద్దని అనలేదే, తెలుగులో కూడ వ్రాయమని అడుగుతున్నాం.
ఇక మన వారే మన రోడ్డు రవాణా సంస్థ వారే తమ గరుడ,అంతర రాష్ట్ర బస్సులపై తెలుగును మొత్తం తీసివేసి అంతాఆంగ్లమే వాడుతుంటే మన రాష్ట్రం లోనికి వచ్చి బ్రతికే ఇతరులకు మన భాషకు మాత్రం గౌరవం ఇస్తారు చెప్పండి?
ప్రస్తుతం ప్రపంచంలో చలామణి అవుతున్న భాషా స్వచ్ఛమైనది కాదు. ప్రతి భాషా ఇతర భాషల నుండి కొన్నిపదాలను కలుపుకొంటుంది.తెలుగు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాని ఇతర భాషలు తమ భాషలో ఇతరభాషలకు చెందిన పదాలకు సమాన పదాలు లేకుంటేనో లేక అది ఒక క్రొత్త పదం అయితేనో పదాన్ని యధాతథంగాతన భాష లోనికి తీసుకొంటాయి.ఉంటే కనుక ఉన్న పదాలనే వాడుతాయి. కాని మన తెలుగు భాష మాట్లాడేవారుతెలుగులో ఆంగ్లమో లేక మరే ఇతర భాషలోని పదాలకు తెలుగులో సమానార్థక పదాలున్నా అవి వాడరు.నాచిన్నప్పుడు నువ్వు తరగతి చదువుతున్నావు అంటే ఫలానా తరగతి చదువుతున్నాను అని పిల్లలు సమాధానాలుఇచ్చేవారు. కాని ఇప్పుడు తరగతి అనే పదాన్ని పెద్దలే వాడడం లేదు స్థానే "క్లాస్" అనే ఆంగ్ల పదం చేరిపోయింది. పిల్లలు కూడా మేము ఫస్ట్ స్టాండర్డ్ అనో లేక ఫస్ట్ క్లాస్ అనో చదువుతున్నామని అంటున్నారు. ఇలా మూలం దగ్గరేతెలుగును వాడకపోతే ఎలా?

చివరిగా ఒకమాట.మాతృభాష అనేది ఒక ఇంటికి కాని మరే నిర్మాణానికి కాని వేసే పునాది వంటిది. పునాది లేనినిర్మాణం ఎలా నిలబడదో మాతృభాష పునాది లేని జీవితం అలా నిలబడదు.పునాది వేసిన తర్వాతే దాని పై ఇతరనిర్మాణం ఎలా గావించగలమో అలానే మాతృభాష పునాది పైనే మనిషి ఉన్నతి నిర్ణయించబడుతుంది.

Tuesday, January 27, 2009

కొన్ని ఆచారాలు - వాటి మూలాలు

ముగ్గులు:

దుష్ట శక్తులు ఇళ్ళలోకి ప్రవేశించకుండా ఉండటం అని మనకు తెలిసిన కారణము.కానీ మన పూర్వీకుల ఉద్దేశ్యము చీమల లాంటి వాటికి ఆహారము కొరకు.అందుకే ముగ్గుపిండి ని మిగిలిపొయిన బియ్యపుపిండి తో ఎలాంటి రసాయనాలు కలపకుండా తయారు చేసి ముగ్గులువేయాలి.అంతేకాని బాగాకనిపించాలని సుద్ద ముక్కలతో లేక పెయింట్ లతో వేయడము ముగ్గుల పరమార్థాన్ని మరిచిపోవడమే అవుతుంది.

ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపకూడదంటారు.ఎందుకు?:

సైంటిఫిక్ కారణము ఏమంటే ఇలా చేయడము వలన దీర్ఘకాలము లో పక్షవాతము వచ్చే అవకాశము చాలా ఎక్కువ.అంతేకాక ఇలా చేయడము వలన ఎదురుగా కూర్చున్నవారికి కాలు చూపిస్తున్నట్టు అవుతుంది.

పెళ్ళిలో జీలకర్ర, బెల్లము తలపైన పెట్టుకోవడము:

పెళ్ళి అనగానే వధూవరుల మనసు ఎన్నో మానసిక మార్పులకు లోనవుతుంది.ముఖ్యముగా పెళ్ళికొడుకు లెక పెళ్ళికూతురును చేసినప్పటినుండి వారిద్దరికీ హడావుడి మొదలవుతుంది.పెళ్ళిపీటలపైన కూర్చున్నప్పుడు వారి శరీరాలు మరియు మనసు చాలా అలసిపోయుంటాయి. జీలకర్ర,బెల్లము కలిపిన మిశ్రమము చాలా శీతలకారి కనుక వారి తలలపైన పెట్టుకుంటారు.దీనివలన ముఖ్యముగా వారి శరీరాలు మరియు మనసు శాంతము పొందుతాయి.

కమెండోల్లారా మీకు మా తల వంచి పాదాభివందనాలు చేస్తున్నాము

నిన్న NDTV లో వచ్చిన జాతీయ రక్షణా బలగాల (NSG కమెండోల) కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా, స్పూర్తిదాయకముగా సాగింది. కార్యక్రమానికి భారత క్రికెట్ సారథి ధోనీ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
కార్యక్రమం చలోక్తులు,హృదయం హత్తుకొనే సన్నివేశాలతో సాగిపోయింది.
కొన్ని సన్నివేశాలు:
1.ఇది మనకు తెలియని విషయం.నారీమన్ ప్రాంతంలో నివశిస్తున్న వ్యక్తి చెప్పినది. నారీమన్ హోటల్ పైకి హెలికాప్టర్ లో నుండి తాడు సహాయంతో ఒక కమెండో దిగుతున్నప్పుడు పొరపాటున జారి క్రిందపడ్డాడు. అప్పుడు అతని కాలు బెణికింది. కాని ఆ విషయం అతను పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయాడు.
2.ఒక సారి ఒక ఉగ్రవాది విసిరిన బాంబు కమెండో ప్రక్కనే పడింది. ఈ విషయం పసిగట్టిన కమెండో ముందుగానే నేల పై పడుకోవడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు.వెంటనే అతను పైకి లేచి ఉగ్రవాది వైపు పరిహాసపూర్వకముగా నవ్వాడు. అంత కఠిన పరిస్థితులలో కూడా ఆ కమెండో ప్రశాంతమైన చిరునవ్వును కోల్పోలేదు.
3. ఒక కమెండో(నవ్వుతూ) ధోనీ తో :
మీరు మొన్న ఒక వన్‌డేలో కీపింగ్ చేస్తూ "గంట వాయించు" అని అంటున్నారు.ఎందుకు?
ధోనీ: అప్పుడు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ ఆడుతున్నాడు. అతని పేరులో "బెల్" ఉండడం వలన మన హిందీ భాషలో బౌలర్‌కు అతని గంట వాయించమని చెప్పాను.(అందరిలో నవ్వులు)
4.ధోనీ కమెండోలతో : చివరి బంతికి 10 పరుగులు ఎలా కొట్టగలము ?
ఎవరూ జవాబు ఇవ్వలేదు.
ధోనీ: మమూలుగా ఎవరూ కొట్టలేరు.అది నోబాల్ ఐతే తప్ప.కాని అది నోబాల్ కాకున్నా అలా కొట్టగల వ్యక్తి ఒక్కడే ఉన్నాడు.అతను రజనీ కాంత్.అతను కనుక కొడితే బంతి రెండు ముక్కలై ఒక ముక్క బౌండరీకి,ఇంకో ముక్క సిక్స్ కు వెళ్తుంది.ఒక వేళ 24 పరుగులు కొట్టవలసి వస్తే బంతి ఆరు ముక్కలై అన్ని ముక్కలు బౌండరీకి వెళ్తాయి.(అందరిలో నవ్వులు)
5.ఒక కమెండో ఉద్విగ్నతతో :
మేము అక్కడ పోరాడుతుంటే పార్లమెంట్ లో కూర్చున్న కొన్ని ...... ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయి.

ఇంకొన్ని విశేషాలు తర్వాత

Monday, January 26, 2009

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


ఓ స్వతంత్ర సమరయోధులారా!
మిమ్ములను విస్మరించాము, మీ అడుగుజాడలను విస్మరించాము,
మీ పోరాటాల ఫలమైన స్వాతంత్రమును దుర్వినియోగ పరుస్తున్నాము,
స్వతతంత్ర దినమని, గణతంత్ర దినమని మా చంకలు గుద్దుకొంటున్నాము,
ఐనా సుందర భవిష్యత్తులో మీ త్యాగాలను వృథా పోనివ్వమని ఆశిస్తూ
-ఒక భారతీయుడు

ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకొంటూ
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Sunday, January 25, 2009

ఆచరణ లేని ఆలోచనలేల?( తెలుగు భాష)

తెలుగు భాష పరిస్థితి గురించి అర్థం చేసుకొన్నవారికి గాని లేక కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వారికి గాని ఒక్క సంగతి చెబుతాను.కేవలం అర్థం చేసుకొన్నందువల్ల ప్రయోజనం ఏమిటి? మనం అర్థం చేసుకొన్నామనే దానికి ఋజువు ఏమిటి?మనం ఊరికే పలికేమాటల్లో ప్రతిజ్ఞా వాక్యాలు పలికినంత మాత్రాన ,దానిలో మనకు ఎంతో నమ్మకం ఉన్నదని చెప్పినంతమాత్రాన మనలను ఎవరు నమ్ముతారు? మనం చేసే పని మన ఆచరణానికి,భావాలకు నిదర్శనం. మనం అనుకొన్నదాన్ని,విశ్వసించినదాన్ని ఆచరణలో పెడదాం. అప్పుడు లోకం మనలను గుర్తిస్తుంది. మన భావాలు హృదయపూర్వకముగా వచ్చాయో లేదో మన చేతలు ఋజువు చేస్తాయి.మన చేతలు మన భావాల ఫలితాలే కదా! అప్పుడే లోకం మనలను అంగీకరించి అర్థం చేసుకొంటుంది.

Friday, January 23, 2009

తెలుగు భాష పట్ల ప్రజలలో అభిమానం పెంపొందేందుకు ఏ చర్యలు తీసుకొంటే బాగుంటుంది ? చర్చించండి.

మన బ్లాగర్లలో చాలా మంది తెలుగుభాష పట్ల ఎంతో అభిమానం కలిగి ఉన్నారు.అలాగే తెలుగు అభివృద్ధికై పాటుపడుతున్నారు.ఇప్పుడు విషయం ఏమిటంటే ఏ అభివృద్ధి ఐనా వ్యక్తిగతముగా రావాలి.అంటే ప్రజల నుండి రావాలి. కాబట్టి ప్రజలలో తెలుగు భాష పట్ల అభిమానం పెరగడానికి,తెలుగు భాష ప్రజల అభివృద్ధికి ఆటంకం కాదు అని ప్రజలకు తెలియడానికి మనం ఏఏ చర్యలు తీసుకొంటే బాగుంటుందో చర్చిద్దాము.నిర్మాణాత్మక సలహాలు,ఆరోగ్యవంతమైన చర్చలు ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాను.తమ తమ సూచనలను,సలహాలను వ్యాఖ్యల రూపంలో కాని లేక తమ బ్లాగు టపాల ద్వారా కాని చర్చించండి.

Thursday, January 22, 2009

బ్లాగరులారా! స్పందించండి!

నిన్న నా బ్లాగులో వ్రాసిన టపా" తెలుగు భాషను రక్షించుకొనే తరుణం వచ్చేసింది, ఇక ఆలస్యం వద్దు "కు కేవలం ఒకరిద్దరు మాత్రమే స్పందించారు. నేను నిన్న ప్రతిపాదించిన విషయం పై ఎవరికైనా ఆసక్తి ఉన్న ఎడల దయచేసి తమ టపాల ద్వారా కానీ,లేక వ్యాఖ్యల ద్వారా గానీ స్పందించండి.
కార్యాచరణకు ఉపక్రమిద్దాం.

Wednesday, January 21, 2009

తెలుగు భాషను రక్షించుకొనే తరుణం వచ్చేసింది, ఇక ఆలస్యం వద్దు

ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. మనకు మంచి తరుణం వచ్చింది. అదే తెలుగు భాషను రక్షించుకునే సమయం,అందుకు గాను ప్రభుత్వాన్ని నిలదీసే సమయం.
ఈ సమయం లో నైతే ప్రభుత్వం కనీసం మన మాట ఐనా వింటుంది. అందుకు గాను మనం ఒక వినతి పత్రాన్ని తయారు చేసుకొందాము.అందులో ఉండాలి అని నేను అనుకొంటున్న అంశాలు
1.6 లేదా 7వ తరగతి వరకు నిర్బంధ తెలుగు మాధ్యమం ఉండాలి.ఆంగ్లం ఒక విషయం(subject ) మాత్రం గానే ఉండాలి.
2.ప్రభుత్వ వ్యవహారాలలోనూ, RTC లాంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనూ తెలుగు భాషకు సింహభాగం ఇవ్వాలి.
3.ప్రభుత్వ పథకాలకు తెలుగుదనం ఉట్టిపడే పేర్లు పెట్టాలి మరియు ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు లోనే ( తప్పనిసరి పరిస్థితులలో ఆంగ్లం లో కూడా) ఇవ్వాలి.
4.మన రాష్ట్రములో నడుపుతున్న ఆంగ్ల పాఠశాలలలో తెలుగు ఖచ్చితముగా భోధించాలి.
5.రాష్ట్రవ్యాప్తముగా ప్రతి సంవత్సరము తెలుగు పద్యాలు,వ్యాస రచన పోటీలు నిర్వహించాలి.
6.TV చానల్స్ లో కూడా తెలుగు భాషకు అత్యధిక ప్రాముఖ్యత నివ్వాలి.
7.అధికార భాషా సంఘానికి తెలుగుభాష అమలుపై పూర్తిగా అధికారాలివ్వాలి.తప్పనిసరి ఐతే తప్ప ప్రభుత్వం అధికారభాషా సంఘం వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు.

ఈ వినతిపత్రాన్ని తీసుకొని మన బ్లాగర్లు అందరు మరియు ఇంకా తెలుగుభాషా అభిమానులు అందరము ర్యాలీగా సచివాలయానికి వెళ్ళి ప్రభుత్వానికి అందజేద్దాము. ప్రభుత్వము ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా మన ఉద్యమము ప్రజలలో బాగా వ్యాప్తి చెందుతుంది.అలా వ్యాప్తి చెందిననాడు ప్రభుత్వము దిగరాక తప్పదు.

పైన పేర్కొన్న వినతిపత్రాన్ని అన్ని రాజకీయపార్టీ నాయకులకు ఇద్దాము.ఎవరైతే సానుకూలముగా స్పందిస్తారో వారికే ఓటు వేస్తామని చెబుదాము.
మన బ్లాగర్లలో మహానుభావులు,పండితులు మరియు అనుభవశీలురు ఉన్నారు.వీరందరికీ నా విన్నపము ఏమిటంటే పైన పేర్కొన్న నా ప్రతిపాదనకు ఏమైనా సవరణలు చేసి ఇంకా విషయాలను కలిపి మన ఉద్యమానికి కార్యరూపం గావించవలసింది గా కోరుకొంటున్నాను.పైన పేర్కొన్నవే అంతిమం కావు.పై పని వలన వచ్చే ఫలితం పైన మన తర్వాతి కార్యాచరణకు సిద్దం అవుదాము.
ఈ పనికి గాను ప్రాంత భేధము లేకుండా తెలంగాణా,రాయలసీమ,కోస్తా అన్ని ప్రాంతాల నుండి బ్లాగర్లు,భాషాభిమానులు నడుం కట్టవలసి ఉంటుంది.ఈ పని భాషకు సంబంధించినది. ప్రాంతమునకు సంబంధించినది కాదు.కుల,మత మరియు ప్రాంత భేధాలు లేకుండా మనము అందరము సంఘటితముగా ఉండి ఈ విషయంపై పోరాడాలి.
మంచిపనికి ముహూర్తాలు చూసుకోనవసరంలేదు.ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నిద్దాము.
తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం గారు,నల్లమోతు శ్రీధర్ గారు,వీవెన్ గారు,జ్యోతక్క,కత్తి మహేష్ కుమార్ గారు,లక్ష్మి గారు,"అమ్మఒడి" గారు,"దీప్తిధార" గారు, దుర్గేశ్వర్ గారు,నూర్‌భాషా గారు మొదలగు అనుభవశీలురకు మరియు అందరు బ్లాగర్లకు పేరుపేరునా నా విన్నపము.

Monday, January 12, 2009

వివేకానందుని పిలుపు


లేవండి, మేల్కొనండి, గమ్యం చేరుకొనేవరకు విశ్రమించకండి

Friday, January 2, 2009

మాజీ కేంద్రమంత్రి అంతూలే గారి నిజస్వరూపం

ముంబాయిలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులకు,లష్కర్-ఏ-తోయిబా నేతలకు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలను మన పోలీసులు బహిర్గతం చేసారు.
బయటపడిన కొన్ని సంభాషణలు:
"అగ్గి పెట్టండి,అగ్గి పెట్టండి" - పేలుళ్ళ తీవ్రతను పెంచవలసిందిగా ఆదేశాలు
"అలసిపోకుండా ఒకరొకరుగా దాడి చేస్తూ అప్పుడప్పుడు నిద్రపోతూ దాడులు కొనసాగించండి" - సుదీర్ఘ,ఉద్దేశ్యపూర్వక దాడుల కొరకు ఆదేశాలు
"అంతిమ క్షణాలు వచ్చేసాయి.నమాజు చేయండి.ఏమైనా సందేశము ఇవ్వాలనుకొంటున్నారా?" - కమెండోలు ఆపరేషన్ పూర్తి చేసే సమయంలో ఉగ్రవాదులకు వచ్చిన సందేశము
"కమీషనర్‌ను ఎవరైనా చంపేసారా?" - ఈ సందేశము ఆతృతగా అడిగారు.ఈ సందేశము ATF ముఖ్యనేత కర్కరే హత్యను ఉద్దేశించి ఆ హత్య జరిగిన విషయాన్ని రూఢి చేసుకొనుటకు అడిగినట్టు ఉంది.అతన్ని ప్రత్యేకము గా లక్ష్యము చేసుకొన్నారు.

అందరికీ తెల్సు మన మాజీ కేంద్ర మంత్రివర్యులు అంతూలే గారు చేసిన వ్యాఖ్యలు.ATF ప్రధానాధికారి హేమంత్ కర్కరే మృతిని మాలేగావ్ పేలుళ్ళకు లంకె పెడుతూ ఎవరో ముస్లిమేతరులు(ఆ ముస్లిమేతరులు ఎవరో కొత్తగా చెప్పనవసరం లేదనుకుంటాను) అతని హత్యకు కారణమని వ్యాఖ్యలు చేసాడు.ఎప్పుడెప్పుడు మతవిద్వేషాలు రెచ్చగొడదామా,లాభం పొందుదామా అని ఎదురుచూసే ఇలాంటి వెధవ రాజకీయనాయకులను కఠినముగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంతూలే గారి నిజస్వరూపం ఈ రోజు వచ్చిన పై వార్తతో బట్టబయలైంది.కేంద్ర ప్రభుత్వములో మైనారిటీ శాఖకు మంత్రిగా ఉంటూ ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మంత్రికి ఎలాంటి శిక్ష విధించినా పాపం ఉండదు.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు