
మహాభారతములో తిక్కన గారు ఒకచోట ఒక పద్యాన్నివ్రాశాడు. ఆ పద్యం ఏంటో, ఏ పర్వం లోనిదో గుర్తులేదు.
ఆ పద్య అర్థం ఏంటంటే
" సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత సూర్యుడు తనస్థానానికి చేరాక ఆకాశం అనే పందిరి మంచం పై సంధ్యసాయం సంధ్య ) అనే కన్య తన ఎరుపెక్కిన బుగ్గలతో ( నక్షత్రాలు అనే పూలు చల్లుతుంది. తర్వాత ప్రొద్దున కూడాసిగ్గుతో ఎరుపెక్కిన మొహంతో ఎవరైనా చూస్తారేమోనని తననాథుడైన సూర్యుడు లేస్తుండగానే (ఉదయిస్తుండగానే) నక్షత్రాలు అనే పూలను పందిరిమంచం (ఆకాశం) పై నుండితొలగించివేస్తుంది."
సాయంకాలము, ఉదయము సమయాలలో ఆ దిక్కు ఎరుపెక్కడాన్ని ఎంత బాగా తీసుకొన్నాడో కదా.
అసభ్యత అనే దుర్గంధం సోకని శృంగారరస వర్ణన ఎంత బాగుందో కదా!