తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

సోమవారం 17 మే 2010

గొప్పవారికీ, సామాన్యులకూ గల తేడా ఎక్కడ ఉంది?


ఇక్కడ గొప్పవారు అంటే డబ్బులో ధనవంతుల గూర్చి కాదు చెప్పబడుతున్నది, శీలము (character) లో గొప్పవారి గురించి.
రమణ మహర్షి జీవితములో జరిగిన చిన్న సంఘటన. ఒకసారి ఒక దుష్టుడి గూర్చి కొందరు భక్తులు మహర్షి సన్నిధిలో మాట్లాడుకుంటున్నారు. అతని దుష్టత్వం గురించి మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి మహర్షిగారు కలుగజేసుకొంటూ " మీరు దుష్టుడు అని చెప్పుకొంటున్నతడు ప్రొద్దున్నే సూర్యోదయానికి ముందే బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానం చేస్తాడటనే" అన్నారు.
ప్రొద్దున సూర్యోదయానికి ముందే బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానం చేయడం ఎంత మంచిదో మనకు తెలుసు.
ఇక్కడ ఆ దుష్టుడిలోని చెడ్డగుణాలను పట్టించుకోకుండా ఉన్న ఒక్క మంచిగుణమును మాత్రమే శ్రీరమణులు గుర్తుపెట్టుకొన్నారు.
ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".

ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.

3 వ్యాఖ్యలు:

  1. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".
    ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.
    ________________

    ఎంత చక్కటి మాట. ఎందుకో అభిజాత్యం(సరయిన పదం అనుకుంటాను) అడ్డొస్తుంది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఎదుటివారిలో మంచిని మాత్రమే చూడగలిగారు కాబట్టే రమణుల వారు మహర్షి అయ్యారు. నాకు ఎందుకో భారతం లోది ఒక చిన్న ఉదాహరణ గుర్తుకొస్తోంది అభిజాత్యము అని చదివిన తరువాత. చెబితే పెద్ద కథ ..రెండు ముక్కల్లో చెప్పాలంటే ఒక మంచి వానిని కనుగొనమని సుయోధనుడికి , ఒక చెడ్డవాడిని కనుగొనమని ధర్మరాజుకి చెబితే తనను మించిన మంచివాడు సుయోధనునికి కనిపించలేదట(అభిజాత్యం ? ). అలాగే తనకు మించిన చెడ్డవాడు ధర్మరాజుకి అగుపడలేదట. చాలా మంచి విషయం ఉదహరించినందుకు ధన్యవాదములు.

    ప్రత్యుత్తరంతొలగించు

నా బ్లాగును ఇష్టపడేవారు