తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, October 8, 2010

హస్టల్లో ఉంచి చదివించినందుకు ప్రతిఫలం వృద్ధాశ్రమమా? ఒక యదార్థ సంఘటన.

సంఘటన నిజంగా రోజు నేను చూసిన సంఘటన.

స్టీరింగ్ (సెవెన్ సీటర్) ఆటోలో నేను వెళ్తుంటే అదే ఆటోలో ఒక తల్లీ,కొడుకుల మధ్య జరిగిన సంభాషణ ఇది.


తల్లి: "ఏరా! చిన్నప్పటినుండి కష్టపడి మిమ్మల్ని చదివించి,జీవితంలో వృద్ధిలోనికి తీసుకువచ్చినందుకు వృద్ధాశ్రమంలోచేర్పించి మాకు బానే బుద్ధిచెప్పారు .ఒకే కొడుకువి మాకు మీదగ్గర ఉండాలని ,శేషజీవితం గడపాలని ఉంటుంది కదా"


కొడుకు: "ఏం నెలనెలా డబ్బు నేనేకదా పంపుతున్నది మీకు. అదీగాక మీరు నన్ను చూడాలని అనినప్పుడలా నేనువస్తూనే ఉన్నాకదా. మీతో గడుపుతున్నాకదా"


తల్లి: అలా డబ్బు పంపడం కాదు. మాకు మీదగ్గర ఉండాలని, మనవడిని ఆడించాలని ఉంటుంది కదా"


కొడుకు : చూడమ్మా. నువ్వు,నాన్న నాకు మిగతా బంధువుల కన్నా ఏమంత ఎక్కువకాదు. తేడా ఏంటంటే మీరుకష్టపడి మీ డబ్బుతో నన్ను చదివించారు.అంతే. అసలు నన్ను 2 తరగతిలోనే హాస్టల్లో వేసి చదివించారు. అప్పటినుండి నా ఎడ్యుకేషన్ అంతా హాస్టల్లల్లోనే జరిగింది. అప్పుడప్పుడు నెలకొకసారి వచ్చి పలకరించి వెళ్ళేవారు. ఇంటికొచ్చి చదువుకుంటానంటే నీ భవిష్యత్తు కోసమే కదా మేము ఇద్దరమూ కష్టపడుతూ చదివిస్తున్నాము అన్నారు. ఏం నాకు మాత్రం మీవద్ద ఉండాలని అప్పుడు ఎంతబాధపడ్డానో మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోలేదు. ఐన విషయం ఎన్నిసార్లు చెప్పాలి. మీలాగే నేను కూడా డబ్బు పంపుతున్నా కదా. మీరన్నా అప్పుడు నెలకుఒకటిరెండుసార్లే వచ్చే వారు చూడడానికి.నేను మీరు పిలిచినప్పుడల్లా వస్తున్నా కదా. ఇక టాపిక్ ఎప్పుడూమాట్లాడకు.


ఇక్కడ నేను ఆటో దిగేసాను. తర్వాత ఏం వాదం జరిగిందో నాకు తెలీదు.ఆమె చేతిరుమాలు అడ్డుపెట్టుకొని ఏడుస్తున్నట్లుఅనిపించింది.

కాని సంఘటన నాలో నేటి మానవసంబంధాలను గూర్చి ఏవేవో అస్పష్ట ఆలోచనలను రేకెత్తిస్తోంది .

Thursday, October 7, 2010

నేర్చుకోవడం అంటే ఇదీ............ నేటి మనుషులు అనుకుంటున్నట్లు కాదు

చాలా పెద్ద విరామం తర్వాత మళ్ళీ బ్లాగులోక దర్శనం. ఒక చిన్న కథ.

కౌరవపాండవులు ద్రోణాచార్యుల గురుకులం లో విద్యాభ్యాసం చేస్తున్న రోజులవి. ఒకసారి ద్రోణులు ఏదో పనిమీద కొన్ని రోజులు బయటకు నేర్చుకోవడం వచ్చింది. వెళ్తూవెళ్తూ తన శిష్యులకు కొద్దిగా ఇంటిపని(home work) ఇచ్చి వెళ్ళాడు. అతను వచ్చిన తర్వాత శిష్యులు తాము చదివినదంతా ద్రోణులకు అప్పజెపుతారు.

కాని ధర్మరాజు మాత్రం "ఒక వాక్యాన్ని మాత్రం చదివాను.అందులొని విషయాన్నే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని చెప్తాడు. ఇన్నిరోజులుగా ఒక్కవాక్యం మాత్రమే చదివి నేర్చుకొన్నావా? అంటూ కోపంతో ధర్మరాజును దండిస్తాడు.


ఐనా ధర్మరాజు ఏ మాత్రం చలించకుండాఉండడం చూసి ద్రోణులు ఆలోచనలో పడి ధర్మరాజును పిలిచి "నాయనా! నువ్వు చదివిన ఆ వాక్యం ఏమిటి?" అన్నాడు. అప్పుడు ధర్మరాజు పుస్తకం చూపాడు."ఎన్నడూ కోపం తెచ్చుకోవద్దు" అన్నదే ఆ వాక్యం. ద్రోణులు ఆనందభాష్పాలు రాలుస్తూ "నాయనా! నాకు నువ్వు ఈరోజు "నేర్చుకోవడం"అంటే ఏమిటో నేర్పావు" అన్నారు.


పైన చెప్పిన విధం నిజముగా నేర్చుకోవడం కాని చిలకలలా నేర్చుకొని తిరిగి వల్లించడం,వప్పచెప్పడం కాదు.

ఇప్పుడు చెప్పండి నేర్చుకోవడం అంటే ఏదో.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు