తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, December 30, 2013

హృదయవాసి రమణులకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

కొందరిపై ఎందుకు ప్రేమ పుడుతుందో తెలియదు..చూడగానే వారికీ,మనకూ జన్మజన్మల సంబంధం ఉందని అనిపిస్తుంది..వారి పేరు వినగానే,వారి రూపం చూడగానే ఏదో తెలియని ఆనందం మనసును ఆక్రమిస్తుంది.

అలా నాకు ఫోటో చూడగానే ప్రేమ,ఆరాధన పుట్టినవారిలో స్వామి వివేకానందులు మొదటివారు.
ఇక భగవాన్ రమణులు రెండవవారు.రామకృష్ణులు,శారదామాతలను కూడా చూడగానే ఇలాంటి భావమే కలుగుతుంటుంది.

4వ తరగతి చదువుతున్నప్పుడే(అతిశయోక్తి అనిపించవచ్చు కానీ నిజం) రమణుల ఒక వాక్యం ("నేను" గురించి)ఏదో పుస్తకంలో చదివి మా తాత గారిని అడగడం ఇప్పటికీ గుర్తు వస్తూ ఉంటుంది.
ఇప్పటికీ వీరి పేర్లు ఎవరి నోటైనా అనుకోకుండా విన్నా మనసు తెలియకుండానే ఆ మాటల వైపు వెళ్ళిపోతూంటుంది.

ప్రతిరోజూ ఏదో ఒక సందర్భం లో నా హృదయంలో తిరుగాడే నా హృదయవాసి అయిన భగవాన్ రమణులకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

"భక్తి జ్ఞానమునకు తల్లి"
                                - భగవాన్ రమణులు

Sunday, December 8, 2013

ఓ మాదిరి తెలివి చాలా కొద్దిగా గణిత పరిజ్ఞానం ఉపయోగించి ఈ ప్రశ్నకు జవాబు ప్రయత్నించండి - సమాధానం

నిన్నటి ప్రశ్న:

మీకు నలుగురు స్నేహితులు ఉన్నారు.
ఆ నలుగురూ ఎప్పుడూ నిజం చెప్తారు.
వారి జీతాలెంతో చెప్పడం వారిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదు.
ఒక వేళ మీ జీతం ఎంత అని అడిగితే చెప్పడం మాకు ఇష్టం లేదంటారు. 
వారిలో వారికి కూడా ఒకరి జీతం ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు.

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారి జీతాలు ఎవరికీ తెలియనవసరం లేకుండానే వారి జీతాల మొత్తం వారి ద్వారానే కనుక్కోవాలి.

సమాధానం:

నలుగురు వ్యక్తులు a,b,c,d అనుకుందాము. ఒక కాగితం తీసుకొని a తో తన జీతం మొత్తానికి తన ఇష్టమొచ్చినంత కలిపి వ్రాయమనాలి. ఉదాహరణకు a  జీతం 15000 అనుకుంటే అతను 547 కలిపాడనుకోండి 15547 వ్రాస్తాడు. ఇలా ఎంత కలిపితే అంత వ్రాస్తాడు. జీతం వ్రాయడు (కాబట్టి తెలిసేందుకు అవకాశం లేదు) కాని కలిపిన మొత్తంతో కలిపి వ్రాస్తాడు. తర్వాత అదే కాగితాన్నిb,c,d లకు ఇచ్చి అధే విధంగా చేయమంటాము. ఇప్పుడు మొత్తము(జీతాల మొత్తము + వాళ్ళు కలిపిన మొత్తము) వస్తుంది. ఇప్పుడు వచ్చిన దాన్లో వాళ్ళు కలిపిన మొత్తాలను తీసివేయమనాలి.ఇప్పుడు మిగిలేదే వాళ్ళ జీతాల మొత్తము.

ఉదాహరణకు a,,b,c.d ల జీతాలు A,B,C,D అనుకొంటే మరియు కలిపిన మొత్తాలు w,x,y,z అనుకొంటే 
అందరూ కలిపిన మొత్తం 
(A+w) + (B+x) + (C+y) + (D+z) అవుతుంది 

ఇందులో మళ్ళీ w,x,y,z లను తీసేస్తే A+B+C+D (అంటే జీతాల మొత్తం) వస్తుంది.

ఇక్కడ వారెంత కలిపారో మనకు తెలియనవసరం లేదు మరియు ముఖ్యంగా వారి జీతాలు కూడా తెలియనవసరం లేదు.

చూసారా ఎంత సులభమో.


Saturday, December 7, 2013

ఓ మాదిరి తెలివి చాలా కొద్దిగా గణిత పరిజ్ఞానం ఉపయోగించి ఈ ప్రశ్నకు జవాబు ప్రయత్నించండి.

మీకు నలుగురు స్నేహితులు ఉన్నారు.
ఆ నలుగురూ ఎప్పుడూ నిజం చెప్తారు.
వారి జీతాలెంతో చెప్పడం వారిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదు.
ఒక వేళ మీ జీతం ఎంత అని అడిగితే చెప్పడం మాకు ఇష్టం లేదంటారు. 
వారిలో వారికి కూడా ఒకరి జీతం ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు.

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారి జీతాలు ఎవరికీ తెలియనవసరం లేకుండానే వారి జీతాల మొత్తం వారి ద్వారానే కనుక్కోవాలి.

అందరూ సమాధానం కోసం ప్రయత్నించేందుకు వీలుగా సాయంత్రం వరకు కామెంట్ మాడరేషన్ పెడుతున్నాను.

Friday, December 6, 2013

అరటిపండు తిన్నంత సులభమేనా ఈ ఇంటర్‌వ్యూ ప్రశ్నకు సమాధానం చెప్పడం?

16 రూపాయలకు "ఎన్ని" అరటిపండ్లు వస్తాయో, "అన్ని" రూపాయలకు 36 అరటిపండ్లు వస్తాయి. ఐతే డజను అరటిపండ్ల ఖరీదెంత?

( వివరణ: ఉదాహరణకు 16 రూపాయలకు "X" అరటిపండ్లు వస్తే, "X" రూపాయలకు 36 అరటిపండ్లు వస్తాయన్న మాట)

అందరూ సమాధానం కోసం ప్రయత్నించేందుకు వీలుగా సాయంత్రం వరకు కామెంట్ మాడరేషన్ పెడుతున్నాను.



దక్షిణాఫ్రికా సూరీడు నెల్సన్ మండేలా గారికి హృదయపుర్వక శ్రద్ధాంజలి



గతరాత్రి దివికేగిన దక్షిణాఫ్రికా సూరీడు నెల్సన్ మండేలా గారికి హృదయపుర్వక శ్రద్ధాంజలి.

Thursday, December 5, 2013

మీ క్రికెట్ పరిజ్ఞానానికి ఒక పరీక్ష (గణిత మరియు ఆట నియమాలకు సంబంధించినది)

మనదేశంలో క్రికెట్ అంటే తెలియనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మరి క్రికెట్ కు సంబంధించిన గణిత శాస్త్రపు ప్రశ్నకు సమాధానం చెప్పండి చూద్దాం.

ప్రశ్న:

9 వికెట్లు పడిపోయాయి.భారత్ తరపున చివరి ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఆడుతున్నారు. ఇద్దరూ చెరి 94 పరుగుల మీద ఉన్నారు. ఇంకా 7 పరుగులు చేస్తే విజయం లభిస్తుంది. ఇక రెండే బంతులు ఉన్నాయి. భారత్ గెలవాలి మరియు ఇద్దరివీ సెంచరీలు కావాలి. ఎలా సాధ్యం అవుతుంది?

కష్టమనుకుంటున్నారా!  క్రింది ప్రశ్న చూడండి. పై దానితో పోలిస్తే కొంచెం సులభం.

ఒక వేళ 8 వికెట్లు పడి ఉన్నప్పటి పరిస్థితి ఉంటే ఎలా సాధ్యం అవుతుంది.



Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు