సమాధానం ఏంటి? వాళ్లకు అంత సాంకేతికపరిజ్ఞానం లేకనా? లేక మరో కారణం ఉందా?
సాంకేతిక పరిజ్ఞానం లేక పోతే క్రీ.శ 2వ శతాబ్దం లో తంజావూరు సమీపంలో కావేరీ నదిపై కట్టిన,ఇంకా ఉన్న కలనై ఆనకట్ట, క్రీ.పూ 4వ శతాబ్దంలో గుజరాత్ లో నిర్మించిన సుదర్శన జలాశయం, క్రీస్తుపూర్వమే ఈజిప్టులో నిర్మించబడిన సద్-అల్-కఫ్రా ఆనకట్టలు మొదలగువాటిని నిర్మించగలరా? కాబట్టి ఆనాటికే వారికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదనడంలో ఏమాత్రం సందేహం లేదు.
మరెందుకని వాటిని భారీస్థాయిలో నిర్మించలేదు? అలా నిర్మించకపోవడానికి గల కారణాలను మనం ఒకసారి ఆలోచిస్తే ఆశ్చర్యం కల్గక మానదు. మరి కారణాలు ఏమిటి?
నేడు మనకు అనుభవం అవుతూనే ఉంది. భారీ ఆనకట్టలవలన మనకు లాభాల కన్నా నష్టాలే భారీస్థాయిలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది భూమి యొక్క సమతుల్యత దెబ్బతినడం. అందువలనే భూకంపాల ప్రమాదం. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన సత్యం. ఇక నీటివనరుల కొసం జరుగుతున్న యుద్ధాలు.
మనిషి తన కనీస అవసరాలైన తిండి, నీరు, బట్టలు వీటి కోసం ఇతరులపై ఎంత తక్కువ ఆధారపడితే అంత ప్రశాంతం గా ఉండగలడు. ఇదే విషయాన్ని మన పూర్వీకులు ఆలొచించిఉన్నారు. వీళ్ళు పర్యావరణ,ప్రకృతి పరంగానూ, సామాజిక పరంగానూ ఆలోచించే భారీఆనకట్టలు నిర్మించలేదు.
ఉదాహరణకు మన దేశంలో ఇవి ఆలోచించే మన పూర్వీకులు ప్రతి జనపదానికీ (పల్లె లేక పట్టణం ఏదైనా కావచ్చు) ఒక చెరువును లేక అవసరం రీత్యా 2,3 చెరువులను త్రవ్వించారు. ఇక బావుల సంగతి చెప్పనవసరమే లేదు. బావులు మంచినీటికి, చెరువులు పంటపొలాలకు ఉపయోగపడతాయని తెలుసు. ఇలా చేయడం వలన పడిన వర్షం నీరు వృధా కాకుండా చెరువులు,బావులు రూపంలో ఉపయోగపడుతుంది.
ఇలా చేయడంవలన అత్యంత ముఖ్యప్రయోజనం ఏమంటే నీటి కోసం కనీసం పక్క గ్రామం పై కూడా ఆధారపడనవసరం లేదు. నీటి విషయంలో స్వయంసమృద్ధి అలానే నీటిపై ఆధారపడిన పంటల విషయంలో స్వయంసమృద్ధి తద్వారా తిండికోసం కూడా ఎవరిపైనా ఆధారపడనవసరం లేకుండా ఉండడం సంభవిస్తుంది. వీటి వలన నష్టాలకంటే లాభాలే ఎక్కువ ఉంటాయి.
ఇన్ని ఆలొచించే మన పూర్వీకులు భారీఆనకట్టల వంటి నిర్మాణాలు ఎక్కువ చేయలేదు.
బుధవారం 26 అక్టోబర్ 2011
ఆదివారం 23 అక్టోబర్ 2011
పసిపిల్లల చేష్టలు మనకు ఎందుకంత ఆనందం కల్గిస్తాయి?
మనందరికీ అనుభవమే ఈ విషయం. పసిపిల్లల పనులు, వారి చేష్టలు మనకు ఎంతో ఆనందం కల్గిస్తాయి. అలాగే ఇంట్లోని పెంపుడు జంతువుల చేష్టలు కూడా మనకు ఎంతో ఆనందం కల్గించి మన మనసులను టెన్షన్ నుండి దూరం చేస్తుంటాయి. అసలు వారి పనుల వలన మనకు ఎందుకు ఆనందం కల్గుతోంది? అవే పనులను పెద్దవాళ్ళు చెస్తే మనకు ఒక్కొక్కసారి కోపం,అసహ్యం కూడా కల్గుతుంటాయి.
పసిపిల్లల చేష్టలు మనకు ఆనందం కల్గించడానికి కారనం ఒక్కటే. వారు చూసేవారికి ఆనందం కల్గించడానికి అలా ప్రవర్తించరు. వారి పనులు పరిపూర్ణసహజత్వం కల్గిఉన్నవి. వారి సహజస్వభావం ప్రకారం పనులు చేస్తుంటారు. వారు ఎలాంటి ముసుగులనూ ధరించి ఉండరు. వారి మనసులలో కపటత్వం ఉండదు కేవలం నిర్మలత్వం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ముసుగులు అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకలా ఉండడం లాంటివి. చివరికి వాళ్ళ కోపం కూడా ఎంత సహజం గా ఉంటుందంటే వారు కోపగించుకోవడాన్ని కూడా మనం ఆనందిస్తాము. "అబ్బ ఎంతకోపం వీడికి" అంటూ మురిసిపోతాము.
కాలం గడవగా గడవగా ఏమవుతుందంటే చుట్టుపక్కల పరిస్థితుల వలన ఆ సహజత్వం కోల్పోయి ఒకరిని ఆనందపెట్టడానికో లేక బాధపెట్టడానికో ప్రవర్తించడం వలన ఇక వారి చేష్టలు మనకు అసలైన ఆనందం ఇవ్వలేవు.
సమస్త వేదాంతానికీ మూలసూత్రం ఇదే. ఎవరైతే తమ బాల్యం లో లాగా నిర్మలమైన,కపటత్వం లేకుండా అత్యంత సహజంగా తమకు తెలియకుండానే ప్రవర్తిస్తారో వారికి తెలియకుండానే వారి పనుల వలన జీవులు ఆనందిస్తుంటాయో వారే భగవంతునికి అత్యంత సమీపంగా తమకు తెలియకుండానే ఆయన సాన్నిధ్యం అనుభవిస్తుంటారు.
పసిపిల్లల చేష్టలు మనకు ఆనందం కల్గించడానికి కారనం ఒక్కటే. వారు చూసేవారికి ఆనందం కల్గించడానికి అలా ప్రవర్తించరు. వారి పనులు పరిపూర్ణసహజత్వం కల్గిఉన్నవి. వారి సహజస్వభావం ప్రకారం పనులు చేస్తుంటారు. వారు ఎలాంటి ముసుగులనూ ధరించి ఉండరు. వారి మనసులలో కపటత్వం ఉండదు కేవలం నిర్మలత్వం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ముసుగులు అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకలా ఉండడం లాంటివి. చివరికి వాళ్ళ కోపం కూడా ఎంత సహజం గా ఉంటుందంటే వారు కోపగించుకోవడాన్ని కూడా మనం ఆనందిస్తాము. "అబ్బ ఎంతకోపం వీడికి" అంటూ మురిసిపోతాము.
కాలం గడవగా గడవగా ఏమవుతుందంటే చుట్టుపక్కల పరిస్థితుల వలన ఆ సహజత్వం కోల్పోయి ఒకరిని ఆనందపెట్టడానికో లేక బాధపెట్టడానికో ప్రవర్తించడం వలన ఇక వారి చేష్టలు మనకు అసలైన ఆనందం ఇవ్వలేవు.
సమస్త వేదాంతానికీ మూలసూత్రం ఇదే. ఎవరైతే తమ బాల్యం లో లాగా నిర్మలమైన,కపటత్వం లేకుండా అత్యంత సహజంగా తమకు తెలియకుండానే ప్రవర్తిస్తారో వారికి తెలియకుండానే వారి పనుల వలన జీవులు ఆనందిస్తుంటాయో వారే భగవంతునికి అత్యంత సమీపంగా తమకు తెలియకుండానే ఆయన సాన్నిధ్యం అనుభవిస్తుంటారు.
శుక్రవారం 14 అక్టోబర్ 2011
సింగరేణి కార్మికుల సమ్మె సమస్త మానవాళికి ఇస్తున్న హెచ్చరిక
సకలజనుల సమ్మెలో భాగంగా సింగరేణి బొగ్గు గనుల కార్మికుల సమ్మె వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీని వల్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాల కు బొగ్గు సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి కూడా చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరే నేను చెప్పదలచుకొన్న విషయం ఏంటంటే ఈ కార్మికుల సమ్మె వల్ల ప్రపంచమే గ్రహించాల్సిన హెచ్చరిక ఒకటి ఉంది.
ఎప్పుడో ఒకప్పుడు భూమి లో ఉన్న బొగ్గు నిల్వలు అన్నీ అయిపోతాయి. అప్పుడు ఏ కొద్దిగా బొగ్గు నిల్వలున్నా వాటి కోసం ప్రపంచ సంగ్రామాలే జరగవచ్చు. ఉన్న కొద్ది నిల్వలు కూడా అయిపోతే పూర్తిగా జల విద్యుత్, అణువిద్యుత్ మీదే ఆధారపడి మనం జీవించలేము. నిరంతర శక్తి ప్రధాత ఐన సూర్యుడు ఒక్కడే అప్పుడు మనకు దిక్కు. ప్రపంచ వ్యాప్తం గా సౌర విద్యుత్ ఉత్పత్తి పై ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. కాని ఇప్పుడు జరుగుతున్న ప్రయోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎప్పుడో ఒకప్పుడు భూమి లో ఉన్న బొగ్గు నిల్వలు అన్నీ అయిపోతాయి. అప్పుడు ఏ కొద్దిగా బొగ్గు నిల్వలున్నా వాటి కోసం ప్రపంచ సంగ్రామాలే జరగవచ్చు. ఉన్న కొద్ది నిల్వలు కూడా అయిపోతే పూర్తిగా జల విద్యుత్, అణువిద్యుత్ మీదే ఆధారపడి మనం జీవించలేము. నిరంతర శక్తి ప్రధాత ఐన సూర్యుడు ఒక్కడే అప్పుడు మనకు దిక్కు. ప్రపంచ వ్యాప్తం గా సౌర విద్యుత్ ఉత్పత్తి పై ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. కాని ఇప్పుడు జరుగుతున్న ప్రయోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)