
ఇక్కడ గొప్పవారు అంటే డబ్బులో ధనవంతుల గూర్చి కాదు చెప్పబడుతున్నది, శీలము (character) లో గొప్పవారి గురించి.
రమణ మహర్షి జీవితములో జరిగిన చిన్న సంఘటన. ఒకసారి ఒక దుష్టుడి గూర్చి కొందరు భక్తులు మహర్షి సన్నిధిలో మాట్లాడుకుంటున్నారు. అతని దుష్టత్వం గురించి మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి మహర్షిగారు కలుగజేసుకొంటూ " మీరు దుష్టుడు అని చెప్పుకొంటున్నతడు ప్రొద్దున్నే సూర్యోదయానికి ముందే బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానం చేస్తాడటనే" అన్నారు.
ప్రొద్దున సూర్యోదయానికి ముందే బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానం చేయడం ఎంత మంచిదో మనకు తెలుసు.
ఇక్కడ ఆ దుష్టుడిలోని చెడ్డగుణాలను పట్టించుకోకుండా ఉన్న ఒక్క మంచిగుణమును మాత్రమే శ్రీరమణులు గుర్తుపెట్టుకొన్నారు.
ఇదీ గొప్పవారి మనసు. మరి మనమో శారదామాత (శ్రీరామకృష్ణపరమహంస గారి భార్య) చెప్పినట్లు " మనిషి ఒకరి నుండి తను పొందిన 99 మంచిపనులను మర్చిపోయి కేవలం తనకు జరిగిన ఒక్క చెడ్డపనిని మాత్రం గుర్తుపెట్టుకొంటాడు".
ఇలాంటి గుణాలే గొప్పవారి నుండి సామాన్యులను వేరు చేస్తాయి.