తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, October 29, 2008

మన తెలుగు బ్లాగుల వలన తెలుగు భాషకు ప్రయోజనం ఏమిటి?

మనం అందరము తెలుగులో బ్లాగులు వ్రాస్తున్నాము.ఎంతో కొంత ఐనా తెలుగు బాషకు ప్రయోజనం చేకూరుతున్నదని అనుకొంటున్నాము.గూగుల్ వారు,ఫైర్‌ఫాక్స్ వాళ్ళు తెలుగులో తమ సర్వీసులు అందిస్తున్నారు.బయటివారందరూ తెలుగు కు బాగానే ప్రాముఖ్యత ఇస్తున్నారు.కాని తీరా అసలు ప్రదేశమైన మన రాష్ట్రం వచ్చేటప్పటికి తెలుగు వాడకం ఎంతగా తగ్గిపోతోందో తెలుసు.

మనం మనవంతుగా దృష్టి పెట్టవలసిన నేను అనుకొంటున్న కొన్ని సంఘటనలను క్రింద తెలియజేసుకొంటున్నాను.

1.తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో వైభవం గా తెలుగు బాషా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.అందులో పాల్గొన్న మన ముఖ్యమంత్రి గారు తెలుగు కు ప్రాముఖ్యత ఇస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు.కాని అసలు జరిగింది ఏమిటి?ఆ ఉత్సవాలు ముగిసిన వారం లోపే ఆరవ తరగతి నుండి తెలుగును కేవలం ఒక పాఠ్య విషయంగా(సబ్జెక్ట్)గా మాత్రమే బోధించాలని మిగతా అంతా ఆంగ్ల మాధ్యమంలో నే ఉంచాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు.
యూరప్ దేశాలలో వారి విద్యావిధానం చూడండి.వారి విద్యావిధానంలో డిగ్రీ వరకు కూడా వారి మాతృభాషలోనే బోధన ఉంది.ఆంగ్లం కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే.కేవలం పిజి మాత్రమే ఆంగ్లమాధ్యమం లో బోధిస్తున్నారు.

2.ఇక రాష్ట్ర రోడ్డు రవాణా విషయానికి వస్తే ఇంకా అధ్వాన్నంగా పరిస్థితి ఉంది.స్థానికంగా మన రాష్ట్రం లోపల నడిపే బస్సుల విషయంలో మాత్రం తెలుగును అమలు చేస్తున్నారు.హైదరాబాదులో మహాత్మాగాంధీ బస్టాండులో వోల్వో(గరుడ) బస్సులు నిలిపే స్థలానికి ఎదురుగా విచారణా కేంద్రం వద్ద ఒక ఫలకం ఉంటుంది.అందులో మన ఆర్టీసి వాళ్ళు ఎంతో గొప్పగా "తెలుగు కనపడాలి","తెలుగు వినపడాలి""తెలుగు కన్నతల్లి లాంటిది" మొదలగు నినాదాలు వ్రాసిఉన్నారు.కాని ఆచరణలో వాళ్ళు చూపిస్తున్నది ఏమిటి? మన రాష్ట్రం నుండి బయలుదేరే అన్ని అంతరరాష్ట్ర బస్సుల పైనా పూర్తిగా తెలుగు తీసివేసి అంతా ఆంగ్లమయం చేసారు.ఇక గరుడ వోల్వో బస్సుల విషయంలో పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉంది.రాష్ట్రంలోపల తిరిగే బస్సులను కూడా అంతా ఆంగ్లం తో నింపివేసారు.అంతర రాష్ట్ర బస్సుల విషయంలో అంతా తెలుగులోనే వ్రాయాలని అనడం లేదు.ఆంగ్లంతో పాటు తెలుగు కూడా వ్రాస్తేనే కదా,తెలుగు కనపడితేనే కదా మన బాషపై మనకు గల అభిమానం కనీసమైనా ఇతర రాష్ట్రాలవారికి తెలిసేది.కర్ణాటక వారి విషయానికి వస్తే వారి అంతర రాష్ట్ర బస్సులపై కన్నడ,తెలుగు, వోల్వో బస్సులపై కన్నడ,ఆంగ్లం,తెలుగు మరియు తమిళనాడు విషయానికి వస్తే వారి అన్ని అంతర రాష్ట్ర బస్సులపైనా తమిళం,ఆంగ్లంలలో వ్రాసి ఉంటుంది.ఆ విధంగా వారు తమ భాష ను ఇతర రాష్ట్రాలవారికి తెలిసేలా చేస్తున్నారు.తమ భాషా సంస్కృతిని ఇతర రాష్ట్రాలవారు తెలుసుకొనేలా చేస్తున్నారు.ఆంగ్లాన్ని వద్దనకుండానే తమ బాషా సంస్కృతిని కాపాడుకుంటున్నారు.కాని మన విషయం ఏమిటి?ఇంత మాత్రం జ్ఞానం కూడా మన ప్రభుత్వానికి లేదా?

3.ఇక హైదరాబాదు చూసిన వారందరికీ ఒక విషయం తెలుసు.ఒక రాష్ట్ర రాజధానికి ఉండవలసిన లక్షణాలు అన్నీ దానికి ఉన్నప్పటికీ అసలు లక్షణమైన బాషా సంస్కృతి లక్షణం అన్నది లేదు అని.హైదరాబాదులో తిరుగుతుంటే ఒక విదేశ నగరంలో తిరుగుతున్నట్టు ఉంటుంది కానీ ఒక తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టు అనిపించదు.ఏ దుకాణం పై చూసినా పేరు సూచికలు పూర్తిగా ఆంగ్లంలోనే ఉంటాయి.ఇదే కర్ణాటక,తమిళనాడు విషయానికి వస్తే దుకాణాలపైన ఆంగ్లంతో పాటు ఆయా భాషలు కూడా తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది.ఎవరైనా అమలు చేయకపోతే ఆ దుకాణాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.

ఇతర బాషలను మనం ద్వేషించనవసరం లేదు.కాని మన మాతృబాషను మనం మరిచిపోతున్నాము.

మన బ్లాగర్లు ఈ విషయాలపైన ఏమీ చేయలేమా? మనం ఏ విధమైన కార్యాచరణ పథకం చేయలేమా? ఆలోచించండి. సంఘటనలు ఇంకా ముదిరిపోకముందే మనము సంస్థాగతంగా ఏదైనా చేయకతప్పదు.ఇలా ఏమీచేయలేనినాడు మనం మన బ్లాగుల ద్వారా ఒకరికి తెలిసిన సమాచారం మరొకరికి ఇచ్చిపుచ్చుకోవడం,అభిప్రాయాలు పంచుకోవడం మాత్రమే చేయగలము.ఇవి మాత్రమే ఉద్దేశ్యంగా గలవారికి ఏమీ చెప్పడం లేదు.తెలుగు బాషను బ్రతికించుకందామనుకొనే వారికి,కాపాడుకొందాము అనుకొనేవారికి నా ఈ అభ్యర్థన.ఇప్పటికిప్పుడు తెలుగుబాషకు ఏమీ ప్రమాదం లేదని అనుకోవచ్చు.కాని సమస్యా పరిష్కారానికి నడుము బిగించాల్సిన తరుణం ఇదే అని నా ప్రగాఢవిశ్వాసం.

మన బ్లాగుల ప్రధాన ఉద్దేశ్యం తెలుగు భాషా పునర్వైభవమే కాబట్టి అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.
పైన పేర్కొన్నవి కేవలం కొన్ని సమస్యలు మాత్రమే.ఇంకా చాలా ఉన్నాయి.కాని పైన పేర్కొన్నవి తక్షణసమస్యలు అని అనుకొంటున్నాను.
బ్లాగుల ద్వారా ఎలానూ తెలుగుభాషకు సేవ చేసుకొంటున్నాము.ఇకనైనా మనము కార్యాచరణకు నడుము బిగించాలి అనుకొంటున్నాను.అందుకుతగ్గ కార్యాచరణను ఆలోచించండి.

Sunday, October 26, 2008

గణపతి ఆవిర్భావానికి సంబంధించిన కథలు

గణపతి కి సంబంధించిన కథలను చూస్తే మనకు ఆసక్తి కలుగుతుంది.అవేమిటో చూద్దాం.
1.దేవతలు తమ పనులకు కలుగు ఆటంకాలను తొలగించి వాటిని విజయవంతం చేసే ఒక దేవత కావాల్ని శివుడిని వేడుకొన్నప్పుడు ఆయనే స్వయంగా పార్వతీదేవి గర్భంలో వినాయకుడిగా జన్మించాడు.
2.ఒకసారి పార్వతీదేవి తను వంటికి రాసుకున్న లేపనంతో ఏనుగు తల గల ఒక బాలుడి బొమ్మను తయారు చేసి గంగానదిలో విసిరివేసింది.మరుక్షణమే అది సజీవమైంది.గంగాదేవి,పార్వతి ఇద్దరూ ఆ బాలుడిని తమ బిడ్దగానే పిలిచారు.దీనివలన ఆ బాలుడికి ద్వైమాతురుడు అనగా ఇద్దరు తల్లులు గలవాడు అనే పేరు వచ్చింది.
3.పార్వతీ దేవి నలుగుపిండి తో బాలుడిని తయారుచేయడం,అతన్ని పార్వతి కాపలాగా ఉంచుకోవడం,అతడు శివుడిని అడ్డగించడం,శివుడు కోపంతో అతని తలను నరికివేయడం,పార్వతి దుఃఖించడం,ఏనుగు తలను అతికించి ప్రాణం పోసి గణనాయకుడిని చేయడం ఇది అందరికీ తెలిసిన కథ.
4.గణపతి శివుని ముఖకవలికళనుండి ఉద్భవించాడు.అందరినీ మోహింపచేస్తున్న ఆ రూపం పట్ల పార్వతీ దేవి కోపంతో శపించడం వలన వికారరూపం ఏర్పడింది.
5.గణేశుడు మొదట మానవరూపంలోని కృష్ణుడే.అపకారబుద్దితో శనిగ్రహం ఒకసారి అతన్ని చూడడంతో అతడి తల తెగి కృష్ణుడి లోకమైన గోలోకంలో పడింది.తర్వాత ఏనుగుతలను ఆ బాలుడికి అతికించారు.

Saturday, October 18, 2008

ద్వాదశ జ్యోతిర్లింగాలు,అష్టాదశ శక్తిపీఠాలు

ద్వాదశ జ్యోతిర్లింగాలు:

1.శ్రీ భీమశంకరేశ్వరుడు : భీమశంకర్

2.శ్రీ త్రయంబకేశ్వరుడు : త్రయంబకేశ్వరం,మహారాష్ట్ర

3.శ్రీ కేదారేశ్వరుడు : కేదార్‌నాథ్,హిమాలయాలు

4.శ్రీ విశ్వేశ్వరుడు : వారణాశి,ఉత్తరప్రదేశ్

5.శ్రీ రామలింగేశ్వరుడు : రామేశ్వరం,తమిళనాడు

6.శ్రీ మల్లిఖార్జునుడు : శ్రీశైలం,ఆంధ్రప్రదేశ్

7.శ్రీ మహాకాళేశ్వరుడు : ఉజ్జయిని,మధ్యప్రదేశ్

8.శ్రీ ఓంకారేశ్వరుడు : ఓంకారేశ్వర్,మధ్యప్రదేశ్

9.శ్రీ సోమనాధేశ్వరుడు : సోమనాథ్,గుజరాత్

10.శ్రీ నాగేశ్వరుడు : దారుకావనం,గుజరాత్

11.శ్రీ వైద్యనాథేశ్వరుడు : వైద్యనాథ్,బీహార్

12.శ్రీ ఘశ్మేశ్వరుడు :ఎల్లోరాగుహ,మహారాష్ట్ర

అష్టాదశ శక్తిపీఠాలు:

1.శ్రీ సరస్వతీ దేవి : జమ్మూకాశ్మీర్

2.శ్రీ విశాలాక్షీ దేవి : వారణాశి,ఉత్తరప్రదేశ్

3.శ్రీ కామాక్షీదేవి : కంచి,తమిళనాడు

4.శ్రీ గిరిజాదేవి : ఓడ్గాపురి,కటక్,ఒరిస్సా

5.శ్రీ భమరాంబా దేవి : శ్రీశైలం,ఆంధ్రప్రదేశ్

6.శ్రీ వైష్ణవీ దేవి : కాంగడా,హిమాచల్‌ప్రదేశ్

7.శ్రీ పురుహూతికా దేవి : పిఠాపురం,ఆంధ్రప్రదేశ్

8.శ్రీ శృంఖలా దేవి : ప్రద్యుమ్నం,బెంగాల్

9.శ్రీ మాధవేశ్వరీ దేవి : ప్రయాగ,ఉత్తరప్రదేశ్

10.శ్రీ మహాలక్ష్మీ దేవి : కొళ్హాపురం,మహారాష్ట్ర

11.శ్రీ ఏకవీరాదేవి : మహూర్యం,నాందేడ్,మహారాష్ట్ర

12.శ్రీ కామరూపిణీ దేవి : గౌహతి,అస్సాం

13.శ్రీ చాముండేశ్వరీ దేవి : మైసూరు,కర్ణాటక

14.శ్రీ మహాకాళీ దేవి: ఉజ్జయిని,మహారాష్ట్ర

15.శ్రీ మాంగల్య గౌరీదేవి : గయ,బీహార్

16.శ్రీ జోగులాంబా దేవి : ఆలంపురం,కర్నూలు

17.శ్రీ మాణిక్యాంబా దేవి : ద్రాక్షారామం,ఆంధ్రప్రదేశ్

18.శ్రీ శంకరీ దేవి : ట్రింకోమలి,శ్రీలంక.

Wednesday, October 15, 2008

ఒక జోకు

ఓ సారి జేమ్స్‌బాండ్,తెలుగువాడు కలిసి ప్రయాణిస్తున్నారు.తెలుగువాడు అడిగాడు "మీ పేరేమిటి?"
"బాండ్.....జేమ్స్‌బాండ్" అన్నాడు జేమ్స్‌బాండ్.
'నీ పేరు ' అని అడిగాడు.
'సాయి......వెంకట సాయి......శివ వెంకట సాయి.........లక్ష్మినారాయణ శివ వెంకట సాయి......శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సాయి............రాజశేఖర శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సాయి......సీతారామాంజనేయ రాజశేఖర శ్రీనివాస లక్ష్మినారాయణ శివ వెంకట సాయి..........అల్లంరాజు సీతారామాంజనేయ రాజశేఖర శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సాయి............"
జేమ్స్‌బాండ్ మూర్చపోయాడు.

Tuesday, October 14, 2008

భాషతో ప్రయోగాలు - విచిత్రాలు- సరదాలు

enemy the= ఎనిమిది
way to=వేటు
సీ రియల్= చూడు నిజం
ఏమిటీ=ఏ కంపెనీ టీ
P.D.కిలి= పిడికిలి
P.C.నారి=పిసినారి
Six master=ఆరుగురు
ఫోర్మెన్=నలుగురు మగవారు
ఫోర్జరీ=నాలుగు జరీ(చీరలు)
though Say=దోసె
chest air=ఎదగాలి
100 ద్దీన్=నూరుద్దీన్
Earth Milk=నేలపాలు
సిగ్నేచర్=సిగ్గు పడే ప్రకృతి
వెన్నెల=WHEN నెల(ఎప్పుడు నెల)
వేలు= Way లు(దారులు)
Slow come=శ్లోకం
Low come=లోకం

Tuesday, October 7, 2008

త్యాగరాజ కీర్తన ( భావము )

ఎంత నేర్చిన ఎంత జూచినఎంత వారలైన కాంత దాసులే

సంతతంబు శ్రీకాంత స్వాంతసిద్ధాంతమైన మార్గ చింత లేనివా(రెంత)

పర హింస పర భామాన్య ధనపర మానవాపవాదపర జీవనాదులకనృతమేభాషించెదరయ్య త్యాగరాజ నుత (ఎంత)

భావము:

ఈ కీర్తన త్యాగరాజు గారి ఆవేదన ను మనకు తెల్పుతుంది.మనుషులు ఎంత నేర్చుకున్నా,ఎంత జ్ఞానము సంపాదించినా,ఎన్ని అనుభవాలు పొందినా కాంతకు అనగా కామానికి దాసులు గానే ఉన్నారు.ఇచ్చట కాంత అనగా స్త్రీని ఉద్దేశించి చెప్పినది కాదు కామాన్ని ఉద్దేశించి చెప్పినది.మనకు కామం యొక్క శక్తి తెలిసినదే.ఇది అగ్నిలాగా ఎంత అనుభవించినా ఇంకా దహించాలనుకొంటుంది అనగా అనుభవించాలనుకొంటుంది.


స్వాంతన(శాంతి లేక ఉపశమనం) కలిగించు ఆ శ్రీకాంతుని(శ్రీ మహా విష్ణువు)పైన భక్తి లేని ఎంత నేర్చుకున్నా,ఎంత జ్ఞానము సంపాదించినా అనగా కామానికి దాసులు గానే ఉంటారు.

ఓ త్యాగరాజు చే భజింపబడే రామా,ఈ మానవులు ఇతరుల ధనానికై,ఇతర స్త్రీలను ఆశించి ఇతరులను హింసించడానికైనా వెనుకాడక తమ మానాలను అనగా శీలాన్ని పోగొట్టుకుంటారు.అపవాదులను కొనితెచ్చుకుంటారు.పరులపై అధారపడి జీవించడానికి అబద్దాలు చెప్పుతుంటారు.

Monday, October 6, 2008

యుగం బట్టి ధర్మం - కాలం బట్టి ఉద్యోగం

కాలం బట్టి యువత ఎక్కువగా కోరుకొనే ఉద్యోగాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1900 సంవత్సర సమయాలలో : లాయరు(న్యాయవాది)
1920 నుండి 1947 వరకు : స్వతంత్రయోధులు
1947 నుండి 1990 ల వరకు : ప్రభుత్వ ఉద్యోగాలు
1990 నుండి 2000 ల వరకు : ఉపాధ్యాయ ఉద్యోగాలు
2000 నుండి ఇప్పడు కూడా : సాప్ట్‌వేర్ ఉద్యోగాలు
తర్వాతో.............

Thursday, October 2, 2008

లాల్‌బహదూర్ శాస్త్రి గారిని మరిచిపోయామే

నేడు మన అత్యంత నిష్పక్షపాత ప్రధాని ఐన లాల్‌బహదూర్ శాస్త్రి గారి జన్మదినమని ఎంతమందికి గుర్తుంది?మనమెంత కృతఘ్నులం?
ఐనా నేడు మహాత్మాగాంధీ జన్మదినమని కొంతమందికి గుర్తులేదు.
ప్రియతమ నాయకులారా జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి.
కానీ క్షమించండి.మీరు చూపిన బాటలో మేము ఎంత మాత్రమూ నడవడంలేదు.ఎప్పుడూ మేము ఎలా బ్రతకాలనే.ప్రక్కవారిని పట్టించుకోకుండా మేము మా స్వార్థాన్నే చూసుకుంటున్నాము.క్షమించండి.మీ బాటలోనే మేము నడిచేలా మమ్మల్ని ఆశీర్వదించండి.

Wednesday, October 1, 2008

త్యాగరాజ కీర్తన వినండి

క్రింది కీర్తన వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బాల! కనకమయ చేల! సుజన పరిపాల!
కనకమయ చేల! సుజన పరిపాల!
కనకమయ చేల! సుజన పరిపాల!
శ్రీ రమాలోల! విధృత శరజాల!

శుభద కరుణాలవాల!ఘననీల నవ్యవనమాలికాభరణ!ఏల నీ దయ రాదు!!
పరాకు జేసేవేల సమయము గాదు!!

రారా!! దేవాది దేవ!!రారా!! మహానుభావ!!(2)
రారా!! రాజీవ నేత్ర! రఘువర పుత్ర!
సారతర సుధాపూర! హృదయ పరివార! జలధి గంభీర దనుజ సంహార!
దశరధ కుమార! బుధ జన విహార! సకల శ్రుతిసార! నాదుపై (ఏల)

రాజాధిరాజ ముని పూజిత పాద రవి రాజ లోచన శరణ్య అతి లావణ్య రాజ ధర నుత విరాజ తురగ సుర రాజ
వందిత పదాజ జనక దిన రాజ కోటి సమ తేజ దనుజ గజ రాజ నిచయ మృగ రాజ జలజ ముఖ (ఏల)

యాగ రక్షణ పరమ భాగవతార్చిత యోగీంద్ర సుహృద్ భావితాద్యంత రహిత నాగ శయన వర నాగ వరద పున్నాగ సుమ ధర సదాఘ మోచన సదా గతిజ ధృత పదాగమాంత చర రాగ రహిత శ్రీ త్యాగరాజ నుత (ఏల)

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు